సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఊదీ - భక్తులకు బాబా ఇచ్చి‌న అత్యంత అద్భుతమైన బహుమతి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఊదీ - భక్తులకు బాబా ఇచ్చి‌న అత్యంత అద్భుతమైన బహుమతి. ఊదీ దివ్యమైన ఔషధం, సర్వరోగ నివారిణి. అది ఆధ్యాత్మికపరమైన లేదా భౌతికపరమైన విషయాలలో ఒక చక్కటి పరిష్కారం. ఊదీ సాయిబాబా యొక్క మరో రూపం. లవ్ యు సాయి. జయ జయహో సాయి ...!

సాయి భక్తురాలు కమల తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. అందరికీ సాయిరాం.
దాదాపు 15 రోజుల క్రితం నేను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డాను. ఆ నొప్పి వలన శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. అందువలన ఇంటి పనులు చేసుకోలేక, సరిగా నిద్రపట్టక, నా రెండేళ్ళ బిడ్డకి తిండి కూడా పెట్టలేక చాలా బాధపడ్డాను. మందులు తీసుకుంటున్నా కూడా ప్రయోజనం కనపడలేదు. అల్లం, పసుపుతో కట్టు కట్టుకోమని కొందరు, వేడినీటితో కాపడం పెట్టమని కొందరు సూచించారు. నేను ప్రతిదీ చేసాను, కానీ వేటివలనా ఉపయోగం లేకుండా పోయింది.

నేను దాదాపు మూడురోజులు ఇలా బాధపడ్డాను. తరువాత నాల్గవ రోజున బాబా పూజ చేయడానికి బాబా ముందు కూర్చొని, "బాబా! ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఒక తల్లిగా నా బిడ్డకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను. చాలా నొప్పిగా ఉంది బాబా. నా చేతిని పైకి ఎత్తలేకపోతున్నాను. బాబా నాకు సహాయం చేయండి. ఈ నొప్పిని తొలగించండి" అని బాబాతో చెప్పుకున్నాను. హఠాత్తుగా నేను బాబా ముందు వెలిగించిన అగరుబత్తి నుండి రాలిన ఊదీ చిటికెడు తీసుకున్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే బాబాను ప్రార్థించి, నొప్పి ఉన్న చోట ఆ ఊదీ వ్రాసుకొని, "ఇప్పుడు ఇక ఈ నొప్పి తొలగించడం నీ చేతుల్లో ఉంది బాబా!" అని చెప్పుకున్నాను. అలా నేను బాబాను ప్రార్థించి ఊదీ వ్రాసుకున్న కొంతసేపటికి నొప్పి అదృశ్యమయిపోయింది. ఇది ఒక అద్భుతం! మూడు రోజులనుండి నన్ను బాధపెట్టిన నొప్పిని అరగంటలో బాబా తీసేసారు. చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఇది బాబా ఊదీ మహిమ.

"బాబా మన ప్రతి చిన్న, పెద్ద ప్రార్థనలను విని, తప్పనిసరిగా సమాధానాలు ఇస్తారు."

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!

సాయి బంధువు వర్ష గారు చెప్తున్నా అనుభవం:- 

ప్రియమైన సాయిభక్తులందరికీ సాయిరాం. మీతో ఇప్పుడు ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటాను. కొన్నిరోజుల క్రిందట మా పిన్నిగారి గర్భాశయంలో కణితి(ట్యూమర్) ఏర్పడిందని వైద్యులు ధ్రువీకరించారు. దానితోపాటు వైద్యులు క్యాన్సర్ అని కూడా అనుమానం వ్యక్తం చేసారు. ఆమె గర్భాశయాన్ని తొలగించవలసి ఉంటుందని చెప్పారు. ఈ కారణంగా ఆమె మానసికంగా చాలా కృంగిపోయింది. ఆమె ఆప్పటికే బీపీ, ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర వ్యాధులతో బాధపడుతూ ఉంది. "దేవుడికి నామీద కనికరం లేదు. నేను ఇన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నా కూడా నన్ను వదలకుండా క్రొత్త రోగాలను అంటగడుతున్నాడు" అని మా పిన్ని వేదన పడసాగింది. అప్పుడు మా అమ్మ ఆమెతో, "ఆశ వదులుకోకు. నీకు తోడుగా బాబా ఉన్నారు. నీ వ్యాధిని బాబా నయం చేస్తారు" అని చెప్పింది. ఇంకా బాబా ఊదీని తన కడుపుపై వ్రాసుకోమని, కొంచెం ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగమని చెప్పింది. ఆమె ప్రతిరోజూ అమ్మ చెప్పినట్లుగా చేయడం మొదలు పెట్టింది. అంతిమంగా బాబా తన అద్భుతాన్ని చూపించి ఆమెను ఆశీర్వదించారు. ఆమె రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి. క్యాన్సర్ ఏమీ లేదని చెప్పారు. గర్భాశయాన్ని తొలగించవలసిన అవసరం లేదని కూడా చెప్పారు. కణితి(ట్యూమర్)ని నయం చేసేందుకు కొన్ని మందులు ఇచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆనందంగా ఉంది కదా! భక్తుల కష్టకాలంలో బాబా తన భక్తులకు ఎల్లప్పుడూ తన సహాయాన్ని అందిస్తారు. అందువల్ల మనం ఆయన పట్ల చెదరిపోని విశ్వాసంతో ఉండాలి.

జై సాయిరామ్.
వర్ష పట్నాయక్

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo