సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 18వ భాగం....


బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకలు

సాయిభక్తురాలు హేతల్ పాటిల్ రావత్ గారు చెప్తున్న మరికొన్ని అనుభవాలు.

"పిచ్చుక కాలికి దారంకట్టి ఈడ్చునట్లు నా భక్తులను నేను నా వద్దకు లాగుకుంటాను" అని బాబా చెప్పారు. అలా బాబా చెంతకు చేరిన రెండు పిచ్చుకల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతుల్ అనే వ్యక్తి ఒక ఫార్మా కంపెనీలో పని చేస్తుండేవాడు. అతనికి బాబాతో ఏ మాత్రం పరిచయం లేదు. ఒకసారి మందులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో అతనిని సస్పెండ్ చేయడమే కాకుండా, అతనిపై కేసు కూడా నమోదు చేసింది కంపెనీ. దాంతో అతను తనపై ఆధారపడివున్న కుటుంబం గురించి చాలా కలతచెందాడు. అటువంటి సమయంలో సాయిబాబాకు అంకిత భక్తుడైన అతని స్నేహితుడు, "ఈ విపత్తునుండి బయటపడటానికి సాయిబాబా పేరుమీద ఉపవాసం ఉండమ"ని సలహా ఇచ్చాడు. తన స్నేహితుని సలహా ప్రకారం అతుల్ 11 గురువారాలు ఉపవాసం పాటించి, సాయి మందిరానికి కాలినడకన వెళ్తుండేవాడు. కొద్దిరోజులు గడిచిన తరువాత కంపెనీనుండి అతనికి ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, అతనిపై పెట్టిన ఆరోపణలను, కేసును కంపెనీ ఉపసంహరించుకోవడమే కాకుండా అతనిని మునుపటి కన్నా చాలా ఎక్కువ జీతంతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ సంఘటన అతనిలో బాబాపట్ల పూర్తి విశ్వాసాన్ని నింపింది. ఇప్పుడతడు తరచూ శిరిడీ సందర్శిస్తూ ఎన్నో అనుభవాలను మూటకట్టుకున్నాడు.

మరో అనుభవం:


సాయిబాబా కృపను ఆయన భక్తులు పొందడం సాధారణమైన విషయమే. కానీ ఆయనను విశ్వసించని వాళ్ళపై కూడా ఆయన అంతే కృప చూపుతున్నారు. ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది నేనిప్పుడు చెప్పబోయే నా మేనమామ సునీల్ కలే గారి అనుభవం. ఆయన తన 50 ఏళ్ళ వయస్సులో ఏనాడూ దేవుడిని నమ్మేవారు కాదు. ఎప్పుడూ ఏ దేవుడినీ ప్రార్థించలేదు, పూజించలేదు. కనీసం అన్నేళ్లలో ఒక్కసారి కూడా దేవాలయానికి వెళ్ళలేదు. అలాంటతను ఇప్పుడు సాయిబాబాకి గొప్ప భక్తుడు. 2007 - 2008 లో ఆయన కొడుకు MCA చేస్తున్నాడు. తనకి కంప్యూటర్స్‌లో బాగా ఆసక్తి ఉన్నప్పటికీ కామర్స్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినందువలన MCA సబ్జెక్ట్స్ విషయంలో బాగా కష్టపడాల్సి వచ్చింది. కష్టపడి చదివినప్పటికీ మొదటి సెమిస్టర్ లోని ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దాంతో మా మామయ్య చాలా ఆందోళన చెంది మా అమ్మకు ఫోన్ చేసి, "నా కొడుకు చాలా కష్టపడి చదువుతున్నప్పటికీ కావలసిన ఫలితం పొందలేకపోతున్నాడు. ఏదైనా పరిష్కారం చూపించు" అని అడిగారు. సాయిభక్తురాలైన అమ్మ మా ఆంటీతో, 9 గురువారాలు ఉపవాసం పాటించి సాయిబాబాను ప్రార్థించి, సాయి మందిరానికి వెళ్ళమని చెప్పింది. ఆమె తక్షణమే అందుకు అంగీకరించి అమ్మ చెప్పినట్లు చేసింది. బాబా వారికి తోడుగా నిలిచారు. అంకితభావంతో మా ఆంటీ చేసిన ప్రార్థనలకు బాబా 9 గురువారాలలోపే సమాధానం ఇచ్చారు. ఆ సంఘటనతో మా మామయ్యకు బాబా యందు నమ్మకం కుదిరింది. ఇప్పుడు ఆయన ప్రతి గురువారం సాయి మందిరానికి వెళుతున్నారు. ప్రతి గురువారంనాడు బాబాకు సమర్పించడం కోసం కొబ్బరికాయ, కోవా, పూలు, అగరుబత్తీలు ముందురోజే తెచ్చిపెట్టుకుంటున్నారు. అంతలా ఆయనలో మార్పు వచ్చింది. అంతా బాబా లీల.


గమనిక: ఎన్నో లీలల ద్వారా బాబా ఉపవాసాలు ఉండవద్దని సూచించారు. అందువలన ఉపవాసం ఉండటానికి బాబా అనుగ్రహానికి ఏ సంబంధం లేదు. బాబాకు ఒక చిన్న ప్రార్ధన సరిపోతుంది. బాబా ఇష్టానుకనుగుణముగా నడుచుకోవడం వలన బాబా అపార అనుగ్రహానికి పాత్రులం కాగలం.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo