సాయి వచనం:-
'నాకు వారసులెవరూ లేరు. నన్ను ఆశ్రయించినవారికి నా సమాధినుండే సమాధానమిస్తాను. సమాధి చెందినప్పటికీ నా సమాధిలోనుండి నా ఎముకలు మాట్లాడుతాయి. అవి మీకు ధైర్యమును, విశ్వాసమును కలిగిస్తాయి.'

' 'జైసా దేశ్ – వైసా వేష్' అన్నారు శ్రీసాయిబాబా. ఏ కాలానికి అనుగుణమైన ధర్మాన్ని ఆ కాలంలో పాటించడం వివేకం. కాలధర్మం చెందిన ఆచారాలను పట్టుకుని వ్రేలాడడం అవివేకం' - శ్రీబాబూజీ.

శ్రీభాస్కర్ సదాశివ్ సాతమ్


బాబాను సశరీరులుగా ఉన్న సమయంలో దర్శించుకోలేనప్పటికీ, ఆయన అనుగ్రహానికి పాత్రుడైన శ్రీభాస్కర్ సదాశివ్ సాతమ్ 1911వ సంవత్సరంలో ఒక సాధారణ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి క్రమేణా సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగాడు. సుమారు 1930 ప్రాంతంలో అతను సాయిభక్తుడైన శ్రీనాగేష్ ఆత్మారామ్ సామంత్‌ను కలుసుకున్నాడు. సామంత్ అతనితో శ్రీసాయిబాబా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆ సమయంలో శ్రీభాస్కర్ శిరిడీ వెళతానని సామంత్ తో చెప్పాడు. కానీ, చాలా సంవత్సరాల వరకు అతను శిరిడీ వెళ్ళలేదు.

1940లో భాస్కర్ సదాశివ్ సాతమ్, నాగేష్ ఆత్మారామ్ సామంత్ లు కలిసి నార్గాఁవ్ ట్రైనింగ్ స్కూల్లో కలిసి పనిచేశారు. దురదృష్టవశాత్తు, కొన్ని అవాంఛనీయ సంఘటనల కారణంగా 1940, ఫిబ్రవరి 16న భాస్కర్‌ ఉద్యోగం నుండి సస్పెండ్ చేయబడ్డాడు. ఆ సమయంలో అతను హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించాడు. అతను శిరిడీ నుండి ఊదీ, ప్రసాదం పంపమని కోరగా శ్రీసగుణమేరు నాయక్ వాటిని పంపాడు. కానీ  ప్రసాదం మాత్రమే అతనికి అందింది. తరువాత 1940, ఫిబ్రవరి 28న అతన్ని ఉద్యోగం నుండి తొలగించినట్లు ఉత్తర్వులు వచ్చాయి. అప్పుడు సామంత్ జోక్యం చేసుకుని, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా శిరిడీ వెళ్ళమని భాస్కర్‌తో చెప్పాడు. దాంతో భాస్కర్ సదాశివ్ సాతమ్ తన కుమారుడిని వెంటబెట్టుకుని 1940 సంవత్సరం రామనవమి పండుగ సమయంలో శిరిడీ సందర్శించి బాబా దర్శనం చేసుకున్నాడు. అక్కడ రెండు రోజులు ఉండి ఆర్తిగా బాబాను ప్రార్థించాడు. మూడవరోజు బొంబాయికి తిరిగి వస్తుండగా దారిలో దాదర్ వద్ద ఒక కానిస్టేబుల్‌ అతన్ని కలిసి, అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని లామింగ్టన్ రోడ్ పోలీసుస్టేషన్లో నియమించినట్లు చెప్పాడు. కానీ అలాంటి ఉత్తర్వులు అప్పటికి జారీ అయ్యే అవకాశమే లేదు. తరువాత భాస్కర్ సదాశివ్ సాతమ్ 1940, ఏప్రిల్ 28న మునుపటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేశాడు. తరువాత 1940, మే 14న, అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని లామింగ్టన్ రోడ్ పోలీసుస్టేషన్లో నియమించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంటే అధికారికంగా ఉత్తర్వులు రావడానికి ముందే బాబా నిర్ణయం కానిస్టేబుల్ నోటి ద్వారా వచ్చింది!

శ్రీ భాస్కర్ సదాశివ్ సాతమ్ తీర్చవలసిన కొన్ని బాకీలు ఉండేవి. ఆ విషయంలో అతడు బాబాను ప్రార్థించాడు. కృపతో బాబా అతనికి డబ్బులు అందేలా చేయడంతో అతడు ఆ అప్పుల నుండి విముక్తిపొందడమే కాకుండా కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు. అలాంటి  సుఖసంతోషాలు ఎల్లప్పుడూ ప్రసాదించమని అతడు బాబాను ప్రార్థించాడు.

సమాప్తం

Source: Devotees' Experiences of Shri Sai Baba, Part III by Late Shri.B.V.Narasimha Swamiji.

6 comments:

  1. om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  2. Danyosmi thandri sainatha.🙏🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  5. Om sai ram, na manasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri, amma nannalu kshamam arogyam ga unde la chudandi tandri vaalla badyata meede, ofce lo anta bagunde la chudandi tandri, e roju anta bagunde la chudandi tandri, health bagoni vaallu twaraga kolukunr la chesi manchi arogyanni ivandi tandri.

    ReplyDelete
  6. Om sai ram, na manasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri, amma nannalu kshamam arogyam ga unde la chudandi tandri vaalla badyata meede, ofce lo anta bagunde la chudandi tandri, e roju anta bagunde la chudandi tandri, health bagoni vaallu twaraga kolukune la chesi manchi arogyanni ivandi tandri.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo