సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీసాయిసచ్చరిత్ర - సాయి విశ్వవిద్యాలయం


చంద్రాబాయి బోర్కర్ మనుమరాలైన ఉజ్వలా బోర్కర్ కూడా ఎన్నో సాయి అద్భుతాలను అనుభవించారు. సాయి అద్భుతాలలో ఒకటి శ్రీసాయిసచ్చరిత్ర. అది సాయి విశ్వవిద్యాలయం, సాయిబాబానే దాని ఛాన్సలర్!

ఉజ్వలా బోర్కర్ మాట్లాడుతూ, "మాధవరావు దేశ్‌పాండే, బయజాబాయితాత్యాకోతేపాటిల్, లక్ష్మీబాయిషిండే, కాకాసాహెబ్ దీక్షిత్, చంద్రాబాయి బోర్కర్ మరియు ఇతర సాయిభక్తులు వారి వారి జీవితాల్లో ఎలా పురోగతి సాధించారో తెలుసుకొని నేను గోవిందరావు దభోల్కర్ రచించిన 'శ్రీసాయిసచ్చరిత్ర' అనే విశ్వవిద్యాలయంలో  మే 18, 1974న ప్రవేశం పొందాలని నిర్ణయించుకున్నాను."

ఈ విశ్వవిద్యాలయం స్థాపించడానికి బాబా దభోల్కర్‌ను ప్రోత్సహించారు. ఇది 53 తరగతి గదులను (అధ్యాయాలు) కలిగి ఉంది. ఆశ్చర్యకరంగా, ఈ విశ్వవిద్యాలయం నిర్మాతైన దభోల్కర్ మొదట్లో బాబాను ఈ విశ్వవిద్యాలయం యొక్క ఛాన్సలర్ (కులపతి)గా అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అతను నేర్చుకున్న దానిని బట్టి 'ఏవైనా ఫలితాలను స్వంత ప్రయత్నాల ద్వారా పొందవచ్చ'ని నమ్మేవాడు. అతని మనస్సు అహంతో నిండివుండేది. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, భాటే మరియు నూల్కర్ - ఈ విద్యార్థులు దభోల్కర్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఈ విద్యార్థులు మట్టిరోడ్డు మీద కూడా బాబాకు సాష్టాంగనమస్కారం చేస్తారు. ఇదంతా చూస్తూ అతను ఆశ్చర్యపోయాడు, కానీ ప్రభావితం కాలేదు. దీక్షిత్ ప్రపంచాన్ని పర్యటించారు, ప్రపంచ సాహిత్యాన్ని చదివారు. అయినా అతను ఎందుకు ఇంత దిగజారాడు?” అని అనుకున్నాడు. "ఈ ఫకీరులో ఈ తెలివైన వ్యక్తులు ఏమి చూసి గురువుగా ఆయనను అంగీకరించారు?" అని అనుకునేవాడు.

కానీ ఒకసారి బాబా తిరగలిలో గోధుమపిండిని విసరటం చూశాడు. గ్రామశివార్లలో చల్లిన పిండి గ్రామంలో వ్యాపించిన కలరా వ్యాప్తిని అడ్డుకుంది. ఈ సంఘటన అతనికి ఒక మలుపు. అదే 'శ్రీసాయిసచ్చరిత్ర' అనే విశ్వవిద్యాలయ స్థాపనకు పునాదిరాయి వేసింది. దానితో అతనిలో బాబా పట్ల విశ్వాసం పెరిగింది. తరువాత బాబా తమ వరదహస్తాన్ని దభోల్కర్ తలపై ఉంచి శ్రీసాయిసచ్చరిత్ర రూపంలో సాయి విశ్వవిద్యాలయాన్ని నిర్మించటానికి అనుమతి ఇచ్చారు.

ఈ విశ్వవిద్యాలయంలోని కొన్ని పాఠాలు: 
1) విశ్వాసము మరియు పట్టుదల ఎల్లప్పుడూ మీతో ఉండనివ్వండి.
2) మీరు శాంతితో జీవించాలని అనుకుంటే క్రమంగా మీ నిర్బంధ కోరికలను తగ్గించండి. ఇతరులకి సంబంధించిన వాటిని దొంగిలించవద్దు. కష్టపడండి. మీరు ఏ విత్తు వేస్తే అదే దక్కుతుంది. అది మాత్రమే మిమ్మల్ని మంచి స్థితిలో నిలబెడుతుంది.
3) ఒక వ్యక్తి పని చేస్తాడు, ఇతరులు ఫలితాలను పొందుతారు. ఇది ఇక్కడ ఎలా సాధ్యమవుతుందిఇంట్లో కూర్చుని సుఖాన్ని అనుభవిస్తూ లంచం ఇవ్వటం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే, ఈ విశ్వవిద్యాలయంలో మీరు మొదటి తరగతి పొందలేరు. ఛాన్సలర్(సాయిబాబా) మార్గనిర్దేశంలో అధ్యయనం చేసేవారు వారి ప్రశ్నలకు సరైన సమాధానాలను పొందుతారు.
4) మీ అహాన్ని వదిలేయండి. ఎవరు కోరికలను విడనాడలేరో వారు బ్రహ్మజ్ఞానం పొందలేరు.

ఈ విశ్వవిద్యాలయంలో ఏ వ్యయం లేదా ప్రవేశరుసుము లేకుండా ఎవరైనా ప్రవేశాన్ని పొందుతారు. పగలు, రాత్రి గడియారంతో పనిలేకుండా పనిచేయడం ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత. ఇందులో నేర్చుకున్న వాటిని ఆచరించే ప్రదేశం - జీవితం.

ఇక్కడ ప్రతి విద్యార్థీ ప్రత్యేకమైనవారే. ప్రతి ఒక్కరి కోసం, వారికి తగిన విధంగా ఇక్కడి ఛాన్సలర్ అప్రమత్తంగా పనిచేస్తారు. కొందరికి కలలు లేదా ఇతర మార్గాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఛాన్సలర్ శ్రీసాయి, "నేను ఇక్కడ ఉన్నప్పటికీ, మీరు సప్తమహాసముద్రాల అవతల ఉన్నప్పటికీ, మీరు చేసే ప్రతిదీ ఇక్కడ నాకు తెలిస్తుంది" అంటారు.

యూనివర్సిటీలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు నేర్చుకోవడానికి ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ఒక పరీక్ష ఎదుర్కొన్నారు. అది 'గురువు ఆజ్ఞలకు శిష్యులు విధేయులేనా, కాదా?' అని నిర్ధారించే పరీక్ష. స్వచ్ఛమైన బంగారం కూడా అగ్ని ద్వారా పరీక్షింపబడాలి. ఒక బ్రాహ్మణుడైనప్పటికీ, ఒక ఆయుధం తీసుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఏ సంకోచమూ లేకుండా మేకను చంపడానికి సిద్ధపడి సాయి ఛాన్సలర్ యొక్క పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ యూనివర్సిటీలో నేను, నాది అనే మనస్తత్వాన్ని యూనివర్శిటీ ఛాన్సలర్ సాయి యొక్క పాదాల వద్ద సమర్పించాలి. మీ కర్మల యొక్క కర్తృత్వాన్ని అర్పించాలి. గురువు ఆదేశాలచే ఏర్పాటు చేయబడిన యూనివర్సిటీ నియమాల ప్రకారం నడుచుకోవాలి.

అహం లేకుండా చర్య జరిగితే, పరిపూర్ణతకు ఎక్కువ సమయం పట్టదు. ఒక విద్యార్థి అయిన పుండలీకరావు, "మీ వైఖరిలో అహంకారం లేనట్లయితే, మీరు ఆత్మజ్ఞానం సాధించడానికి అర్హులు. మీరు సులభంగా జీవితసాగరాన్ని దాటగలరు" అని సలహా ఇచ్చాడు. ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ సాయి విద్యార్థులకు వాగ్దానం చేశారు - అధ్యయనం చేసేవారు వారి సామర్థ్యం ప్రకారం విజయవంతం అవుతారు. ప్రతి ఒక్కరూ తమ అర్హతను బట్టి వారు అడిగేది పొందుతారు. అందరూ ఈ విశ్వవిద్యాలయంలో సహాయం పొందుతారు. ఇతరులతో మీ పురోగతిని పోల్చవద్దు. మోసం అనుమతించబడదు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అంకితభావం మరియు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. నియమాలను అనుసరించేవారు సులభంగా విజయాన్ని పొందుతారు.

బిలియన్ డాలర్లను ఖర్చుచేసిన తరువాత కూడా పొందలేని ఆనందాన్ని, మనశ్శాంతిని ఎలా సాధించాలో ఈ యూనివర్సిటీలో  నేర్చుకుంటారు.

గత జన్మ కర్మఫలాల వలన ప్రస్తుతం కలిగే సుఖదుఃఖాలను ఎవరూ నివారించలేరు. ప్రార్థన మరియు భగవంతుని యొక్క నామం స్మరించుకోవడం వారి సంబంధిత తరగతిలో విజయం తెస్తుంది. 

(ఫోటో & ఆర్టికల్ కౌన్సిల్: శంషాద్ అలీబేగ్, జర్నలిస్ట్, నవీ ముంబై).

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo