సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 358వ భాగం.


ఖపర్డే డైరీ - నలభై మూడవ భాగం.

ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చాక నెలలోనే దాదాసాహెబ్ శిరిడీ మొదటిసారి దర్శనం చేసుకోవటం చూశాం. అది ఒక వారంరోజుల్లోనే ముగిసింది. అయితే అప్పటినుంచీ, కొన్ని నెలల్లోనే రాజకీయ పరిస్థితి క్షీణించింది. ప్రభుత్వం జాతీయోద్యమాన్ని అణిచివేయటం కోసం తన అణిచివేత ఫథకాలను మరింత తీవ్రం చేసింది. 1911 అక్టోబరు 7న బిపిన్ చంద్రపాల్ ప్రయాణిస్తున్న స్టీమరు ఇంగ్లాండు నుండి బొంబాయికి చేరగానే అతని మీద దేశద్రోహ నేరం ఆరోపించి అతన్ని అరెస్టు చేయటమే దీనికి గుర్తు. లోకమాన్య విడుదల కోసం ఖపర్డే ఆందోళన చేస్తున్నందువల్ల అతను ప్రభుత్వం వారి బ్లాక్ లిస్టులో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేయటం అతి సమీపంలోనే పొంచి ఉంది. గవర్నమెంటు తీసుకోబోయే నిర్ణయం గురించి సరైన సమాచారాన్ని సేకరించటానికి ఖపర్డే పెద్దకొడుకు ఆ సమయంలో సిమ్లా వెళ్ళాడు. తాము సర్వజ్ఞులు కనుక, ఈ ప్రపంచంలో తమకు తెలీకుండా తమ దృష్టిని తప్పించుకొని ఏదీ ఉండదు కనుక సాయిబాబా తమ దివ్యదృష్టితో దీన్నంతా చూసి ఉండాలి. దానినే సాయిబాబా తమ నిగూఢ పరిభాషలో సూచించారు. 1911 డిసెంబరు 29న వ్రాయబడిన శిరిడీ డైరీలో ఆ విషయం స్పష్టంగా ఉంది. "నేను ఇంకా రెండు నెలలు ఉండాల"ని ఈ మధ్యాహ్నం ఆయన (సాయిబాబా) కబురు చేశారు. మధ్యాహ్నం ఈ సందేశాన్ని స్థిరపరచి, తమ "ఊదీ" గొప్ప ఆధ్యాత్మిక లక్షణాలు కలిగివున్నదని చెప్పారు. సాయిబాబా నా భార్యతో, "గవర్నర్ ఒక ఈటెతో వచ్చాడనీ, తాను (సాయిబాబా) తన వద్దనున్న త్రిశూలంతో బయటకు నెట్టి చివరికి గవర్నరుని సమాధాన పరిచామనీ" అన్నారు. భాష చాలా నిగూఢంగా ఉండటం వల్ల వివరించటం కష్టంగా ఉంది.

బాబాసాహెబ్ ఖపర్డే తన తండ్రి జీవిత చరిత్రలో, "ఊదీ" అనే మాటను సాయిబాబా దయగానూ, "గవర్నరు" యొక్క "ఈటె"ని "అరెస్టు వారెంటు"గానూ, "త్రిశూలాన్ని" బాబా యొక్క దివ్యశక్తిగానూ వివరించాడు.

29-12-1911 శిరిడీ డైరీ ఎంట్రీలో "హంస"గానూ, "స్వామి"గానూ పిలువబడే “మిస్టర్ నటేకర్" గురించిన వివరం కూడా ఉంది. హంస సన్నగా, తెల్లగా, మంచి కనుముక్కు తీరుతో, మంచి గాత్రంతో ఉండేవాడు. దానితో పాటు కొంచెం వాగుడుకాయలా కూడా ఉండేవాడు. అతను బాహ్యంగా ప్రదర్శించే పవిత్రతతోనూ, తన హిమాలయ మరియు మానససరోవర యాత్రావిశేషాలను కథలుగా చెపుతూ ఖపర్డే కుటుంబం యొక్క విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఖపర్డే ఇంగ్లాండులో ఉన్నప్పుడు హంస ఓ నెలపాటు ఖపర్డే కుటుంబం వారి అతిథి సత్కారాలను హాయిగా అనుభవించాడు. 

1913లో దాదాసాహెబ్ యొక్క తొమ్మిది డైరీలు  తాళం వేసి ఉన్న చెక్కపెట్టెలో నుండి దొంగిలించబడినట్లు కనుగొన్నారు. అయితే వాటిల్లో నేరారోపణ చేయదగ్గ విషయాలేవీ లేనందువల్ల ప్రభుత్వం ద్వారా ఆ డైరీలు తిరిగి ఖపర్డేకు ఇచ్చివేయబడ్డాయి. ఈ సంఘటన జరిగిన చాలాకాలానికి "హంస" ప్రభుత్వంచే నియోగించబడిన సిఐడి డిటెక్టివ్ అనీ, అతను దాదాసాహెబ్ శిరిడీలో ఉన్నప్పుడు అతని వ్యవహారశైలిని గమనించడానికి శిరిడీ వచ్చాడనీ ఖపర్డేకు తెలిసింది. 

1913 జూన్ 14న దాదాసాహెబ్ తన డైరీలో ఇలా రాశాడు: 

"సాధువులా కనిపించటానికి హంస అనేక ముందుజాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది" అని. 'హంస' శిరిడీలో ఉన్న సమయంలో, ఖపర్డే 29-12-1911 డైరీలో “ఊదీ" గురించి, గవర్నరును "త్రిశూలం"తో తరిమివేయటాన్ని గురించి రాయటంలో అర్థం లేకపోలేదు. హంస కుట్రలను తెలుసుకొని, తన శక్తులను ఉపయోగించి తన విశ్వాసపాత్రుడైన భక్తుడికి రాబోయే ప్రమాదాలను శ్రీసాయిబాబా తొలగించి ఉంటారనటంలో ఆశ్చర్యమేమీ లేదు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo