- బాబా దయతో క్షేత్ర దర్శనాలు
|
సాయి వచనం:-
|
|
|
సాయిభక్తుల అనుభవమాలిక 2122వ భాగం....
శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి - 2వ భాగం....
తర్వాత శ్రీఅవస్థి సతారాలోని డోమిబూవా వద్దకు, ఆ తర్వాత పూణేలోని సోమవార్ ఆలయంలోని ధర్మశాలలో ఉంటున్న ఒక వృద్ధ మహాత్మురాలిని కలవడానికి వెళ్ళాడు. ఆ మహాత్మురాలి కొడుకుకి రెండు, మూడేళ్ల వయసున్నప్పుడు ఆవిడ భర్త చనిపోయాడు. దాంతో చిన్ననాటినుండి తాను చదువుతూ వస్తున్న తులసీదాస్ రామాయణాన్ని అనుసరించి సన్యసించాలని ఆవిడ అనుకుంది. హనుమంతుడు ఆవిడకు తన దర్శనభాగ్యాన్ని ప్రసాదించి అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆవిడ వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, సప్తాహాలు (ఏడు రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు) నిర్వహిస్తూ, వందలాది మంది బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేస్తూ పర్యటించింది. హరిద్వార్ నుండి కోయంబత్తూర్ చేరుకోవడానికి ఆవిడకు మూడేళ్లు పట్టింది. కోయంబత్తూరులో ఆవిడ ఒక హనుమంతుని ఆలయం వద్ద ఆశ్రయం పొంది తన దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించింది. ప్రజలు ఆవిడ పట్ల ఆకర్షితులయ్యారు. ఆవిడ గురువు కోయంబత్తూరు జిల్లాలోని వేలంకురిచిలో ఉండేవారు. ఆయన ఒక కాఫీ తోట యజమాని. కుటుంబసమేతంగా అక్కడ నివసించేవారు. శ్రీరాముని భక్తుడైన ఆయన తన నివాసానికి సమీపంలోనే ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. వృద్ధ మహాత్మురాలు ఆ గ్రామంలో ఆరునెలలపాటు గడిపిన తర్వాత, ఉత్తరప్రదేశ్లోని సరైసేట్రై/సరైరసి(సరైతరేసా)లో ఉన్న తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి దారిలో పండరీపురం దర్శించి అక్కడినుండి నేరుగా పూణే వచ్చింది.
అవస్థి ఒక యోగి భక్తుడైన తన స్నేహితునితో కలిసి ఆ మహాత్మురాలి దర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో అతను వివేకానందుని రాజయోగం అభ్యసిస్తున్నందున కుండలిని, అది వివిధ చక్రాల గుండా ప్రయాణించడం వంటి విషయాలపై ఆవిడను ప్రశ్నించాలని అనుకున్నాడు. కానీ వాళ్ళు వెళ్లే సమయానికి ఆ మహాత్మురాలి చుట్టూ భక్తులు, పండితులు, నాస్తికులు, దూషించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆవిడతో మాట్లాడే అవకాశం తమకు చాలా తక్కువని భావించి దూరంగా కూర్చుని, ఒక నిర్ణిత సమయం వరకు చూసి ఆవిడతో మాట్లాడే అవకాశం లభించకపోతే వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ సమయానికి సరిగ్గా 5 నిమిషాల ముందు ఆవిడ తమ చెంత ఉన్న జనసమూహాన్ని చెదరగొట్టడానికి చాలా తెలివైన ఉపాయం ఒకటి పన్నారు. ఆమె అకస్మాత్తుగా తన ముఖంపై ముసుగు వేసుకొని, "చనిపోతున్నాన"ని చెప్పి, అందరినీ వెళ్లిపొమ్మంది. దాంతో అందరూ వెళ్ళిపోయారు. సహజంగానే అవస్థి, అతని స్నేహితుడు కూడా వెళ్ళిపోవాలని అనుకున్నారు. కానీ వెళ్లేముందు నమస్కరించుకుందామని ఆవిడ దగ్గరకు వెళ్ళసాగారు. వాళ్ళు ఆవిడను సమీపిస్తుండగా, ఆవిడ తన ముసుగు తీసేసి కూర్చుని, వాళ్ళను దగ్గరకు రమ్మని సైగ చేసారు. వాళ్ళు "మీ ఆరోగ్యం బాగోలేదు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టమ"ని అన్నారు. అందుకు ఆవిడ, "మీకోసమే అనారోగ్యం నటిస్తున్నాన"ని చెప్పి, తమకున్న శక్తులకు సాక్ష్యాన్ని చూపింది. అప్పుడు వాళ్ళు కుండలిని, చక్రాల చిత్రమున్న పుస్తకం ఆవిడకు చూపించి, ఆ విషయం గురించి తమకు భోదించగలరా అని అడిగారు. ఆవిడ ఆ పుస్తకాన్ని తిరిగిచ్చి, తమ గురు మహారాజ్ తనకి భక్తి మార్గాన్ని మాత్రమే చూపించినందువల్ల యోగ మార్గ విషయమై తాను ఎటువంటి సహాయం చేయలేనని చెప్పింది. వాళ్ళు ఆవిడ వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయారు కానీ, ఆమె నిరాడంబర సాధు ప్రవర్తనకు బాగా ముగ్ధులయ్యారు. కాబట్టి, అవస్థి సంధ్య సమయంలో ఆవిడ చెప్పే మాటలు వినడానికి వెళ్తూ జనసమూహానికి దూరంగా చీకటిలో ఒక మూలన కూర్చునేవాడు. ఆ సమయంలో అతని మనసులో పగటిపూట తాను చదువుకున్న విషయాలకు సంబంధించిన సందేహాల పరిష్కారం కోసం కొన్ని ప్రశ్నలు సాధారణంగా ఉండేవి. అతను వాటిని అడగకముందే ఆవిడ మాటల మధ్యలో విషయాన్ని మార్చి, అతని మనసులో ఉన్న ప్రశ్నలనే లేవనెత్తి సమీపంలో ఉన్న పెద్దలు, పండితుల ముందు ఆ ప్రశ్నలను ఉంచేది. వాళ్ళు ఆ ప్రశ్నల గురించి చర్చించి వారివారి సమాధానాలను ఇచ్చేవారు. వాటిని పరిశీలించి, తిరస్కరించిన మీదట ఆవిడ అవస్తేకు సంతృప్తినిచ్చే పరిష్కారాన్ని ఇచ్చేది. ఇంకా ఇదే ప్రశ్నను ఒకప్పుడు తన సద్గురువు కూడా అడిగి, దానికి సమాధానం చెప్పారని ఆవిడ చెప్పేది. ఆవిడ ఒక ఏకాంత సమావేశంలో అవస్థితో, 'కేవలం అతని కోసమే పూణేకి రావడమైందని, తన సద్గురువు తనకు ప్రత్యేక ఆదేశం ఇచ్చారని, హనుమంతుడికి, తన గురువుకి నిత్య పూజ చేసిన తర్వాత జపధ్యానాలు చేస్తున్నప్పుడు తన సద్గురువు నుండి తనకి సందేశాలు లభించాయ'ని చెప్పారు.
అవస్థికి ఆ మహాత్మురాలి దివ్య శక్తుల పట్ల చాలా గొప్ప గౌరవం ఏర్పడి తన స్నేహితులను తనతో పాటు వచ్చి ఆవిడను దర్శించి, ప్రణామాలు అర్పించేలా ప్రోత్సహించాడు. వాళ్ళు కూడా ఆవిడ ప్రసంగాలకు హాజరవుతూ ఆవిడకు సన్నిహితులయ్యారు. ఒకరోజు ఆవిడ స్నేహితుని ఇంటి వద్ద ఉన్న అవస్థికోసం కబురు పంపింది. దాంతో అతను తన స్నేహితుడు, అతని తమ్ముడు, వారిద్దరి భార్యలు కలిసి ఆవిడ వద్దకు వెళ్లారు. అప్పుడు ఆవిడ, తాము త్వరలో ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోతున్నామని, అవస్థి తదితరులు అంగీకరిస్తే, తమ గురు మహారాజ్ ఆదేశానుసారం కొన్ని మంత్రాలు, ఉపదేశాలు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పింది. కానీ అవస్థికి తనకొక గురువు ఉండాలనే కోరిక లేదు, అదికాక తనకున్న షరతులు అంగీకరిస్తే తప్పా తాను మంత్రాన్ని అంగీకరించదలచుకోలేదు అతను. ఆవిడ అతనితో, తాను ప్రత్యేకంగా అవస్థిని కలవడానికే పూణే వచ్చానని, తన సలహాను అంగీకరించడంలో ఎలాంటి హాని లేదని చెప్పింది. అతను, 'తాను ఎలాంటి జపమాల ఉపయోగించనని, జపాల సంఖ్యను లెక్కించనని, జపం చేసే సమయం మరియు ప్రదేశం గురించి ఎలాంటి విధివిధానాలు పాటించనని, తన మనస్సు వేరే ఏ పనిలోనూ నిమగ్నమై లేనప్పుడు కేవలం మానసికంగా జపించుకుంటానని' అని షరతు విధించాడు. అందుకు ఆవిడ అంగీకరించి, అతనికి పంచాక్షరి ఉపదేశించి, "నేను నీకు గురువుగా ఉండబోను. ఎందుకంటే, నువ్వే నా గురువని భావిస్తున్నాన"ని చెప్పి అతన్ని సంతోషపెట్టింది. తర్వాత ఆమె అతనితోపాటు ఉన్న ప్రతి ఒక్కరికీ పంచాక్షరి మంత్రాలను ఇచ్చింది. అయితే పురుషులకు ఇచ్చేటప్పుడు దానికి ముందు 'హరి ఓం' అని చేర్చి, స్త్రీలకు ఇచ్చేటప్పుడు దానిని విడిచిపెట్టి ఇచ్చింది. ఆవిడ జపంలో, పంచాక్షరిలోని అక్షరాలకు ఒకదాని తర్వాత మరొకదానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి అక్షరాన్ని పంచభూతాలు మరియు ఐదుగురు అధిష్టాన దేవతలకు ప్రతీకలుగా చిన్న చిన్న మార్పులు చేసింది. జపంలోని మొదటి మూడు అక్షరాలపై మనస్సును కేంద్రీకరించాలని, ఆ తర్వాత కేవలం ప్రణవం (ఓంకార నాదం)మీద, చివరగా ఉచ్వాస, నిశ్వాసాలు(ప్రాణాయామం)పై దృష్టి పెట్టాలని ఆమె అవస్తేకు సూచించింది. ఇంకా ఆ అక్షరాల అధిదేవతల దర్శనం కోసం ఆత్రుత వద్దని, ముఖ్యంగా మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరించవద్దని, తన సూచనలను సాధ్యమైనంత శ్రద్ధగా పాటించమని చెప్పి తన కొడుకును చూడటానికి పూణే విడిచి వెళ్లిపోయింది. ఇదంతా 1898లో జరిగింది.
తర్వాత ఒకసారి అవస్థి ఎంతో ఇష్టపడే శాంతి అనే అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అతను ఆమెకోసం వెతుకుతుంటే, "మీరు దేనికోసం వెతుకుతున్నారు?" అని దూరం నుండి ఆ పాప అడిగింది. అతను, "శాంతికోసం" అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆమె, "శాంతి ఇలా వెతకడం వల్ల లభించదు గాని, ప్రశాంతంగా వేచి ఉండటం వల్ల దానంతట అదే వస్తుంది" అని బదులిచ్చింది. ఒకరోజు ఆ అమ్మాయి తండ్రి, అవస్థి, మరికొంతమంది దైవమూ, సాక్షాత్కారమూ గురించి చర్చించుకుంటుండగా ఆ అమ్మాయి అక్కడికి వచ్చి, "మీలో ఎవరైనా దేవుణ్ణి చూశారా?" అని అడిగింది. తర్వాత ఆ అమ్మాయి అవస్థిను సూటిగా, "మీకు సాక్షాత్కారం అయిందా?" అని అడగగా, "లేదు" అని సమాధానమిచ్చాడతను. తర్వాత ఒకరోజు అవస్థి తుకారాం రచనలను చదువుతుండగా, ఒక 'అభంగం'(భక్తి గీతం) కనిపించింది; అందులో తుకారాం అక్కడికక్కడే దీక్షను ప్రసాదించడం గురించి నొక్కి చెప్పడం చూసి అతను ఆశ్చర్యచకితుడై, నిశ్చలంగా ఉండిపోయాడు. ఆ సమయంలో అతనికి పక్కనే ఉన్న కిటికీ బయటనుండి భగవంతుండు 'లోపలికి రావాలా?' అని అడుగుతున్నట్లు అనిపించింది. అప్పుడు అతను దర్శనానికి తాను ఇంకా అర్హుడిని కాదని భావించి, 'వద్దు, వద్దు' అని అన్నాడు. దేవుడిని చూసి ఆ తీవ్రతను తట్టుకునే శక్తి తనకు లేదనిపించడంతో అతను పారాయణను ఆపివేశాడు. ఇకపై దేవుడిని ఇబ్బందిపెట్టనని ప్రమాణం కూడా చేసుకున్నాడు. అయితే శాంతి అతన్ని, తనకు సాక్షాత్కారం ప్రసాదించమని శ్రీరాముడిని ప్రార్థించమని చెప్పడంతో అతను ప్రతి రాత్రి ప్రార్థిస్తానని ఆమెకి మాటిచ్చాడు. ఆమె కూడా ప్రతి రాత్రి పడుకునే ముందు సాక్షాత్కారం కోసం ప్రార్థించేది. 1912లో ఒకరోజు రాత్రి అతను పూజించే దైవమున్న హాలులోని ద్వారం పైభాగం నుండి శ్రీరాముడు నెమ్మదిగా కిందికి దిగి వస్తున్నట్లు అతనికి అనిపించింది. అతను నమస్కరించాడు, కానీ ఆ దైవస్వరూపం యొక్క వక్షస్థలానికి పైభాగాన్ని చూసేలోపే ఆ దృశ్యం అదృశ్యమైంది. అందువల్ల అతను కేవలం కాళ్లు, నడుము భాగాన్ని మాత్రమే చూడగలిగాడు. ఆ అనుభవాన్ని మళ్లీ పొందడం ఇష్టం లేక అతను రాత్రిపూట ప్రార్థించడం మానేశాడు, అప్పటి నుండి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండసాగాడు.
తరువాయి భాగం వచ్చేవారం..
సాయిభక్తుల అనుభవమాలిక 2121వ భాగం....
1. సమస్యలకు పరిష్కారం చూపే బాబా
2. ఎంత పెద్ద సమస్య అయిన బాబా అనుగ్రహంతో సమసిపోతుంది
సమస్యలకు పరిష్కారం చూపే బాబా
నా పేరు మహేశ్వరరెడ్డి. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను రోజూ ఆఫీసుకి క్యాబ్లో వెళ్తాను. అయితే క్యాబ్ మొదటి పికప్ లొకేషన్కి సరిగ్గా షెడ్యూల్ చేసిన సమయానికి వస్తుండేది. అలా వచ్చాక క్యాబ్ డ్రైవర్ కాల్ చేయడం, మేము క్యాబ్ వద్దకు వెళ్లడం, ఓటీపీ ఎంటర్ చేయడం వంటి వాటికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. ఆ తరువాత ట్రాఫిక్, వాహన సమస్యలు వంటివి ఏవైనా వస్తే, మేము ఆఫీస్ వద్ద లాగిన్ అవ్వడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందుకని నేను క్యాబ్ మొదటి పికప్ లొకేషన్కు షెడ్యూల్ చేసిన సమయానికి 10–15 నిమిషాల ముందే చేరుకోవాలని ట్రాన్స్పోర్ట్ టీమ్కు తెలియజేశాను. అది కాస్త చర్చకి దారితీయడంతో నేను కొంత వాదనకు దిగాను. ఆ విషయాన్ని ట్రాన్స్పోర్ట్ టీమ్ వాళ్ళు నా మేనేజర్కు చెప్పారు. ఆ విషయం నాకు తెలిసి నేను కొంత ఆందోళన చెంది నా ఆరాధ్యదైవమైన సాయిబాబాను, “బాబా! నేను తప్పు చేసి ఉంటే, నాకు సరైన మార్గం చూపించండి. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించండి” అని కోరుకున్నాను. తర్వాత నేను నా మేనేజర్తో మాట్లాడినప్పుడు, ఆయన నన్ను పెద్దగా మందలించకుండా, “ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే వాదించకుండా నేరుగా నాకు తెలియజేయండి” అని మంచి సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు చాలా ఉపశమనాన్నిచ్చాయి. సమస్య నాకు ప్రతికూలంగా మారకుండా, నా మేనేజర్ నాకు సరైన మార్గదర్శనం ఇచ్చారు. సాయిబాబా నా సమస్యను ఒక ప్రత్యేకమైన విధంగా పరిష్కరించారని నాకనిపించింది. ఆయన సమస్యను వెంటనే తొలగించకపోయినా, ఆ సమస్య ద్వారా 'వాదించడం కంటే సరైన వ్యక్తికి, సరైన సమయంలో సమస్యను తెలియజేయడం మంచిది' అని నాకు ఒక మంచి పాఠం నేర్పించారు.
మా నాన్నకి రావలసిన పీఎం-కిసాన్ యోజన ధనం చాలాకాలంగా ఆయన బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. కారణం ఏమిటో తెలియక మేము ఆందోళన చెంది, "సమస్య పరిష్కారం కావాల"ని శ్రీసాయిబాబాను ప్రార్
2026, ఆగస్టు 16, సాయంత్రం 7:25కి నేను సినిమా టిక్కెట్లు బుక్ చేద్దామని 'బుక్ మై షో'లో ప్రయత్నించాను. అయితే చాలా ఆలస్యంగా ప్రయత్నించడం వల్ల టికెట్లు దొరకడం కష్టమైంది. చివరి నిమిషం వరకు టికెట్ దొరుకుతుందో, లేదో తెలియలేదు. అందుకని బాబాను, “మీ దయుంటే నాకు ఒక్క టికెట్ అయినా దొరకాలి బాబా” అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అను
సాయిభక్తుల అనుభవమాలిక 2120వ భాగం....
- బాబా ప్రేమ అపారం
శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి - 1వ భాగం....
పూణేకు చెందిన పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి శ్రీపురుషోత్తం రఘునాథ్ అవస్థి ఉరఫ్ దాజీసాహెబ్ అవస్థి(B.A., LLB.) సాయిబాబా భక్తులలో ఒకరు. అతను సజ్జనుడు, సత్ప్రవర్తన గల గృహస్థుడు. నిరాడంబరత, పవిత్రత అతని శరీరంలో అణువణువునా జీర్ణించుకుపోయాయి. పెద్ద అధికారి అయి కూడా చాలా వినయశీలిత, దానగుణం కలవాడు, నిజమైన కర్మయోగి(నిస్వార్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు), ఏకనిష్ఠ భక్తిమార్గపరుడు(మనసును వేరే వైపుకు మళ్లించకుండా కేవలం ఒకే ఒక దైవంపట్ల భక్తిప్రపత్తులు కలిగి, ఆ దైవమే తన సర్వస్వమని జీవించే వ్యక్తి). సాయిబాబా సన్నిధిలోకి వచ్చిన క్షణం నుంచే, ఆయనకు పరమ భక్తుడయ్యాడు అతను. భగవద్గీత అతనికి అత్యంత ఇష్టమైన గ్రంథం. ఇతను చేసిన గొప్ప సుకృతం ఏమిటంటే, ఒకవేళ ఇతను లేకపోయి ఉంటే, శ్రీ బి.వి.నరసింహస్వామి భారతదేశమంతటా బాబా తత్వాన్ని అంత స్థాయిలో ప్రచారం చేయగలిగేవాడు కాదు.
శ్రీ పి.ఆర్.అవస్థి 1870, ఫిబ్రవరి నెలలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. అతను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎంతో యోగ్యులు, పవిత్రులు ఆయిన వ్యక్తుల సాంగత్యాన్ని పొందాడు. 6ఏళ్ళ వయసప్పుడు 'దేవ్ మమ్లత్దార్'గా ప్రసిద్ధి చెందిన సతారా మమ్లత్దార్ శ్రీయశ్వంత్ రావు భాస్కర్ అనే సత్పురుషుని దర్శించి, వారి చేతుల మీదుగా ఒక జామపండును ప్రసాదంగా పొందిన భాగ్యశాలి అతను. కొంతకాలానికి దేవ్ మమ్లత్దార్కి నాసిక్కు బదిలీ అయింది. అప్పుడు శ్రీఅవస్థి తండ్రి కూడా నాసిక్లోనే ఉన్నందువల్ల చిన్నవయసునుండే అవస్థికు తరచూ దేవ్ మమ్లత్దార్ను దర్శించుకుని, భద్రాచల శ్రీరామదాసు భక్తి వంటి వారి అద్భుతమైన భక్తి గురించి తెలుసుకునే అనేక అవకాశాలు లభించాయి. దేవ్ మమ్లత్దార్ ఎంతో దయ కలవారు; ఒక పేదవాని కొడుకు పెళ్ళికి ధన సహాయం చేసాడు. నిజానికి ఆ సమయంలో అతని వద్ద డబ్బు లేదు. అయినా డబ్బు సమకూరినప్పుడు తిరిగి జమచేయొచ్చనే ఉద్దేశంతో, తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఖజానా నిధులు ఇచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో, ఎవరో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వచ్చి ఖజానాను పరిశీలించి, ఆపై ఉన్న నగదు నిల్వలతో అకౌంట్స్ సరిచూచే ప్రయత్నం చేసారు. అవేవీ తెలియని దేవ్ మమ్లత్దార్ ఇంట్లో ప్రశాంతంగా తన దైనందిన కార్యక్రమాలతోపాటు పూజ చేసుకుంటున్నారు. పూజ తదితర పనులు పూర్తయిన తర్వాత, కలెక్టర్ లెక్కలను మరియు నగదు నిల్వను సరిచూశారని, రెండూ సరిగ్గా సరిపోయాయని ఆయనకు తెలిసి ఎంతో సంతోషించి లోటును భర్తీ చేసినందుకు తన ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత అత్యంత ధార్మిక జీవితాన్ని గడుపుతూ యువకులు, వృద్ధుల మనస్సులు ఎంతగానో ప్రభావితం చేసారు. ఆయన వల్ల అవస్థి చాలా ప్రభావితుడయ్యాడు. ముఖ్యంగా 1887-90 మధ్య, అంటే అతని 17 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దేవ్ మామ్లత్దార్ నాసిక్లో నిష్టాగరిష్ట ఏకాంత జీవితాన్ని గడుపుతున్నప్పుడు అవస్థి, అతని తండ్రి తరచుగా ఆయనను సందర్శించి, గణనీయమైన భక్తి ప్రభావాన్ని పొందారు. ఇలా అవస్థి ఆధ్యాత్మిక జీవితానికి చాలా ముఖ్యమైన పునాది పడింది.
1889లో అవస్థి తన 19వ ఏట, ఒక వీధిలోని బజారు గుండా వెళ్తున్నప్పుడు అర అణాకు చిన్న భగవద్గీత ప్రతి దొరికితే దాన్ని కొని తన జేబులో జాగ్రత్తగా భద్రపరుచుకుని ప్రతిరోజూ తీరిక సమయాల్లో పఠింస్తుండటం అతని అలవాటుగా మారింది. ఆ అలవాటు అతని తరువాతి జీవితంలో చాలా మేలు చేసింది.
కొద్దికాలానికి అవస్థి కళాశాలలో చదువుతున్నప్పుడు జాన్ స్టువర్ట్ మిల్, స్పెన్సర్ల గురించి చేసిన అధ్యయనం అతని మనస్సుని పాశ్చాత్య దేశాలలో ప్రబలంగా ఉన్న సంశయవాదం, నాస్తికత్వం సులభంగా ఆకర్షించాయి. దాంతో అతను నాస్తికుడిగా, వాద స్వభావం గలవాడిగా, అహంకారిగా మారి ఉపన్యాసకుడిగా, వాదనాపటిమగలవాడిగా రాణించాలని, చాలా డబ్బు సంపాదించాలని కోరుకున్నాడు. అతనిని మునపటి భక్తి ప్రభావం విడిచిపెట్టినట్లే కనిపించింది. ఈ నాస్తికత్వం ఎనిమిది సంవత్సరాలు, అంటే 1890 నుండి 1898 వరకు కొనసాగింది. అయితే ఆ కాలంలో కూడా దైవ సంకల్పం వల్ల అతను గీతా పఠనం మానలేదు. అదికాక అతని నాస్తికత్వానికి ఎదురుదెబ్బలు తగిలే కొన్ని సంఘటనలు జరిగాయి.
ఒకసారి అతనికి శ్రీమద్భాగవతంకి సంబంధించిన ఒక కాగితం దొరికితే, దాన్ని తీసి చదివాడు. అందులోని శ్లోకాలలో వ్యక్తి దేవుని నుండి దారి తప్పి, మాయలో చిక్కుకున్నప్పుడు కలిగే ద్వైత భావన వల్ల భయం పుడుతుందని, అది వ్యక్తి యొక్క దైవ విచారణను(భగవదన్వేషణ) మరుగుపరిచి, దైవంలో ఐక్యం కాకుండా నిరోధిస్తుందని వర్ణించబడి ఉంది.
మరోసారి ఒక అందమైన దక్షిణ భారత మహిళ శ్రీరాముని విగ్రహం ముందు నిలబడి, చక్కటి హావభావాలు ప్రదర్శిస్తూ తమిళంలోనో, తెలుగులోనో మీరాబాయి, ముక్తాబాయి, జానాబాయి మొదలైన వారిని ప్రస్తావిస్తూ పాడిన పాటలు సహజంగానే చాలా సున్నితస్తులైన శ్రీఅవస్థి మనసుని మునుపటిలా భక్తి యొక్క సౌందర్యాన్ని, ప్రయోజనాన్ని అనుభూతి చెందేలా చేసాయి.
ఇంకోసారి అవస్థి తన పెదనాన్న/చిన్నాన్న పిల్లలతో దేవుని ఉనికి గురించి తీవ్రమైన చర్చలో నిమగ్నమయ్యాడు. ఆ చర్చకు వాళ్ళు తమ మేనమామ అయిన శ్రీబాలభీమ ఠాకూర్దాస్ను న్యాయనిర్ణేతగా నియమించుకున్నారు కానీ, వాళ్ళు ఆయన్ని సంప్రదించకుండానే చర్చ సాగించారు. ఆ చర్చ అంతులేకుండా కొనసాగింది. వాళ్లలో ప్రతి ఒక్కరూ మరొకరిని ఓడించాలని, తమ వాదనే సరైనదని ఒప్పించేలా ప్రయత్నించారు. చివరికి అవస్థి కీర్తనలు, పురాణాలపై గొప్ప నమ్మకమున్న తమ మేనమామని సంప్రదించి, "సాధుసత్పురుషులు వర్ణించబడినంత గొప్పవారని నిజంగా, నిజాయితీగా మీరు నమ్ముతున్నారా? ఆ విషయంలో నాకు నమ్మకం కలిగించగలరా?" అని అడిగాడు. అప్పుడు అతని మేనమామ అతన్ని గుడి లోపల ఉన్న శ్రీరాముని విగ్రహం ముందుకి తీసుకెళ్లి, ‘పవిత్ర గ్రంథాలలో చెప్పబడిన ప్రతి మాటను తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని, అటువంటి సత్పురుషులను కలుసుకునే భాగ్యం నీకు కలుగుతుందని ఆశిస్తున్నానని, ఆ సత్పురుషుని ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత, నువ్వు కూడా అదే నిశ్చయానికి వస్తావని’ గట్టిగా ప్రమాణం చేశాడు. అప్పుడు శ్రీఅవస్థి, "సశరీరులుగా ఉన్న కొందరు సత్పురుషుల పేర్లు చెప్పమ"ని అడిగాడు. అతని మేనమామ, (1) పలుస్కు చెందిన దొండి బూవా, (2) ఫల్తాన్కు చెందిన హరి మహారాజ్ మరియు (3) కొల్హాపూర్కు చెందిన శ్రీకుంభారస్వామి పేర్లను చెప్పి వీరిని సందర్శించి, పరీక్షిస్తే నమ్మకం కలుగుతుందని చెప్పి, వారిని కలుస్తాన్నన్న వాగ్దానం అతని వద్ద నుండి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు శ్రీఅవస్థి పైన పేర్కొన్న ముగ్గురినీ భవిష్యత్తులో కలుసుకోగలిగాడు.
శ్రీఅవస్తే అతని మేనమామతో మాట్లాడిన తర్వాత డాక్టర్ బీసెంట్ మరియు డాక్టర్ రిచర్డ్సన్ల తత్వశాస్త్ర ఉపన్యాసాలకు హాజరై, తత్వశాస్త్రం(వేదాంతం), మత గ్రంధాలు చదివాడు. 1896వ సంవత్సరం చివరిలో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలింది. అప్పుడు అవస్థికి ప్రాణం, ఆస్తుల పట్ల కలిగిన ఆందోళన అతనిని దేవుని వైపు నడిపించింది. ప్లేగు వ్యాధి నుండి ఆశ్రయం కోసం అతను జ్ఞానేశ్వర్, ఏక్నాథ్, నామ్దేవ్, తుకారాం, రామదాస్ వంటి మహారాష్ట్ర సత్పురుషుల జీవిత చరిత్రలను భక్తిశ్రద్ధలతో చదవడం ప్రారంభించాడు. తార్గావ్లోని తన మేనమామ ఇంటికి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న కృష్ణుడు మొదలైన అవతారపురుషల గురించిన పవిత్ర గ్రంథాలన్నీ ప్రతిరోజూ చదివాడు. అటుపిమ్మట అతను తన మేనమామను పలూస్లోని దొండి బూవా గురించి విచారించగా, పలూస్కు ఎలా వెళ్ళాలో చెప్పాడతను. దాంతో అవస్థి పలూస్కు వెళ్లి దొండి బూవా దర్శనం చేసుకోవాలని బయలుదేరాడు. అతను దారిలో భగవద్గీత చదువుతుండగా, సత్పురుషులు జ్ఞానాన్ని ప్రసాదిస్తారని చెప్పబడిన నాల్గవ అధ్యాయం, 34వ శ్లోకం వద్ద అకస్మాత్తుగా ఆగి, ఆ దొండి బూవా వద్ద ఈ విషయం పరీక్షించి, అతను తనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో, లేదో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ పలూస్లో ఒక ఆలయం వెలుపల కూర్చుని ఉన్న దొండి బూవాను చూసి ఆయన శూద్రుడని భావించాడు అతను. అందువల్ల ఆయనకి నమస్కరించడం ఒక బ్రాహ్మణునిగా తనకి సులువు అనిపించలేదు. బూవా అతనితో కటువుగా, "గుడి లోపలకి వెళ్లి నమస్కరించు" అని చెప్పారు. అతనికి అది సులభంగా అనిపించి లోపలికి వెళ్ళాడు. చూస్తే, అక్కడ పూజించబడుతున్నది అదే శూద్ర బూవా చిత్రపటం! అక్కడ వేరే ఏ విగ్రహం లేదు. దాంతో అతను బయట ఉన్న శూద్రుడే లోపల పూజించబడుతున్న దేవుడని గ్రహించాడు. ఏదేమైనా తన చేతిలో ఉన్న పువ్వులు, నైవేద్యాలు అక్కడ ఉంచి తన మనసులో ఉన్న సందేహాలతో తర్జనభర్జనపడుతూ అక్కడ రెండు గంటల సమయం గడిపాడు. తర్వాత బయటకు వచ్చి దొండి బూవాకు క్షమాపణ చెప్పి, "మీకు ఈ శక్తులు ఎలా వచ్చాయ"ని అడిగాడు. దానికి ఆయన, "అది చాలా సులభం. కేవలం 'రామ్, రామ్, రాజారామ్ సీతారామ్' అని స్మరిస్తుండు, సర్వం సిద్ధిస్తుంది" అని బదులిచ్చారు. ఆపై దొండి బూవా తనకూ, తన పరివారంకీ వంట చేయమని అవస్తేతో అన్నారు. తర్వాత ఇతరుల ఉప్పు తినడం, వారికి ఋణపడి ఉండటం ఇష్టం లేనందున దొండి బూవా స్వయంగా ఉప్పు అతనికి ఇవ్వడమే కాకుండా అవస్థి తయారుచేసిన వంటకాలలో తామే తమ ఉప్పు కలిపారు. ఇంత జరుగుతున్నా దొండి బూవాను తన గురువుగా స్వీకరించడానికి అవస్థి ఇష్టపడలేదు, ఆయన కూడా, "నేను ఎవరికీ గురువుగా ఉండాలనుకోవడం లేద"ని చెప్పి తమ ఆశీస్సులు అతనికి ఇచ్చారు. అవస్తే తిరిగి వచ్చేశాడు.
తర్వాత అవస్థి మనసులో ప్రశ్నలతో పరమహంస(జ్ఞానోదయం పొంది, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తి) అయిన ఒక బ్రాహ్మణ గురువును కలిసి, “బ్రహ్మజ్ఞానం పొందవచ్చా?" అని అడిగాడు. ఆయన అతన్ని నేలపై పడుకోమని, ఆయన కూడా అతని పక్కన పడుకుని, "భయపడవద్దు" అని హెచ్చరించి అతని గొంతుపై చేయిపెట్టి గట్టిగా నొక్కేశారు. అతను భయపడి ఆయన పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన, "నువ్వు పిరికివాడివి. వెళ్ళిపో, నువ్వు బ్రహ్మజ్ఞానం పొందలేవు" అని అన్నారు.
తరువాయి భాగం వచ్చేవారం..
సాయిభక్తుల అనుభవమాలిక 2119వ భాగం....
- సంపూర్ణ విశ్వాసముంటే అన్ని అనుగ్రహిస్తారు బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2118వ భాగం....
1. బాబా చూపిన కరుణ
2. తలచిన వెంటనే పలికే దైవం ఆ సాయినాథుడు
గోవిందస్వామి – ఆదిలక్ష్మియమ్మ
సాయిభక్తుల అనుభవమాలిక 2117వ భాగం....
1. ఆపదలను గట్టెక్కించే సాయితండ్రి
2. మనసు మార్చి దొంగింలించిన చైన్ తిరిగి ఇచ్చేలా అనుగ్రహించిన బాబా
