1889వ సంవత్సరంలో పవిత్రమైన శ్రీరామనవమినాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ద్వారకానాథ్ జనార్ధన్ క్వాలి జన్మించాడు. అతడు పెరిగి పెద్దయి అహ్మద్నగర్ లో విద్యాశాఖలో పనిచేసేవాడు. అదే సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ అక్కడికి బదిలీ మీద వచ్చాడు. అనతికాలంలో వారిరువురూ మంచి స్నేహితులయ్యారు. అప్పట్లో దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నందున ప్రతి సంవత్సరం వారంరోజులు క్రిస్టమస్ సెలవులు ఉండేవి. తరచు ఆ సమయాన్ని చందోర్కర్ శిరిడీ సందర్శించి సద్వినియోగ పరుచుకుంటుండేవాడు. ఒకసారి ద్వారకానాథ్ చందోర్కరుతో కలిసి శిరిడీ వెళ్ళాడు. వాళ్ళు శిరిడీ చేరుకునేసరికి మిట్టమధ్యాహ్నం అయ్యింది. వాళ్ళు ద్వారకామాయి చేరుకునేసరికి భోజనాలు వడ్డించబోతున్నారు. త్వరత్వరగా భక్తులు రెండువరుసల్లో కూర్చున్నారు. ఆరోజెందుకో చందోర్కరుకు నెయ్యి తినాలని కోరిక కలిగింది. కానీ అక్కడ నెయ్యి లేదని అతడు గుర్తించి ద్వారకానాథ్ వైపు తిరిగి, "ద్వారకా! మన శిబిరానికి వెళ్ళి నెయ్యి తీసుకుని రా!" అని చెప్పాడు. ఆ మాట బాబా విని, "వెళ్ళవద్దు! నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే, ఇంకొకరి వద్దనుండి అరువు తెచ్చుకోకూడదు" అని అన్నారు. బాబా మాటలలో ఉన్న అంతరార్థం ద్వారకానాథ్ పై తీవ్రమైన ప్రభావం చూపింది. అతడు తన జీవితాంతం ఆ మాటలను అనుసరించాడు. తరువాత ప్రతి ఒక్కరికీ అన్నంతో పప్పు వడ్డించారు. అప్పుడు ద్వారకామాయి ప్రాంగణమంతా తాజాగా తయారుచేసిన రుచికరమైన నెయ్యి వాసనతో నిండిపోయింది. బాబా అదృశ్యంగా దానిని అందించారు.
Ref.: Sai Prasad Magazine, Deepavali issue, 1991.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri,
to days baba leelas are very good.2 leelas are faith boost.thank you to the members of this blog
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🙏💐🙏నమో సాయినాథాయ నమః🙏💐🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha