సాయి వచనం:-
'నీ నిష్ఠ చెదరకుండా సంరక్షించుకో! నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు! నీవెప్పుడూ సత్యాన్నే అంటిపెట్టుకో! అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను.'

'మనస్సు వివిధ రూపాలు ధరించడం మాని ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్యఘనత లేదా బ్రహ్మతథాకారవృత్తి సిద్ధిస్తుంది' - శ్రీబాబూజీ.

బాబా నా భర్తకి పునర్జన్మనిచ్చారు


నా పేరు అనూరాధ. నా వయస్సు 56 సంవత్సరాలు. మేము చెన్నై నివాసస్థులం. నేను నా జీవితంలో మర్చిపోలేని సాయిలీల ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అనుభవంతో నేను బాబా యొక్క అమితమైన ప్రేమను చవిచూశాను. నమ్మకమే లేని నేను ఈ అనుభవంతో సాయికి అంకిత భక్తురాలిని అయిపోయాను. కేవలం నేనే కాదు, మా కుటుంబమంతా సాయిభక్తులం అయిపోయాం.

1997వ సంవత్సరం, ఫిబ్రవరి నెల 8వ తేదీన నేను ఆఫీసుకి వెళ్ళడానికి దాదాపుగా సిద్ధమయ్యాను. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఏదో ఆందోళనగా అనిపించింది. అందువలన ఇంటిలోనే ఉండిపోయాను. అప్పటికే నా భర్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. యాంటీబయాటిక్స్ వాడినా తనకి నయం కాలేదు. రోజు గడుస్తున్నకొద్దీ, అంటే మధ్యాహ్నం తరువాత జ్వరతీవ్రత ఇంకా అధికం కావడంతో ఆయన స్పృహలేని స్థితిలోకి వెళ్లిపోయారు. అత్యవసర పరిస్థితిలో తనని మేము హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాము. డాక్టర్ ఆయనని పరీక్షించి, 'Pnuemococal Menningitis'గా నిర్ధారణ చేశారు. అంటే, చాలా అరుదుగా వచ్చే బ్రెయిన్ ఫీవర్. ఇది చాలా ప్రాణాంతకమైనది. ఆ రోగం వచ్చినవారు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. డాక్టర్స్ కూడా, "ఆయన చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారు, బ్రతికే అవకాశాలు చాలా తక్కువ"ని చెప్పారు. అటువంటి పరిస్థితిలో నాకు ఏమి చేయాలో తోచక నిస్సహాయంగా ఉండిపోయాను.

అట్టి స్థితిలో ఆ ఆపద నుండి నన్ను బయటపడవేయడానికి సాయిబాబా నా జీవితంలోకి అడుగుపెట్టారు. అంతవరకూ నేను ఎన్నడూ వినని 'శ్రీసాయిసచ్చరిత్ర' పుస్తకం గురించి చెప్పి, నన్ను పారాయణ చెయ్యమని మా దగ్గర బంధువు ఒకామె సలహా ఇచ్చారు. 'ఆ పుస్తకం సాయిబాబా జీవితం మరియు బోధనల గురించి తెలియజేస్తుందని, అది పారాయణ చేస్తే ఎంతో మేలు జరుగుతుంద'ని కూడా తను చెప్పింది. ఆరోజే నేను 'శ్రీసాయిసచ్చరిత్ర'  పుస్తకం తీసుకొని, సమయ నియమం అంటూ ఏమీ లేకుండా, 'ఆ స్థితిలో బాబా మాత్రమే నాకు సహాయం చేయగలర'న్న నమ్మకంతో ఎంతో శ్రద్ధగా పారాయణ చేశాను.

48 గంటల తరువాత ఒక అద్భుతం జరిగింది. నేను, మా చెల్లి మైలాపూరులో ఉన్న బాబా గుడికి వెళ్లాము. బాబా దర్శనం చేసుకొని, దయచూపమని బాబాను ప్రార్థించి, ఊదీ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లాము. గత మూడు రోజుల నుండి నా భర్త కోమాలోనే ఉన్నారు. నేను హృదయపూర్వకంగా బాబాని ప్రార్థించి, నా భర్త నుదుటి మీద ఊదీ రాశాను. ఊదీ రాసిన కొద్ది క్షణాలలో గదిలో ఏదో శబ్దం వినిపించినట్లు అయ్యింది. చూస్తే ఆశ్చర్యం! మావారి అవయవాలలో కదలిక కనపడింది. అప్పుడు బాబా ఊదీ మహిమ ఏమిటో నాకు అర్థమైంది. ఆసుపత్రిలో వైద్యులు 'వైద్యచరిత్రలో ఇది ఒక అద్భుతమ'ని అన్నారు. వైద్యులకే వైద్యుడు మన సాయి క్రమంగా నా భర్తకు నయం చేశారు.

సాయికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా జీవితాంతం నేను సాయికి ఋణపడి ఉంటాను. ఆ కష్టసమయంలో అండగా నిలిచిన నా కుటుంబసభ్యులు నా సోదరులు, నా తల్లి, నా మరదలు మరియు నా సోదరి, ముఖ్యంగా సాయిని పరిచయం చేసిన మా బంధువుకు నా కృతజ్ఞతలు.

ప్రియమైన సాయిభక్తులకు నేను చెప్పేది ఒకటే - కష్టకాలంలో సాయి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారని నేను గ్రహించాను. కేవలం మనం భక్తి విశ్వాసాలతో ఆయనపై దృష్టి పెట్టి, ఆయన నామస్మరణ చేసుకుంటే చాలు.

"నా సమాధి నుండి నా కార్యం నిర్వహిస్తాను. మీరు ఎక్కడవున్నా, నన్ను తలచిన మరుక్షణం నేను మీ ముందు ఉంటాను" అని బాబా చెప్పారు.



FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

1 comment:

  1. మన అందరిని రక్షించే కరుణామయుడు బాబా కాక ఇంకొకరు ఉన్నారా. ఆయనకు ఆది అంతం లేదు

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe