సాయి వచనం:-
'నాకు పేరు లేదు, ఊరు లేదు, నేను నిర్గుణుడను. కర్మవశాన ఈ శరీరం ధరించాను. ఇదే నా ఉనికి. బ్రహ్మ నాకు జన్మనిచ్చినవాడు. మాయ నా తల్లి. వారి సంయోగం వల్ల నాకు ఈ శరీరం ప్రాప్తించింది.'

'ఇంతవరకు అన్నీ చూసుకున్న బాబా రేపటి రోజుల్లో మన బాగోగులు చూసుకోరా?' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 362వ భాగం.


ఖపర్డే డైరీ - నలభై ఏడవభాగం.

శిరిడీ డైరీ మరియు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే - వి.బి.ఖేర్

శ్రీ సాయిబాబా ప్రేమను చూరగొన్న భక్తురాలు శ్రీమతి లక్ష్మీబాయి గణేష్ ఖపర్డే. బాబా వద్ద నుండి ఉపదేశం పొందిన భాగ్యశాలి ఆమె. శ్రీసాయిసచ్చరిత్ర 27వ అధ్యాయం 139-169 ఓవీలలో ఆమెకు శ్రీసాయితో ఉన్న ఋణానుబంధమూ, బాబా ఆమెకు ఇచ్చిన ఉపదేశమూ వర్ణించబడి ఉన్నాయి. అలాగే 7వ అధ్యాయం 100 నుంచి 110 వరకు ఉన్న ఓవీలలో ఆమె కుమారుడికి సోకిన ప్లేగును, అతని కర్మ సంబంధమైన బాధలను సాయిబాబా స్వీకరించి ఆమెను ఆందోళన నుంచి ఎలా విడుదల చేశారో కూడా చెప్పబడి ఉంది. మనం మొదట ఆ లీలలను చెప్పుకుని తరువాత శిరిడీ డైరీలో దానికి సంబంధించిన వివరాల్ని చూసి శ్రీసాయిసచ్చరిత్రలో చెప్పబడని వేరే సంఘటనలను కూడా పరిశీలిద్దాం. అప్పుడు పాఠకులను ఎంతో కదిలించివేసే ఆమె జీవిత గాథను, ఆమె చివరిదశ వరకూ జాగ్రత్తగా తెలుసుకుందాం. ఆమె అంత్యదశ ప్రశాంతంగా ఉండటమే గాక, ఆమె తన సద్గురు సాయిబాబా దర్శనాన్ని కూడా పొందింది. సాయిభక్తులు ఇంతకంటే ఎక్కువ ఏ ఆనందాన్ని ఆశిస్తారు? కనుక ఇప్పుడు ఆమె ఋణానుబంధమూ, ఉపదేశాల లీలను ప్రారంభిద్దాం.

"ఒకసారి దాదాసాహెబ్  శిరిడీకి తన కుటుంబంతో వచ్చి బాబా ప్రేమలో కరిగిపోయాడు. ఖపర్డే సామాన్యమైన మనిషి కాడు. అతను ఎంతో చదువుకున్నవాడైనా బాబా ముందు భక్తిభావంతో తలవంచేవాడు. ఇంగ్లీషు భాషలో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉండేవాడు. సుప్రీమ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోనూ, స్టేట్ కౌన్సిల్ లోనూ మంచి వక్తగా ఖ్యాతిని సంపాదించడమే కాక, తన వాక్చాతుర్యంతో, వాదప్రతివాదాలతో విధానమండలిని ప్రభావితం చేశాడు. అయినప్పటికీ బాబా ముందు మాత్రం మౌనంగా ఉండేవాడు. 

బాబాకి ఎంతోమంది భక్తులున్నప్పటికీ, ఖపర్డే, గోపాలరావు బూటీ, లక్ష్మణ్ కృష్ణ నూల్కర్‌లు తప్ప బాబా ముందు ఎవరూ మౌనంగా ఉండేవారు కాదు. వారందరూ బాబాతో మాట్లాడేవారు. కొందరు తమ మనసుకు ఏది తోస్తే అది మాట్లాడేవారు. మరికొందరు వివాదాస్పద విషయాల్లో జోక్యం చేసుకొనేవారు. కానీ ఈ ముగ్గురూ మాత్రం పూర్తి సంయమముతో ఉండేవారు. మాట్లాడటం సంగతి అలా ఉంచి వారు బాబా చెప్పిన దానిని తప్పకుండా పాటించేవారు. బాబా మాట వినే విషయంలో వారికున్న మర్యాద, అణకువలు అవర్ణనీయాలు. విద్యారణ్యుని పంచదశిని వివరించటంలో అద్భుతమైన నైపుణ్యం గల ఖపర్డే మశీదుకు రాగానే మౌనంగా అయిపోయేవాడు. వాక్చాతుర్యం ఎంత ఉన్నప్పటికీ సచ్చిదానంద పరబ్రహ్మ అవతారమూర్తియైన సాయి ముందు వెలవెలబోయేది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe