సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా విగ్రహానికి కాలు విరిగింది - భక్తురాలికి నయమైంది.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అతిశీతల చలికాలపు సాయంకాల సమయాన మేఘాకాక్రేకు అధికజ్వరంతో చలి, వణుకు మొదలయ్యాయి. ఆమె దుప్పటి కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నించారు కానీ, ఎంతకీ నిద్ర పట్టలేదు. ప్రతిరోజూ నిద్రపోయే ముందు నుదుటికి, శరీరానికి ఊదీని పెట్టుకొని పడుకోవడం ఆమె అలవాటు. అమెకు ఆ విషయం గుర్తుకువచ్చి వెంటనే లేచి ఊదీ పెట్టుకొని, బాబా నామం చెప్పుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. మరుసటిరోజు ఉదయానికి కూడా జ్వరం అలానే ఉంది. ఆ రోజంతా ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా జ్వరం అలానే ఉంది. తన కుటుంబసభ్యులు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోమని చెబుతున్నా ఆమె పట్టించుకోలేదు. ఈ పృథ్విపై ఉన్న వైద్యులమీద కన్నా, ఆమెకు బాబా ఊదీమీద అపారమైన నమ్మకం. కానీ పదేపదే వాళ్ళు వైద్యుడిని సంప్రదించమని ఒత్తిడి చేస్తుండటంతో, చివరికి ఆమె వాళ్ళ కోరిక మేరకు పరీక్ష చేయించుకోవడానికి, మందులు తీసుకోవడానికి అంగీకరించింది. అయినప్పటికీ ముందుగా ఊదీ తీసుకున్న తర్వాతే మందులు వేసుకునేది. అయితే జ్వరం మొండిగా తిష్ఠవేసుకుని కూర్చుంది.

ఇలా ఉండగా ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఎడమకాలికి విపరీతమైన నొప్పి వచ్చింది. అదేసమయంలో ఆమెకు విపరీతమైన దాహం వలన నీళ్ళు త్రాగాలనిపించింది. కానీ ఆమె మంచం మీద నుంచి లేవలేకపోయింది. ఐనా ఎవరినీ నిద్రలేపడం ఇష్టంలేక మళ్ళీ నిద్రపోయింది. కొద్దిసేపటికి భరించలేనంతగా నొప్పి ఎక్కువైంది. అప్పుడు మళ్ళీ నీళ్ళు త్రాగాలనిపించి ఆమె లేవడానికి ప్రయత్నించింది. పాదం నేలమీద పెట్టగానే, దానిమీద (శరీర)బరువు మోపలేక పోయింది. దానితో ఆమె మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. మొత్తానికి ఆమె గాఢనిద్రలోకి జారుకుంది.

మర్నాడు ఉదయం లేచేసరికి ఆమెకు జ్వరంగాని, కాలునొప్పిగాని లేవు. అంతలో ఆమె మనవరాలు అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, "బామ్మా! బాబా కాలుకు ఏమైందొ చూడు" అని చెప్పింది. ఆమె నిదానంగా మంచం మీద నుంచి దిగి బాబా విగ్రహం ఉన్న గదికి వెళ్ళింది. చూస్తే, బాబా విగ్రహానికి ఎడమ మోకాలు దగ్గర విరిగిపోయి ఉంది. అది చూస్తూనే ఆమె నిర్ఘాంతపోయింది.

బాబా కరుణతో ఆమె అనారోగ్యాన్ని తన మీదకు తీసుకున్నారు. ఆమె అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆమె తన మనసులోనే బాబా చూపిన దయను తలుచుకుంటూ చివరిసారిగా ఆ విగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకుని నమస్కరించుకుంది. తరువాత విరిగిన విగ్రహాన్ని ఒక సంచిలో పెట్టి తన ఇంటి పరిసరాలలో ఉన్న బావినీటిలో వేసింది. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన బాబా తన భక్తుల ప్రారబ్ధాన్ని తీసుకుంటారు.

రీసెంట్ గా 2016లో జరిగిన ఇలాంటి మరో అనుభవం రేపటి భాగంలో.... 

మూలం: సాయి ప్రసాద్ పత్రిక 1993 (దీపావళి సంచిక).

4 comments:

  1. So nice and I felt so happy,after seeing this experience,so much inspiring that I should depend on baba like Megha Kante ji

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి రామ్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo