సాయిభక్తుడైన చోటూభయ్యా, నారాయణ గోవింద్ షిండేలు చిన్ననాటి స్నేహితులు. వారివురూ 1903వ సంవత్సరంలో గాణ్గాపురం వెళ్లి సంగమంలో స్నానమాచరించారు. తరువాత చోటూభయ్యా తన స్నేహితుడైన షిండేతో, "దత్తపాదుకలకు నమస్కరించుకుని, సంవత్సరంలోగా కొడుకు పుడితే, బిడ్డను తీసుకొచ్చి స్వామి పాదుకల వద్ద ఉంచుతానని మ్రొక్కుకో!” అని సలహా ఇచ్చాడు. అతనలా చెప్పడానికి కారణం, అప్పటికి షిండేకి ఏడుగురు కుమార్తెలున్నారుగానీ, పుత్రసంతానం లేదు. స్నేహితుని సలహాననుసరించి అలాగే మ్రొక్కుకున్నాడు షిండే. భగవంతుని ఆశీస్సులతో సంవత్సరంలోపు అతనికి పండంటి కొడుకు పుట్టాడు. కానీ, అతను తన మ్రొక్కును తీర్చుకోలేదు. మ్రొక్కును త్వరగా తీర్చుకోమని చోటూభయ్యా పదేపదే షిండేకు గుర్తు చేస్తున్నప్పటికీ అతను ఏవో సాకులు చెప్పి కాలయాపన చేస్తుండేవాడు. ఒకరోజు చోటూభయ్యా అతని చేయి మెలిపెట్టి, "అరే షిండే! భగవంతుడు ఏదో ఒక విధంగా తన మ్రొక్కులు రాబట్టుకుంటాడు. ఆ పరిస్థితి రాకముందే నీ బిడ్డను తీసుకొని గాణ్గాపురం వెళ్లడం మంచిది" అని చెప్పాడు. అయినా షిండే వినలేదు.
1911లో ఒకరోజు చోటూభయ్యా తన కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకొని షిండేని కూడా తమతో శిరిడీ రమ్మని అడిగాడు. కానీ షిండే అందుకు నిరాకరించాడు. ఆ రోజంతా షిండే విపరీతమైన అశాంతికి లోనయ్యాడు. దాంతో తన స్నేహితునితో కలిసి శిరిడీ వెళ్ళటానికి నిర్ణయించుకుని, సరిగ్గా వాళ్ళు శిరిడీ బయలుదేరే సమయానికి వాళ్లను కలుసుకున్నాడు. అందరూ కలిసి ప్రయాణమై మరుసటిరోజు సాయంత్రానికి శిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకున్నారు. ఆ మరుసటిరోజు వాళ్ళు మధ్యాహ్న ఆరతికి హాజరయ్యారు. అప్పుడు బాబా షిండే వైపు తీక్షణంగా చూస్తూ, "అరేయ్! నిన్ను నువ్వు చాలా తెలివైనవాడినని అనుకుంటున్నావు. నా పొత్తికడుపును చీల్చి నీకు కొడుకును ప్రసాదించాను. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే, ఎలాగైతే నీకు కొడుకునిచ్చానో అలాగే వాడిని వెనక్కి తీసుకోగల సామర్థ్యం నాకుంది" అని అన్నారు. బాబా మాటలు వింటూనే షిండే పశ్చాత్తాపపడి మనసులోనే తనను క్షమించమని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా చోటూభయ్యా వైపు తిరిగి, "నీ విషయంలో అంతా బాగుంది కదా" అని అడిగారు. ఆ విధంగా అడగడం ద్వారా షిండేని తమ చెంతకు తీసుకురావడంలో చోటూభయ్యా నిమిత్తమాత్రుడని తెలియజేశారు బాబా.
పై సంఘటనతో షిండే బాబాకు అంకిత భక్తుడై తరచూ శిరిడీ దర్శిస్తుండేవాడు. ఆ సంఘటన జరిగిన కొన్నిరోజులకి షిండే తన కుటుంబంతో కలిసి గాణ్గాపురం వెళ్లి దత్తపాదుకల వద్ద తన కొడుకును ఉంచాడు. ఆ తరువాత అక్కడినుండి ఇంటికి తిరిగి వెళ్లకుండా నేరుగా శిరిడీ వెళ్లి తన కొడుకును బాబా పాదాల చెంత ఉంచాడు. చంచల స్వభావం గల భక్తులపై బాబాకు ఉండే అపారమైన ప్రేమకు నిదర్శనమీ లీల.
సోర్స్: శ్రీసాయిలీల పత్రిక 1924 (బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి)
Om sairam
ReplyDeleteOm Sai
Sri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteJai sairam
ReplyDeleteOm sai ram baba kapadu thandri pleaseeee
ReplyDelete🙏🌷🙏ఓం సాయిరాం🙏🌷🙏
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
🙏🌷🙏💐🙏🌺🙏🌷🙏💐🙏🌺🙏🌺🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi manchi varini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDelete