1910 సంవత్సరంలో "లక్ష్మణ్ బజీ అవరె" అనే అతనికి రెండు కళ్ళలో నొప్పి వచ్చి రెండు కళ్ళ నుండి నీరు కారసాగింది. చివరికి కంటి చూపు పోయింది. నయం చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు, మందులు ఏవీ పనిచేయలేదు. ఆ కుటుంబానికి తెలిసిన ఒక స్నేహితుడు శిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చారు. బాబా దర్శనం చేసుకుంటే బాధ నయం కాగలదని చెప్పారు.
ఒక గురువారం షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా లక్ష్మణ్ వైపు కరుణతో చూసి, “అల్లా అచ్ఛా కరేగా” అంటూ ఊదీ ఇచ్చారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక కళ్ళ నీరు రావడం ఆగింది, నొప్పి కూడా తగ్గింది. అప్పటినుండి ఆరు నెలల పాటు వారు ప్రతి గురువారం షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు.
తర్వాత ఆ గ్రామస్తులు అతని తల్లితో అతనిని బొంబాయిలో జె.జె. హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని చెప్పారు. వారు బొంబాయి బయలుదేరిన రోజు లక్ష్మణ్ ఒళ్ళంతా మంటలు పుట్టి బాధ కలిగింది. బ్రిటిష్ కంటి వైద్యుడు లక్ష్మణ్ ను పరీక్షించి అతని కళ్ళు బాగా చెడిపోయాయని, కంటి చూపు మరి రాదని చెప్పారు. వాళ్ళు చాలా బాధపడుతూ తిరిగి ఇల్లు చేరారు.
లక్ష్మణ్ కు కంటిచూపు వచ్చినా, రాకున్నా షిర్డీ వెళ్ళి, సాయి చెంత ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ కుటుంబమంతా షిర్డీ వచ్చి కొన్ని రోజులపాటు షిర్డీలో ఉన్నారు. తర్వాత అతని తల్లి లక్ష్మణ్ ను బాబా చెంత విడిచి తన స్వగ్రామం వెళ్ళిపోయారు. లక్ష్మణ్ కు బాబా యందు సంపూర్ణ విశ్వాసం కలదు. ప్రతిరోజు బాబా ముఖం కడుక్కున్న నీళ్ళతో అతడు తన కళ్ళను కడుక్కునేవాడు. ఈవిధంగా ఒక నెల రోజులపాటు చేసాడు.
అకస్మాత్తుగా ఒకరోజు, పూర్తిగా కాకుండా కొంచెం కంటి చూపు వచ్చింది. తరువాత ఒక సాయంత్రం చావడిలో బాబా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు బాబా లక్ష్మణ్ గుండెపై చేతితో తట్టి, “ఇతనికి మళ్ళీ కంటిచూపు పూర్తిగా వస్తుంది. ఇకపై అంతా స్పష్టంగా చూడగలడు” అన్నారు. మరుక్షణమే లక్ష్మణ్ కు చూపు వచ్చింది. బాబా చేసిన మేలుకు లక్ష్మణ్ కృతజ్ఞతాభావంతో పరవశించిపోయాడు. రాధాకృష్ణమాయి లక్ష్మణ్ ను బావి నుండి నీరు తెమ్మని చెప్పేవారు. మరికొన్ని సేవలు కూడా ఆమె అతనికి చెప్పేది. లక్ష్మణ్ తనకు కంటిచూపును తిరిగి ప్రసాదించిన సాయిపై కృతజ్ఞతాభావంతో ఆ సేవలను సంతోషంగా చేస్తుండేవాడు. అలా బాబా మహాసమాధి చెందేవరకు షిర్డీలోనే ఉండిపోయాడు.
ఒక గురువారం షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా లక్ష్మణ్ వైపు కరుణతో చూసి, “అల్లా అచ్ఛా కరేగా” అంటూ ఊదీ ఇచ్చారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక కళ్ళ నీరు రావడం ఆగింది, నొప్పి కూడా తగ్గింది. అప్పటినుండి ఆరు నెలల పాటు వారు ప్రతి గురువారం షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంటుండేవారు.
తర్వాత ఆ గ్రామస్తులు అతని తల్లితో అతనిని బొంబాయిలో జె.జె. హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమని చెప్పారు. వారు బొంబాయి బయలుదేరిన రోజు లక్ష్మణ్ ఒళ్ళంతా మంటలు పుట్టి బాధ కలిగింది. బ్రిటిష్ కంటి వైద్యుడు లక్ష్మణ్ ను పరీక్షించి అతని కళ్ళు బాగా చెడిపోయాయని, కంటి చూపు మరి రాదని చెప్పారు. వాళ్ళు చాలా బాధపడుతూ తిరిగి ఇల్లు చేరారు.
లక్ష్మణ్ కు కంటిచూపు వచ్చినా, రాకున్నా షిర్డీ వెళ్ళి, సాయి చెంత ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ కుటుంబమంతా షిర్డీ వచ్చి కొన్ని రోజులపాటు షిర్డీలో ఉన్నారు. తర్వాత అతని తల్లి లక్ష్మణ్ ను బాబా చెంత విడిచి తన స్వగ్రామం వెళ్ళిపోయారు. లక్ష్మణ్ కు బాబా యందు సంపూర్ణ విశ్వాసం కలదు. ప్రతిరోజు బాబా ముఖం కడుక్కున్న నీళ్ళతో అతడు తన కళ్ళను కడుక్కునేవాడు. ఈవిధంగా ఒక నెల రోజులపాటు చేసాడు.
అకస్మాత్తుగా ఒకరోజు, పూర్తిగా కాకుండా కొంచెం కంటి చూపు వచ్చింది. తరువాత ఒక సాయంత్రం చావడిలో బాబా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు బాబా లక్ష్మణ్ గుండెపై చేతితో తట్టి, “ఇతనికి మళ్ళీ కంటిచూపు పూర్తిగా వస్తుంది. ఇకపై అంతా స్పష్టంగా చూడగలడు” అన్నారు. మరుక్షణమే లక్ష్మణ్ కు చూపు వచ్చింది. బాబా చేసిన మేలుకు లక్ష్మణ్ కృతజ్ఞతాభావంతో పరవశించిపోయాడు. రాధాకృష్ణమాయి లక్ష్మణ్ ను బావి నుండి నీరు తెమ్మని చెప్పేవారు. మరికొన్ని సేవలు కూడా ఆమె అతనికి చెప్పేది. లక్ష్మణ్ తనకు కంటిచూపును తిరిగి ప్రసాదించిన సాయిపై కృతజ్ఞతాభావంతో ఆ సేవలను సంతోషంగా చేస్తుండేవాడు. అలా బాబా మహాసమాధి చెందేవరకు షిర్డీలోనే ఉండిపోయాడు.
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteఓం సాయిరాం🙏🙏💐💐
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDelete