సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 347వ భాగం


ఖపర్డే డైరీ - ముప్పయి రెండవభాగం

18-2-1912

మాధవరావు దేశ్‌పాండే ఉదయం నన్ను నిద్ర లేపగా ప్రార్థన చేసుకొని కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిసాహెబ్ ఆరతిని ప్రశాంతంగానే తీసుకున్నారు. దీని తరువాత కొంచెం కఠినంగానే మామూలు ధోరణిలోనే మాట్లాడినా అవి చాలా సరళంగా ఉన్నాయనే అనాలి. దీక్షిత్ తన కొడుకు వొడుగుకి నాగపూర్  వెళదామనుకుంటున్నాడు. అతను తనతో పాటు నన్ను కూడా తీసుకువెళతానని సాయిబాబాని అడిగాడు. దానికి చాలా పరుషమైన సమాధానం వచ్చింది. నాకు అనుమతి లభించదని ఇంచుమించు నాకు గట్టిగా అనిపించింది. వెళ్ళాలని నా భార్య చాలా ఆత్రుతపడుతోంది. నేను బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీశాస్త్రి, ఇంకా మిగతావారితో కలసి పంచదశి తరగతిలో ఉండగా నానాసాహెబ్ చందోర్కర్ వచ్చి దీక్షిత్‌తో కూర్చున్నాడు. మా తరగతి అయ్యాక నేను సాయిసాహెబ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అతన్ని కలిశాను. సాయిసాహెబ్ అతనితో తన మామూలు ధోరణిలో తేలీ, వామన్ తాత్యా, అప్పాకోతే మొదలైనవారి గురించి మాట్లాడుతున్నారు. చివర్లో సాయిసాహెబ్ కొంచెం అసహనంగా అయి అక్కడున్న వారిని త్వరగా వెళ్ళిపొమ్మని చెప్పటం మినహా మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగింది. నేను నానాసాహెబ్ చందోర్కర్‌తోనూ, దీక్షిత్‌తోనూ కలసి భోజనం చేశాను. క్రిందటిసారి నానాసాహెబ్ వచ్చి కొద్దిరోజులున్నప్పుడు మధ్యలో ఆగిపోయిన మా చర్చను కొనసాగించమని అతన్నడిగాను. అదంతా సాయిబాబా చేతుల్లో ఉందన్నాడతడు. పెళ్ళి మొదలైన శుభకార్యాలలో వాడే 'చంద్రుడితో ఉండే కృత్రిమమైన తోట'ను అతను తీసుకువచ్చాడు. దాన్ని తెమ్మని రాధాకృష్ణఆయి కోరింది. నేను కొద్దిసేపు విశ్రమించాను. సుమారు నాలుగు గంటలకు నానాసాహెబ్ చందోర్కర్ వెళ్ళిపోయాక దీక్షిత్ రామాయణం చదివాడు. తరువాత మేము పరమామృతం తరగతి నిర్వహించి సాయిబాబాను సాయంత్రపు వ్యాహ్యాళిలో దర్శించటానికి వెళ్ళాం. 'చంద్రుడు' వెలుగుతూ చల్లని ప్రకాశాన్ని విరజిమ్ముతున్నాడు. అమరావతికి తిరిగి వెళ్ళిపోయేందుకు నా భార్య తన అభ్యర్థనను తిరిగి వారి ముందుంచగా సాయిబాబా పరుషంగా మాట్లాడారు. వాడా ఆరతి అయ్యాక దీక్షిత్ రామాయణం చదివితే, భీష్మ భజన చేశాడు. మర్నాడు పొద్దున్నే దీక్షిత్, మాధవరావు దేశ్‌పాండేల ప్రయాణం కోసం వీలుగా మా కార్యక్రమాన్ని మేం పెందరాళే ముగించాము.

19-2-1912.


దీక్షిత్, అతని భార్య, మాధవరావు దేశ్‌పాండే, హీరాలాల్, ఇంకా మిగతావారు ఈరోజు ఉదయాన్నే వెళ్ళిపోయారు. దీక్షిత్ వాళ్ళు వాళ్ళ అబ్బాయి 'బాబు' వొడుక్కి వెళ్ళారు. హార్దాలో ఒక స్నేహితుడి ఇంట్లో జరిగే అలాంటి వేడుకకే మాధవరావు దేశ్‌పాండే వెళ్ళాడు. ప్రార్థనానంతరం మేము పంచదశి తరగతి నిర్వహించాము. మోర్ గావోంకర్ తన వాచీ, గొలుసూ పోయాయని చెప్పాడు. బంగారపువి కావటంతో అవి చాలా ఖరీదైనవి. వెతికినా అవి దొరకలేదు. సాయిబాబా బయటకు వెళ్ళి తిరిగి రావటం చూశాము. ఎప్పటిలా ఒక్క చామరానికి బదులు రెండు చామరాలుండటంతప్ప మధ్యాహ్న ఆరతి మామూలుగానే జరిగింది. బాలాసాహెబ్ భాటే పూజ చేసుకొని ఆరతికి ఉందామనుకున్నాడు గానీ, సాయీసాహెబ్ ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించాక మా సభ్యులతో కలసి పంచదశి తరగతి కొనసాగించాము. తరువాత దాదాకేల్కర్, బాలాషింపీ, ఇంకా మిగతావారు వచ్చారు. సాయిమహారాజుని వారి సాయంత్రవు వ్యాహ్యాళిలో చూసి, వాడా ఆరతి అయ్యాక శేజారతికి హాజరయ్యాము. అక్కడ మొట్టమొదటిసారి కృత్రిమమైన తోట, చందమామను ఉపయోగించారు. అవి చాలా అందంగా ఉండి చాలామందిని ఆకర్షించాయి. సాయిసాహెబ్ వాటిని ఇష్టపడనట్లు అనిపించలేదు. చందమామ నచ్చిందనుకుంటా. రాత్రి భీష్మ భాగవతం, దాసబోధలో పది సమాసాలు చదివాడు. నటేకర్ ఎలియాస్ హంస నేను ఈ నెలాఖరుకల్లా అమరావతికి తిరిగి రావాలని రాశాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo