సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సమయం రాగానే చిన్న లీలతో చిటికెలో కష్టం నుండి విముక్తిని ప్రసాదించేస్తారు బాబా


 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

"కష్టంలో ఉన్నప్పుడు కొందరు భక్తులు పిలవగానే బాబా నుండి సహాయం అందుతుంది. మరికొంతమంది విషయంలో కొంత జాప్యం కనపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?" అని చాలామంది సాయి భక్తుల మదిలో మెదిలే ప్రశ్న. కానీ దానికి సమాధానం తెలుసుకోవడం మిడిమిడి జ్ఞానం ఉన్న మనకెలా సాధ్యం? స్వయంగా బాబానే చెప్పారు కదా, "నా చర్యలు అగాధాల"ని. మనకొచ్చే కష్టసుఖాలన్నీ మన పూర్వ కర్మల ఫలితాలే. మనకు ప్రస్తుత పరిస్థితి మాత్రమే తెలుసు, దాని పూర్వాపరాలు ఏమీ తెలియవు. మరి ఆయనకు మన భూత, భవిష్యత్ , వర్తమానాలన్నీ తెలుసు. వాటన్నింటి దృష్ట్యా తన భక్తులకేది శ్రేయస్కరమో అదే చేస్తారు బాబా. అది మనకు అర్ధంకాక మనం అయన మనల్ని పట్టించుకోవడం లేదని అనుకుంటూ బాధపడతాం. కానీ సమయం రాగానే చిన్న లీలతో చిటికెలో కష్టం నుండి విముక్తిని ప్రసాదించేస్తారు బాబా. అటువంటిదే ఈమధ్య మాకు తెలిసిన ఒక అంకుల్ కి జరిగిన అనుభవాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను.

అంకుల్ సబ్ ఇన్స్పెక్టర్ గా చేసి 2010లో ఉద్యోగ విరమణ చేసారు. ఆ తరువాత నుండి ఆంటీ, అంకుల్ ఇద్దరూ కూడా పెద్ద బాబా మూర్తిని  ఇంట్లో పెట్టుకొని బాబాకి అభిషేకాలు, సచ్చరిత్ర పారాయణలతో నిత్యం బాబాని ఆరాధించుకుంటున్నారు. రెండు, మూడు నెలల క్రిందట అంకుల్ కి జ్వరం వచ్చింది. జ్వరమే కదా అని మెడికల్ షాపుకి వెళ్లి ఏవో మందులు తెచ్చి వేసుకున్నారు. మందులు వేయడం, అది కాసేపు తగ్గి మళ్ళీ రావడం ఇలా పది రోజులు గడిచిపోయాయి. పది రోజులుగా సరైన ఆహారం లేక బాగా నీరసించిపోయారు. పదకొండవ రోజు హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే కంగారుపడి అంకుల్ ని వైజాగ్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. అక్కడ టెస్టులు అన్నీ చేసారు కానీ ఏదీ తెలిసేదికాదు. హాస్పిటల్లో ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సెలైన్ ఎక్కించారు. 8 రోజులలో దాదాపు 70, 80 సెలైన్ బాటిళ్లు ఎక్కించారట. ఏడు రోజుల వరకు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. సడన్ గా 8వ రోజు ఎవరో ఒక స్పెషల్ డాక్టర్ వచ్చి అంకుల్ ని చూసారు. అప్పటివరకు ఏమి చేసినా తగ్గని జ్వరం ఆ డాక్టర్ చూసాక తగ్గడం మొదలు పెట్టింది. మరో రెండు రోజులు ఉన్న తరువాత పూర్తిగా జ్వరం తగ్గడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి అంకుల్ ఇంటికి వచ్చారు. జ్వరం అయితే తగ్గింది కానీ ఏమి తిన్నా వాంతి అయిపోతూ ఉండేది. ఏ మందులు వాడినా తగ్గేది కాదు. అసలు వాళ్ళు పడ్డ బాధ వర్ణనాతీతం. ఇలా తొమ్మిది రోజులు గడిచిన తరువాత పదవరోజు రాత్రి అంకుల్ బాధ తట్టుకోలేక, "బాబా! ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాను, మరి నాకేమిటి ఇంత కష్టం? ఇన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నాను. నన్నెందుకు పట్టించుకోవడం లేదు? ఏదో ఒకటి చేసి నాకు ఈ బాధ నుండి ఉపశమనం కలిగించండి బాబా" అని బాబాను ప్రార్ధించి పది గంటల సమయంలో పడుకున్నారు. సుమారు 2 లేక 2.30 గంటల సమయంలో అంకుల్ కి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక వృద్ధుడు అంకుల్ ని విమానం ఎక్కించారు. తరువాత అంకుల్ ని నోరు తెరవమని, అంకుల్ తెరవగానే నోటిలో ఏవో రెండు మాత్రలు వేసి, "ఇక నీ బాధ తీరిపోయింది" అన్నారు. అంతటితో స్వప్నం ముగిసింది. అంతే! అంతటితో నెలరోజుల నుండి అంకుల్ పడుతున్న బాధంతా తీరిపోయింది. ఆ తెల్లవారి నుండి అంకుల్ ఏవి తిన్నా వాంతులు కావడం ఆగిపోయాయి. నిదానంగా రెండు నెలల్లో అంకుల్ పూర్తిగా కోలుకున్నారు. తనపై ఆధారపడిన భక్తులను బాబా ఎప్పుడూ నిరాధారం చేయరు. సహనంతో ఉంటే సమయానికి ఆయన తన సహాయాన్ని అందించి కష్టం నుండి మనల్ని బయటపడేస్తారు.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo