సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పవిత్రమైన ఊదీతో అనారోగ్యాన్ని నయం చేసిన బాబా


నేను నోయిడా నుండి జితేంద్ర శర్మని. నేను గత 20 సంవత్సరాలుగా సాయిభక్తుడిని. ఆయన నా జీవితంలో అనేక అద్భుతాలు చేసారు. సాయి లేని నా జీవితాన్ని నేను ఊహించలేను. నాకు ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
2018 ఫిబ్రవరి 13న నా కుటుంబంతోపాటు ఒక వివాహానికి హాజరై అర్థరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాము. తరువాత నేను నా బట్టలు మార్చుకొని పడుకోవడానికి వెళ్ళాను. పడుకున్న కాసేపటికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి మరియు ఛాతీలో మంటతోపాటు నొప్పి మొదలైంది. నాకు చాలా భయం వేసింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని యాంటాసిడ్ మందులు తీసుకున్నాను. కానీ ఎటువంటి ప్రభావం చూపలేదు. అకస్మాత్తుగా సాయి ఊదీ గుర్తు వచ్చింది. బాబా ఊదీ సర్వరోగ నివారిణి కదా! వెంటనే కొంచెం ఊదీ నీళ్ళలో వేసి త్రాగాను. మరికొంత ఊదీ నా కడుపుపై రాసుకున్నాను. కొన్ని క్షణాలలో బాబా అద్భుతం చేశారు. ఆయన అందరి విషయంలో చేస్తారనుకోండి. నాకున్న నొప్పులన్నీ అదృశ్యమైపోయాయి. ప్రశాంతంగా పడుకున్నాను. ఉదయం లేవగానే మళ్ళీ కొంచెం నొప్పిగా అనిపించింది. వెంటనే నేను ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగి, కడుపు మీద కూడా రాసుకున్నాను. దానితో పూర్తిగా నొప్పి పోయింది, మళ్ళీ ఆ నొప్పి రాలేదు. నాకు బిపి సమస్య ఉంది, కాబట్టి గుండెనొప్పి వస్తుందేమోనని నేను చాలా భయపడిపోయాను. కానీ బాబా నా అనారోగ్యాన్ని తన పవిత్రమైన ఊదీతో నయం చేసేశారు. ఆయన నా జీవితంలో నాకన్నీ ఇచ్చారు. నేను ఎల్లప్పుడూ ఆయన బోధనలను అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సాయిభక్తులందరినీ నేను అభ్యర్థించేది ఒకటే - "బాబా చూపించిన మార్గంలో నడవండి. సాయి సచ్చరిత్ర చదవండి. దానితో మీ జీవితంలోని సమస్యలన్నీ అంతరించిపోతాయి".

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo