సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు - గణేష్ రఘునాథ్ తేలి


గణేష్ రఘునాథ్ తేలి గౌరవ మేజిస్ట్రేట్. అతడు థానాలోని బొంబాయి రోడ్డులో నివాసముండేవాడు. అతడు శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను 1936 డిసెంబర్ 13న దివంగత శ్రీబి.వి.నరసింహస్వామిగారికి ఈక్రింది విధంగా తెలియజేశాడు:

నేను 1914 లేదా 1915వ సంవత్సరంలో సాయిబాబా దర్శనానికి వెళ్లాను. బాబా, "ఒక రూపాయి రెండు అణాల ఆరు పైసల దక్షిణ ఇవ్వు" అని నన్ను అడిగారు. అప్పుడు నా జేబులో సరిగ్గా వారడిగినంత పైకమే వుంది. అదే మొత్తాన్ని ఆయన అడగడం వారి సర్వజ్ఞతకు నిదర్శనం. వెంటనే నేను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించాను. ఆ సమయంలో నాతోపాటు చంద్రాబాయి అనే నర్సు ఉంది. బాబా ఆమెను "ఆరు రూపాయల ఏడు అణాలు" దక్షిణ అడిగారు. ఆశ్చర్యంగా ఆమె వద్దనున్న మొత్తం కూడా అదే. ఆమె కూడా ఆ మొత్తాన్ని బాబాకు దక్షిణగా ఇచ్చింది. తరువాత మేము అదేరోజు శిరిడీ నుండి తిరుగు ప్రయాణమవ్వడానికి బాబాను అనుమతి కోరాము. బాబా ఆమెతో, "కొన్నిరోజులు ఉండకూడదా?" అన్నారు. అందుకామె వేరేచోట ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు వెళ్ళవలసి ఉందని విన్నవించుకుంది. ఆ రాత్రే మేము శిరిడీ నుండి బయలుదేరాము. అదే రాత్రి ఆమె ఇంట దొంగలుపడి 500 రూపాయల విలువగల ఆస్తిని దోచుకోవడమేకాక, ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. నాకు బాబాతో  పంచుకోవడానికి వేరే అనుభవాలు లేవు. నేను కేవలం సాయిబాబా దర్శనం కోసమే శిరిడీ వెళ్ళాను. ఆయన దర్శనంతో ఆయనపై నాకున్న నమ్మకం పెరిగింది. అది నాకు చాలు. శిరిడీ నుండి వచ్చిన తరువాత సంవత్సరంలోపే నాకు కొడుకు పుట్టాడు. వాడి పేరు నానూ.

సమాప్తం.

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part III by Late Shri.B.V.Narasimha Swamiji.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo