సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 45వ భాగం.


 కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 45వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 75

తాత్యాసాహెబ్ నూల్కర్ గారి స్నేహితుడు అయిన డా. పండిత్ అనే పేరు కలిగిన వ్యక్తి ఒకసారి బాబా దర్శనానికై వచ్చాడు. దర్శనం అయిపోయిన తరువాత బాబా తనను దాదా కేల్కర్ వద్దకు వెళ్ళమని చెప్పారు. తనకు దాదాసాహెబ్ యొక్క ఇల్లు తెలియదు. తాను ఎలా వెళ్ళాలో బాబా చెప్పారు. ఆ విధంగానే డాక్టర్ పండిట్ దాదాకేల్కర్ వద్దకు వెళ్ళాడు. దాదాకేల్కర్ తనకు సాదరంగా ఆహ్వానం పలికాడు. తరువాత కొంచెం సేపటికి దాదాకేల్కర్ బాబా పూజ కోసమై బయలుదేరాడు. బయలుదేరేముందు తాను డాక్టర్ సాహెబ్ తో  “బాబా వద్దకు వస్తావా?” అని అడిగారు. డాక్టరు వెంటనే బయలుదేరారు. ద్వారకామాయికి వెళ్ళాక డాక్టరు కూడా బాబా పూజ చేసుకున్నారు. సహజంగా బాబా ఎవరినీ తమ నుదిటి పై గంధం పూయనివ్వరు. అందరూ కేవలం బాబా చరణాలకు మాత్రమే గంధం పూసేవారు. మహల్సా మాత్రమే బాబా కంఠానికి గంధం పూసేవారు. దాదాకేల్కర్ పూజ పూర్తి కాగానే  డాక్టరు లేచి గంధపు గిన్నె తీసుకొని బాబా నుదిటి పై త్రిపుండ్రాన్ని పూసారు. కోప్పడతారని దాదాకేల్కర్ భయపడ్డాడు. కానీ బాబా ఏమీ మాట్లాడలేదు మరియు  డాక్టరును ప్రశాంతంగా నుదిటి పై గంధాన్ని పూయనిచ్చారు. ఆ రోజు సాయంకాలం  దాదా కేల్కర్ బాబాను “మీరు మమ్మల్ని ఎవరినీ నుదిటి పై గంధం పూయనివ్వరు. కానీ ఈ రోజు మధ్యాహ్నం డాక్టరుచే పూయించుకున్నారు. అదెలా?” అని అడిగాడు అప్పుడు బాబా “అరే! తన గురువు బ్రాహ్మణుడు. తాను నన్ను తన గురువని అనుకున్నందు వలన గంధం పూసాడు. అందువలన తనను ఆపడానికి మనసు రాలేదు” అని చెప్పారు. డాక్టరును దాదాకేల్కర్ తరువాత విచారిస్తే, డాక్టర్ యొక్క గురువు కౌపేశ్వరానికి చెందిన కాకామహారాజ్ అని తెలిసింది.

అనుభవం - 76

శిరిడీలో లక్ష్మణ్ భట్ అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వద్ద నుండి నేను కొంత భూమిని 1910 లో ఖరీదు చేసాను. తను రూ.200/- ధర అడగసాగాడు. నేను రూ. 150/- కంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్దంగాలేను. ఆ విధంగా బేరం సాగుతుండగా లక్ష్మణ్ భట్ ద్వారకామాయి దారిలో వెళుతున్నపుడు బాబా తనను పిలిచి “ఏమిటి సంగతి?” అని అడిగారు. లక్ష్మణ్ భట్ జరిగిన విషయాన్నంతా చెప్పాడు. అప్పుడు బాబా “ఇద్దరిది కాదు కానీ, రూ.175/- లకు భూమి ఇచ్చేయ్. కానీ అంతకంటే తక్కువకు ఇవ్వవద్దు” అని చెప్పారు. కానీ లక్ష్మణ్ భట్ ఆ విషయం మాకు చెప్పలేదు. చివరకు రూ. 150/- లకు బేరం కుదిరింది. ఆ విధంగానే రిజిస్టర్ ముందర రూ. 150/- ను మేము ఇచ్చాము. కానీ గొప్ప చమత్కారమేమంటే ఇంటికి రాగానే లక్ష్మణ్ భట్ ఆ డబ్బులను లెక్కపెడితే సరిగ్గా రూ.175/- ఉన్నాయి.

అనుభవం - 77

1915 సంవత్సరం ఆఖరులో శ్రీ బాపుసాహెబ్ బూటీ గారికి విషజ్వరం వచ్చింది. సుమారు ఒక నెల రోజులు విపరీతంగా బాధపడ్డారు. మూడు వారాల పాటు జ్వరం 103 నుండి 105 వరకు ఉండేది. లేవడానికి, కూర్చోవడానికి కూడా  తన వద్ద శక్తి లేకుండా పోయింది. అటువంటి స్థితిలో కూడా బాపుసాహెబ్ ద్వారకామాయికి తీసుకురమ్మని బాబా చెప్పేవారు. ద్వారకామాయికి వచ్చాక బాపూసాహెబ్ కు శిరా, పాయసం, శనగలతో చేసిన కూర వంటి వాటిని తినిపించి  మరలా వాడాకు పంపించేవారు. బాపూసాహెబ్ ను శ్రీ మాధవరావ్ దేశపాండే లేదా ఇంకెవరైనా వీపుపై ఎక్కించికొని బాబా వద్దకు తీసుకు వచ్చేవారు. కానీ ఆయనకు ఇంక ఏ విదమైనటువంటి ఔషధోపచారాలు లేవు. బాబా దయవలన మరియు బాబా ఊదీ వలన మెల్ల మెల్లగా కోలుకోసాగారు. ఆ రోజులలోనే బాబా కూడా అస్వస్థతకు లోనయ్యారు. బాపూసాహెబ్ ఆరోగ్యవంతులయ్యాక, బాబా కూడా ఆరోగ్యవంతులయ్యారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo