సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా బాబాయే నాకు తల్లి, తండ్రై జాగ్రత్తగా తిరుపతి యాత్ర పూర్తీ చేయించారు


నా పేరు అర్చన. మాది హైదరాబాద్. సాయినాథుని కరుణ అందరి మీద ప్రసరిస్తుంది కానీ, మనం అనుభవించే ఆనందం మన పరిస్తితిని బట్టి ఉంటుంది. శరత్ బాబూజీ గారు చెప్పినట్లు ఆకలితో ఉన్న వారికి అన్నం విలువ తెలుస్తుంది అది ఒక చిన్న ముద్ద అయినా చాలు. మనం కష్టాల్లో ఉన్నపుడు జరిగిన చిన్న లీల అయినా మన మనసుపై పెద్ద ముద్ర వేస్తుంది. మేము రీసెంట్ గా 2018 ఆగష్టు 20న వెళ్లిన తిరుపతి ప్రయాణం గురించి నేను మీకిప్పుడు చెప్తాను. అడుగడుగునా బాబా ఉనికితో నిండిపోయిన చక్కటి అనుభవాలను చదివి ఆనందించండి.

నాకు చిన్నతనం నుంచి ప్రయాణాలు పడవు. వాంతులుతో సతమతం అవుతాను. చిన్నపుడు మా అమ్మ నాన్నలు జాగ్రత్తగా తీసుకెళ్లేవారు. ఇపుడు నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నన్ను ఎవరు చూస్తారు? నాకు తల్లితండ్రి అయిన సాయి తప్ప. 19వ తేదీన మా అత్తామామలు, ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, నేను, మావారు, మా ఇద్దరు పిల్లలు అందరం కలిసి హైదరాబాదు నుంచి బయలుదేరాము. వెళ్లే ముందు నేను ఇంట్లో బాబా పూజ చేశాను కానీ, గుడికి వెళ్లి ఊదీ తీసుకుని బయలుదేరాలని నా ఆశ. ఏ ఊరు వెళ్ళినా అలా ఊదీ తీసుకొని వెళ్ళడం నాకలవాటు. కానీ ఆ రోజు చాలా పెద్ద వర్షం కురవడంతో గుడికి వెళ్ళటం కుదరక నిరాశగా బస్సు స్టాపుకి వెళ్ళాను. పక్కనే శివాలయం ఉంది. సరే అన్ని రూపాలు బాబావే కదా! ఇక్కడైనా దేవుడికి నమస్కరించుకుందామని లోపలికి వెళితే అక్కడ పెద్ద ద్వారకమాయి బాబా ఫోటో దర్శనమిచ్చింది. చాలా సంతోషంగా అనిపించి బాబాకి నమస్కరించుకున్నాను. పక్కనే ఆంజనేయస్వామి గుడి ఉంటే వెళ్ళాను. అక్కడ కూడా బాబా దర్శనమిచ్చారు. బయటకి రాగానే ఒక బస్సు మీద పెద్ద సమాధి మందిరంలోని బాబా పటం కనిపించింది. నా ఆనందానికి అవధుల్లేవు. ఆ సంతోషంలో బస్సు ఎక్కి ప్రశాంతంగా పడుకున్నాను. ఉదయాన తిరుపతిలో బస్సు దిగగానే దూరంగా లైటింగ్ తో ఉండే బాబా ఫోటో కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తిరుపతిలో కూడా నా బాబానే నాకు మొదట దర్శనం ఇచ్చారు. "ఓం సాయిరామ్" అనుకుని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొండపైకి వెళ్ళడానికి బయలుదేరాము. ఇక నాకు ఒకటే భయం మొదలైంది. ఎందుకంటే కొండపైకి బస్సులో వెళితే ఆ కుదుపులకి నాకు ఒంటిలో తిప్పుతుంది, ఆ వికారానికి వాంతులు అయిపోతాయి. అందుకే నేనెప్పుడూ తిరుపతి వెళ్లినా కొండపైకి నడిచే వెళ్తాను. అయితే ఇప్పుడు పిల్లలు ఉండడంతో ఆ అవకాశం లేదు. "బాబా ఎలా నన్ను కొండపైకి తీసుకెళతావో ఏమో, నాకు చాలా భయంగా ఉంది" అనుకుని వెహికల్ లో బయలుదేరాము. ఆశ్చర్యం ఎవరో చెప్పినట్లుగా ఆ డ్రైవర్ మలుపుల దగ్గర ఎంతో జాగ్రత్తగా, చాలా నిదానంగా నడుపుతూ కొండపైకి తీసుకెళ్ళాడు. మెలుకువగా ఉన్న కూడా నాకు కాస్త కూడా ఇబ్బంది అనిపించలేదు. కొండపైకి వెళ్లిన తరువాత మేము ఇంకో  వెహికల్ ఎక్కాము, అందులో కూడా సచ్చరిత్ర చేతిలో పట్టుకొని ఉన్న బాబా ఫొటో దర్శనమిచ్చింది. బాబా దయతో స్వామి దర్శనం బాగా జరిగింది. ప్రయాణంలో నాకెప్పుడూ ఉండే ఇబ్బందులు కలగకపోయినా గాని ప్రయాణ సమయమంతా మా పాప నా ఒడిలో ఉండటం వలన నడుమునొప్పి, బాడీ పెయిన్స్, వీటికి తోడు తలనొప్పి కూడా రావడంతో కొంచం ఇబ్బందిగా ఉంది. సరే ఇంకా విశ్రాంతి తీసుకుందామనుకొనే సరికి మావారు కాణిపాకం వెళదామన్నారు. సరే అని వెహికల్ లో కొండ దిగుతున్నాము. ఈ డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా కిందకి తీసుకువచ్చాడు. చిత్తూరులో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లి అలసటగా ఉండటంతో కాస్త పడుకున్నాను. నేను ఈ పెయిన్స్ తో బాధపడుతూ పిల్లలితో ఇంకా ఈ జర్నీ అంతా ఎలా పూర్తి చేయాలి అనుకుంటూ ఉన్నాను. అసలు నేను పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు, మా వాళ్ళు ఆడే మాటలన్నీ వినబడుతున్నాయి కూడా అంతలో ఒక కల. అందులో మావారు బాబా గుడి ఉంది చూడు అంటుంటే చూసాను. ఎవరో ఒకరు చేతుల నిండుగా ఊదీ ఇచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. కాని లేచిన తరువాత కూడా అలసటగానే ఉంది. తరువాత కాణిపాకం వెళ్ళాము, అక్కడ దిగగానే నేను చూసిన మొదటి ఫోటో బాబాదే. అక్కడ కూడా బాబా దయవలన చక్కగా దర్సనం జరిగింది. తరువాత తిరుపతి వచ్చి హైదరాబాదు బస్సు ఎక్కి అలసటతో ఓపిక లేక ఎవరి గురించి పట్టించుకోకుండా పడుకున్నాను. ఉదయాన హైదరాబాదులో దిగగానే వెంకటేశ్వరస్వామి మరియు బాబా ఫోటో కనిపించాయి. చాలా సంతోషం వేసింది. 

ఇంటికి వచ్చి రాగానే మొబైల్ లో చూడగానే ఊది గురించి మన "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు" లో వచ్చిన  "బాబా అప్పుడే కాదు ఇప్పుడు కూడా తమ భక్తులు కష్టంలో ఉంటే ఊదీ అందిస్తున్నారు" అన్న టైటిల్ తో ఉన్న అనుభవాన్ని చూసాను. అది చూసాక నాకు ముందురోజు కలలో ఊదీ ఇవ్వడం గుర్తుకు వచ్చింది. బ్లాగులోని అనుభవం ద్వారా "ఊదీ కలలో ఇచ్చినా లేక మెలకువలో ఎవరి ద్వారా ఇచ్చినా ఎటువంటి తేడా లేదని, అది అయన ఊదీ, అద్భుతమైనది, అమోఘమైనదని, నా బాధను చెప్పుకున్న మరుక్షణమే కలలో నాకు ఆయన ఊదీ ఇచ్చి ఆయన నాపై కృప చూపారని, తిరుపతి వెళ్లేముందు ఊదీ తీసుకోలేకపోయిన కలలో బాబా నాకు ఊదీ ఇచ్చారని" అర్దమై పట్టరానంత ఆనందం కలిగింది. ఇంకో ముఖ్య విషయం ఎప్పుడూ విపరీతమైన అల్లరి చేసే మా పిల్లలు ఈ ప్రయాణంలో అసలు అల్లరే చేయలేదు. అంత బాబా దయ. నా బాబాయే నాకు తల్లి, తండ్రై జాగ్రత్తగా తిరుపతి యాత్ర పూర్తీ చేయించారు. ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి క్షణం అయన ఉనికిని తెలియజేస్తూ నాకే కష్టం లేకుండా చూసుకున్నారు. అయన ప్రేమ అద్భుతం. ధన్యవాదాలు బాబా. లవ్ యు బాబా.


No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo