సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 344వ భాగం


ఖపర్డే డైరీ - ఇరవై తొమ్మిదవ భాగం

8-2-1912.

కాకడ ఆరతి కోసం లేచి, ఆరతి అయ్యాక నా దినచర్య మొదలుపెట్టాను. నారాయణరావు వామన్ గావోంకర్ తిరిగి వెళ్ళిపోవటానికి అనుమతి సంపాదించాడు. నా భార్య నుండి కొన్ని వస్తువులు అమరావతికి అతను తీసుకెళ్ళవలసివుంది. అవి తీసుకొని అతను టాంగాలో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళబోయేముందు మా బంధువూ, సతారాకి చెందిన ఓ పెద్ద ఆఫీసరూ అయిన కర్బారీ కొడుకు గణవతిరావు అనే అతను తిల సంక్రాంతి కోసం సాంప్రదాయబద్ధమైన నువ్వులు, బహుమతులతో వచ్చాడు. వాటిలో చక్కెర, నువ్వులతో కలిపి ఎంతో కళాత్మకంగా చేసిన వస్తువులు వున్నాయి. ఈ మూడు వారాల్లో మొట్టమొదటిసారిగా బల్వంత్ మశీదు వరకు ఎలాగో నడవటం అనే సాహసం చేసి సాయిమహారాజు పాదాల మీద తల పెట్టాడు. కొంతవరకు అతని ఆరోగ్యం బాగుపడింది. రంగపంచమికి మా అబ్బాయి బల్వంత్‌ను సతారాకి రమ్మని గణపతిరావు కోరాడు. అతన్ని సాయిబాబాని అడగమన్నాను.

మధ్యాహ్న ఆరతి చివరిలో సాయిమహారాజు కోపాన్ని ప్రదర్శించటం తప్ప అంతా మామూలుగానే జరిగిపోయింది. దీక్షిత్ రామాయణం చదవగా నేను దాసబోధ చదివి మధ్యాహ్న సమయాన్ని గడిపాము. పొద్దున పంచదశి తరగతి నిర్వహించాము. సాయిసాహెబ్‌ను సాయంత్రపు వ్యాహ్యాళిలో చూశాము. బొంబాయి నుంచి కులకర్ణి అనే అతను వచ్చాడు. అక్కడ అతని లాబొరేటరీలో ఖనిజాలు మొదలైనవి పరీక్షిస్తారట. 1907వ సంవత్సరంలో నన్ను సూరత్‌లో అతను చూశానని చెప్పాడు. మేము పాతవిషయాలు మాట్లాడుతూ కూర్చున్నాము. రాత్రి భీష్మ భజన చేస్తే, దీక్షిత్ రామాయణం చదివాడు.

9-2-1912.

నేను మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని, పంచదశి తరగతికి హాజరయ్యాను. అప్పుడు సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాము. తరగతి పూర్తయ్యాక నేను మశీదుకు వెళ్ళాను. సాయిబాబా చాలా మంచి ధోరణిలో ఉన్నారు. మేమంతా పిష్యా అని పిలిచే కిష్యా అనే చిన్న పిల్లవాడు యథాప్రకారం వచ్చాడు. అతడిని చూడగానే సాయిసాహెబ్, పిష్యా తన పూర్వజన్మలో ఒక రోహిల్లా అనీ, అతను చాలా మంచివాడనీ, అతను చాలా సుదీర్ఘంగా ప్రార్థించి సాయిబాబా తాతగారికి అతిథిగా వచ్చాడనీ చెప్పారు. ఆయనకు ఒక సోదరి ఉండేదనీ, ఆమె విడిగా జీవించేదనీ చెప్పారు. అప్పుడు సాయిబాబా చిన్న పిల్లవాడట. సరదాకి ఆ రోహిల్లా ఆమెను పెళ్ళాడాలని అనేవారట. అలాగే జరిగి అతను ఆమెను పెళ్ళాడాడట. చాలారోజులు రోహిల్లా తన భార్యతో అక్కడే ఉండి, ఆ తరువాత ఆమెతో వెళ్ళిపోయాడట. కానీ ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలీదట. అతను చనిపోయాక సాయిసాహెబ్ అతన్ని ప్రస్తుతపు తల్లి గర్భంలో పెట్టారుట. పిష్యా చాలా అదృష్టవంతుడు అవుతాడని, వేలకొద్దీ మానవులకు రక్షకుడౌతాడనీ ఆయన చెప్పారు. మధ్యాహ్న ఆరతి యథాప్రకారం జరిగిపోయింది. ఆ సమయంలో సాయిబాబా శివానందశాస్త్రికి ఏదో చెప్పి కొన్ని సంజ్ఞలు చేశారు. దురదృష్టవశాత్తూ శాస్త్రి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయాడు. సాయిసాహెబ్ బాపూసాహెబ్ జోగ్‌కి కూడా కొన్ని సంజ్ఞలు చేశారు. ఠాణాలో ప్లీడరైన ఓక్ ఇక్కడే ఉన్నాడు. బాబాగుప్తేకీ, నా ఇతర స్నేహితులకీ నన్ను గుర్తుచేయమని అతన్ని నేనడిగాను.

10-2-1912

ఉదయం కాకడ ఆరతికి హాజరయ్యాను. మా అబ్బాయి బల్వంత్‌తో సతారా వెళ్ళటానికి గణపతిరావు ఈ ఉదయం బాబా వద్ద అనుమతి సంపాదించాడు. ఆ సమయంలో అతనితో పాటు మాధవరావు దేశ్‌పాండే కూడా ఉన్నాడు. నేను బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ, శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గిలతో కలసి పంచదశి పఠించి, ఆ తరువాత మశీదుకు వెళ్ళాను. సాయిసాహెబ్ చాలా మంచి ధోరణిలో ఉండి తన శరీరం తన కాళ్ళనుండి విడివడిందనీ, శరీరాన్ని తాను పైకి లేపగలిగాను కానీ కాళ్ళను మాత్రం లేపలేకపోయాననీ అన్నారు. తేలీతో తనకు గొడవ జరిగిందనీ, తను బాల్యంలో కుటుంబ పోషణార్థం అప్పుచేసి, అప్పు తీర్చేందుకు అప్పిచ్చినవాడికి పనిచేసి పెట్టేందుకు ఒప్పుకున్నానని, అయితే ఆ పని చేయలేకపోయాననీ చెప్పారు. అందుకని జీడిగింజను తన కళ్ళకి, మంటపుట్టించే మరో పదార్థాన్ని శరీరానికి పూసుకొని మంచానపడ్డారట. అలా ఒక సంవత్సరం మంచంలోనే పడివుండి, ఒంట్లో ఆరోగ్యం చేకూరిన వెంటనే రాత్రింబవళ్ళు పనిచేసి ఋణం తీర్చేశారట. చాలా హాయిగా మాట్లాడుతూ కూర్చున్న సాయి ఆరతి అయిపోవచ్చే సమయంలో కొంచెం అసహనాన్ని ప్రదర్శించారు. నాసిక్ ప్లీడరు గద్రే ఉన్నాడిక్కడ.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

  1. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    “బాబా! మీరు ప్రపంచాన్నంతటినీ కొరోనా బారినుండి కాపాడండి”.

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo