సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీతుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

హరిభక్త పరాయణుడు, శ్రీతుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్ 1910వ సంవత్సరంలో జన్మించాడు. అతను ఋగ్వేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి శ్రీకేశవ్ గురు అజ్‌గాఁవ్‌కర్ గొప్ప వైదిక పండితుడు. స్వామి వాసుదేవానంద సరస్వతి(ఈయన సాయిబాబా సమకాలీకులు, వీరి మరో నామధేయం టెంబె స్వామి) గారి శిష్యుడు.

శ్రీతుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్ దాసగణు మహరాజ్ యొక్క ప్రధాన శిష్యుడు. అతను, అతని భార్య శ్రీమతి రమబాయి అజ్‌గాఁవ్‌కర్ ఇరువురూ దాసగణు మహరాజ్ తో కలిసి అనేక సంవత్సరాలు నివసించారు. వీరు క్రమంతప్పకుండా శిరిడీలోని రామనవమి ఉత్సవాలకు హాజరయ్యేవారు.

శ్రీసాయిబాబా ఆదేశానుసారం దాసగణు మహరాజ్ మహారాష్ట్ర అంతటా తిరుగుతూ కీర్తనలు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా మహాత్ముల చరిత్రలకి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉండేవారు. ఇలా సంచరిస్తున్న తరుణంలోనే దాసగణు ఒకానొకప్పుడు మరాట్వాడా ప్రాంతంలోని హింగోలి తాలూకాలో 'అజ్‌గాఁవ్' అనే చోటుకి వెళ్లారు. అక్కడ కేశవ్ గురు అను కేశవరాజ్ దైవవిగ్రహ భక్తుడిని కలుసుకున్నారు. అతని పూర్వీకులు కులగురువులుగా ఉండేవారు. అంటే, నామదేవ్ మహరాజ్ తెగకు చెందిన అన్ని మతపరమైన ఆచారాల కొరకు కులగురువుగా ఉండి అందరినీ మార్గనిర్దేశం చేసేవారు. కేశవరాజ్ విగ్రహం నామదేవుని కాలంలో నదిలో వారికి దొరికింది. కేశవ్ గురు ఆ విగ్రహానికి స్వయంగా పాలు పట్టేవారు. శ్రీకేశవ్ గురు మూడవ కుమారుడైన శ్రీతుకారాంని 8 సంవత్సరాల వయస్సులో శ్రీదాసగణు మహరాజ్ తన శిష్యుడిగా స్వీకరించారు. బాబా మహాసమాధికి కొద్దిగా ముందు, అంటే 1918వ సంవత్సరంలో రామనవమి పండుగ సందర్భంగా శ్రీసాయిబాబా సమక్షంలో దాసగణు మహరాజ్‌తో పాటు తుకారాం బువా కీర్తనలు చేసారు. ఆ కీర్తనలకు సాయిబాబా ఎంతో సంతోషించి తుకారాం తలపై తమ చేయి ఉంచి ఆశీర్వదించారు. బాబా సమాధి అనంతరం దాసగణు ఆ యువకుడికి కీర్తనలలో మంచి శిక్షణ ఇచ్చారు. అతనిని సుమారు 15-20 సంవత్సరాలు ఇండోర్, వారణాసి, బరోడా మరియు పూనా వంటి వివిధ ప్రదేశాలలో వివిధ గురువుల వద్ద విస్తృతంగా శిక్షణ ఇప్పించారు. ఆ విధంగా తుకారాం బువాను గొప్ప కీర్తనకారుడిగా తీర్చిదిద్దారు దాసగణు. తరువాత ఆ బాలుడు 'హరిభక్త పరాయణ తుకారాం బువా అజ్‌గాఁవ్‌కర్'గా ప్రాచుర్యం పొందారు. తరువాత రామనవమి పండుగ సందర్భంగా శిరిడీలో దాసగణు మహరాజ్ మరియు అతని ప్రముఖ శిష్యుడైన శ్రీదామోదర్ వామన్ అతవలే('దాము అన్నా' అని పిలుస్తారు)తో కలిసి కీర్తనలను చేయడం ప్రారంభించారు. శ్రీదామోదర్ వామన్ అతవలే చాలా చిన్న వయస్సులోనే 1924లో మరణించారు. అప్పటినుండి శ్రీతుకారాం బువా దాసగణు మహరాజ్‌తో పాటు కీర్తనలు ప్రదర్శించేవారు. 15 ఏళ్ల వయస్సులోనే స్వతంత్రంగా శిరిడీలో కీర్తనలు ప్రదర్శించారు(ref: శ్రీ సాయిలీల మ్యాగజైన్, 1925).

శ్రీదాసగణు మహరాజ్ తన 70 సంవత్సరాల వయస్సు వరకు కీర్తనలు చేశారు. 1935 లేదా 1940 తరువాత శ్రీతుకారాం బువా దాసగణు మహరాజ్ గారి కీర్తన సాంప్రదాయాన్ని కొనసాగించారు. 1988 వరకు ఈ కీర్తన సంప్రదాయం కొనసాగింది. 65 సంవత్సరాలకు పైగా దాసగణు మహరాజు యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతదేశం అంతటా మరాఠీ మరియు హిందీ భాషల్లో పదివేల కన్నా ఎక్కువ కీర్తనలు చేశారు. అతడు రామదాసి సంప్రదాయాన్ని అనుసరిస్తూ తద్వారా వచ్చే ఆదాయంతోనే జీవనం సాగించారు. అదే అతని జీవనోపాధిగా ఉండేది. అతని జీవితంలో చివరి 20-25 సంవత్సరాలలో అతను కేవలం ధోతి, తువ్వాలు మాత్రమే ధరించేవారు. అతను పండిట్ శ్రీరాజేశ్వరశాస్త్రి ద్రావిడ్ యొక్క సంరక్షణలో సంస్కృత లేఖనాలు, వేదాలు మొదలైన వాటిని నేర్చుకున్నారు. పూనాలోని గంధర్వ మహావిద్యాలయ ప్రిన్సిపాల్ అయిన పండిట్ వినాయకరావు పట్వర్ధన్ మార్గదర్శకంలో వద్ద సంగీతం కూడా నేర్చుకున్నారు. అతను 81 ఏళ్ళ వయసులో 1991వ సంవత్సరంలో ప్రశాంతంగా మరణించారు.

తుకారాం కుమారులు శ్రీ మాధవరావు తుకారాం(కీర్తనాకారుడు) మరియు శ్రీ ప్రభాకర్ తుకారాం లు తండ్రి బాధ్యతలను స్వీకరించి భారతదేశం అంతటా మరియు విదేశాలలోను కీర్తనలను చేస్తున్నారు.

(మూలం: శ్రీ మాధవరావు తుకారాం అజ్‌గాఁవ్‌కర్, S/o. స్వర్గీయ శ్రీ తుకారాం మహరాజ్ అజ్‌గాఁవ్‌కర్,  http://www.saiamrithadhara.com/mahabhakthas/tukaram_maharaj_ajegaonkar.html

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo