సాయి వచనం:-
'నేనుండగా భయమెందుకు? నువ్వు నిశ్చింతగా కూర్చో! అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంటా గమ్యం చేరుస్తాను.'

'కష్టం మీద జీవించడాన్ని నేను ఇష్టపడతాను. అలా ఉండడాన్ని ప్రేమిస్తాను. కోట్లాది రూపాయలు మీరిచ్చినా వాటిని కాదని బాబా పాదాల వద్ద నిలబడి అర్థిస్తాను. చేయి చాచితే అది బాబా ముందే చాచుతాను' - శ్రీబాబూజీ.

మండేకర్


మండేకర్

దత్తాత్రేయుని గొప్ప భక్తునిగా పూణే నివాసి మండేకర్ అందరికీ సుపరిచితుడు. అతనికి ఒక చిన్న వ్యాపార సంస్థ ఉండేది. ఆ కారణంగా అతను తరచూ కోపర్‌గాఁవ్ వెళ్తుండేవాడు. అలా వెళ్ళినప్పుడల్లా అతను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడు. 1914వ సంవత్సరంలో అతను వ్యాపార నిమిత్తం వెళ్తున్నపుడు, 15 సంవత్సరాల వయసున్న తన కొడుకును తనతోపాటు తీసుకుని వెళ్ళాడు. అతను వ్యాపార లావాదేవీలలో భాగంగా శిరిడీలో ఒకరికి 1500 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నందున ఆ మొత్తాన్ని కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. తండ్రీకొడుకులిద్దరూ శిరిడీ చేరుకుని ద్వారకామాయికి వెళ్ళారు. బాబా దక్షిణగా పెద్ద మొత్తాన్ని అడుగుతారని మండేకర్‌కి తెలుసు. అందువలన అతను ద్వారకామాయిలోకి అడుగుపెట్టేముందు తన దగ్గరున్న డబ్బును తన కొడుకుకిచ్చి భద్రపరచాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే అతను డబ్బును తన కొడుక్కిచ్చి, "తాను సాయిబాబా దర్శనం చేసుకుని వచ్చేవరకూ ద్వారకామాయి బయటనే వేచి ఉండమ"ని కొడుకుతో చెప్పాడు. తరువాత అతను లోపలికి వెళ్ళి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారాలు అర్పించి వారి ఆశీర్వాదం, ఊదీ తీసుకుని బయటికి వచ్చాడు. అప్పుడు అతను కొడుకు దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని, తనను వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని చెప్పాడు.

మండేకర్ కొడుకు లోపలికి వెళ్ళి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనికి ఊదీ ఇస్తూ, "నాకు 1500 రూపాయలు ఏకమొత్తంగా ఇవ్వు" అని బిగ్గరగా అరిచారు. పిల్లవాడు చాలా భయపడిపోయి, కంగారులో తన దగ్గర డబ్బులు లేవన్న సంగతే మరచి డబ్బుకోసం తన జేబులు తడుముకుని, "నా దగ్గర డబ్బులు లేవ"ని చెప్పాడు. కానీ బాబా శాంతించలేదు. అలాగే కొంతసేపు అరిచారు. పిల్లవాడు భయంతో ఓదార్చశక్యం కానంతగా ఏడ్వసాగాడు. దయాళువైన బాబా శాంతించి, పిల్లవాణ్ణి తమ ప్రక్కనే కూర్చుండబెట్టుకుని, తన చేత దత్తమంత్రాన్ని రమారమి అరగంటసేపు పఠింపజేశారు. ఆ విధంగా తానెంచుకున్న మంత్రాన్ని బాబా సమక్షంలో పఠించే మహద్భాగ్యం ఆ పిల్లవానికి లభించింది. తరువాత పిల్లవాణ్ణి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు బాబా. 

అప్పుడు పిల్లవాడు బయటకి వచ్చి తన తండ్రిని ఇలా హెచ్చరించాడు: "మీరు ఏమి చేసినా దాన్ని బాబా దగ్గర దాచడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఆయన సాక్షాత్తూ భగవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకి అన్నీ తెలుసు. ఇకమీదట ఇలాంటి పని చేయనని నాకు వాగ్దానం చేయండి" అని. బాబా దైవత్వాన్ని గ్రహించి మండేకర్ తన కొడుకుకి వాగ్దానం చేశాడు. తరువాత తండ్రీకొడుకులిద్దరూ తిరిగి బాబా వద్దకు వెళ్లి క్షమించమని వేడుకున్నారు.

రెఫ్: శ్రీసాయి ప్రసాద్ పత్రిక, 1990 (దీపావళి సంచిక) 
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

8 comments:

  1. Om sai ram🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om sai ram, baba nannu e kashtam nundi nve bayata padaiyali tandri, meeru tappa naaku inka evaru leru tandri pls kapadandi piliste palukuta annaru alage paliki na ee khastanni teerchandi na tappu nenu telusukunnanu ika mundu jagratta ga untanu inka aa tappu chayakunda.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo