సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 409వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైమూడవ భాగం

నిన్నటి తరువాయిభాగం.....

ఒకరాత్రి సరిహద్దు రాయి మీద ధ్యానస్థుడినై కూర్చున్నాను. అక్కడ ఒక గుడిసె ఉంది. ఆ గుడిసెలో రాత్రంతా భజన జరుగుతోంది. దాన్ని నేను విన్నాను కానీ అక్కడ నాకెవరూ కనపడలేదు. ధ్యానావస్థలో నేనక్కడొక ఎడ్లబండిని చూశాను. అందులో బాబా రుద్రవేషధారణలో నిలబడి ఉన్నారు. వారి మీసాలు విశేషించి చాలా పొడవుగా ఉన్నాయి. బండిలో నుంచి వారొక పెద్దరాయినీ, బోలెడన్ని కంకరరాళ్ళనూ నా మీదకు విసిరారు. అవి నా వద్దకు వచ్చి పడ్డాయి కానీ, నాకు దెబ్బ తగల్లేదు. తిరిగి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి నా నివాసస్థలానికి చేరుకున్నాను.

ఈ మధ్యకాలంలో ఒకరాత్రి అందరూ నిద్రిస్తున్నప్పుడు నేను నా చెంబు తీసుకొని బయటకు వచ్చాను. బయటకొస్తూనే సన్యసించాలని నిశ్చయించుకున్నాను. శిరిడీ గ్రామం నుండి బయటకొచ్చి రహతా గ్రామం వైపు నడిచాను. రాత్రి పన్నెండున్నర గంటలైంది. ఆశ్వయజ మాస బహుళపక్షం అవటం వల్ల అంతటా చీకటిగా ఉంది. కొద్దిదూరం వెళ్ళాక, సూర్యోదయ సమయంలోనూ, సూర్యాస్తమయ సమయంలోనూ ఉండే రక్తవర్ణ సూర్యుడి లాంటి ఎర్రని గోళం ఆకాశంలో కనిపించింది. నేను సర్వాన్నీ త్యజించాలని నిశ్చయించుకున్నాను కాబట్టి సూర్యనారాయణుడు నాకు దర్శనమిచ్చారని నాకనిపించింది. “నిజమైన సన్యాసి త్యాగాన్ని చూసి ‘ఈ వైరాగ్య పురుషుడు నాకన్నా ముందు వెళతాడేమో’ననుకొని సూర్యుడు కూడా భయకంపితుడౌతాడు. అర్థరాత్రి సూర్యదర్శనం అవుతుంది” అన్న శాస్త్రవచనాలు నా స్మృతిపథంలోకి వచ్చాయి. ఈ విధంగా - ప్రతిపాదించబడిన శాస్త్రం యొక్క సత్యానికి బలం చేకూరింది. ఈ ఆలోచన నా మనసులోకి రావటంతోనే ఆ సూర్య ప్రకాశంవల్ల వీధి చివర ఎత్తైన భాగంలో ఉన్న నీళ్ళు కనిపించాయి. అప్పుడు నేను సావధానుడినైనాను. లేకపోతే ఆ అంధకారంలో కాలికి దెబ్బ తగిలి ఉండేదే. ఇదంతా చూసి - సాయిబాబా నన్ను రక్షించినట్లనిపించింది.

వెళుతూ వెళుతూ కాసేపటి తరువాత ముగ్గురు నలుగురు మనుషులు చెత్తను కాలుస్తూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కూర్చున్న చోటికొచ్చాను. వారు నన్ను పిలిచారు. నేను ఆగి అక్కడ కాసేపు కూర్చున్నాను. అయితే వారికీ, నాకూ మధ్య ఎలాంటి సంభాషణా జరగలేదు. తరువాత నేను నా చెంబుని అక్కడే వదిలేసి ముందుకెళ్ళి రహతా నదిని దాటి ఆ ఇసుకలో ఒక విరిగిన చెట్టుకొమ్మ మీద కూర్చున్నాను. ఒక గంట తరువాత నదిలో ఉన్న చెట్ల పైనుంచి పిశాచాలు వచ్చే చప్పుడైంది. మళ్ళీ నాకు లఘుశంక అనిపించి అందుకోసం కూర్చున్నప్పుడు ఎవరో ఒక దీపం పట్టుకుని నా గుహ్యభాగం మీద వెలుతురును ప్రసరింపచేయటం నాకు తెలిసింది. ధ్యానం పెట్టి చూస్తే అదో పిశాచమని తెలిసింది. దాని తలమీద ఒక దీపమో లేక దీపంలాంటి ప్రకాశమో ఉంది. అది తల క్రిందకీ, కాళ్ళు పైకీ పెట్టి నడుస్తోంది. లఘుశంక అయిన తరువాత మళ్ళీ చెట్టుకొమ్మ మీద కూర్చున్నాను. చూస్తూండగానే ఆ పిశాచం తల క్రిందకీ, కాళ్ళు పైకీ పెట్టి నదిలో దిగి నీళ్ళల్లో రెండు మునకలు వేసి కొంచెంసేపైన తరువాత అదృశ్యమైపోయింది. ఆ పిశాచాన్ని చూస్తే అది బ్రహ్మరాక్షసేమో అనిపించింది. తలమీద ప్రకాశాన్ని చూసి బహుశా అది ఒక పండితుడేమో అనిపించింది. అతడే బ్రహ్మరాక్షసుడి రూపంలో తిరుగుతున్నాడేమో! పండితుడు భక్తిహీనుడై తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోకపోతే వాడి అవస్థ ఇలాగే ఉంటుందన్న విషయం అప్పుడు నాకు గుర్తొచ్చింది. తెల్లవారుతూనే నేను శిరిడీ చేరుకున్నాను. అక్కడే ఖాన్‌గీవాలేతో పరిచయమైంది. ఆయన, “రాత్రి మీరెక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని వెతకటానికి బాబా ఒక మనిషిని పంపించారు. నేను కూడా గుర్రం మీద మిమ్మల్ని వెతకటానికి బయలుదేరాను, కానీ మీ జాడ తెలియలేదు. బాబా మమ్మల్ని ఈ రకంగా కష్టపెట్టకుండా ఉండాలంటే ఇకముందు మీరు కాకాసాహెబ్ వాడాలో నిద్రిస్తానని మాటివ్వాలి” అన్నారు. కాకాసాహెబ్, "ఇక్కడే పడుకో. నీవద్ద మా బాబు పడుకొంటాడు. నీవు కూడా బాబుని ఇష్టపడతావు కదా” అన్నారు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

6 comments:

  1. 🙏🙏🙏సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
    జయ జయ సాయి సాయి హరే హరే !🙏🙏🙏
    💐🌹🌷🌺🌸💐🌹🥀🌷🌺🌸🏵️💐🌺🏵️💐💐

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhavya sree

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo