సాయిభక్తుడు శ్రీ బల్వంత్ హరికార్నిక్ బొంబాయిలో (ఘోడ్ బందర్ రోడ్డు, బాంద్రా) నివాసముండేవాడు. అతను కస్టమ్స్ శాఖలో పనిచేసేవాడు. అతడు 1936 సెప్టెంబర్ 19న, శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను దివంగత శ్రీ బి.వి.నరసింహ స్వామిగారితో ఈక్రింది విధంగా వివరించాడు.
నేను సాయిభక్తుడిని. ప్రతిరోజూ నేను ఇంట్లో సాయిబాబాను ఆరాధిస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా నేను శిరిడీ సందర్శిస్తుండేవాడిని. దాసగణు మహారాజ్ కీర్తనలను వినటం ద్వారా సాయిబాబాపట్ల నాకు భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. నేను 1911వ సంవత్సరంలో మొదటిసారి శిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాను. ఆయన శక్తివంతమైన కళ్ళు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి, ఆయనపై నాకున్న విశ్వాసాన్ని ఎన్నోరెట్లు అధికం చేశాయి. నేను ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాను.
బాబా నావద్దనుండి రూ.10/- దక్షిణ తీసుకున్నారు. దాంతో నావద్ద తిరుగు ప్రయాణానికి డబ్బులు లేకుండా పోయాయి. కానీ అదే సమయంలో నా స్నేహితుడు మిస్టర్ ఠోసర్ (వాయ్ కి చెందిన సన్యాసి నారాయణాశ్రమ్) కలిసి నాకు కావలసినంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. నేను శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు. అప్పటినుండి మేమంతా నిత్యం ఇంటిలో సాయిబాబాను పూజించడం మొదలుపెట్టాము.
సాయిబాబాతో నాకు ప్రత్యేకమైన అనుభవాలు ఏమీలేవు. నేను ఏదీ ఆశించి బాబా దర్శనం కోసం వెళ్ళేవాడిని కాదు. కానీ, 1918వ సంవత్సరం, గురుపూర్ణిమనాడు మాత్రం ప్రత్యేకంగా నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి బాబాని అడగాలని అనుకున్నాను. కానీ, ఆరోజు బాబా చాలా కోపంగా ఉన్నందువల్ల నేను అసంతృప్తితో వెనుదిరిగాను. బయటకు వచ్చి నేను టాంగా ఎక్కబోతుండగా నానావళి నా వద్దకు వచ్చి, నన్ను కౌగిలించుకుని, "అల్లాహ్ తేరా అచ్చా కరేగా" (భగవంతుడు నీకు మేలు చేస్తాడు) అని అన్నాడు.
నా భార్య సాయిబాబాను దర్శించిన తరువాత ఆయనపట్ల ప్రత్యేకమైన భక్తి ఏర్పరుచుకుంది. 1928వ సంవత్సరంలో ఆమె మరణించింది. ఆమె మరణించడానికి ముందు ప్రసవానంతరం వచ్చే సమస్యలతో 9 నెలలపాటు బాధపడింది. ఆమె తన చివరి 6, 7 రోజులు పూర్తి అపస్మారక స్థితిలో ఉంది. అప్పుడు నేను సాయిబాబా ఫోటో ఆమె ముందు ఉంచాను. చివరి ఘడియల్లో ఆమెకు స్పృహ వచ్చి, తన రెండుచేతులు జోడించి, ముందు సాయిబాబాకు తరువాత నాకు నమస్కరించింది. తరువాత తన పెద్దకొడుకును దగ్గరకు పిలిచి, చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రశాంతంగా కన్నుమూసింది. ఆవిధంగా బాబా ఆమెను ఆశీర్వదించి సద్గతి ప్రసాదించారు.
ఒకసారి, నేను, నా భార్య పండరీపురం, అక్కడికి సమీపంలో ఉన్న ఇతర పవిత్రక్షేత్రాలను సందర్శించాలనుకుని, రూ.100/- లు తీసుకుని ప్రయాణమయ్యాము. ఆ ప్రదేశాలకు వెళ్ళేముందు మేము శిరిడీ వెళ్ళాము. అక్కడ మేము రెండురోజులు ఉన్నాము. ఆ రెండు రోజుల్లో సాయిబాబా మావద్దనుండి రూ.100/- లను దక్షిణగా తీసుకున్నారు. అందువల్ల ఇతర ప్రదేశాలను దర్శించుకోవాలనుకున్న మా ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఆవిధంగా పండరీపురం మరియు ఇతర క్షేత్రాలన్నీ శిరిడీలోనే ఉన్నాయని బాబా మాకు తెలియజేయాలనుకున్నట్లుగా నేను గుర్తించాను. "సకల తీర్థాలు సద్గురు(మహాత్ముల) చరణాలలో ఉంటాయ"ని గ్రంథాలన్నీ చెపుతాయి. బాబా మావద్ద ఉన్న డబ్బంతా దక్షిణగా తీసుకున్న తరువాత శిరిడీ విడిచివెళ్ళడానికి మాకు అనుమతి ఇచ్చారు. అప్పుడు నేను శిరిడీలో ఉన్న నా స్నేహితులతో నావద్దనున్న ధనమంతా అయిపోయినందున నేను ఇంటికి తిరిగి వెళ్ళలేనని చెప్పాను. వాళ్ళు నాతో, "బాబా అనుమతించిన తరువాత శిరిడీలో ఉండటం తప్ప"ని చెప్పారు. అకస్మాత్తుగా మిస్టర్ ఠోసర్ శిరిడీ వచ్చాడు. అతను నాకు కావలసినంత డబ్భు ఒకతని వద్దనుండి అప్పుగా ఇప్పించాడు.
బాబా ఫకీర్లకు, పేదవారికి అన్నం పెట్టి ఆదరిస్తుండేవారు. అందువలన నేను బాబాకు సమర్పించిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను సాయిబాబాను ఆశ్రయించిన తరువాత నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించిన సూచనలు ముందుగానే అందేవి. వాటిని ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యాన్ని కూడా బాబా ద్వారా పొందుతున్నాను.
సమాప్తం.
నేను సాయిభక్తుడిని. ప్రతిరోజూ నేను ఇంట్లో సాయిబాబాను ఆరాధిస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా నేను శిరిడీ సందర్శిస్తుండేవాడిని. దాసగణు మహారాజ్ కీర్తనలను వినటం ద్వారా సాయిబాబాపట్ల నాకు భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. నేను 1911వ సంవత్సరంలో మొదటిసారి శిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాను. ఆయన శక్తివంతమైన కళ్ళు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి, ఆయనపై నాకున్న విశ్వాసాన్ని ఎన్నోరెట్లు అధికం చేశాయి. నేను ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాను.
బాబా నావద్దనుండి రూ.10/- దక్షిణ తీసుకున్నారు. దాంతో నావద్ద తిరుగు ప్రయాణానికి డబ్బులు లేకుండా పోయాయి. కానీ అదే సమయంలో నా స్నేహితుడు మిస్టర్ ఠోసర్ (వాయ్ కి చెందిన సన్యాసి నారాయణాశ్రమ్) కలిసి నాకు కావలసినంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. నేను శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు. అప్పటినుండి మేమంతా నిత్యం ఇంటిలో సాయిబాబాను పూజించడం మొదలుపెట్టాము.
సాయిబాబాతో నాకు ప్రత్యేకమైన అనుభవాలు ఏమీలేవు. నేను ఏదీ ఆశించి బాబా దర్శనం కోసం వెళ్ళేవాడిని కాదు. కానీ, 1918వ సంవత్సరం, గురుపూర్ణిమనాడు మాత్రం ప్రత్యేకంగా నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి బాబాని అడగాలని అనుకున్నాను. కానీ, ఆరోజు బాబా చాలా కోపంగా ఉన్నందువల్ల నేను అసంతృప్తితో వెనుదిరిగాను. బయటకు వచ్చి నేను టాంగా ఎక్కబోతుండగా నానావళి నా వద్దకు వచ్చి, నన్ను కౌగిలించుకుని, "అల్లాహ్ తేరా అచ్చా కరేగా" (భగవంతుడు నీకు మేలు చేస్తాడు) అని అన్నాడు.
నా భార్య సాయిబాబాను దర్శించిన తరువాత ఆయనపట్ల ప్రత్యేకమైన భక్తి ఏర్పరుచుకుంది. 1928వ సంవత్సరంలో ఆమె మరణించింది. ఆమె మరణించడానికి ముందు ప్రసవానంతరం వచ్చే సమస్యలతో 9 నెలలపాటు బాధపడింది. ఆమె తన చివరి 6, 7 రోజులు పూర్తి అపస్మారక స్థితిలో ఉంది. అప్పుడు నేను సాయిబాబా ఫోటో ఆమె ముందు ఉంచాను. చివరి ఘడియల్లో ఆమెకు స్పృహ వచ్చి, తన రెండుచేతులు జోడించి, ముందు సాయిబాబాకు తరువాత నాకు నమస్కరించింది. తరువాత తన పెద్దకొడుకును దగ్గరకు పిలిచి, చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రశాంతంగా కన్నుమూసింది. ఆవిధంగా బాబా ఆమెను ఆశీర్వదించి సద్గతి ప్రసాదించారు.
ఒకసారి, నేను, నా భార్య పండరీపురం, అక్కడికి సమీపంలో ఉన్న ఇతర పవిత్రక్షేత్రాలను సందర్శించాలనుకుని, రూ.100/- లు తీసుకుని ప్రయాణమయ్యాము. ఆ ప్రదేశాలకు వెళ్ళేముందు మేము శిరిడీ వెళ్ళాము. అక్కడ మేము రెండురోజులు ఉన్నాము. ఆ రెండు రోజుల్లో సాయిబాబా మావద్దనుండి రూ.100/- లను దక్షిణగా తీసుకున్నారు. అందువల్ల ఇతర ప్రదేశాలను దర్శించుకోవాలనుకున్న మా ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఆవిధంగా పండరీపురం మరియు ఇతర క్షేత్రాలన్నీ శిరిడీలోనే ఉన్నాయని బాబా మాకు తెలియజేయాలనుకున్నట్లుగా నేను గుర్తించాను. "సకల తీర్థాలు సద్గురు(మహాత్ముల) చరణాలలో ఉంటాయ"ని గ్రంథాలన్నీ చెపుతాయి. బాబా మావద్ద ఉన్న డబ్బంతా దక్షిణగా తీసుకున్న తరువాత శిరిడీ విడిచివెళ్ళడానికి మాకు అనుమతి ఇచ్చారు. అప్పుడు నేను శిరిడీలో ఉన్న నా స్నేహితులతో నావద్దనున్న ధనమంతా అయిపోయినందున నేను ఇంటికి తిరిగి వెళ్ళలేనని చెప్పాను. వాళ్ళు నాతో, "బాబా అనుమతించిన తరువాత శిరిడీలో ఉండటం తప్ప"ని చెప్పారు. అకస్మాత్తుగా మిస్టర్ ఠోసర్ శిరిడీ వచ్చాడు. అతను నాకు కావలసినంత డబ్భు ఒకతని వద్దనుండి అప్పుగా ఇప్పించాడు.
బాబా ఫకీర్లకు, పేదవారికి అన్నం పెట్టి ఆదరిస్తుండేవారు. అందువలన నేను బాబాకు సమర్పించిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను సాయిబాబాను ఆశ్రయించిన తరువాత నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించిన సూచనలు ముందుగానే అందేవి. వాటిని ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యాన్ని కూడా బాబా ద్వారా పొందుతున్నాను.
సమాప్తం.
Source: Devotees' Experiences of Sri Sai Baba Part III by Sri.B.V.Narasimha Swamiji
Very nice Leela's.first Leela is very good.om Sai Ram om Sai Ram om Sai Ram.
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤🌼😊
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha