సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 44వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 44వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 73 

వసంతరావ్ నారాయణ్ (ముంబాయి) గారు తరచూ శిరిడీ వెళ్ళేవారు. బాబా చరణాలపై ఆయనకు పూర్ణశ్రద్ధ ఉండేది. ఆయనను ఒకసారి జహంగీర్ పటేల్  అనే  పార్శీ స్నేహితుడు శ్రీ సాయిబాబా ఫోటో కావాలని అడిగాడు. శ్రీ వసంతరావ్ తనకు బాబా ఫోటోను ఇచ్చాడు. నిజానికి శ్రీ పటేల్ బాబా ఫోటోను అడిగింది భక్తితో కాదు తన ఆఫీసులో శ్రీ లిమాయే అనే పేరు కలిగిన సాయిభక్తుడైన గుమస్తా ఉన్నాడు తనకు ఇబ్బంది కలిగించాలని శ్రీ పటేల్ ఉద్దేశ్యం. శ్రీ లిమాయేకు పటేల్ శత్రువు. పటేల్ ఎప్పుడూ ఆ ఫోటోను లిమాయే వద్దకు తెచ్చి, ఆ ఫోటోను కించపరుస్తూ మాట్లాడి, శ్రీ లిమాయే మనసును బాధ పెట్టేవారు. ఆ ఫోటో ఇచ్చినందుకు లిమాయే వసంత్రావును దూషించాడు. అప్పుడు వసంతరావు తాను ఆ ఫోటోను పటేల్ అడగడం వలన ఇచ్చానని, అందువలన తాను బాగుపడతాడు అని అనుకున్నానని చెప్పాడు. “మనం ఇప్పుడు ఆ పటేల్ ను ముక్కుపిండి దర్శనానికి తీసుకువచ్చేటట్లు బాబాను ప్రార్థించుదాం” అని వసంతరావు అన్నాడు. వారు ఆ విధంగానే ప్రార్థించారు. తరువాత సుమారు 15 రోజులకు ఆ పార్శీ గృహస్థు వసంతరావు వద్దకు ఏడుస్తూ వచ్చాడు. “తాను బాబా ఫోటో పట్ల అమర్యాదగా ప్రవర్తించానని, అందువలన తనకు పశ్చాత్తాపం కలుగుతుందనీ, తన దక్షిణను బాబాకు చేర్చాలని చెప్పాడు. ఆ వ్యక్తి మనసు మారినందుకు వసంతరావుకి చాలా ఆనందం కలిగింది. ఆ వ్యక్తి శ్రీ కాకాసాహెబ్ ముందర జరిగిన విషయమంతా చెప్పి తన తప్పును ఒప్పుకున్నాడు. తరువాత 1918 లో గురుపూర్ణిమకు వసంతరావు మరియు లిమాయే గారితో కలిసి శ్రీ పటేల్ కూడా శిరిడీకి బాబా దర్శనానికై వచ్చాడు. శ్రీ పటేల్ గారు శ్రీ లిమాయేను ద్వేషించడం మానడమే గాక, వారిద్దరూ తరువాత చాలా మంచి స్నేహితులయ్యారు.

అనుభవం - 74

శ్రీ గణపతి ధోండూ కదమ్ తమ అనుభవాన్ని క్రింది విదంగా తేలియ పరుస్తున్నారు. 1914వ సం.లో నేను కుటుంబసహితంగా నాసిక్ ద్వారా రైలు బండిలో శిరిడీకి సాయిబాబా దర్శనానికి బయలుదేరి వెళుతున్నప్పుడు, నాసిక్ స్టేషన్ కు  ఒకటిరెండు స్టేషన్ల ముందు నేను కూర్చొన్న డబ్బాలోకి దాదాపు 15-20 నల్లగా పోతపోసిన విగ్రహాల్లాంటి బిల్లులు ఒకరి తరువాత ఒకరిగా డబ్బాలోకి  ప్రవేశించారు. వారు నా ప్రక్కనే కూర్చొన్నారు. (నేను కూర్చున్న డబ్బాలో బాబా ప్రయాణికులు ఎవరూ లేరు. నేను నా భార్య మరియు పిల్లలు మాత్రమే ఉన్నాము).  ఆ సమయంలో నేను శ్రీ లక్ష్మణ్ రామచంద్ర పాల్గార్కర్ గారి “భక్తి మార్గ దీపిక” చదువుతూ కూర్చొని ఉన్నాను. అప్పుడు వారు ఆ పుస్తకం శ్రవణం చేయడానికి నా దగ్గర కూర్చొన్నారు అనుకుని ఆ పుస్తకంలోని అభంగాలను బిగ్గరగా శ్రవణం చేయడం మొదలు పెట్టాను. ఆ భిల్లులు నా వద్ద సుమారు ఐదు నిముషాలు కూర్చొన్నారో, లేదో ఉన్నటుండి వెళుతున్న రైలు నుండి క్రిందకు దూకారు. అప్పుడు నేను వారిని చూడడానికై తలుపు దగ్గరకు వెళితే, ఆ భిల్లులు ఒకటే పరిగెడుతున్నారు. ఇంతలో కూర్చొన్న స్థలం వదకు వెళ్ళడానికి వెనుకకు తిరిగితే ఒక వయోవృద్ద ఫకీరు ముందర కూర్చొన్నట్టుగా అనిపించింది. డబ్బాలో ఇంతకు ముందు ఎవరూ లేకుంటే, ఈ ఫకీరు ఇందులోకి ఎలా వచ్చాడు? అనే ఆలోచన మనసులోకి వచ్చింది. మనసులోకి అటువంటి ఆలోచన రాగానే ముందర కూర్చొన్న ఫకీరు అదృశ్యమయ్యాడు. దాంతో నేను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. నాకు కళ్ళ ముందు ఆ ఫకీరు మరియు ఆ భిల్లులే కనపడుతున్నారు. జరిగిన సంఘటన నా కళ్ళ ముందే కదలాడుతోంది. నేను శిరిడీలో, బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, ద్వారకామాయిలో కాలు పెట్టగానే “సురక్షితంగా వచ్చారు కదా” అనే మాటలు బాబా ముఖతః వెలువడడంతో నేను తీవ్ర ఉద్విగ్నతకు గురయ్యాను. రైలులో జరిగిన లీల గుర్తుకు వచ్చింది. ఆ భిల్లులు దోపిడీ దొంగలని, మమ్మల్ని దోచుకోవడానికే రైలులో ఎక్కారని, కానీ బాబా దర్శనానికి వెళుతుండటం వలన, రాబోయే సంకటాన్నుండి తప్పించటానికి స్వయంగా శ్రీ సాయిబాబాయే ఆ ఫకీరు ఈ రూపంలో వచ్చారని అర్థమైంది. తరువాత రెండు రోజులు శిరిడీలోనే ఉండి బాబా దర్శనభాగ్యాన్ని పొంది తిరిగి ముంబాయికి వచ్చాను.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo