శ్రీమతి కృష్ణాబాయి ప్రభాకర్ అనే భక్తురాలు మొదటిసారి బాబాను దర్శించుకున్నప్పుడు, బాబా ఆమెకు ఒక నాలుగణాల నాణేన్ని ప్రసాదించారు. బాబా అమృతహస్తాల ద్వారా లభించిన ఆ నాణేన్ని ఆమె ఎంతో విలువైనదిగా భావించి, జాగ్రత్తగా భద్రపరుచుకొని ప్రతిరోజూ పూజిస్తుండేది. ఒకరోజు తన ఇంటి వద్దకు కొబ్బరికాయలు అమ్మే ఒక మహిళ వచ్చింది. ఆమె వద్ద కొబ్బరికాయ తీసుకున్న కృష్ణాబాయి ఇతర నాణేలతోపాటు పొరపాటున బాబా ఇచ్చిన నాలుగణాల నాణేన్ని కూడా ఆమెకు ఇచ్చేసింది. తరువాత కృష్ణాబాయి తన రోజువారీ ఇంటిపనులు పూర్తి చేసుకున్న తరువాత జరిగిన పొరపాటును గుర్తించి తన మూర్ఖత్వానికి ఎంతగానో బాధపడింది. ఆరోజు సాయంత్రం ఎవరో ఆమె ఇంటి తలుపు తట్టారు. కృష్ణాబాయి గుండెల నిండా బాధతో వెళ్లి తలుపు తీసి ఎదురుగా ఉన్న కొబ్బరికాయలు అమ్మే మహిళను చూసి ఆశ్చర్యపోయింది. ఎందుచేతనో తెలియదుగానీ ఆ మహిళ ఉదయం కృష్ణాబాయి ఇచ్చిన నాలుగణాల నాణేన్ని తిరిగిచ్చి, అందుకు బదులుగా వేరే నాణేన్ని అడిగి తీసుకొని వెళ్ళిపోయింది. జరిగిన సంఘటనతో కృష్ణాబాయి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తనపై చూపిన కరుణకు బాబాకు మనసారా కృతజ్ఞతలు అర్పించుకుంది.
సోర్సు: అంబ్రోసియా ఇన్ శిరిడీ బై విన్ని చిట్లూరి.
🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai🙏🙏🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete