సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 297వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
  1. సాయితండ్రి చూపిన కరుణ
  2. బాబా తక్షణ సహాయం

సాయితండ్రి చూపిన కరుణ

ఓం సాయిరామ్! అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాటి సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నేను గత పది, పదిహేను సంవత్సరాలుగా సాయిభక్తుడిని. నా పేరు మల్లారెడ్డి. నేను హైదరాబాద్ నివాసిని. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. ప్రతిరోజూ ఉదయాన్నే బ్లాగులోని అనుభవాలను చదవడం నాకు అలవాటు. ఇంత చక్కగా అనుభవాలను అనువదిస్తున్నందువలన మేము ఎన్నో సాయి లీలలను తెలుసుకోగలుగుతున్నాము. నేనిప్పుడు సాయి నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

2019, సెప్టెంబరు 6వ తేదీ సాయంత్రం నేను వర్షంలో బైక్ మీద వెళ్తుండగా హఠాత్తుగా బైక్ స్లిప్ అయ్యి బండితో సహా క్రింద పడిపోయాను. నా కాలికి గాయమైంది. దాదాపు నేను నడవలేని స్థితిలో ఉన్నాను. చుట్టూ ఉన్నవాళ్లంతా నా కాలు విరిగుంటుందని అన్నారు. నేను భయంతో బాబానే తలచుకున్నాను. ఆయన నాకు సాయం చేశారు. ఎలా అంటే, నడవలేని స్థితిలో నాకు నడిచే శక్తి ఇచ్చారు. ఎలాగో మొత్తానికి ఒంటరిగా బండి మీద ఇంటికి బయలుదేరాను. దారిలో సాయిబాబా గుడి ఎదురుగా ఆగి, బండి మీదనుండే, "బాబా! నా కాలు విరగకుండా ఉండేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. తరువాత నెమ్మదిగా నేను ఇంటికైతే చేరుకున్నాను కానీ మెట్లెక్కి పైన ఉన్న మా ఇంటికి వెళ్ళలేకపోయాను. మా ఇంట్లో వాళ్ళు నా పరిస్థితి తెలుసుకొని నన్ను ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టారు. నా కాలు పూర్తిగా ఒకవైపుకు ఒరిగిపోయింది. ఆ రాత్రి ఏ ఆసుపత్రికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. మర్నాడు ఉదయం కట్టు కట్టించుకోవడానికని ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ ఎక్స్-రే తీసి ఎముక ప్రక్కకు జరిగిందని చెప్పి రెండు కట్లు  కట్టారు. సరిగా మరో పదిరోజుల్లో (14వ తేదీన) మేమంతా, అంటే గ్రీన్ హిల్స్ కాలనీలోని సాయిబాబా సేవకులమంతా శిరిడీ వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో నాకిలా అయిందేమిటా అని బాధతో కుమిలిపోయాను. "బాబా! నేను ఎలాగైనా మీ దర్శనం చేసుకోవాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా నా మొర విని, నన్ను విడిచిపెట్టకుండా తోటి భక్తుల సహాయంతో నన్ను శిరిడీకి రప్పించుకున్నారు. శిరిడీ చేరుకునేసరికి నా కాలు బాగా వాచిపోయింది. అయినా నేను వెనుకాడలేదు. 4 గంటలు క్యూ లైన్లో నిలబడి నా సాయి దర్శనం చేసుకున్నాను. నా సాయి ప్రేమతో నాకు తమ దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. తరువాత అక్కడున్న మందిరాలన్నీ చూశాను. అంతేకాదు, అంతకుముందెప్పుడూ చూడనటువంటి ప్రదేశాలను కూడా చూశాను. 15వ తేదీన తిరుగు ప్రయాణమై హైదరాబాదుకు వచ్చాము. అప్పటికి నొప్పులు తగ్గి నా కాలు నయమైంది. నా సాయితండ్రి చూపిన కరుణకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. సాయి మహిమ అనంతము, ఎంత చెప్పినా తక్కువే.

రెండవ అనుభవము:

ఇటీవల మా అన్నయ్యకు పక్షవాతం వచ్చి, దాని ప్రభావం కిడ్నీపై పడింది. డాక్టర్ పరీక్షించి కిడ్నీ బ్లాక్ అయిందని చెప్పారు. ఆరోజు ఆదివారం. ఉదయమంతా నేను ఏడ్చి ఏడ్చి, "బాబా, అన్నయ్యకు కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా, తను తొందరగా కోలుకొని నార్మల్ అయ్యేటట్టుగా అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. బాబా నా కోరిక మన్నించారు. నేను మళ్ళీ మంగళవారం హాస్పిటల్‌కి వెళ్లేసరికి అన్నయ్యకు కొంత ఉపశమనం లభించింది. తన కిడ్నీ సమస్య కొంతవరకు తగ్గింది. ఇప్పుడు తను కోలుకుంటున్నాడు. బాబా చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు తప్ప ఏమి చెప్పగలను? నా నోట మాటలు రావడం లేదు. సాయి ఎప్పుడూ మనతోనే ఉంటూ మనలను కంటిరెప్పలా కాపు కాస్తూ ఉంటారు. కాబట్టి, సాయిని ఎప్పుడూ మరవకండి. "ధన్యవాదాలు సాయీ! నీ ఈ పాదదాసుని కరుణించు తండ్రీ! నేను అనుకున్నది జరిగితే మరలా నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకుంటాను".

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జై సాయిరాం! జై జై సాయిరామ్!
జై సద్గురు! జై జై సద్గురు సాయినాథా!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా తక్షణ సహాయం

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను చిన్నప్పటినుండి బాబా భక్తురాలిని. నాకు ఆయన ఇచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఇటీవల నేను వేసవి సెలవుల్లో మా పాపని తీసుకుని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని అనుకున్నాను. కానీ టికెట్లు అందుబాటులో లేవు. నేను, నా భర్త తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి చాలా ప్రయత్నించాము, కానీ దొరకలేదు. చివరికి నేను ముంబై మీదుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను తెల్లవారుఝామున పూణే నుండి పన్వేల్ వెళ్లే రైలు ఎక్కాను. అది ఉదయం 9 గంటలకు పన్వేల్ చేరుకుంటుంది. అక్కడ నేను మళ్ళీ 1:30కి వేరే ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఔటర్‌లో దాదాపు అరగంట ఆగుతూ లోనావాలా చేరేసరికి 11.30 అయింది. ఆ సమయానికి దాదాపు కోచ్ అంతా ఖాళీగా ఉంది. మా పాప, నేను, ఒక అంకుల్, ఇద్దరు అటెండెంట్స్ మాత్రమే మిగిలాము. అంతలో ఒక అటెండెంట్ వచ్చి, ఏదో సాంకేతిక లోపం కారణంగా ట్రైన్ ఇక్కడినుండి ముందుకు కదలదని చెప్పాడు. పసిబిడ్డతో ఒంటరిగా ఆ నిర్మానుష్య ప్రదేశం నుండి ఎలా బయటపడగలనా అని నాకు చాలా భయమేసింది. వెంటనే సహాయం కోసం నేను సాయిని ప్రార్థించాను. కొద్దినిమిషాల్లో ట్రైన్ కదిలి పన్వేల్ చేరుకుంది. వెంటనే నేను, "బాబా! ట్రైన్ కదలకపోయుంటే నా పరిస్థితి అయోమయంగా ఉండేది. పిలిచిన వెంటనే నన్ను గమ్యం చేర్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" అని చెప్పుకున్నాను.

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2510.html?m=0


7 comments:

  1. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    జై సాయిరాం! జై జై సాయిరామ్!
    జై సద్గురు! జై జై సద్గురు సాయినాథా!
    శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. BABA naku darichupinchu
    yetu kani ardham kani paristhitilo unnnanu
    jai sairam

    ReplyDelete
  3. Om sai ram ma babu ki fever taggindi, babu ki unde problem taggite family to shiridi cherukoni mokku teetchu konta mu . Ma tappu la ni ksaminchandi. Jai sai ram

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo