ఈ భాగంలో అనుభవాలు:
- కోరుకున్న దర్శనాన్ని అనుగ్రహించిన బాబా
- నమ్మకంతో ఉంటే బాబా అన్నీ చేస్తారు
కోరుకున్న దర్శనాన్ని అనుగ్రహించిన బాబా
ఓం సాయిరాం! ముందుగా బాబాకి నా ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అలేఖ్య. నేను, మావారు ఇద్దరమూ సాయిభక్తులము. గత కొన్ని సంవత్సరాల నుండి నేను సాయిభక్తురాలిని. అయితే రెండు సంవత్సరాల నుండి బాబాను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఎటువంటి బాధ కలిగినా, కష్టం ఎదురైనా బాబాతోనే పంచుకుంటున్నాను. ఆయన సదా నా వెన్నంటే ఉండి, నాకు సహాయం చేస్తున్నారు. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
నేను బాబాకు సంబంధించిన వీడియోలు, మిరాకిల్స్ యూట్యూబ్లో చూస్తున్న ప్రతిసారీ, "బాబా! మీరు అందరికీ ఏదో ఒక రూపంలో మీ దర్శనభాగ్యాన్నిస్తున్నారు. మాకు ఎప్పుడు అలా దర్శనమిస్తారు?" అని అనుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు నా మనసు అసలేమీ బాగాలేదు. బాధతో ఆ రాత్రంతా యూట్యూబ్లో బాబా వీడియోలు చూస్తూ ఉండిపోయాను. మరుసటిరోజు గురువారం. ఎప్పటిలానే నేను పూజకి సిద్ధం చేస్తూ బాబా మూర్తిని పట్టుకుని, "మీ దర్శనభాగ్యాన్ని మాకీరోజు కలిగించరా బాబా?" అని ఎంతో బాధగా అడిగాను. మరుక్షణమే అద్భుతమైన లీలను, దర్శనాన్ని ప్రకటితం చేశారు బాబా. బాబా ఫోటో మీద నాకు బాబా రూపం కనబడింది. నన్ను నేను నమ్మలేకపోయాను. కాస్త నిశితంగా పరిశీలించాను. విషయం ఏమిటంటే, హారతి ఇస్తున్నపుడు వచ్చే పొగ కారణంగా గోడంతా నల్లబారిపోయింది. ఆ మసిలో చాలా స్పష్టంగా బాబా ముఖం దర్శమిస్తోంది. అది బాబా ఫొటో మీద ప్రతిబింబించింది. పట్టరాని ఆనందంతో నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. బాబా నాకిచ్చిన దర్శనాన్ని ఎవరితోనైనా పంచుకున్నప్పుడు వారికి చూపడానికి, అందరూ బాబా లీల తెలుసుకోవాలని వెంటనే మొబైల్తో ఫొటోలు, వీడియో తీశాను. “కష్టాలు, బాధలు వచ్చినపుడు మాకు ధైర్యం చేకూర్చడానికి, రక్షణనివ్వడానికి బాబా వచ్చారని, ఈరోజు నుండి బాబా మాతోనే ఉంటార”ని నాకనిపించింది. వెంటనే మావారికి ఫోన్ చేసి చెప్పాను. బాబా లీలకు తను కూడా చాలా సంతోషించారు. తరువాత మా బంధువులందరితో బాబా లీలను ఆనందంగా పంచుకున్నాను. "పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను, మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపిస్తాను" అని తన భక్తులకు బాబా ఇచ్చిన నిదర్శనమిది. "బాబా! మీ దర్శనం కోసం తపించేపోయే ఈ భక్తురాలికి చక్కటి అనుభవాన్నిచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు!"
ఓం సాయిరామ్
ఓం సాయిరాం! ముందుగా బాబాకి నా ప్రణామాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అలేఖ్య. నేను, మావారు ఇద్దరమూ సాయిభక్తులము. గత కొన్ని సంవత్సరాల నుండి నేను సాయిభక్తురాలిని. అయితే రెండు సంవత్సరాల నుండి బాబాను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఎటువంటి బాధ కలిగినా, కష్టం ఎదురైనా బాబాతోనే పంచుకుంటున్నాను. ఆయన సదా నా వెన్నంటే ఉండి, నాకు సహాయం చేస్తున్నారు. ఇటీవల బాబా ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
నేను బాబాకు సంబంధించిన వీడియోలు, మిరాకిల్స్ యూట్యూబ్లో చూస్తున్న ప్రతిసారీ, "బాబా! మీరు అందరికీ ఏదో ఒక రూపంలో మీ దర్శనభాగ్యాన్నిస్తున్నారు. మాకు ఎప్పుడు అలా దర్శనమిస్తారు?" అని అనుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు నా మనసు అసలేమీ బాగాలేదు. బాధతో ఆ రాత్రంతా యూట్యూబ్లో బాబా వీడియోలు చూస్తూ ఉండిపోయాను. మరుసటిరోజు గురువారం. ఎప్పటిలానే నేను పూజకి సిద్ధం చేస్తూ బాబా మూర్తిని పట్టుకుని, "మీ దర్శనభాగ్యాన్ని మాకీరోజు కలిగించరా బాబా?" అని ఎంతో బాధగా అడిగాను. మరుక్షణమే అద్భుతమైన లీలను, దర్శనాన్ని ప్రకటితం చేశారు బాబా. బాబా ఫోటో మీద నాకు బాబా రూపం కనబడింది. నన్ను నేను నమ్మలేకపోయాను. కాస్త నిశితంగా పరిశీలించాను. విషయం ఏమిటంటే, హారతి ఇస్తున్నపుడు వచ్చే పొగ కారణంగా గోడంతా నల్లబారిపోయింది. ఆ మసిలో చాలా స్పష్టంగా బాబా ముఖం దర్శమిస్తోంది. అది బాబా ఫొటో మీద ప్రతిబింబించింది. పట్టరాని ఆనందంతో నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. బాబా నాకిచ్చిన దర్శనాన్ని ఎవరితోనైనా పంచుకున్నప్పుడు వారికి చూపడానికి, అందరూ బాబా లీల తెలుసుకోవాలని వెంటనే మొబైల్తో ఫొటోలు, వీడియో తీశాను. “కష్టాలు, బాధలు వచ్చినపుడు మాకు ధైర్యం చేకూర్చడానికి, రక్షణనివ్వడానికి బాబా వచ్చారని, ఈరోజు నుండి బాబా మాతోనే ఉంటార”ని నాకనిపించింది. వెంటనే మావారికి ఫోన్ చేసి చెప్పాను. బాబా లీలకు తను కూడా చాలా సంతోషించారు. తరువాత మా బంధువులందరితో బాబా లీలను ఆనందంగా పంచుకున్నాను. "పిలిస్తే పలుకుతాను, తలిస్తే దర్శనమిస్తాను, మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపిస్తాను" అని తన భక్తులకు బాబా ఇచ్చిన నిదర్శనమిది. "బాబా! మీ దర్శనం కోసం తపించేపోయే ఈ భక్తురాలికి చక్కటి అనుభవాన్నిచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు!"
ఓం సాయిరామ్
నమ్మకంతో ఉంటే బాబా అన్నీ చేస్తారు
సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ముందుగా నా సాయితండ్రికి నమస్సుమాంజలి. నేను పదవతరగతి చదువుతున్నప్పటి నుండి సాయిబాబాకి మామూలు భక్తురాలిని. నా పెళ్లికి కొద్దిరోజుల ముందునుండి బాబా మీద నాకు నమ్మకం ఏర్పడింది. ప్రతి విషయంలో బాబాను తలచుకుని చేయడం అలవాటైంది. చిన్న చిన్న విషయాలు దగ్గర నుండి ప్రతి విషయాన్నీ పూర్తయ్యేలా బాబా చేస్తుండేవారు. అయితే బాబా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా కొన్ని ముఖ్యమైన విషయాలు గత మూడు సంవత్సరాలుగా జరగటంలేదు. నాకు బాగా నిరాశగా ఉంటోంది. బాధ కూడా ఉన్నప్పటికీ బాబా తప్పకుండా చేస్తారనే నమ్మకంతో ఉన్నాను.
కొంతకాలం క్రితం నా భర్త పదోన్నతి కోసం ప్రయత్నిస్తే, కోపంతో పైఅధికారులు తనని బదిలీ చేశారు. దానివల్ల మేము కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. బదిలీపై వెళ్లిన నెలరోజులకే తిరిగి వచ్చేస్తారని అనుకుంటే సంవత్సరం దాటినా స్వస్థలానికి బదిలీ కాలేదు. నా భర్తతో పాటు మరో 53 మందికి కూడా బదిలీ అయింది. అందరూ పదోన్నతి కోసం కోర్టులో కేసు వేశారు. ఆ కేసు వెనక్కి తీసుకుంటేగానీ స్వస్థలానికి బదిలీ కాదన్నారు. అప్పుడు నా భర్త, మరో ఇద్దరు సహోద్యోగులు తప్ప మిగతా అందరూ కేసును వెనక్కి తీసుకున్నారు. నా భర్త మాత్రం, “మా తప్పేమీ లేదు, మేమెందుకు కేసు వెనక్కి తీసుకోవాలి?” అని అంటున్నారు. ఈ అవకాశం పోతే మళ్ళీ స్వస్థలానికి బదిలీ కాదేమో అని మా బాధ. దానికి తోడు ‘మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే ముగ్గురికీ స్వస్థలానికి బదిలీ కాదు’ అని అందరూ అన్నారు. అప్పుడు నేను, “బాబా! మమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడేయండి. మీరు మాత్రమే ఈ పని చేయగలరని నా నమ్మకం. ఈ సమస్య తీర్చితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఎలాగైనా మాకు సహాయం చేయండి బాబా” అని బాబాను వేడుకున్నాను. మన దయగల బాబా నా బాధను అర్థం చేసుకొని కేసును వెనక్కి తీసుకున్న వాళ్ళతో పాటు మిగతా ముగ్గురికి కూడా స్వస్థలాలకు బదిలీ అయ్యేలా చేశారు. నా భర్తకి కూడా స్వస్థలానికి బదిలీ అయ్యిందని తన స్నేహితుడు ఫోన్ చేసి చెప్పగా, అది విని నేను ఎంతో సంతోషించాను. సంవత్సరంనుండి ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది అని నా కళ్లలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాను నమ్మినవాళ్ళకి అన్యాయం జరగదు అని బాబా నాకు మళ్ళీ నిరూపించారు. మనం సహనంతో ఉంటే బాబా మనకు అన్నీ చేస్తారు.
సాయినాథ చరణం శరణం.
సాయిభక్తురాలు శ్రీమతి జ్యోతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ముందుగా నా సాయితండ్రికి నమస్సుమాంజలి. నేను పదవతరగతి చదువుతున్నప్పటి నుండి సాయిబాబాకి మామూలు భక్తురాలిని. నా పెళ్లికి కొద్దిరోజుల ముందునుండి బాబా మీద నాకు నమ్మకం ఏర్పడింది. ప్రతి విషయంలో బాబాను తలచుకుని చేయడం అలవాటైంది. చిన్న చిన్న విషయాలు దగ్గర నుండి ప్రతి విషయాన్నీ పూర్తయ్యేలా బాబా చేస్తుండేవారు. అయితే బాబా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా కొన్ని ముఖ్యమైన విషయాలు గత మూడు సంవత్సరాలుగా జరగటంలేదు. నాకు బాగా నిరాశగా ఉంటోంది. బాధ కూడా ఉన్నప్పటికీ బాబా తప్పకుండా చేస్తారనే నమ్మకంతో ఉన్నాను.
కొంతకాలం క్రితం నా భర్త పదోన్నతి కోసం ప్రయత్నిస్తే, కోపంతో పైఅధికారులు తనని బదిలీ చేశారు. దానివల్ల మేము కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. బదిలీపై వెళ్లిన నెలరోజులకే తిరిగి వచ్చేస్తారని అనుకుంటే సంవత్సరం దాటినా స్వస్థలానికి బదిలీ కాలేదు. నా భర్తతో పాటు మరో 53 మందికి కూడా బదిలీ అయింది. అందరూ పదోన్నతి కోసం కోర్టులో కేసు వేశారు. ఆ కేసు వెనక్కి తీసుకుంటేగానీ స్వస్థలానికి బదిలీ కాదన్నారు. అప్పుడు నా భర్త, మరో ఇద్దరు సహోద్యోగులు తప్ప మిగతా అందరూ కేసును వెనక్కి తీసుకున్నారు. నా భర్త మాత్రం, “మా తప్పేమీ లేదు, మేమెందుకు కేసు వెనక్కి తీసుకోవాలి?” అని అంటున్నారు. ఈ అవకాశం పోతే మళ్ళీ స్వస్థలానికి బదిలీ కాదేమో అని మా బాధ. దానికి తోడు ‘మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే ముగ్గురికీ స్వస్థలానికి బదిలీ కాదు’ అని అందరూ అన్నారు. అప్పుడు నేను, “బాబా! మమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడేయండి. మీరు మాత్రమే ఈ పని చేయగలరని నా నమ్మకం. ఈ సమస్య తీర్చితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఎలాగైనా మాకు సహాయం చేయండి బాబా” అని బాబాను వేడుకున్నాను. మన దయగల బాబా నా బాధను అర్థం చేసుకొని కేసును వెనక్కి తీసుకున్న వాళ్ళతో పాటు మిగతా ముగ్గురికి కూడా స్వస్థలాలకు బదిలీ అయ్యేలా చేశారు. నా భర్తకి కూడా స్వస్థలానికి బదిలీ అయ్యిందని తన స్నేహితుడు ఫోన్ చేసి చెప్పగా, అది విని నేను ఎంతో సంతోషించాను. సంవత్సరంనుండి ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది అని నా కళ్లలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాను నమ్మినవాళ్ళకి అన్యాయం జరగదు అని బాబా నాకు మళ్ళీ నిరూపించారు. మనం సహనంతో ఉంటే బాబా మనకు అన్నీ చేస్తారు.
సాయినాథ చరణం శరణం.
