- కరోనా నుండి వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడిన బాబా
- బాబా ఊదీతో గొంతునొప్పి మాయం
కరోనా నుండి వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడిని బాబా
నా పేరు శిరీష. 2020, ఆగష్టు నెల మొదటివారంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేనొక పెద్ద భవనంలో ఉన్నాను. దాని గోడలు గాజుతో కట్టబడివున్నాయి. ఇంతలో దూరంనుండి పెద్ద పొగ, దానిలో మంటలు చాలా త్వరగా భవనం వైపు వస్తున్నాయి. అది చూసి నేను “ఇక తప్పించుకునే సమయం లేదు, మరణ సమయం సమీపించింది” అనుకుని ‘ఓం సాయి’ అని బాబా నామస్మరణ చేయసాగాను. కొంచెంసేపు ఆగిన తరువాత కళ్ళు తెరచి చూస్తే మంటలు లేవు, అంతా మామూలుగానే ఉంది. ‘బాబానే నన్ను కాపాడారు’ అనుకున్నాను. ఇదంతా కలలోనే జరిగింది. మెలకువ వచ్చాక ఆలోచిస్తే ‘ఏదో జరగబోతుందేమో!’ అనిపించింది.
తరువాత నాలుగైదు రోజులకు నా తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడ్డారు. ఇద్దరూ వృద్ధులు. ఒంటరిగా ఉంటారు. నేను వారికి సహాయంగా వస్తానంటే వాళ్ళిద్దరూ వద్దన్నారు. వాళ్ళిద్దరూ ఆహారం సరిగా తీసుకోకుండా ఇంట్లోనే ఉండి మందులు వాడటం ప్రారంభించారు. నా మనసంతా ఆందోళనగా అనిపించింది. ఆ ఆందోళనలో నేను పారాయణ చేయలేకపోయాను. పది రోజుల తర్వాత వారిద్దరూ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. అయినా వాళ్ళు నన్ను అసలు రావద్దని గట్టిగా చెప్పి ఒంటరిగానే హాస్పిటల్కి వెళ్ళారు. నాకు చాలా ఆందోళనగా అనిపించి ప్రతిరోజూ వాళ్ళిద్దరి గురించి బాబాను ప్రార్థిస్తూ, “ఏం చేసినా మీ ఇష్టం బాబా, వాళ్ళకి ఏది మంచిదో అదే చేయండి” అని బాబాకు శరణాగతి చెందాను. కానీ మనస్సును మాత్రం ప్రశాంతంగా ఉంచుకోలేకపోయాను. ఆ సమయంలో ఈ బ్లాగ్ ఓపెన్ చేశాను. అందులో, “నేనుండగా నీకు భయమేల?” అనే శీర్షికతో ఒక అనుభవం ప్రచురించారు. ఆ వాక్యాన్ని చూడగానే బాబా నాకు అభయం ఇస్తున్నారని అనిపించింది. రెండు రోజుల తరువాత నా తల్లిదండ్రులిద్దరూ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. బాబా అనుగ్రహంతో వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోజు కలలో ఆ మంటలను చూసి ఎలా ఆందోళనచెందానో, సరిగ్గా అలాగే నా తల్లిదండ్రుల అనారోగ్యం గురించి ఆందోళనచెందాల్సి వచ్చింది. తర్వాత బాబా కృపతో అంతా ప్రశాంతంగా మారింది. “థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాబా! నేను ఎప్పుడూ, ఏ పరిస్థితుల్లోనూ మీకు దూరం కాకుండా చూడండి”.
బాబా ఊదీతో గొంతునొప్పి మాయం
నేనొక సాయి బిడ్డను. బాబా కరుణతో నేను టీచరుగా పనిచేస్తున్నాను. నా వృత్తి టీచర్ కావడం వల్లనేమో అప్పుడప్పుడు నాకు గొంతునొప్పి వస్తుంటుంది. అది తగ్గటానికి ప్రతిసారీ జలుబు టాబ్లెట్ వాడుతుండేదాన్ని. అలా ఉండగా 2020లో కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు జరుగుతుండేవి. ఆ కారణంగా గొంతునొప్పి గానీ, జలుబు గానీ నాకు లేకుండా పోయాయి. కానీ ఒకరోజు ఉన్నట్టుండి కొద్దిగా గొంతునొప్పి వచ్చింది. అది ఏ కారణంగా వచ్చిందో కూడా తెలియదు. కానీ ఈసారి మాత్రం నేను బాబాతో, "బాబా! నేను నీ ఊదీని రాసుకుంటాను. మీ అనుగ్రహంతో నా గొంతునొప్పి తగ్గేలా చూడండి" అని చెప్పుకుని బాబా ఊదీని రాసుకున్నాను. ఏ టాబ్లెట్ వాడకుండానే కేవలం బాబా ఊదీతో నా గొంతునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా! మీరు నన్ను కన్నతల్లిలా చూసుకుంటుంటారు, కాదు..కాదు, కన్నతల్లి కంటే ఇంకా ప్రేమగా చూసుకుంటుంటారు. కానీ అప్పుడప్పుడు నేను మీపై కోపగించుకుంటుంటాను. కన్నతల్లిలా నన్ను క్షమించండి బాబా! ఎందుకంటే, మీరు లేని జీవితం ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది".
శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
🌹🌹శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!🌹🌹
DeleteOm sai ram
ReplyDeleteOm srisairam
ReplyDeleteBaba na kastam ni teerchu thandri
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏