సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 360వ భాగం.


ఖపర్డే డైరీ - నలభై ఐదవ  భాగం

మార్చి 15:

మేము సాయంత్రం ఏడు గంటల ట్రైనులో బయలుదేరి మన్మాడు చేరాము. ప్యాసింజర్ రైలు పక్క ప్లాట్‌ఫారం మీద సిద్ధంగా ఉంది. మేము అందులోకి ఎక్కాము. మాకు టిక్కెట్లు కొనమని పాలేకర్‌ని పంపాను. ఈ లోపల రైలు బయలుదేరటంతో పాలేకర్ రైలు ఎక్కలేకపోయాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు మా కంపార్టుమెంటులోనే ఉన్నాడు. పరిస్థితినంతా నేనతనికి వివరించాను. భూసావల్ వరకూ వెళ్ళి అక్కడ పాలేకర్ కోసం ఎదురు చూడమని నాకు సలహా ఇచ్చాడతను. నేను అలాగే చేశాను. నేను ఇక్కడ భూసావల్ స్టేషనులో పాలేకర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా దగ్గర టిక్కెట్టు గానీ, డబ్బుగానీ లేదు. పాలేకర్ ఖపర్డేని భూసావల్ దగ్గర కలిశాడు. ఇద్దరూ కలిసి నాగపూర్ వెళ్ళే ట్రైనులో ప్రయాణించారు. ఖపర్డే మార్చి 16న ఆమ్రావతి చేరుకున్నాడు. అతను తన హృదయాన్ని శిరిడీలోనే విడిచి పెట్టి వచ్చాడన్న విషయం, 1912 మార్చి 18వ తారీఖు ఎంట్రీలో చూడవచ్చు. ఇది కూడా మరాఠీ జీవిత చరిత్ర నుంచి తీసుకొని అనువదించబడింది.

"శిరిడీలో ఉన్న ఆధ్యాత్మిక జీవితం ఇక్కడ కొరవడింది. ఆ నష్టాన్ని పూర్తిగా అనుభూతి చెందుతున్నాను. శిరిడీలో లాగా తెల్లవారుఝామున లేద్దామని అనుకుంటున్నాను, కానీ అలా చేయలేకపోతున్నాను. ఉదయపు స్తోత్రాలు పఠించుకోవటానికి నేను చాలా శ్రమపడవలసి వస్తోంది".

1915 డిసెంబరులో 3వ దర్శనం:

దాదాసాహెబ్ ఖపర్డే తన స్నేహితుడు బాబాగుప్తేను కలుసుకోవటానికి థానే వెళ్ళి అక్కడ నుంచి మన్మాడు మీదుగా డిసెంబరు 29న శిరిడీకి వచ్చాడు. శ్రీమతి ఖపర్డే, మిగిలిన కుటుంబసభ్యులు అప్పటికే నేరుగా శిరిడీ చేరుకున్నారు. డిసెంబరు31వ తేదీన దాదాసాహెబు అమరావతి తిరిగి వెళ్ళడానికి బాబా వద్దనుండి అనుమతి సంపాదించి వెళ్ళిపోయాడు. శ్రీమతి ఖపర్డే, ఇంకా మిగిలినవారు అక్కడే ఆగిపోయారు. ఖపర్డే శిరిడీని దర్శించినందుకు చాలా సంతోషించాడన్న సంగతి వారి మరాఠీ జీవిత చరిత్రలోని కొన్ని భాగాలనుండి తెలుస్తోంది.

డిసెంబరు 29:

"నేను కోపర్గాం నుండి టాంగాలో బయలుదేరి శిరిడీకి ఉదయం 9 గంటలకు చేరాను. త్రోవలో చాలా ప్రమాదాలు ఎదురయ్యాయి. నా భార్యా, పిల్లలూ అప్పటికే శిరిడీలో ఉన్నారు. నేను మశీదుకి వెళ్ళి సాయిబాబాకి నమస్కరించాను. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. పూజా సమయంలో నేను చామరం (నెమలి పింఛాల విసనకర్ర) పట్టుకున్నాను. ఇక్కడ రోజు ఇట్టే గడిచిపోతుంది. గోపాలరావు ఎలియాస్ బాపూసాపాబ్ బూటీ ఇక్కడే ఉన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్, బాలాసాహెబ్ భాటే ఇంకా మిగిలిన పాత స్నేహితులంతా ఇక్కడే ఉన్నారు. నాకు చాలా ఆనందమనిపించింది".

డిసెంబరు 30:

"ఈరోజు నేను పూజ చేసి నైవేద్యం సమర్పించాను. ప్రసాదం కోసం సుమారు 100 మంది కూర్చుని ఉన్నారు. భోజనం అద్భుతంగా ఉంది. అయితే కొంచెం ఆలస్యంగా, అంటే సాయంత్రం నాలుగు గంటలకి పూర్తయింది. బూటీవాడా నిర్మాణం బాగానే సాగుతోంది. ఈరోజు చావడి ఉత్సవం జరిగింది. నేను నా చేతుల్లో చామరం పట్టుకొన్నాను".

డిసెంబరు 31:

భోజనానంతరం నేను మాధవరావు దేశ్‌పాండేని కలిశాను. ఎటువంటి కష్టమూ లేకుండా తిరిగి వెళ్ళటానికి బాబా వద్ద అనుమతిని సంపాదించుకున్నాను. నా భార్య, మనూతాయి, ఉమ, పిల్లలూ ఇక్కడే ఆగిపోతారు".

1917 మే 19న నాలుగవ దర్శనం:

లోకమాన్య తిలక్‌తో కలిసి దాదాసాహెబ్ ఖపర్డే శిరిడీ వచ్చి పన్నెండు గంటలు ఉండటం అనేది కేవలం లోకమాన్యను సాయిబాబా వద్దకు తీసుకొచ్చి వారి ఆశీస్సులను తన నాయకుడికి ఇప్పించటానికే. శ్రీసాయిలీలలో వచ్చిన వివరాలు దాదాపు సంపూర్ణంగానే ఉన్నాయి.


తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo