ఈ భాగంలో అనుభవాలు:
- ఆరోగ్యం, మొబైల్ రీఛార్జ్ ప్రసాదించిన బాబా
- ఏ డాక్టరూ తగించలేని నొప్పిని బాబా తగ్గించారు
ఆరోగ్యం, మొబైల్ రీఛార్జ్ ప్రసాదించిన బాబా
నల్గొండ నుండి సాయిభక్తురాలు శ్రీమతి సుమలత తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ సాయిరాం! ఈ బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి, సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు సుమలత. మాది నల్గొండ. నేను చిన్నప్పటినుంచి బాబా భక్తురాలిని. నాకు ఏ సమస్య ఉన్నా ముందుగా బాబాకు చెప్పుకుంటాను. బాబా ఆశీస్సులతో నాకు కలిగిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
ఒకరోజు ఉన్నట్టుండి నాకు జ్వరము, జలుబు వచ్చాయి. కరోనా సోకిందేమో అని భయపడ్డాను, చాలా బాధపడ్డాను. వెంటనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీ అనుగ్రహంతో నాకు ఈ జలుబు, జ్వరం తగ్గితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాకు మొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన రెండు రోజుల్లో నాకు జలుబు, జ్వరం తగ్గిపోయాయి. “చాలా ధన్యవాదాలు తండ్రీ! మాకు తోడుగా, మా ఇంటికి పెద్దదిక్కుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. చాలా ధన్యవాదాలు బాబా!”
ఇప్పుడు చెప్పబోయే అనుభవం బాబా మా అమ్మాయికి ప్రసాదించినది. మా అమ్మాయి పదవతరగతి చదువుతోంది. తనకి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి, ఒక నెల రీఛార్జ్ చేశాము. రీఛార్జ్ గడువు ముగిసింది, మళ్ళీ రీఛార్జ్ చేయించమని మా అమ్మాయి గొడవ చేసింది. మేము చేయించలేదు. దాంతో తను బాబాకు నమస్కరించుకుని, “తాతయ్యా! నాకు త్వరగా రీఛార్జ్ చేయించండి” అని ప్రార్థించింది. ఆశ్చర్యం! బాబాను ప్రార్థించిన రెండు రోజుల్లో మా అమ్మాయి మొబైల్ కి 249 రూపాయలకు రీఛార్జ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను గానీ, మావారు గానీ రీఛార్జ్ చేయించలేదు. ఇది మీ అందరికీ చాలా చిన్న విషయం కావచ్చు, కానీ మాకు మాత్రం ఒక పెద్ద అనుభవం. “బాబా! మా అమ్మాయికి ఏ సమస్య ఉన్నా మీరే చూసుకోవాలి. మీరే తనని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి. అలాగే మేము మ్రొక్కుకున్న చిన్న చిన్న కోరికలను త్వరలోనే తీరుస్తారని ఆశిస్తున్నాము”.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ఏ డాక్టరూ తగించలేని నొప్పిని బాబా తగ్గించారు
సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ బ్లాగుని నేను మొదటిసారి చూసింది మార్చి నెలలో. బాబా ప్రసాదించిన అనుభవాలు చదువుతూ ఉంటే సాయి చరిత్ర పారాయణ చేసినంత సంతోషంగా ఉంటోంది. నేను పెళ్లయిన తర్వాత నుంచి బాబాను ఎక్కువగా ఆరాధిస్తున్నాను. అప్పట్నుంచి చాలా విషయాలలో బాబా నాకు సహాయం చేస్తున్నారు.
ఇటీవల లాక్ డౌన్ మొదలయ్యాక నాకు విపరీతమైన పంటినొప్పి వచ్చింది. పంటినొప్పి వలన ఎడమప్రక్కన ఉన్న పన్నుతో పాటు చెవి, కన్ను, తల కూడా విపరీతంగా నొప్పిపుట్టటం మొదలైంది. నొప్పి తగ్గడానికి మాత్రలు వేసుకున్నప్పటికీ తగ్గకపోయేసరికి లాక్ డౌన్ లోనే ఒక హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడి డాక్టర్ ఇచ్చిన మందులు వాడినా నొప్పి తగ్గలేదు. అందువల్ల ఈసారి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాను. నన్ను పరీక్షించిన డాక్టర్, ‘పన్ను కట్ చేసి తీయాలి, కుట్లు పడతాయి’ అని చెప్పారు. పన్ను కట్ చేసి తీయాలి అనేసరికి నాకు చాలా భయమేసింది. తర్వాత నొప్పి తగ్గటానికి ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటున్నప్పటికీ పంటినొప్పి తగ్గలేదు. ఒకరోజు రాత్రి తట్టుకోలేనంత నొప్పి వచ్చింది. నొప్పి భరించలేక బాగా ఏడుస్తూ బాబాతో నా బాధను చెప్పుకుని, “బాబా! నా పంటినొప్పిని తగ్గించండి. మీ అనుగ్రహంతో ఈ పంటినొప్పి తగ్గితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఏ డాక్టరూ తగించలేని నొప్పిని బాబా తగ్గించారు. బాబాకు నా జీవితాంతం ఋణపడి ఉంటాను. “బాబా! నీ పాదాలపై నా శిరస్సునుంచి నిన్ను శరణు వేడుతున్నాను, మా భారాలను నీ భుజాల మీద వేసుకుని మమ్మల్ని మంచిదారిలో నడిపించు తండ్రీ!”
నిజానికి పంటినొప్పి తగ్గి నెలరోజులు అయింది. కానీ నా అనుభవాన్ని బ్లాగులో ఎలా పంచుకోవాలో తెలియక ఇంత ఆలస్యమైంది. మనపై ఎంతో ప్రేమను చూపే బాబా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. మరో అనుభవంతో త్వరలోనే మళ్ళీ కలుస్తాను.
సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు నా నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ బ్లాగుని నేను మొదటిసారి చూసింది మార్చి నెలలో. బాబా ప్రసాదించిన అనుభవాలు చదువుతూ ఉంటే సాయి చరిత్ర పారాయణ చేసినంత సంతోషంగా ఉంటోంది. నేను పెళ్లయిన తర్వాత నుంచి బాబాను ఎక్కువగా ఆరాధిస్తున్నాను. అప్పట్నుంచి చాలా విషయాలలో బాబా నాకు సహాయం చేస్తున్నారు.
ఇటీవల లాక్ డౌన్ మొదలయ్యాక నాకు విపరీతమైన పంటినొప్పి వచ్చింది. పంటినొప్పి వలన ఎడమప్రక్కన ఉన్న పన్నుతో పాటు చెవి, కన్ను, తల కూడా విపరీతంగా నొప్పిపుట్టటం మొదలైంది. నొప్పి తగ్గడానికి మాత్రలు వేసుకున్నప్పటికీ తగ్గకపోయేసరికి లాక్ డౌన్ లోనే ఒక హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడి డాక్టర్ ఇచ్చిన మందులు వాడినా నొప్పి తగ్గలేదు. అందువల్ల ఈసారి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాను. నన్ను పరీక్షించిన డాక్టర్, ‘పన్ను కట్ చేసి తీయాలి, కుట్లు పడతాయి’ అని చెప్పారు. పన్ను కట్ చేసి తీయాలి అనేసరికి నాకు చాలా భయమేసింది. తర్వాత నొప్పి తగ్గటానికి ఆ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటున్నప్పటికీ పంటినొప్పి తగ్గలేదు. ఒకరోజు రాత్రి తట్టుకోలేనంత నొప్పి వచ్చింది. నొప్పి భరించలేక బాగా ఏడుస్తూ బాబాతో నా బాధను చెప్పుకుని, “బాబా! నా పంటినొప్పిని తగ్గించండి. మీ అనుగ్రహంతో ఈ పంటినొప్పి తగ్గితే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఏ డాక్టరూ తగించలేని నొప్పిని బాబా తగ్గించారు. బాబాకు నా జీవితాంతం ఋణపడి ఉంటాను. “బాబా! నీ పాదాలపై నా శిరస్సునుంచి నిన్ను శరణు వేడుతున్నాను, మా భారాలను నీ భుజాల మీద వేసుకుని మమ్మల్ని మంచిదారిలో నడిపించు తండ్రీ!”
నిజానికి పంటినొప్పి తగ్గి నెలరోజులు అయింది. కానీ నా అనుభవాన్ని బ్లాగులో ఎలా పంచుకోవాలో తెలియక ఇంత ఆలస్యమైంది. మనపై ఎంతో ప్రేమను చూపే బాబా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. మరో అనుభవంతో త్వరలోనే మళ్ళీ కలుస్తాను.
