సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 381వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదిహేనవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

"ఇక్కడ చేయవలసిందంతా ఇతరుల కోసమే చేయాలి"

వాసుదేవ్ అనే పేరుగల పూణేకి చెందిన ఒక బ్రాహ్మణుడు శిరిడీలో భోజనశాల నడిపిస్తూ ఉండేవాడు. అతని దగ్గర శ్రీసగుణరావు ఉంటుండేవాడు. వర్తమానంలో (అంటే 1913లో) సగుణరావు ఉంటున్న ఇంటికి వెనుకభాగంలో శ్రీవాసుదేవ్ ఉంటుండేవాడు. బయట ఓ అరుగు ఉండేది. ఇప్పుడు ఆ ప్రదేశంలో సగుణరావు దుకాణం ఉంది. ఆ అరుగు మీద కూర్చొని హోటలుకొచ్చే వారందరూ తేనీరు, ఉదయ ఫలహారం మొదలైనవి తీసుకుంటుండేవారు. ఇరవై రూపాయలకు వాసుకాకా దగ్గర నా భోజనానికి ఏర్పాటయింది. ద్వాదశిరోజున అప్పుడప్పుడు పొద్దునపూట వాసుకాకా రవ్వకేసరి తెస్తుండేవాడు. అది ఒకవేళ బాబా ఉదయ ఫలహారానికి ముందు తయారైతే ఆ రవ్వకేసరి సరాసరి బాబా దగ్గరకు కూడా పంపబడుతుండేది. అయితే ఒకరోజు అది ఆలస్యంగా లభించటంవల్ల నేనే దాన్ని పూర్తిగా తినేశాను. అదేరోజు బాబా నన్ను అగ్గిపెట్టె కొనుక్కురమ్మని పంపించారు. బాబా ఎప్పుడూ రెండు పైసలకు మూడు అగ్గిపెట్టెలు తెప్పిస్తుండేవారు. కానీ నేను బేరం చేయకుండా ఒక పైసాకు ఒక అగ్గిపెట్టెను తీసుకొచ్చాను. అప్పుడు బాబా నాతో, "ఏం, కల్లూ గిల్లూ ఏమీ తాగి రాలేదు కదా?!" అన్నారు. ఆరోజు నుంచి ఉపవాసానికి తరువాతరోజు పారణ (అంటే వ్రత సమాప్తి) సమయంలో రవ్వకేసరి తయారు కాబడుతూ ఉండేది. దాన్ని తినే సమయం గురించి ఇప్పటికీ నేను భయపడతాను.

ఒకరోజు స్వప్నంలో, “నీకు శంకరుని ఆశీర్వాదం ఉంది” అని బాబా నా శిరస్సుపై తమ వరదహస్తాన్నుంచారు. ఈ స్వప్నం వచ్చిన కొద్దిరోజులకు స్వప్నంలో లాగానే ఇంచుమించు ఐదునిమిషాలు బాబా నా తలమీద చేయి పెట్టారు. ఆ యోగంతో నా శరీరంలో దివ్యమైన శక్తి సంచారం జరిగింది. అలా స్వప్నంలో ఇచ్చినటువంటి జ్ఞానాన్ననుసరించి 'ఒప్పచెప్పబడ్డ పని నీ చేత్తో అవవలసి ఉంద'నే సూచన లభించింది.

తరువాత అందరూ కూర్చొని ఉన్నప్పుడు బాబా, "వీడు చిన్నగా ఎలుకంత ఉన్నప్పటినుంచి నేను వీడిని ఎరుగుదును” అన్నారు. బాబా నోటినుంచి వెలువడిన ఈ మాటలను నేను మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె నాతో ఒక వాస్తవం చెప్పింది. చిన్నప్పుడు నేను చాలా బలహీనంగా ఉండేవాణ్ణట. మాటిమాటికీ నాకు అనారోగ్యం వస్తుండేదట. నాకు ఇంచుమించు ఐదుసంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు ధారానణాలో ఉప్పు గోడౌన్లో ఉద్యోగం చేస్తుండేవారట. అప్పుడు మేము ఓ డేరాలో ఉంటుండేవాళ్ళమట. కొన్నినెలలపాటు నాకు బంక విరోచనాలు, అతిసారం, వికారంతో వాంతులు అవుతుండేవట. నేను బ్రతుకుతాననే ఆశను అందరూ వదులుకున్నారట. ఓ సాయంత్రం మా అమ్మ నన్ను తీసుకుని ఇంటి ప్రాంగణంలో కూర్చొని ఉన్నప్పుడు హఠాత్తుగా అక్కడకొక ఫకీరు వచ్చి ఆమెతో, "మీ కొడుకు చాలా అదృష్టవంతుడు" అన్నాడట. మా అమ్మ, "ఏమదృష్టవంతుడు? వీడికి నీళ్ళు విరోచనాలు పట్టుకుని వదలటం లేదు. వీడు మాతో మరో నాలుగు రోజులుంటే అదే గొప్ప అనిపిస్తోంది” అన్నదట. ఫకీరు, "లేదు, లేదు, అలా అనొద్దు, ఇతను చాలా అదృష్టవంతుడు. ఇతని కుడిచంకలోనూ, కుడిభుజంమీదా కూడా పుట్టుమచ్చలున్నాయి” అన్నాడట. మా అమ్మ నా ఒంటిమీద కప్పిన దుప్పటిని నాకు తొడిగిన చొక్కానీ పైకెత్తి చూసిందిట. అప్పుడు ఫకీరు చెప్పిన ప్రదేశాల్లో నిజంగానే ఆ గుర్తులు కనిపించాయట. దాన్ని చూసి మా అమ్మ, “మీరు చెప్పిన గుర్తులయితే ఉన్నాయి, బాగానే ఉంది, మరి వీడి అనారోగ్యం గురించి ఏం చేయాలి?" అన్నదట. ఆ ఫకీరు, "ఈ విభూది తీసుకుని అతని నోట్లో వేస్తే అంతా బాగయిపోతుంది" అన్నాడట. దాని తరువాత ఎటువంటి వైద్యమూ లేకుండానే నేను స్వస్తుడ్ని కావటం మొదలుపెట్టానట. అప్పుడు అందరి విచారమూ దూరమైపోయిందట. ఈ వాస్తవంతో, బాబా నా చిన్నప్పటినుంచి నన్ను జాగ్రత్తగా చూస్తూ నన్ను రక్షిస్తున్నారన్న విశ్వాసం నాకు కలిగింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo