సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

షిర్డీ సాయి ఆరతుల గురించి సమగ్ర సమాచారం - 2వ భాగం.....

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై


బాబా దేహదారిగా యుండగా రోజు జరిగిన ఆరతులు మూడే. మధ్యహ్న ఆరతి ఒక్కటే మశీదులో జరిగేది. రోజు మర్చి రోజు బాబా చావడిలో పరుండు రోజు శేజారతి, మరుసటి రోజు కాకడ ఆరతి చావడిలో నిర్వహించబడేవి. సాయింత్రం ఆరతి మొదటిలో సాఠెవాడలో జరిగేడిది. తరువాత గురుస్థానములో కూడా జి. కే. దీక్షీత్ అను వారు సాయింత్రం ఆరతి చేసెడివారు. అటు తరువాత దీక్షిత్ వాడలో కూడా సాయింత్రం ఆరతి జరిగేడిది. ఖపర్డే మొదలగు భక్తులు ఇందులో పాల్గొనుట ఖపర్డే డైరీ లో చూడవచ్చు. 

బాబా దేహనంతరం నాలుగు వేళల జరుగు ఈ ఆరతులు బూటివాడాలోని బాబా సమాధి వద్ద నిర్వహించబడుచున్నవి. ఉదయం గం. 4.30 నిమషాలకి కాకడ ఆరతి, మధ్యాహ్నం గం. 12.00 లకి మధ్యాహ్న ఆరతి, సూర్యాస్త సమయమున సంధ్య ఆరతి, రాత్రి గం. 10. 30 నిమషాలకి శేజరతి జరుగుచున్నవి. సంధ్య ఆరతికి ఒక వత్తితోను, మిగిలిన మూడు అరతులకు ఐదు వత్తులతో ఆరతి ఇవ్వబడుచున్నవి. అరతులకు ముందు బాబాకు మరియు ఆయన సమాధిపై వస్త్రములు మార్చుదురు. నాలుగు వేళల ధూపం వేయుదురు. కాకడ ఆరతికి వెన్న నైవేద్యం, మధ్యహ్న ఆరతికి భోజనం మరియు రొట్టెల నైవేద్యం, సాయింత్రం మిఠాయిలు నైవేద్యం, శేజారతికి చపాతీలు నైవేద్యం పెట్టెదరు. అవి ప్రసాదముగా భక్తులకు పంచెదరు.

ఒకప్పుడు బాబా భీష్మను ఐదు లడ్డులు ఇవ్వాలి అని అడిగారు. అతనికి ఏమి అర్ధం కాలేదు. మరుగోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెల్లుబికి వెంటనే రెండు పాటలు వ్రాసారు. కాని ఆ పై ఒక్కటి గూడా నడవలేదు. వాటిని బాబాకు సమర్పించగానే అతనినే పడి విన్పించామన్నారు. అతడు పాడక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్ళి స్పుర్తి కలిగి మరి మూడు పాటలు వ్రాసి ఆయనకు వినిపించారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకోవడం ఎంతో శ్రేయస్సుకరం. అవే మొదటి షిర్డీ హారతులు. సాయి ఇలా కోరి, తమ తపశ్శక్తి దారపోసి వ్రాయించుకుని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగణు, మాధవ్ లు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిర్డీ ఆరతులు కూర్చారు.

శ్రీ సాయినాథ సగుణోపాసన పుస్తకంలో శ్రీ సాయిబాబాకి చెందిన ఆరతులలో పాడుతున్న పాటలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్ర పుష్పమ్, శ్రీ లక్ష్మీఅష్టోత్తరం వంటి హిందూ మత సంప్రదాయాల నుండి కొన్ని సంప్రదాయ శ్లోకాలు ఉన్నాయి. భక్తుల రోజువారీ ఆరాధన కోసం శ్రీ జి.ఎస్.ఖపర్దే 1922 వరకు ప్రచురణ యొక్క అన్ని ఖర్చులను భరించారు. బాబా మహాసమాధి తరువాత, ఈ పుస్తకం సమాధి మందిరంలో అధికారిక 'ది బుక్ ఆఫ్ డైలీ వర్షిప్' గా రూపాంతరం చెందింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ 1923 నుండి సవరించిన ప్రచురణను చేపట్టింది. 

శిరిడీ ఆరతి పుస్తకంలో మొత్తం ముప్పై పద్యాలు ఉన్నాయి. ఆ ముప్పైలో, కేవలం పదహారు మాత్రమే శ్రీ సాయిబాబా మీద కూర్చబడినవి. వేద శ్లోకం తప్ప మిగిలిన పద్నాలుగు సంప్రదాయ ఆరతి పాటలు మధ్యయుగానికి చెందిన మహారాష్ట్ర కవులు, సత్పురుషులు రచించినవి. పద్నాలుగు సాంప్రదాయ పాటలలో ఐదు సంత్ తుకారమ్ మహారాజ్; సంత్ నామదేవ్ మరియు సంత్ జానబాయిలు ఒక్కొక్కరు రెండు పాటలు; శ్రీ రామజనార్ధన్ స్వామి మరియు శ్రీ రామేశ్వర్ భట్ ఇద్దరు చెరొక పాట; మిగిలిన మూడింటిలో, ఒక వేద శ్లోకం మరియు రెండు ఇతర సంప్రదాయ ప్రార్థనలు ఉన్నాయి. శ్రీ సాయిబాబా పై ప్రత్యేకంగా వ్రాయబడిన పదహారు పాటలలో- తొమ్మిది, శ్రీ K.J. భీష్మ రచించినవి, మూడు శ్రీ దాసగణు మహారాజ్ వ్రాయగా మిగిలిన వాటిని శ్రీఉపసాని మహరాజ్, శ్రీమాధవ్ అడ్కర్, శ్రీమోహినిరాజ్ మరియు శ్రీB.V. దేవ్ ఒక్కొక్కటి రచించారు. భాషాపరంగా ముప్పై అరతి పాటలలో ఇరవై ఐదు మరాఠీలో, హిందీలో రెండు, సంస్కృతంలో రెండు మరియు ఒక పాట మరాఠీ, సంస్కృత ద్విభాషా సంపుటిలోని ప్రార్థన ఉన్నాయి.

ఇందులో బాబాను గురించి వ్రాయబడిన 16 పాటలు:

భీష్మ గారు వ్రాసినవి 9 పాటలు:

   కాకడారతిలోని
  • 1.      3వ పాట ఉఠా ఉఠా శ్రీ సాయినాథ గురు చరణ కమలదావా
  • 2.      5వ పాట ఘేఉని పంచారతీ కరూ బాబాంచి ఆరతి.
  • 3.      6వ పాట కాకడా ఆరతి కరీతో సాయినాధ దేవా.
  • 4.      9వ పాట పభాతసమయీ నభా శుభరవి ప్రభా ఫాకలి.
  • 5.      13వ పాట శ్రీ సద్గురుబాబాసాయి.
  • మధ్యాహ్న అరతిలోనివి
  • 6.      3వ పాట జయదేవ జయదేవ దత్తా అవధూత.
  • శేజహరతి లోనివి
  • 7.      4వ పాట జై జై సాయినాధ ఆతాపహుదావేమందిరీ హో.
  • 8.      5వ పాట ఆతాస్వామి సుఖే నిద్రా కరా అవధూతా
  • 9.      8వ పాట సాయినాధమహారాజ్ అతనా కృపాకరోగురు రాజా. (ప్రస్తుతం ఇది శేజారతి లో లేదు)

  • దాసగాణు మహారాజు గారు వ్రాసిన 3 పాటలు
  • 10.  సాయి రహమ్ నజర్ కరనా
  • 11.  రహమ్ నజర్ కరో అబ్ మోర్ సాయి
  • 12.  షిర్డీ మాఝే పండరీపుర సాయిబాబా రామావర
  • ఉపాసనీ మహారాజ్ గారు వ్రాసిన ఒక పాట
  • 13.  సదాసత్స్వరూపం (1911 లో వ్రాయబడినది)
  • మాధవ్ అడ్కర్ గారు వ్రాసిన ఒక పాట
  • 14.  ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార జీవా
  • మోహిని రాజా గారు వ్రాసిన ఒక పాట
  • 15.  అనంత తులాతే కసేరేస్తవావే
  • బి. వి. దేవ్ గారు వ్రాసిన ఒక పాట
  • 16.  రూసో మమ ప్రియంబికా
ఇతరులు వ్రాసిన 14 పాటలు
  • తుకారం వ్రాసిన 5 పాటలు
  • 1.      జోడునియా కర చరణి
  • 2.      భక్తీచియా పోటీ బోద్ కాకడా జ్యోతి
  • 3.       శేజారతి లో ఓవాళు ఆరతి మాఝ్యా సద్గురునాధ
  • 4.      పాహే ప్రసాదా చీవాట
  • 5.      పావలా ప్రసాద ఆతా విఠో నిజావే
  • నామదేవ్ ప్రాసిన 2 పాటలు
  • 6.      ఉఠా పాండురంగా ఆతా దర్శనద్యాసకళా
  • 7.      ఉఠా ఉఠా సాధు సంత సదా అపులాలేహిత
  • జానాబాయి వ్రాసిన రెండు పాటలు
  • 8.      ఉఠాపాండురంగా ప్రభాత సమయోపాతలా
  • 9.      తుజకాయ దేఉ సావళ్యా మిభాయాతరీయో
  • రామజనార్ధన గారి ఒక పాట
  • 10.  ఆరతి జ్ఞాన రాజా మహా కైవల్య తేజా
  • రామేశ్వర భట్ వ్రాసిన ఒక పాట
  • 11.  ఆరతి తుకారమా స్వామి సద్గురుధామా
  • మిగిలిన పాటలు
  • 12.  వేద సంబంధమైన మంత్రపుష్పం
  • 13.  సంప్రదాయ ఆరతి పాటలు – భజన మొదలగు ఇతర పాటలు (హరేరామ రామరామ హరే, కర చరణ మొదలైనవి.)

పై పాటలన్ని సాయి ఆరతుల పుస్తకం సాయి సగుణోపాసన లో ప్రచురించబడినవి. ఈ సగుణోపాసనకు మూలకర్త శ్రీ కృష్ణ జోగేశ్వర భీష్మ. ఈ హరతులకు భీష్మ రూపకల్పన చేయగా, వాటిని సక్రమంగా నిర్వహించుటకు కృషి చేసిన వారు రాధాకృష్ణమాయి. సాయిని సేవించుటకు సాయి తత్త్వంలో ఈ అరతులకు మించినదిలేదు. సాయి భక్తులు, సాయి మందిర నిర్వాహకులు ఈ అరతులకు ప్రాధాన్యతను గుర్తించి వాటిలో పాల్గొని సాయి కృపకు పాత్రులగుదురుగాక!

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo