సాయి వచనం:-

- శ్రీబాబూజీ.
Showing posts with label Baba’s Divine Manifestations by Vinny Chitluri.. Show all posts
Showing posts with label Baba’s Divine Manifestations by Vinny Chitluri.. Show all posts

శ్రీ నారాయణ్ నీలకంఠ కరాధికార్


బాబా దైవత్వం గురించి కరాధికార్ అనుభవం

నారాయణ్ నీలకంఠ కరాధికార్ అలియాస్ బాపూసాహెబ్ 1893వ సంవత్సరంలో పూణేలో జన్మించాడు. అతనికి 14 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు వాళ్ళింట్లో గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కొలువై ఉండేది. అతని గురువు పేరు గోపాల్ గురు. కరాధికార్ తన తల్లి, అన్నయ్య వాసుదేవరావులతో కలిసి స్వామి సమర్థుని పూజించే విధంగా అతడిని గోపాల్ గురు ప్రభావితం చేశారు. వాళ్లంతా ప్రతిరోజు సాయంత్రం క్రమంతప్పకుండా గోపాల్ గురు ఆశ్రమంలోని స్వామి సమర్థ ఆరతికి హాజరయ్యేవారు. 1907లో గోపాల్ గురు సమాధి చెందారు. దాంతో ఆయన కుమారుడైన శ్రీ అభాసాహెబ్ చితలే గారిని ఆధ్యాత్మికంగా తమకు మార్గనిర్దేశం చేయమని వాళ్ళు అభ్యర్థించారు. ఆయన వాళ్లకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేయడమే కాకుండా, ఆ కాలంలో ఉన్న ఎంతోమంది సత్పురుషులను కలిసేలా చేశారు. వాళ్ళు కలిసిన కొంతమంది సాధువులు కేస్కర్ మహారాజ్, గొండేవాల్కర్ మహారాజ్, నారాయణ్ మహారాజ్, బాబురావు బెడే, గుళవణి మహారాజ్ మరియు శిరిడీ సాయిబాబా.

నారాయణ్ నీలకంఠ కరాధికార్ సాయిబాబా ద్వారా తను పొందిన అనుభవాన్ని చాలా దృఢంగా ఇలా చెప్తున్నారు: "1914 - 1916 మధ్యకాలంలో నేను చాలాసార్లు శిరిడీ సందర్శించాను. బాబా పాదాలకు సర్వస్యశరణాగతి చెందిన తరువాత నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకున్నాను. కేవలం ఆయన పాదాలు తాకినందునే నేను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి ఎదిగాను. అది పదివేల సంవత్సరాలు తపస్సు చేసినా సాధ్యంకానిది. ఆ అత్యున్నత స్థితి సూర్యచంద్రుల కంటే అతీతం, ఎందుకంటే ఆ దైవత్వం ఆయన భౌతిక శరీరం నుండి అణువణువునా ప్రకాశించేది. 

నేను శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందాను. సంగీతం గురించి నాకు మంచి జ్ఞానం ఉంది. బాబా దర్బారైన ద్వారకామాయిలో నాకు పాడాలని కోరిక ఉన్నందున ఒకసారి బాబాను అనుమతి అడిగాను. బాబా అన్నారు, "ఇప్పుడు కాదు, నీవు కొన్నిరోజులు ఉందామని వచ్చావు. వారం, అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నప్పుడు పాడుదువు" అని. అప్పుడు నా తల ఆయన పాదాల మీద ఉంచాను, ఆ పాదాల యొక్క పవిత్రత నన్ను (నా జీవాత్మను) పూర్తిగా చుట్టుముట్టింది. నేను ఆయన పాదాలపై ఉన్న స్వేదాన్ని(తడి) పవిత్రమైన పాదతీర్థంగా భావించి, నెమ్మదిగా నా నాలుకతో ఆ పాదాలను నాకాను. వెంటనే బాబా, "అరె! ఎందుకు నా పాదాలకు వింతగా నమస్కారం చేస్తున్నావు?" అన్నారు.

సమాప్తం.

Source:  Ref: Sai Prasad Magazine, Deepavali issue, 1999.
Source : Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

బాల్ నవాల్కర్


1910వ సంవత్సరం నుండి సాధురావు నవాల్కర్ తరచూ శిరిడీ సందర్శించేవాడు. అతని కొడుకు బాల్ నవాల్కర్ ఇలా చెప్పాడు: "నేను చిన్నతనంలో బాబా అంటే భయపడేవాడిని. అతి తక్కువ కాలంలోనే ముంబాయి నుంచి గుంపులు గుంపులుగా భక్తులు శిరిడీకి రాసాగారు. పిల్లలందరికీ బాబా పండ్లు, మిఠాయిలు పంచిపెడుతుండేవారు. మా నాన్నగారు బాబాపట్ల ఎంతో భక్తిప్రపత్తులు కలిగి ఉండేవారు. బాబా మా నాన్నతో ఎన్నో విషయాలు చెప్తుండేవారు. అప్పట్లో నాకు బాబా చెప్పే ఆ విషయాల తలా, తోకా ఏమీ అర్థమయ్యేది కాదు‌. అయితే నా మొదటి శిరిడీ దర్శనంలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుత అనుభవాన్ని బాబా నాకిచ్చారు. ఆ సంగతులు నాకు చాలా స్పష్టంగా గుర్తున్నాయి.

మేము ముందుగా ముంబాయి నుండి కోపర్‌గాఁవ్ చేరుకున్నాము. అక్కడనుండి టాంగాలో నది దాటి శిరిడీ చేరుకోవాలి. చిన్నపిల్లాడినైన నేను టాంగాలో మా అత్త ప్రక్కన కూర్చున్నాను. నది మధ్యలోకి చేరుకున్నాక టాంగా నదిలో ఇరుక్కుపోయింది. మా అత్త చేతిలో ఉన్న మూట నదిలో పడిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. అది చూసిన నేను 'మేము కూడా ఆ నీటిలో పడి మునిగిపోతామేమో'నన్న భయంతో, నిరాశతో మా అత్త మెడను గట్టిగా పెనవేసుకొని ఏడవటం మొదలుపెట్టాను. తక్షణమే పొడుగ్గా ఉన్న ఒక ఫకీరు ప్రత్యక్షమై, "భయపడకు, నీకు ఏమీ కాదు" అని చెప్పాడు. తరువాత అతనెంతో నేర్పుగా టాంగాను లాగి క్షేమంగా గోదావరి అవతలి ఒడ్డుకు చేర్చాడు. తరువాత మేము శిరిడీ చేరుకొని ద్వారకామాయికి వెళ్ళాము. గోదావరి నదిలో మాకు సహాయం చేసిన ఫకీరు అక్కడ కూర్చొని ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. "ఆ క్షణం నుంచి నా సంరక్షకుడు బాబానేనని నాకు తెలుసు".

సమాప్తం.

Ref.: Sai Prasad Magazine, Deepavali issue, 1999.
Source : Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri,  

కేసర్ బాయి జయకర్


కేసర్ బాయి జయకర్ ప్రఖ్యాత శ్యామారావ్ జయకర్ గారి కుమార్తె. ఆమెను బాబా ఎంతగానో ఇష్టపడేవారు. ఆమె తనకు ఏడేళ్ల వయస్సున్నప్పుడు మొదటిసారి శిరిడీ దర్శించింది. అప్పటి తన అనుభవం గురించి ఆమె ఇలా చెప్పింది:

మేము శిరిడీ సందర్శించినప్పుడు చలికాలం కావడంతో తీవ్రమైన చలిగా ఉంది. నాకు జామకాయలంటే చాలా ఇష్టం. చాలామంది అమ్మకందారులు వాటిని బుట్టలో పెట్టుకొని ద్వారకామాయికి వస్తుండేవాళ్లు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయంలో నాకు జలుబు, దగ్గు పట్టుకున్నాయి. మా తాతగారు దాని గురించి దిగులుపడుతూ జలుబు ఎక్కువవుతుందని నన్ను జామపళ్ళను తినవద్దని కఠినంగా హెచ్చరించారు. 

ఆరతి అనంతరం భక్తులందరూ  ఇండ్లకు వెళ్ళిపోయాక బాబా నన్ను పిలిచారు. నేను పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళాను. అప్పుడు బాబా నా కోటు జేబులో ఒక జామపండు పెట్టి, మరో పండును నా చేతికిచ్చి, "త్వరగా తిను" అన్నారు. బాబా కూర్చున్న రాయి వెనుక గోనెసంచితో చేసిన ఒక పరదా ఉండేది. ఆ పరదా వెనకాల ఏమున్నదో తెలుసుకోవాలని నాకు ఆత్రుతగా ఉండేది. బాబాకు అన్నీ తెలుసు. ఆయన నెమ్మదిగా నాతో, "వెళ్లి ఆ పరదా వెనకాల కూర్చొని జామపండ్లు తిను. అలా చేస్తే మీ తాతకు నువ్వు కనపడవు. అతడు చూస్తే దగ్గు ఎక్కువవుతుందని నీ మీద కోప్పడతాడు" అన్నారు. నేను ఆనందంతో పరదా వెనక్కి వెళ్ళి జామపండ్లను కరకరా కొరుక్కుంటూ నమిలి తినేశాను. అయితే, 'గదిలో మా తాత నాతో చెప్పింది బాబాకు ఎలా తెలిసింద'ని చాలా ఆశ్చర్యం వేసింది".

సమాప్తం.

Ref: Sai Prasad Magazine, Deepavali issue, 1999.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri,

సాయిభక్తుల అనుభవమాలిక 152వ భాగం....


ఈరోజు భాగంలో:

  • నూనె లేని దీపాలు వెలిగించడం గురించి బాబా వివరణ

2002, జూలై 24న పవిత్రమైన గురుపూర్ణిమ పండుగ వచ్చింది. ఆరోజు తెల్లవారుఝామున మేఘశ్రీ కామత్ సాయిబాబా మందిరాన్ని దర్శించి పండ్లు, మిఠాయిలు బాబాకు సమర్పించుకున్నారు. తరువాత ఆమె విజయ్ హజారేగారి ఇంటికి వెళ్ళి బాబా లీలల గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని అర్థవంతంగా గడిపారు. రాత్రి తన అలవాటు ప్రకారం బాబా నామం స్మరించుకుంటూ ఆమె నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి తన జీవితాన్ని మార్చేసే అద్భుతమైన కల వచ్చింది.

కలలో ద్వారకామాయి కనిపించింది. బాబా తమ ప్రక్కన ఉన్న కఠడాపై ఎడమ మోచేయి ఆనించుకుని తమ సహజరీతిన కూర్చుని ఉన్నారు. మేఘ గబగబా ద్వారకామాయి మెట్లెక్కి బాబా పాదాలను పట్టుకుని, తన తలను ఆయన పాదాలపై ఉంచారు. బాబా తమ దివ్యహస్తాలను ఆమె తలమీద ఉంచి, "అల్లా మాలిక్" అని ఆశీర్వదించి, కొంచెం ఊదీ ఆమె నుదుటిమీద పెట్టారు. ఆమె బాబా ముందు కూర్చుని, "బాబా! మీరెందుకు మట్టి ప్రమిదలలో నీళ్లు పోసి దీపాలు వెలిగించారు?" అని అడిగింది. బాబా కాసేపు మౌనంగా ఉండి, "నేను నూనె లేకుండా దీపాలు వెలిగించేది నా భక్తులందరి మేలు కోసం. ప్రతి ఒక్క భక్తుని కోసం నా హృదయం ప్రేమ, దయ, జాలి, కరుణతో పొంగిపొర్లుతోంది. అయినప్పటికీ, మనుషుల దుర్మార్గపు ధోరణులను చూసి నాకు దుఃఖం కలుగుతుంది. దురదృష్టవశాత్తు, అది విస్తృతంగా వ్యాపించి నాలుగుదిశలలో అదే కనిపిస్తూ నన్ను బాధిస్తుంది" అని అన్నారు. వెంటనే ఆమె, "బాబా! ఎలాంటి దుర్మార్గపు ధోరణులు?" అని అడిగింది. అందుకు బాబా తల ఆడిస్తూ, "చాలామంది జనులు రోజూ ప్రమిదలలో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. వాళ్ళు వాటిని తమ పూజగదిలో దేవుని ముందు, బయట ద్వారం వద్ద, తులసి బృందావనం వద్ద పెడతారు. ఆచారపూర్వకంగా కొంతమంది రోజుకు నాలుగుసార్లు దీపాలు పెడతారు. ఇంకొంతమంది పూజగదిలో 'అఖండ జ్యోతి' పెడతారు. అయినా వాళ్ళు ద్వేషపూరితంగా, హానికరంగా, సాటి మనుషుల పట్ల అమానుషంగా ఉంటారు. వాళ్ళ హృదయంలో సాటి మనుషుల పట్ల సానుభూతి, మానవత్వం, ప్రేమ లోపించాయి. ప్రేమ, దయ లేకుండా దీపాలు వెలిగిస్తే అది వ్యర్థం. అది నూనె లేకుండా దీపాలు వెలిగించడంతో సమానం. అలా ఎందుకు దీపాలు వెలిగించడం? రోజూ దీపాలు వెలిగించి, బయటికి వెళ్ళి ఇతరుల విషయంలో మోసాలు, కుట్రలు చేస్తారు. తరువాత మీ భక్తిని ప్రదర్శించుకోవడానికి అధిక మొత్తంలో డబ్బులు, ధూపాలు, పూలు, నైవేద్యాలు నాకు సమర్పిస్తారు. ఆ మనిషి ఆడైనా, మగైనా, సోదరసోదరీమణులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఏ బంధువులైనా కావచ్చు, కానీ ప్రేమలేని ఆ అనుబంధాలు వ్యర్థమైనవి. వాళ్లంతా రక్తసంబంధీకులు అయినందున కర్మసంబంధంగా తలచి అర్థాంగీకారంతోనే ఆ సంబంధాలను భరిస్తారు. దురదృష్టంకొలది అత్త తన కోడలిని సొంత కూతురిలా భావించదు. అన్న భార్య తమ్ముడి భార్యని సోదరీభావంతో ప్రేమ చూపించదు. మీ బుద్ధిలో, హృదయంలో తీవ్రమైన అంధకారం గూడుకట్టుకోవడం నేను గమనిస్తున్నాను. వాస్తవానికి మీలో కొంతమంది మానవత్వం, దయ కలిగి సరైన మార్గంలో జీవించేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివాళ్ళు ఈ ప్రపంచంలో మనుగడ సాగించడం చాలా కష్టం. మీ మనస్సునందు, హృదయమునందు ప్రేమ లేనిచో దీపాలు వెలిగించడం గురించి ఆలోచించవద్దు. ఎవరి హృదయం ఇతరులపట్ల చెడుతలంపులు లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో ఆ వ్యక్తే దీపాలు వెలిగించాలి, అప్పుడే అది అంధకారాన్ని పారద్రోలుతుంది. అప్పుడే నిజమైన జ్యోతి వెలుగుతుంది. ఇతరులపట్ల మంచి సంకల్పం లేకపోతే నా ఊదీకాని, ధ్యానంకాని మీకు సహాయపడవు. ఎప్పుడైతే మీరు ప్రేమ, కరుణలను అలవరచుకుంటారో అప్పుడు అంధకారం మాయమైపోతుంది. నా చుట్టూ ఉన్న తీవ్రమైన అంధకారాన్ని చూసి నాకు బాధ కలుగుతుంది. బేటా! నీవు దీపాలు నీటితో వెలిగించడం గురించి ప్రశ్నించావు. అందుకే నేను ఇవన్నీ నీకు చెప్పాను. నేను ఏదైతే చెప్పానో దానిగురించి నీవు ఎంతమంది భక్తులకు వీలైతే అంతమందికి తెలియచేసి, అవగాహన కలిగిస్తే, అది మీ అందరికీ చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. నా సందేశాన్ని స్వీకరించి వారి చెడు మార్గాలను మార్చుకున్నంతవరకు వాళ్ళు నా లీలలు, చరిత్ర చదవకపోయినా, నాకు ఆరతులు చేయకపోయినా ఫరవాలేదు. బేటా! నువ్వు ఇది నాకోసం చేస్తావా?" అని చెప్పి కన్నీళ్లు నిండిన కళ్ళతో బాబా తమ చేతిని మేఘ తలపై ఉంచి ఆశీర్వదించారు. మరుక్షణం ఆమెకు మెలకువ వచ్చి, తాను కలగన్నానని గ్రహించింది. ఆ క్షణంనుంచి తాను కలుసుకున్న ప్రతి భక్తునికి ఆ ప్రత్యేకమైన బాబా సందేశాన్ని తెలియజేయడమే తన జీవితధ్యేయంగా మారిపోయింది.

మనం మన కర్మల ద్వారా సృష్టించుకున్న అంధకారాన్ని తొలగించడానికి బాబా తనదైన ప్రత్యేకశైలిలో మనకి సహాయం చేస్తారు. ఆయన ఈ లీల ద్వారా ఆత్మజ్యోతి(ఆత్మ సాక్షాత్కారం) వెలిగించడానికి ప్రతిఒక్కరూ సాధన చేయాలని సందేశాన్నిస్తున్నారు.

Ref.: Sai Prasad, Deepavali vissesh ank, 2002.
Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

సాయిభక్తుల అనుభవమాలిక 132వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • భక్తుడు రాంభావుకు ఋజువు చూపిన బాబా

సుమారు 1954లో పూణే వాస్తవ్యుడైన రాంభావు కాకడే కడుపునొప్పితో బాధపడేవాడు. తన డాక్టర్ pleurisy (పార్శ్వశూల) గా అనుమానించి యాంటీ బయాటిక్స్ వాడుతూ బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు. రాంభావు సాయిబాబాను, స్వామిసమర్థులను పూజించేవాడు. ఒక మధ్యాహ్నం మంచంమీద పడుకుని ఉన్న సమయంలో అతని ఆలోచనలు తీసుకునే ఆహారానికి సంబంధించిన ముడిసరుకుల మీదకి వెళ్లాయి. అతని ఆలోచన ఏమిటంటే - మనం తీసుకునే ఆహారం మన మనస్సు మీద, శరీరం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి అందుకవసరమైన ముడిసరుకులు ఎక్కడనుండి వస్తున్నాయి? వాటిని మనం ఎవరి వద్దనుండి కొనుగోలు చేస్తున్నాము? అనే వివరాలు తెలుసుకోవాలి. వాటిని మనమెలా తీసుకొస్తున్నాము? ఎవరు తీసుకొస్తున్నారు? అనే విషయాలపట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. దానితోపాటు ఎవరు వంట చేస్తున్నారు? ఎలా వండుతున్నారు? అన్న వాటి మీద కూడా శ్రద్ధ వహించాలి. ఈ విషయాలన్నింటి మీద ఆలోచన చెయ్యాలి - అని. ఇలా అతడు దీర్ఘాలోచన చేస్తుండగా బాబా అతని ముందు ప్రత్యక్షమై, "అరె! ఆహార పదార్థాలు నారాయణ్ నుండి తెచ్చుకో!" అని చెప్పి అదృశ్యమైపోయారు. నారాయణ్ అనే కిరాణా దుకాణాదారుని దుకాణం అతని ఇంటికి దగ్గరలో ఉంది. ఆ క్షణంనుండి బాబా సలహా ప్రకారం రాంభావు కిరాణా సరుకులన్నీ నారాయణ్ దుకాణం నుండి తెప్పించుకోసాగాడు. అప్పటినుండి అతని ఆరోగ్యం మెరుగుపడటం మొదలై తొందరలోనే పూర్తిగా కోలుకున్నాడు.

1960లో రాంభావుకొక అద్భుతమైన అనుభవం కలిగింది. ప్రతిరోజు వేకువఝామున లేచి కొంతసమయం ధ్యానంలో గడపటం అతనికి అలవాటు. ఒకరోజు తెల్లవారుఝామున సుమారు 4 గంటల సమయంలో రాంభావు ధ్యానం చేస్తున్నాడు. ఆ సమయంలో స్వామి సమర్థుని దివ్యదర్శనమైంది. అతడు తాను చూస్తున్నది నమ్మలేకపోయాడు. 'ఇది కల కాదు కదా!' అని ఆశ్చర్యచకితుడయ్యాడు. మేలుకుని ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికై తనని తాను గిల్లుకున్నాడు. అతను పూర్తి జాగ్రదావస్థలోనే ఉన్నాడు. ఇంతలో స్వామి సమర్థులు అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. అయినా అతను తన కళ్ళముందు జరుగుతున్న దాన్ని నమ్మలేకపోతున్నాడు. ఇంతలో బాబా ప్రత్యక్షమై, "అరె! నీకు ఇంకా అనుమానాలున్నాయా? నన్ను నమ్ము! ఈయన స్వామి సమర్థ" అని చెప్పారు. అతడు, "బాబా! నాకు ఒక అనుభవం లేదా ఋజువు ఇవ్వండి. లేకపోతే నేనెలా నమ్మేది?" అని అన్నాడు. అప్పుడు బాబా, "నీకు ఋజువు కావాలి, అవునా? ఈ ఉదయం నీకు బాసుంది ఇస్తాను. అప్పుడు నన్ను నమ్ముతావా?" అని అన్నారు. అందుకతను, "నాకు ఋజువు దొరికితే, ఖచ్చితంగా నమ్ముతాను" అని అన్నాడు. తరువాత అతడు ధ్యానస్థితి నుండి బయటకి వచ్చాడు.

ప్రతి ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో మారుతి మందిరానికి వెళ్లడం రాంభావుకి అలవాటు. ఆరోజు అతడు మందిరంలోకి ప్రవేశిస్తుండగా ఒక అపరిచితవ్యక్తి అతనిని పిలిచి, "నేను ఈరోజు దేవునికి సమర్పిద్దామని బాసుంది తయారుచేశాను. ఈ ప్రసాదాన్ని నేను ఎవరైనా నైతిక విలువలున్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు గుర్తుకు వచ్చావు. ఈ వెండిగ్లాసులో ప్రసాదం ఉంది. దయచేసి ఇది స్వీకరించు!" అన్నాడు. రాంభావు అతనిని గుర్తుపట్టలేదుగాని, "నేను ఎంతోమందితో మాట్లాడుతుంటాను. వాళ్లలో ఈయన ఒకరు అయివుండవచ్చు" అని అనుకున్నాడు. తరువాత అతను బాసుంది స్వీకరించి కొద్దిగా నోట్లో వేసుకున్నాడు. అది చాలా రుచికరంగా ఉంది. అంతవరకూ అతనెప్పుడూ అంత రుచికరమైన బాసుంది తినివుండలేదు. తరువాత అతడు మారుతి ముందర సాష్టాంగపడి, ఆ మూర్తి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్షణాన బాబా చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. సరిగ్గా బాబా చెప్పినట్లుగానే జరిగింది. "ఆ అపరిచితవ్యక్తి వేరెవరో కాదు, నాకు ఋజువు చూపిస్తానని వాగ్దానం చేసిన బాబానే!" అని అనుకుని వెంటనే మందిరం వెలుపలికి పరుగుపెట్టి ఆ అపరిచితవ్యక్తి కోసం వెతికాడు, కానీ ఆ వ్యక్తి ఎక్కడా కనపడలేదు.

Ref: Prasad, Volume 33, No. 9, August 1979.
Source: Baba’s Divine Manifestations  compiled by Vinny Chitluri

గజానన్ ప్రధాన్


దీర్ఘకాలికంగా బాధించిన వాపు, నొప్పితో కూడుకున్న రాచపుండు గజానన్ రామచంద్ర ప్రధాన్‌ని 1910వ సంవత్సరంలో శిరిడీకి రప్పించింది. యుక్తవయస్సులో ఉన్న గజానన్ ముంబాయిలో నివాసం ఉండేవాడు. 1910లో అతని కుడికాలి చీలమండకు వాపు వచ్చింది. ఒక ఆయుర్వేద వైద్యుడు అతని కాలుని పరీక్షించి చికిత్స చేసాడు. తరువాత ఒక హకీమ్(ఫిజీషియన్)  కూడా వైద్యం చేసాడు. గజానన్ పద్ధతి ప్రకారం మందులన్నీ తీసుకుంటూ, సూచించిన పులియబెట్టిన ఔషధాలు కూడా త్రాగాడు. అయినా కూడా అతనికి ఉపశమనం కలగలేదు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాపు ఉన్న చోట అతడు పిండికట్టు వేసుకున్నా ఆ రాచపుండు పగలకపోగా గుండ్రంగా, గట్టిగా తయారయ్యింది. అనతికాలంలోనే ఆయుర్వేద వైద్యుడు, హకీం తమ ప్రయత్నాలను విడిచిపెట్టారు. అయితే గజానన్ చీలమండ వాపు, విపరీతమైన నొప్పి అలానే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు అతన్ని అల్లోపతి వైద్యుడికి చూపించారు. ఆ వైద్యుడు కొన్ని గుళికలు ఒక వారంరోజులపాటు వాడమని ఇచ్చి, "ఈ మందులతో వారం లోపల స్వస్థత చేకూరకపోతే ఆపరేషన్ చేసి రాచపుండును తొలగిస్తాను" అని చెప్పాడు. అయితే వాపు రోజురోజుకీ పెరగసాగింది. అతని తల్లి శ్రీమతి ప్రధాన్ దిగజారుతున్న బిడ్డ పరిస్థితికి ఏం చేయాలో అర్థంకాక చాలా చింతించసాగింది.

అలా ఉండగా ఒకరోజు సాయంత్రం అనుకోకుండా వాళ్ళ కుటుంబ స్నేహితుడు ఒకతను వచ్చి, "శిరిడీ వెళ్ళి అక్కడ రెండువారాలపాటు ఉండమ"ని సలహా ఇచ్చాడు. ఇంకా ఇలా చెప్పాడు: "అక్కడొక అద్భుతమైన సత్పురుషుడుగా పిలవబడే సాయిబాబా నివసిస్తున్నారు. ఆయన ఎంతోమంది అసాధారణమైనటువంటి జబ్బులను నయం చేసారు. కాబట్టి మీరు కూడా బాబా సహాయాన్ని అర్థిస్తే, ఆయన తప్పక గజానన్‌కి నయం చేస్తారు" అని. ఆ స్నేహితుని సలహాను శ్రీమతి ప్రధాన్ అనుసరించాలని నిర్ణయించుకుంది. మరుసటిదినమే గజానన్, అతని తల్లి, ఆమె తమ్ముడు నానా శిరిడీ ప్రయాణమయ్యారు. శిరిడీ చేరుకున్నాక వాళ్ళకి ధర్మశాల(పిలిగ్రిమ్స్ ఇన్)లో గది దొరికింది. గదిలో గజానన్ విశ్రాంతి తీసుకుంటుండగా అతని తల్లి, నానా గ్రామంలో విచారించి సరుకులతో గదికి తిరిగి వచ్చి, వంట తయారు చేసుకున్నారు.

గ్రామంలో చాలా చిన్న చిన్న మందిరాలున్నాయి. అక్కడకు వెళ్ళి వీళ్ళు కూర్చున్నారు. "బాబా ఎక్కడ ఉంటారు?" అని గ్రామస్థులను విచారించి 'మసీదులో ఉంటార'ని తెలుసుకున్నారు. అటువైపు నడుస్తుండగా వాళ్ళకు ఆరతి పాట వినిపించి, ఆ వైపుగా నడుచుకుంటూ వెళ్లి కొద్దిసేపట్లోనే ద్వారకామాయిలో అడుగుపెట్టారు. అక్కడ బాబాను పూజిస్తూ, ఆరతి ఇస్తున్నారు. ఆరతి ముగిసిన తరువాత శ్రీమతి ప్రధాన్, నానా వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించుకున్నారు. బాబా వాళ్ళను ఆశీర్వదించి, "అల్లా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు" అని అన్నారు. వాళ్ళు ఆనందంతో పొంగిపోయారు. గదికి తిరిగి వచ్చిన తరువాత గజానన్‌కు అక్కడ జరిగినదంతా చెప్పారు. అది విన్న అతను వ్యాకులతతో, "నేను ఎప్పుడు బాబాను కలవగలను? ఆరోజు నా జీవితంలో అతిముఖ్యమైన రోజు" అని అన్నాడు.

మరుసటిరోజు ద్వారకామాయిలోని గంటల మోత విని గజానన్‌ను గదిలోనే విడిచి శ్రీమతి ప్రధాన్, నానా మధ్యాహ్న ఆరతికి హాజరు కావడానికి వెళ్ళారు. ఆరతి ప్రారంభం కావడానికి కాస్త ముందు వాళ్ళు ద్వారకామాయిలో అడుగుపెట్టారు. బాబా వాళ్ళను చూసి, "ఏ భక్తుడు ధర్మశాలలో ఉంటూ ఆరతికి రాలేదు?" అని అడిగారు. అప్పుడు శ్రీమతి ప్రధాన్, "బాబా! నా బిడ్డ గజానన్ ఆరతికి హాజరయ్యే స్థితిలో లేడు. తన చీలమండ వాచి, బాగా నొప్పిగా ఉంది. అందువలన తను నడవలేడు బాబా" అని చెప్పింది. అప్పుడు బాబా, "వెంటనే వెళ్ళి అతనిని ఆరతికి తీసుకుని రండి" అని అరిచారు. వెంటనే శ్రీమతి ప్రధాన్, నానా గదికి తిరిగి వచ్చి, గజానన్‌ను ద్వారకామాయికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. వారిద్దరి సహాయంతో గజానన్ కుంటుకుంటూ అతికష్టంమీద మసీదుకు చేరుకున్నాడు. అప్పటికి ఆరతి ముగిసింది. భక్తులు బాబా పాదాలకు నమస్కరించుకుంటున్నారు. అకస్మాత్తుగా బాబా ఒక రాయి తీసుకుని గజానన్ కుడికాలి చీలమండపై విసిరారు. గజానన్ నొప్పితో కేకపెట్టి క్రిందపడిపోయాడు. ఆ రాచపుండు పగిలి చీము, రక్తం బయటకు వచ్చాయి. శ్రీమతి ప్రధాన్ అక్కడ పడివున్న ఆకులు, పువ్వులతో తుడిచి, పుండు ఉన్నచోట ఊదీ వ్రాసారు. తొందరలోనే పుండు నయమై, గజానన్ ప్రతీరోజు అన్ని ఆరతులకు హాజరు కాగలిగేవాడు. తరువాత బాబా ఆశీర్వాదాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. కొంతకాలానికి గజానన్‌కి రైల్వేలో ఉద్యోగం వచ్చింది.

తీవ్రంగా వేధించిన నొప్పినుండి విముక్తి కలిగించినందుకు గజానన్ బాబాపట్ల ఎంతో కృతజ్ఞత కలిగివుంటూ, తన ఇంట్లో బాబా చిత్రపటాన్ని పెట్టుకుని భక్తితో పూజిస్తుండేవాడు. బాబా మహాసమాధి చెందేలోపు రెండు, మూడుసార్లు శిరిడీ సందర్శించాడు. నిత్యం విరామం లేకుండా 8 గంటల సమయం సచ్చరిత్ర పారాయణ చేసేవాడు. ఆ అభ్యాసాన్ని తాను చనిపోయేవరకు కొనసాగించాడు.

భక్తులకు శిరిడీ సందర్శించే కారణాలు వేరుగా ఉండవచ్చు. కానీ, బాబా తమ దృష్టి వాళ్ళ మీద నిలిపి ఖచ్చితంగా వాళ్ళను తమ పాదాల చెంతకు లాక్కుంటారు.

Ref : సాయిప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 1999.
Source: Baba’s Divine Manifestations  compiled by Vinny Chitluri.

పని విలువ


1946వ సంవత్సరం మే నెలలో ఒకరోజు వసంత్ ప్రధాన్, అతని స్నేహితుడు శిరిడీ సందర్శించారు. ఆ సాయంత్రం వేడి తగ్గుతూ ఆహ్లాదకరమైన గాలి వీస్తోంది. 'వయస్సు పైబడివుండి, బాబాను కలిసిన వ్యక్తి ఎవరైనా కనపడతారా?' అనే ఆశతో స్నేహితులిద్దరూ గ్రామంలో నడుస్తున్నారు. బాబాకి సంబంధించిన లీలలు, ఆసక్తికరమైన విషయాలు ఆ వ్యక్తి చెప్తారేమోనని వారి ఉద్దేశ్యం.

చిన్నచిన్న వీధులలో వారిరువురు నడుస్తుండగా ఒక ముస్లిం పెద్దమనిషి కనపడ్డారు(దురదృష్టవశాత్తు ఆ పెద్దమనిషి పేరు తెలియపరచలేదు). అతను ఒక రాయిమీద కూర్చుని బీడీ తాగుతున్నాడు. వసంత్ అతనిని, "బాబా, మీరు శిరిడీ గ్రామస్థులా?" అని అడిగాడు. అతను ఆతురతగా తల ఆడించాడు. అప్పుడు వసంత్ అతనితో, "బాబా గురించి, మీకు జరిగిన ఏదైనా అనుభవం గురించి మాకు చెప్పండి" అని అభ్యర్థించాడు. అందుకతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: 

"నేను బాబా దగ్గర కూర్చునేవాడిని. ఆయన ఇచ్చిన చిలుం పీల్చేవాడిని. ప్రతిరోజూ నేను ఆయన దర్బారుకు వెళ్ళి, ఆయన చెప్పేవి జాగ్రత్తగా వినేవాడిని. బాబా వింతగా మాట్లాడేవారు. ఎప్పుడైనా ఏ భక్తునికైనా ఏదన్నా చెప్పాలని అనుకుంటే, ఆయన వేరెవరివైపో చూస్తూ సందేశం లేదా సలహా చెప్పేవారు. ఆయన చూపు ఎవరిపై ఉందో ఆ వ్యక్తి గాభరాపడేవాడు. కానీ ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆయన చెప్తున్నారో ఆ వ్యక్తి మాత్రం చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఆ సందేశాన్ని వినేవాడు. తరువాత ఆ వ్యక్తి ఆయన పాదాలమీద పడి ఆ సలహాను పాటించేవాడు. ప్రతిరోజూ బాబా విస్తారంగా డబ్బులు పంచేవారు. ఆయన 5, 10, 50 మరియు 100 రూపాయలు అక్కడ కూర్చుని ఉన్న భక్తులకు ఇచ్చేవారు. అయితే నాకు మాత్రం ఆయనెప్పుడూ డబ్బులు ఇవ్వలేదు. నాకు ఒక చిన్న పొలం ఉండేది. దానిద్వారా వచ్చిన దాంతోనే నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకునేవాడిని. ఒకరోజు నేను, "బాబా! మీరు మీ భక్తులందరికీ విరివిగా డబ్బులు పంచిపెడతారు. నేను చాలా పేదవాడిని, అయినప్పటికీ మీరు నాకెప్పుడూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు" అని అన్నాను. అప్పుడు బాబా, "అరె! నీకెందుకు డబ్బులు కావాలి? నీ పొలంలో బంగారుకుండ ఉంది" అని అన్నారు. మరుసటిరోజు నేను జాగ్రత్తగా పొలం దున్ని, సరిపడేంత ఎరువు వేసి, గింజలు నాటాను. బాబా మాటలు నా చెవిలో మారుమ్రోగుతుండగా ప్రతిరోజూ జాగ్రత్తగా పనిచేసేవాడిని. సమయం దొర్లిపోయింది కానీ బంగారుకుండ కనపడలేదు. అయినా నా శ్రమవలన ప్రతిసారీ విస్తారమైన పంట వచ్చేది. తొందరలో నేను ప్రక్కనున్న మూడు పొలాలు కొనగలిగాను. నా దగ్గర సరిపడా ధనం చేరింది. కొన్ని సంవత్సరాల తరువాత నేను బాబాతో, "నేనింకా బంగారుకుండను కనుగొనలేకపోయాను" అని అన్నాను. ఆయన నవ్వుతూ, "ప్రయత్నం చేస్తూ ఉండు" అని అన్నారు. తరువాత బాబా మాటలు నిజమయ్యాయి. నేనిప్పుడు ఐశ్వర్యవంతుడిని. చాలా సంతోషంగా ఉన్నాను. నా శ్రమ, ఆయన అనుగ్రహం రెండూ కలిస్తే బ్రహ్మండమైన పంట పండుతుందని ఆయన నాకు తెలియజేశారు". ఆ క్రమంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, బాబాను ఎల్లవేళలా జ్ఞప్తియందు ఉంచుకుని శ్రద్ధగా పని చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తాము అని.

వసంత్ కూడా ఈ కథ వల్ల పాఠం నేర్చుకున్నాడు. శ్రీసాయిసచ్చరిత్ర 19వ అధ్యాయంలో హేమాడ్‌పంత్ ఇలా వ్రాసారు: "మీరు మీ సామర్థ్యాన్నంతా పెట్టి కష్టపడి పనిచేయండి. నేను గిన్నెడు పాలతో మీ ప్రక్కనే నిలబడి ఉంటాను. మీరు కష్టపడక పోయినట్లైతే నేను గిన్నెడు పాలతో మీ ప్రక్కన నిలుచుంటానని ఆశించవద్దు".

బాబా చదువుకున్న, చదువుకోని భక్తులకు సుళువైన పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పుతారు. ఆయన అంతటా, అన్నిచోట్లా ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి.

Ref : సాయి ప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 1992.
Source: Baba’s Divine Manifestations  compiled by Vinny Chitluri.

సాయిభక్తుల అనుభవమాలిక 105వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • భక్తురాలిని చూడటానికి వచ్చిన బాబా

చారుశీల వరద్కర్ బాబా భక్తురాలు. ఆమెకు సత్పురుషుల పట్ల ఎంతో గౌరవభావం. ఒకసారి ఒక గొప్ప సత్పురుషుడు తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆశ్రమానికి రాబోతున్నారని తెలిసి ఆ విషయాన్ని ఆమె తన సోదరికి తెలియజేసింది. ఇద్దరూ ఆ సత్పురుషుని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. చారుశీల తన పనులను పూర్తి చేసుకుని తన సోదరి రాకకోసం వేచి చూసింది. కానీ ఎంతసేపు చూసినా తన సోదరి రాకపోవడంతో ఆమె తన సోదరి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక, తన సోదరి వెళ్ళిపోయి చాలా సమయమైందని తెలిసి ఆమె నిరాశకి గురికావడమే కాకుండా తాను వంచింపబడ్డానని చాలా బాధపడింది. వెంటనే ఆమె ఇంటికి తిరిగి వచ్చి, బాబా చిత్రపటం ముందర కూర్చుని, "బాబా! ఇద్దరం కలిసి వెళదామని తను నాకు మాట ఇచ్చింది. కానీ ఆమె ఒక్కతే వెళ్ళిపోయింది. ఆమె తన మాట నిలబెట్టుకోలేదు. నాకు ఆ సత్పురుషుని కలవాలని ఉంది, కానీ ఇప్పుడు నేనేమీ చేయలేని పరిస్థితి. నేను వంచించబడ్డాను" అని చాలా రోదించింది. కొంతసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పుడొక అద్భుతమైన కల! కలలో ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. అక్కడ చాలా జనసమూహం ఉంది. అందులో తను కూడా ఒక మూల నిలబడి ఉన్నది. అంతలో సాయిబాబా ఆ జనసమూహం మధ్యనుండి నడుచుకుంటూ తనవైపే వస్తున్నట్లు కన్పించింది. ఆయన నేరుగా వచ్చి తన ముందు నిలుచున్నారు. వెంటనే ఆమె ఆయన పాదాల మీద పడి, పాదాలను గట్టిగా పట్టుకుని ఆనందంతో, భక్తిపారవశ్యంతో వెక్కి వెక్కి ఏడ్చింది. తరువాత లేచి తన రెండు చేతులు జోడించి బాబా ముందు నిలబడగా, బాబా తన చేతులు ఆమె తలమీద ఉంచి, "ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా?" అన్నారు. వెంటనే ఆమెకు మెలకువ వచ్చింది. ఆమె పట్టరాని తన్మయత్వపుస్థితిలో మునిగిపోయింది. అదే సమయానికి ఆశ్రమం నుండి తన సోదరి తిరిగి వచ్చి ఆమెతో, "నీవు ఆశ్రమానికి రాకపోవడం మంచిదైంది. అనారోగ్యం కారణంగా ఆ స్వామి ఈరోజు రాలేదు" అని చెప్పింది. అది విన్న చారుశీల నవ్వి, "నాకిప్పుడు అక్కడకి పోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఆయనే నా ఇంటికి వచ్చారు. నాకు దివ్య దర్శనం ఇచ్చారు" అని చెప్పి తన కల గురించి వివరించింది. అది విని తన సోదరి ఆమెను వదిలిపెట్టి వెళ్ళినందుకు క్షమాపణ చెప్పింది.

ఒకరోజు చారుశీలగారి పిల్లలు ఇంటి పైఅంతస్థులో ఉన్న బాల్కనీలో ఆడుకుంటూ ఒక వృద్ధుడు ఇంటి ప్రహరీ లోపలికి రావడం చూసారు. ఆయన చాలా వయసు పైబడినట్లుగా ఉండి, చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు. వెంటనే ఆమె కూతురు పరిగెత్తుకుంటూ క్రిందకు వెళ్ళి తీగపై బట్టలు ఆరేస్తున్న తన తల్లితో ఆ విషయం చెప్పింది. వెంటనే ఆమె ముందుద్వారం దగ్గరకు వెళ్లి తలుపు తీసింది. ఆ సమయానికి మిగతా పిల్లలంతా అక్కడ గుమిగూడారు. ఆ ముసలాయన ముందుద్వారానికి ఆనుకుని ప్రశాంతంగా కూర్చొని ఉండటం చూశారామె. సందిగ్ధస్థితిలో ఆమె, "మీరు సాయిబాబానా?" అని గొణిగారు. అందుకాయన నవ్వారు. 

అప్పటికి 12 సంవత్సరాల వయస్సున్న చారుశీలగారి పెద్దమ్మాయి ఇలా చెప్పింది: "మా అమ్మ, 'మీరు సాయిబాబానా?' అని అడిగినప్పుడు, నేను తదేకదృష్టితో ఆయనను చూసాను. ఆయన మేము పూజించే చిత్రపటంతో పూర్తిగా పోలివున్నారు. ఆయన తెల్లని కఫ్నీ ధరించి, తలకు గుడ్డ కట్టుకుని ఉన్నారు. ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే, ఆయన చేతిలో ఉన్న కర్ర. అప్పటికే చుట్టుప్రక్కల వాళ్లంతా అక్కడకు చేరారు. మా అమ్మ, "మీరు పాలు తాగాలని అనుకుంటున్నారా?" అని అడిగింది. అందుకాయన, "అవును" అన్నారు. అమ్మ లోపలికి వెళ్ళి చిక్కటి వేడి పాలు తీసుకొచ్చి ఆయన చేతికిచ్చారు. ఆయన వాటిని త్రాగారు. తరువాత ఆయన అమ్మను కొంచెం నూనె, దక్షిణ అడిగారు. అమ్మ ఒక సీసాతో కొంచెం నూనె, రూ.1-25 పైసలు దక్షిణ ఇచ్చారు. అప్పుడు బాబా వెళ్ళటానికి లేచి నిలబడ్డారు. నన్ను, మా చెల్లెల్ని దగ్గరకు రమ్మని తల ఊపుతూ సైగ చేసారు. ప్రేమతో తమ చేతులు మా తలలమీద పెట్టి ఆశీర్వదించారు. తరువాత నడుచుకుంటూ ఇంటి ప్రహరీ దాటి బయటికి వెళ్ళారు. మేము ఆయన్ని అనుసరిస్తూ ఆయన ఎక్కడికి వెళ్తున్నారా అని గమనించాము. ఆశ్చర్యం! కొంచెం దూరం వెళ్ళాక ఆయన అంతర్థానమయ్యారు".

ref : ప్రసాద్, వాల్యూం ౩౩, నెంబర్.9, ఆగష్టు 1979.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

సాయిభక్తుల అనుభవమాలిక 99వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత బాబా ప్రత్యక్షమయ్యారు
  2. బాబా గురించి తెలియని వ్యక్తి ఆయనకు భక్తునిగా మారిన వైనం

ఇప్పుడు మీరు చదవబోయే రెండు లీలలు సాయిభక్తుడు మనోహర్ తన పాదయాత్రలో భాగంగా అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు తాను తెలుసుకున్న సాయి లీలలు. 

సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత బాబా ప్రత్యక్షమయ్యారు:

ఒకసారి మనోహర్(పూర్తిపేరు పేర్కొనలేదు) జునాగఢ్ నుంచి శిరిడీకి పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాడు. అలా వెళ్తూ పోరుబందర్ పట్టణానికి కొంచెం ముందర మెయిన్ రోడ్డు నుండి కాస్త దూరంలో ఉన్న రామమందిరంలో బస చేశాడు. అక్కడ మధ్యయుగానికి చెందిన యోగి రామానంద్ గారి అనుచరుడైన రామానంది గారిని కలుసుకున్నాడు. అతనా గుడిలో పూజారి. అతడు ఆచారపూర్వకంగా పూజలు చేస్తూ మందిరాన్ని చూసుకుంటుండేవాడు. ఆ పూజారి మనోహర్‌ని, "మీ ఈ పవిత్రయాత్ర ఎక్కడివరకు?" అని అడిగాడు. అందుకు మనోహర్, "శిరిడీ వరకు పాదయాత్ర చేస్తున్నాను" అని చెప్పాడు. శిరిడీ అన్నమాట వినగానే పూజారి కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. పూజారి మనోహర్‌ని, "ఈ రాత్రి ఇక్కడే ఉండి, రేపు ఉదయం మీ యాత్రను కొనసాగించండ"ని అభ్యర్థించాడు. మనోహర్ సంతోషంగా అంగీకరించాడు. ఎందుకంటే, తను కూడా అక్కడ ఉండాలని అనుకున్నాడు. తరువాత పూజారి అతనికి భోజనం వడ్డించాడు. ఆ తరువాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పూజారి మనసులో శిరిడీ గురించి ఎన్నో ప్రశ్నలున్నాయి. అతను, "శిరిడీ మహారాష్ట్రలో ఎక్కడ ఉంది? ఇక్కడి నుంచి శిరిడీ ఎలా వెళ్ళాలి? అక్కడ నేను బస చెయ్యడానికి ఏదైనా ధర్మశాల ఉందా?" అని అడిగాడు. మనోహర్ అవసరమైన సమాచారమంతా అతనికి తెలియజేసాడు.

అప్పుడు పూజారి తన అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా చెప్పాడు: "కొన్ని రోజుల క్రితం ఒక ఫకీరు ఇక్కడకు వచ్చాడు. నేను అతనిని స్వాగతించి, "భోజనం చేయాలని అనుకుంటున్నారా?" అని అడిగాను. అందుకాయన తనకు భోజనం వద్దన్నారు. కానీ నేనిచ్చిన పాలు స్వీకరించారు. మేము కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఆయన మాట్లాడిన హిందీ అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆయన మాట్లాడిన దానిలో ఒక వాక్యాన్ని బట్టి 'ఆయనకు నా గురువు గురించి తెలుసు' అని నాకు అర్థమైంది. కొంతసేపటికి ఆయన వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. ఆయన్ని ఉండమని ప్రాధేయపడ్డాను. కానీ ఆయన నిరాకరించారు. అంతకు కొద్దిసేపు ముందు ఆయన నాకు ఒక పుస్తకం ఇచ్చి చదవమని చెప్పారు. ఆ పుస్తకమొక ఆధ్యాత్మిక గ్రంథం, అది ఒక కాషాయరంగు వస్త్రంలో చుట్టివుంది. నేను ఆ పుస్తకాన్ని తీసుకుని, తెరవకుండా ప్రక్కన పెట్టాను. తరువాత ఆయన వెళ్తుంటే నేను ద్వారం వద్ద నిలుచుని గమనిస్తూ ఉన్నాను. ఆయన మూడడుగులు వేసిన తరువాత అంతర్థానమయ్యారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వెనక్కి తిరిగి అతనిచ్చిన పుస్తకం తెరిచి చూసాను. ఆ పుస్తకం 'సాయి సచ్చరిత్ర'. నేను ఆ పుస్తకం తెరిచి అందులో ఉన్న ఫోటోను చూసి నిశ్చేష్టుడనయ్యాను. కాసేపటిక్రితం నా ముందు కూర్చుని వున్న ఫకీరు వేరెవరో కాదు, స్వయంగా ఆ సాయిబాబానే! ఆ గ్రంథం మరాఠీలో ఉండటం వల్ల నేను దానిని అర్థం చేసుకోలేకపోయాను. చాలామందికి ఆ ఫోటోను చూపించి వివరాలు అడిగాను. ఒకతను మాత్రం, "బాబా మహారాష్ట్రలో జీవించిన ఒక గొప్ప సత్పురుషులు, 1918లో ఆయన సమాధి చెందారు" అని చెప్పాడు. అది విన్న నేను నిర్ఘాంతపోయాను. సమాధి చెందిన చాలా సంవత్సరాల తరువాత బాబా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇక్కడ కూర్చుని నాతో మాట్లాడారు. నేను ఉత్తరప్రదేశ్‌కి చెందినవాడిని, ఆయన మహారాష్ట్రకు చెందినవారు. అయినప్పటికీ ఆయనకు నా గురువు గురించి తెలుసు. ఆయన అంతర్థానమవడం నేను నా కళ్ళతో చూసాను. ఇవన్నీ నన్ను అబ్బురపరచాయి. నేను ఒక్కసారైనా శిరిడీ దర్శించాలని అనుకున్నాను".

బాబా గురించి తెలియని వ్యక్తి ఆయనకు భక్తునిగా మారిన వైనం:

ఇంకోసారి మనోహర్ పాదయాత్రలో భాగంగా ఋషీకేశ్ తీర్థయాత్రకు వెళ్లాడు. అప్పుడు శంకరాచార్యనగర్ వద్ద స్వర్గ ఆశ్రమముగా పిలవబడే మహేష్ యోగి ఆశ్రమంలో బసచేసాడు. ఈ ఆశ్రమం గంగానది తీరాన ఉంది. అక్కడ మనోహర్ కొన్నిరోజులు ఉండాలని అనుకున్నాడు. ఆ ఆశ్రమ సంరక్షకునిగా ఉన్న రమణేష్ గద్వాల్ ప్రాంతానికి చెందిన బ్రహ్మచారి. అతడు మనోహర్‌ని స్వాగతించి బస చేయటానికి గది ఇచ్చాడు. గదిలోకి వెళ్తూనే మనోహర్‌ని ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే, అక్కడ గోడకు బాబా చిత్రపటం తగలించబడి ఉంది. దాని గురించి రమణేష్‌ను విచారించాడు మనోహర్. ఆ చిత్రపటానికి సంబంధించిన కథనం ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రకు చెందిన ఒక బ్రహ్మచారి ఆ ఆశ్రమంలో కొన్ని రోజుల పాటు బస చేసాడు. ఆ బ్రహ్మచారి అక్కడనుండి వెళ్లిపోయే సమయంలో ఆ చిత్రపటాన్ని రమణేష్‌కు ఇచ్చాడు. ఆ సమయంలో రమణేష్‌కు బాబా గురించి ఏమీ తెలియనప్పటికీ ఆ చిత్రపటాన్ని ఆనందంగా స్వీకరించి, గది అందాన్ని పెంచుతుందన్న ఆలోచనతో అతడా చిత్రపటాన్ని గోడకు తగిలించాడు.

తరువాత ఒకసారి రమణేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడు ప్రయత్నించిన వైద్యాలన్నీ నిష్ఫలమయ్యాయి. త్వరలోనే అతను పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. నిరాశా నిస్పృహలతో మంచంమీద పడుకుని వున్న సమయంలో అతని దృష్టి బాబా చిత్రపటం వైపు మళ్ళింది. అతను తన మనసులో, "నేను ఈ అనారోగ్యం నుండి త్వరగా కోలుకున్నట్లైతే మిమ్మల్ని పూజించడం మొదలుపెడతాను" అని అనుకున్నాడు. తానే ఆశ్చర్యపోయే విధంగా ఆరోజు సాయంత్రానికే తాను కోలుకుంటున్న అనుభూతి మొదలైంది. త్వరలోనే కోల్పోయిన బరువును తిరిగి సంతరించుకొని ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పటినుండి తనకు తోచిన విధంగా బాబా చిత్రపటాన్ని పూజించడం మొదలుపెట్టాడు.

మరో అనుభవాన్ని  కూడా రమణేష్ జ్ఞప్తికి తెచ్చుకుని ఇలా చెప్పాడు: "నేను చాలా రోజుల నుండి యోగా చేస్తున్నాను. ఒకసారి నేను ఒక క్లిష్టమైన ఆసనం వెయ్యడానికి చాలా ప్రయత్నించాను కానీ, నేనందులో విఫలమయ్యాను. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా సాధించలేకపోయాను. అందువలన ఇక దానిగురించి మర్చిపోదామని అనుకున్నాను. చాలాకాలం తరువాత మళ్ళీ ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు సహాయం కోసం బాబా వైపు తిరిగి, "మీరు నిజంగా సత్పురుషులైతే, మొదట మీ నామం చెప్పి ఆసనం ప్రయత్నిస్తాను. నేను గనుక విజయం సాధించగలిగితే, మీరు సద్గురువని ఖచ్చితంగా నమ్ముతాను" అని చెప్పుకున్నాను. తరువాత మరోసారి ఆసనం వేసే ప్రయత్నం చేశాను. ఆశ్చర్యం! ఎటువంటి ప్రయాస లేకుండా ఆసనం వేయగలిగాను. దాదాపు ఒక గురువు మార్గదర్శనంలో చేయగలిగినట్లు పరిపూర్ణంగా చేయగలిగాను". 

అలా రమణేష్ హృదయంలో బాబాపట్ల భక్తివిశ్వాసాలు  లోతుగా నాటుకున్నాయి. అతడు ఆశ్రమంలోని మిగతా బ్రహ్మచారులందరికీ తన అనుభవాలు చెప్పడంతో అందరూ బాబాను ఆచారపూర్వకంగా పూజించడం మొదలుపెట్టారు. తరువాత నెమ్మదిగా అతను బాబా ఆరతులు నేర్చుకుని, ప్రతిరోజూ బాబాకి ఆరతులు కూడా ఇస్తున్నాడు. ఆయనకి మరాఠీ రాకపోయినా ప్రతిరోజూ శ్రీసాయిసచ్చరిత్ర ఒక అధ్యాయము చదువుతుండేవాడు. 1979లో శిరిడీ తీర్థయాత్రకు వెళ్ళాడు.

Ref: ప్రసాద్, వాల్యూం ౩౩, నెంబర్.9, ఆగష్టు 1979.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri.

సాయిభక్తుల అనుభవమాలిక 91వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • బాబా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాల కొరత ఉండదు

బాబా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాల కొరత ఉండదు

నాగపూర్ నివాసి డి.బొంబొరికర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. పైగా అతనిది పదిమంది సభ్యులు గల పెద్ద కుటుంబం. వాళ్లందరికీ ఆహారాన్ని అందించడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం అతనికి కష్టతరంగా ఉండేది. అలాంటి నిస్సహాయస్థితిలో ఆకలితో అలమటించే రోజులు ఎదుర్కోవలసి వస్తుందేమోనని అతను దిగులుపడుతుండేవాడు.

1957వ సంవత్సరం నుంచి బొంబొరికర్ చాలా శ్రద్ధగా బాబాను పూజించడం మొదలుపెట్టాడు. రోజువారీ పూజతోపాటు ప్రతి గురువారం కొండాభువన్ బాబా మందిరంలో భక్తిపాటలు పాడటంతోపాటు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతనికెంత శ్రద్ధంటే, ఒక్క గురువారం కూడా బాబా మందిరానికి వెళ్ళడం అతను తప్పలేదు. అతడు ధబోల్కర్ రచించిన శ్రీసాయిసచ్చరిత్రను శ్రద్ధగా తన స్వహస్తాలతో వ్రాయడం మొదలుపెట్టాడు. దానిని 1964, డిసెంబర్ నెలలో ఒక గురువారంనాడు పూర్తి చేశాడు. ఇక అతను కోరుకునేదల్లా ఒక్కటే, ఆ సచ్చరిత్రను రానున్న గురువారంనాడు బాబా పాదాలకు సమర్పించడం. ఆరోజు రాత్రి శేజారతి, భజన ముగించుకుని సుమారు అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోవడానికి మంచంమీద మేను వాల్చాడు. ఆ సమయంలో ఎంతో నిరాశగా, "బాబా! దృఢమైన భక్తి, శ్రద్ధలతో నా సేవలను ఇన్ని సంవత్సరాలుగా మీకు సమర్పించుకుంటూ వస్తున్నాను. నా జీవితాన్నంతా మీ పాదాలకు సమర్పించుకున్నాను. ఇదంతా మీకు తెలియనిదా? ఇప్పుడు మీరు మమ్మల్ని ఆకలితో అలమటింపజేయదలుచుకున్నారా? "నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు కొరత ఉండదు" అని మీరు వాగ్దానం చేయలేదా? నా భారమంతా మీ మీద వేసాను. కాబట్టి మీరు నాకు ఏమన్నా ఉపశమనం ఇవ్వబోతున్నారా? "ఎవరైతే భక్తి, ప్రేమలతో నా చరిత్రను పఠిస్తూ, గానం చేస్తుంటారో వారి ప్రక్కనే నేను నిలిచి ఉంటాను" అని మీరు వాగ్దానం చేశారు కదా! నేను నా స్వహస్తాలతో మీ చరిత్రంతా వ్రాసాను. అందుకు నాకు రమారమి మూడునెలల సమయం పట్టింది. దాన్ని మీరు పరిగణించలేదు. 'ఏ భక్తుడైనా మీకు శరణు పొందితే, వాళ్ళ అవసరాలు తీర్చడంలో మీరెన్నడూ విఫలం కాలేద'ని నేను విన్నాను. మరి నా విషయంలో మీరెందుకు వెన్ను చూపుతున్నారు? మీ వాగ్దానాలన్నీ ఉట్టిమాటలా? అవన్నీ అబద్ధాలా? మీరు అసత్యవాదా? మీరు అసత్యవాది కాదని నాకు ఏదైనా ఒక సాక్ష్యం లేదా అనుభవం కావాలి. వచ్చే గురువారం మీ మందిరానికి వెళ్తాను, నేను వ్రాసిన చరిత్రను మీ పాదాలకు సమర్పిస్తాను. ఆ తరువాత మీ మహిమలు కీర్తిస్తాను. ఆ సమయంలో నాకు మీనుండి ఋజువు కావాలి, అది నాకు స్పష్టంగా తెలియాలి. అలా జరగని పక్షంలో నేను 'నువ్వు అసత్యవాదివని, గారడీలవాడివని, అమాయక భక్తులను మోసం చేస్తున్నావ'ని నిశ్చయించుకుంటాను. అప్పుడు నేను మీ చిత్రపటాన్ని వార్ధా నదిలో పడేసి, మిమ్మల్ని పూజించడం మానేస్తాను" అని తన మనస్సులోని భారాన్నంతా  దించుకుని నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి గురువారంనాడు బొంబొరికర్ బాబా మందిరానికి వెళ్లేముందు ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. అక్కడినుండి తన స్నేహితుని కుటుంబంతో కలిసి అతడు కూడా మందిరానికి చేరుకున్నాడు. ముందుగా అతడు బాబాను పూజించి, తాను వ్రాసిన చరిత్రను బాబా పాదాల దగ్గర ఉంచి ఆయనకు నైవేద్యం సమర్పించాడు. సుమారు 60 నుంచి 70 మంది భక్తులు అక్కడ చేరారు. అయితే ఆరోజు అంతమంది ఉన్నా భక్తిగీతాలు పాడటానికి అతడొక్కడే సిద్ధంగా ఉన్నాడు. అప్పుడతడు తన మనస్సులో, "నేను వృత్తిపరంగా గాయకుడిని కాను, నాది గొప్ప గొంతు కూడా కాదు. అయితే నాకున్నది బాబా పట్ల భక్తి, ప్రేమలు మాత్రమే" అని అనుకున్నాడు. ఆరోజు పాటకు తాళం వేసే వ్యక్తి కూడా రాలేదు. అతడు వాద్యబృందంతో, "నేను శాయశక్తులా బాగా పాడటానికి ప్రయత్నిస్తాను. మీకు నచ్చిన విధంగా వీలైనంతవరకు నన్ను అనుసరించండి" అని చెప్పాడు. సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో భక్తిగీతాలాపన మొదలై, చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బొంబొరికర్ కాళ్ళు వణుకుతున్నాయి. అతని మనస్సు ఏం జరుగుతుందోనని వ్యాకులపడుతూ ఉంది. 'బాబా తనకేదైనా ఋజువు ఇస్తారా, లేదా?' అని ఒకటే చింత. అతడు ఒకటి తరువాత ఒకటి హృదయపూర్వకంగా పాటలు పాడాడు. సమయం పరుగులు పెడుతూ రాత్రి 10 గంటలైంది. అయినా తనడిగిన ఋజువుకు సంబంధించిన ఎటువంటి సూచనా లేదు! ఇక అతనిలో నిరాశ అలుముకోగా హృదయవేదనతో, "నా దగ్గర ధనవంతుడైన కుబేరుడున్నప్పుడు, నా ఇంటిని నేను నాశనం చేసుకున్నాను. నేను పేదరికాన్ని కౌగిలించుకున్నప్పుడు నీ ద్వారం వద్దకు భిక్షకు వచ్చాను. నీ ధనాగారం దైవత్వంతో నిండి ఉంది, నాకు కొన్ని ముక్కలు ఇవ్వు, ఒట్టి చేతులతో నీ దర్బారును వదిలివెళ్ళడం నాకు వేదన కలిగిస్తుంది" అనే భావం వచ్చేలా ఒక పాట పాడాడు.

పాట ముగిసే సమయంలో అక్కడి పూజారి ఆరతి కోసం అందరినీ ఒక్కచోట చేరమన్నాడు.  బొంబొరికర్ బాబా విగ్రహం వైపు చూస్తూ, "రేపు నేను ఖచ్చితంగా నా మాటను నిలబెట్టుకుంటాను. నిన్ను వార్ధా నీటిలో ముంచేస్తాను" అని అనుకున్నాడు. తరువాత భక్తులందరితో కలిసి ఆరతిలో పాల్గొన్నాడు. ఆరతి కొనసాగుతుండగా బాబా తమ అనుగ్రహాన్ని అతనిపై కురిపించారు. ఆ అనుభవాన్ని బొంబొరికర్ ఇలా చెప్తున్నాడు: "తరువాత జరిగిన దానికి నేను దాసోహమైపోయాను. నేను చూస్తుండగానే బాబా విగ్రహం అతి పెద్దగా మారిపోయింది. పరమానందభరితంగా నవ్వడం మొదలుపెట్టింది. తరువాత వేదిక మీద నుంచి క్రిందకు దిగి మందిరమంతా తిరగసాగింది. నా కళ్ళు పెద్దగా చేసుకుని ఆనందపారవశ్యంతో విగ్రహాన్ని చూస్తూ ఉండిపోయాను. నా కళ్ళనిండా ఆనందభాష్పాలు నిండిపోయాయి. నేను పూర్తి జాగరూకతలోనే ఉన్నానని నాకు తెలుస్తోంది. కానీ 'ఏం జరుగుతుంది ఇక్కడ?' అని అనిపించింది. మరుక్షణంలో దృశ్యమంతా మారిపోయింది. నేను పరిమళాలు వెదజల్లే పూలు, చెట్లు ఉన్న అందమైన తోటలో ఉన్నట్లు గమనించాను. ఒక పెద్ద చెట్టుకి ఊయల కట్టబడి ఉంది. ఆ ఊయలపై మానవరూపంలో బాబా కూర్చుని ఉన్నారు. ఆయన ముఖం ఆనందపారవశ్యంతో వెలిగిపోతోంది. ఆయన వేగంగా ముందుకి వెనక్కి ఉయ్యాల ఊగుతున్నారు. అలా ఆయన ఊగుతూ తనవద్ద ఉన్న పూలు నా మీద విసరి, "ఇదిగో, ఇవి తీసుకో! నిజానికి నీవు నిజాయితీపరుడివి. మిగతా జీవితమంతా ఇలానే ఉండు" అని అన్నారు. ఆ దృశ్యమంతా మూడు నిమిషాలపాటు కొనసాగింది. కానీ బాబా ఇచ్చిన అనుభవం మర్చిపోలేనిది". ఈ అనుభవం తరువాత అతని ఆర్థిక పరిస్థితి నిదానంగా మెరుగుపడడం మొదలయ్యింది.

బొంబొరికర్ ఇలా చెప్పారు: "నేను ఇంతవరకు శిరిడీ దర్శించలేదు. అయినా దయగల శిరిడీ దైవం నేను ఆయన పాటలు పాడినప్పుడు ఇక్కడే ఉంటారు. ఒకానొక సమయంలో నాతోపాటు నా కుటుంబమంతా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. కానీ నిదానంగా నా పరిస్థితి మెరుగుపడసాగింది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, "అన్నవస్త్రాలకు బాబా భక్తుని ఇంటిలో కొరత ఉండదు. బాబా తన వాగ్దానాలని నిలబెట్టుకుంటారు".

Ref : ప్రసాద్, వాల్యూం ౩౩, నెంబర్.9, ఆగష్టు 1979.
source: Baba’s Divine Manifestations, Compiled by Vinny Chitluri.

డాక్టర్ ఇనామ్‌దార్ ఆధ్యాత్మిక వికాసం


సత్పురుషుని యొక్క అనుగ్రహం పొందడం అంత తేలిక కాదని తరచూ చెప్తూ ఉంటారు. బజారుకు వెళ్లి, కిరాణకొట్టులో తీసుకుని వచ్చేదికాదు సత్పురుషుల అనుగ్రహం. భక్తి, విశ్వాసాలు కలిగి ఉంటే సమయం వచ్చినప్పుడు సత్పురుషులే తమ అనుగ్రహాన్ని భక్తుని మీద కురిపిస్తారు.

డా.ఇనామ్‌దార్ దైవానుగ్రహం పొందిన వ్యక్తి. చిన్నవయసులోనే వైరాగ్యాన్ని సాధించడమే కాకుండా బాబా అనుగ్రహాన్ని పొందాడు. దురదృష్టవశాత్తు అతని పూర్తి పేరు, ఊరు తెలియలేదు. ఆయన వృత్తాంతాన్ని గిర్‌గాఁవ్‌కి చెందిన రజని బార్కే అనే భక్తుడు ఇలా వివరించారు:
   
డా.ఇనామ్‌దార్ బాబా దైవత్వము గురించి, ఘనకీర్తి గురించి వినడమే కాకుండా చదివాడు కూడా. అందువలన, "అంతటి గొప్ప సత్పురుషుని పాదాలకు శరణు వేడాలి. ఆయన అనుగ్రహిస్తే నా ఈ మానవజన్మ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి నేను వెంటనే శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలి" అని అతను అనుకున్నాడు. వెంటనే, 'ఏదో ఒకనాడు బాబా కరుణతో తనపై దృష్టి సారించి, ఉపదేశించి, ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడతార'నే తలంపుతో శిరిడీ వెళ్ళాడు. శిరిడీలో వారంరోజులు ఉన్నాడు. అంతలో అతని చంచల మనస్సు, "ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి? బాబా నాకు మార్గదర్శనం చేయడం లేదు. అనవసరంగా నేనిక్కడ నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. నా మనస్సు యొక్క చంచలత్వాన్ని అణిచివేసి, నాకు సరియైన మార్గం చూపే వేరొక సత్పురుషుణ్ణి చూసుకోవాలి" అని కలవరపడసాగింది.

మరుసటిరోజే డాక్టర్ బాబా అనుమతి తీసుకుని సతమ్ మహారాజ్‌ను కలవాలన్న ఆశతో ధానోలికి ప్రయాణమయ్యాడు. సతమ్ మహరాజ్ తన మనసుకు శాంతి ప్రసాదించి, ఉపదేశిస్తారని చాలా ఉత్సుకతతో ధానోలి చేరుకుని, సతమ్ మహరాజ్ ఎక్కడ ఉంటారో, ఆయనని ఎప్పుడు కలవాలో విచారించాడు. కానీ ఆ విషయంలో ఎవరూ అతనికి సహాయం చేయలేకపోయారు. ఎందుకంటే, సతమ్ మహరాజ్ ఒకేచోట ఎక్కువ కాలం ఉండటం చాలా అరుదు. డాక్టర్ ధానొలీలో రెండురోజులు ఉన్న తరువాత మళ్ళీ అతని చంచల మనస్సు కలవరపెట్టసాగింది. అతను ఒక ఎత్తైన కొండపైకి వెళ్లి కూర్చుని, "ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ నా సమయాన్ని వృధా చేసుకోవాలి?" అని ఆలోచనలోపడ్డాడు. మరుక్షణం సతమ్ మహరాజ్ అతని ముందు ప్రత్యక్షమై, "నీకు ఏ ఒక్క సత్పురుషుని మీదా  దృఢమైన విశ్వాసం కలగలేదు. మరలాంటప్పుడు ఏ సత్పురుషుడైనా నీ పట్ల ఎలా ప్రసన్నులవుతారు? నీ చంచల మనస్సు పలువిధాలుగా పరుగులు తీస్తోంది. మరి ఆయన ఎలా నీకు ఆశ్రయమిస్తారు? నీ భక్తిలో సంపూర్ణ శరణాగతి లేదు. ముందు నీ మనస్సులో భక్తి నింపుకొని సర్వేంద్రియాలను ఒక్క సత్పురుషుని మీద కేంద్రీకరించు. అప్పుడు ఖచ్చితంగా నీ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకుంటావు" అన్న భావంతో ఉన్న ఒక అభంగాన్ని నిదానంగా గానం చేశారు. తరువాత సతమ్ మహరాజ్ డాక్టరును ఆశీర్వదించి, "తక్షణమే శిరిడీకి తిరిగి వెళ్ళమ"ని చెప్పారు.

తరువాత డాక్టర్ శిరిడీ చేరుకుని మసీదుకు వెళ్ళాడు. అతనిని చూస్తూనే బాబా నవ్వి, "భగవంతుడు పేరు వున్న ప్రతి ఒక్కదానిలో ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి" అన్నారు. ఆ మాట వింటూనే అతను, "సత్పురుషులిద్దరూ ఒకే అంతర్‌దృష్టి కలిగి ఉన్నారు. ఇద్దరూ చెప్పే మాట ఒక్కటే!" అని ఆశ్చర్యపోయాడు. అదే డాక్టర్ జీవితంలో పెద్ద మలుపు. ఆ క్షణం నుండి డాక్టర్ బాబాకు అంకిత భక్తుడయ్యాడు. క్రమంగా అతని విశ్వాసం దృఢమవుతూ బాబా యందే అతని మనస్సు కేంద్రీకృతమయ్యింది. అతని విశ్వాసం బలపడేకొద్దీ ఇతర విషయాల పట్ల పూర్తి నిర్లిప్తత ఏర్పడి అంతరాంతరాలలో బాబాపట్ల భక్తి నిండిపోయింది. అలా బాబా అతన్ని అనుగ్రహించారు. బాబా ఆజ్ఞతో అతను తన మొత్తం జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకున్నాడు. సౌరాష్ట్ర ప్రాంతమంతా బాబా మహిమను గానం చేస్తూ తిరిగాడు. చివరికి పోరుబందరును అతని స్వస్థానముగా చేసుకుని సౌరాష్ట్రలో 'గోంగ్డీవాలే బాబా'(the sadhu with a sheep’s blanket)గా ప్రసిద్ధిగాంచాడు.


సోర్స్: Baba's Divine Manifestations by విన్నీ చిట్లూరి.

సాయిభక్తుడు తమ్మాజీ


తమ్మాజీ శిరిడీ నివాసి. యుక్తవయస్సులో ఉన్నప్పుడు కుస్తీలో ఖ్యాతిగాంచాలన్నది అతని ఆశయంగా ఉండేది. కానీ అతని తల్లిదండ్రులు ఆర్థికంగా పేదవారైనందున పాలు వంటి పౌష్ఠికాహారం అతనికి అందించలేకపోయేవారు. అటువంటి ఆహారం కఠినమైన శ్రమతో కూడుకున్న కుస్తీ పోటీలకు చాలా అవసరం. ఏది ఏమైనా తన లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్న అతడు, "ఎంతోమంది భక్తులకు బాబా చాలా డబ్బులు ఇస్తారు. నేను కూడా ఆయన దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడుగుతాను" అని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే బాబా దగ్గరకు వెళ్లి, గొప్ప మల్లయోధుడు కావాలన్న తన కోరికను చెప్పాడు. బాబా ఓపికగా అతను చెప్పినదంతా విని, "యోగుల, సాధువుల ధనం మీద ఆధారపడటం మంచిది కాదు. నీకు కొంత పొలం ఉంది కదా, పోయి దానిని జాగ్రత్తగా దున్ను. నీ పొలంలో కుండనిండా ఇత్తడి నాణాలున్నాయి" అన్నారు. బాబా మాటలను ప్రమాణంగా తీసుకుని, మర్నాడే తమ్మాజీ తన పొలాన్ని చాలా శ్రద్ధగా దున్నడం మొదలుపెట్టాడు. బాబా ఆశీస్సులతో తాను ఖచ్చితంగా చేస్తున్న పనిలో విజయం సాధిస్తానని తనకి తెలుసు. అందువలన మల్లయోధుడు కావాలన్న తన ఆలోచనను వదిలిపెట్టాడు. అయితే చెప్పినంత తేలిక కాదు చేయడం.

తనకు చాలా కొంచెం పొలం మాత్రమే మిగిలివుందని తమ్మాజీ గ్రహించాడు. ఋణదాతలు చాలావరకు తమ స్థలాన్ని జప్తు చేసుకున్నారు. ఆనాటి ప్రజలు చాలామంది బ్రిటిష్ పరిపాలన అందరికీ న్యాయపరమైనదని అనుకునేవారు. అయితే ఋణదాతలు రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకుని ఎక్కువ భూమికి సంతకాలు చేయించుకునేవారు. ఆవిధంగా వాళ్ళు విస్తారంగా భూములను ఆక్రమించుకునేవారు. అందువలన చాలీచాలని డబ్బులకోసం రైతులు తమ సొంత భూములలోనే పనిచేయాల్సి వచ్చేది. ఇదంతా గమనించిన తమ్మాజీ, రైతులు తెల్లవారింది మొదలు చీకటి పడేవరకు పనిచేసినా చాలా దయనీయమైన, పేదరికంలో మగ్గిపోతున్నారని అర్థం చేసుకుని తనకున్న తక్కువ పొలంలోనే మనస్ఫూర్తిగా శ్రద్ధపెట్టి పని చేసి మంచి దిగుబడి సాధించాడు. తరువాత ఋణదాతల వద్దనుండి మరికొంత భూమిని బాడుగకు తీసుకున్నాడు. ఆ పొలంలో తనతోపాటు తన కుటుంబమంతా రాత్రనక, పగలనక కష్టపడి పనిచేశారు. బాబా దయవలన గోదావరి నీళ్లు కాలువల ద్వారా శిరిడీ పొలిమేరల వరకు రావడంతో రైతులకు చాలా మేలు జరిగింది. దాని ఫలితంగా విస్తారమైన దిగుబడి వచ్చింది. అలా తమ్మాజీ పొలాలు బాగా అభివృద్ధి చెందాయి. దానితో అతితక్కువ కాలంలోనే ఇంకా ఎన్నో పొలాలు కొనుగోలు చేశాడు. అలా ఇంచుమించు 150 ఎకరాల భూమిని సంపాదించాడు. అతని కుటుంబం బాగా వృద్ధిచెంది ఐశ్వర్యవంతులైనారు.

"ఒకవేళ నేను ఆయన మాట లక్ష్యపెట్టకుండా ఉండివుంటే నాకు, నా కుటుంబానికి ఏమి జరిగి ఉండేదో నిజంగా నాకు తెలియదు. ఇదంతా బాబా ఆశీర్వాదాల వలనే సాధ్యమైంది. సరియైన మార్గం చూపినందుకు నేనెప్పుడూ ఆయనకు కృతజ్ఞుడనై ఉంటాను" అని అంటాడు తమ్మాజీ.

Ref: శిరిడీ చే మహాన్ సంత్ సాయిబాబా(రచన: పాండురంగ బాలాజీ కావడే).
సోర్స్: Baba's Divine Manifestations by విన్నీ చిట్లూరి.

భక్తితో పాటు ధైర్యం, పట్టుదల గల శ్రీమతి ప్రధాన్ పై బాబా అనుగ్రహం


భక్తితో పాటు, శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలన్న ధైర్యం, పట్టుదల గల ఒక మహిళ కథ ఇది. ఆమె కథను థానాలో నివసిస్తున్న భక్తురాలు శ్రీమతి మంగళ ప్రధాన్ వివరిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ మహిళ మొదటి పేరు, ఆమె శిరిడీ వెళ్ళిన సంవత్సరం కూడా పేర్కొనలేదు. ఆ సాహసోపేతమైన స్త్రీ, మంగళ గారి భర్తకు నాయనమ్మ. ఆమెను శ్రీమతి ప్రధాన్ గా ప్రస్తావించారు.

రాయగఢ్ జిల్లాలోని పీణ్ అనే ఊరి సమీపంలో గల సవర్సాయి అనే గ్రామంలో శ్రీమతి ప్రధాన్ నివసించేవారు. బాబా దర్శనం చేసుకోవాలన్న ఆతృత కలిగివున్న ఆమె తన భర్తను శిరిడీ వెళ్ళడానికి అనుమతి ఇమ్మని అభ్యర్థిస్తూ ఉండేది. అందుకతను నిరాకరిస్తూ, "నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నీవు ఎలా వెళ్లగలవు?" అని అన్నాడు. అంతేకాకుండా కుటుంబమంతా ఆమెకు ఎదురు తిరిగి శిరిడీ వెళ్ళడానికి నిరాకరించారు. 

ఈ విషయమై శ్రీమతి మంగళ మామగారు(శ్రీమతి ప్రధాన్ కొడుకు) ఇలా తెలియజేసారు: "మా అమ్మ చాలా మొండిది. ఒకసారి శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకున్నాక ఏవీ తనని ఆపలేకపోయాయి. కొన్నిరోజులపాటు అణిగి మౌనంగా ఉన్నా, తన మనస్సులో మాత్రం రహస్యంగా ఒక ప్రణాళిక వేసుకుంది. ఆమెకు శిరిడీ ఎక్కడ ఉందో తెలీదు, అక్కడికి వెళ్లడానికి ఎంత ఖర్చు అవుతుందన్నది కూడా తెలియదు. కాబట్టి పెద్ద మొత్తమే అవసరమవుతుందని ఆమె అనుకుంది. అందుకోసం తన తల్లిదండ్రులు తనకి కానుకగా ఇచ్చిన నగలన్నీ కుదువ(తాకట్టు) పెట్టింది. తరువాత తెలివిగా కొంత సమాచారం సేకరించి, శిరిడీ అహ్మద్‌నగర్ సమీపంలో ఉందని తెలుసుకుంది. అంతవరకే ఆమెకు తెలుసు. కానీ ఒక భక్తురాలు భగవంతుని చూడాలని గాఢంగా కాంక్షిస్తే, అన్నీ వాటంతటవే సమకూరుతాయి. అప్పటి నా వయస్సు 13 సంవత్సరాలు. ఆమె నన్ను వెంట తీసుకుని, బాగా శ్రమతో కూడుకున్న, సుదీర్ఘమైన దుర్భర ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ముందుగా ఎడ్లబండిలో సవర్సాయి నుండి 100 మైళ్ళ దూరంలో ఉన్న ఖోపోలి కర్జత్ వరకు ప్రయాణించాము. కర్జత్ నుంచి రైలులో ప్రయాణం సాగించి ఎలాగో మొత్తానికి ఏ ఇబ్బందీ లేకుండా శిరిడీ చేరుకున్నాము. అయితే ప్రయాణంలో ఆమె మనస్సంతా, "శిరిడీలో కలరా వంటి అంటువ్యాధులు తరచూ వస్తుంటాయని విన్నాను. ఇప్పుడు నా కొడుకుకు కలరా వస్తే నేను ఏం చెయ్యాలి?" అన్న అనుమానంతో ఉంది. ఏదేమైనా శిరిడీ చేరాక, బాబా దర్శనం చేసుకుని నమస్కరించుకుందామని ద్వారకామాయికి వెళ్ళాము. మా అమ్మ ద్వారకామాయి మెట్లు ఎక్కిన వెంటనే బాబా, "నిన్ను ఎవరన్నా అడిగారా ఇక్కడకు రమ్మని? నీ నగలు కుదువపెట్టి ఇక్కడికెందుకు వచ్చావు? నీ భర్త నిరాకరించినా కూడా ఎందుకు వచ్చావు? నేనేమైనా నిన్ను ఇక్కడకు రమ్మన్నానా?" అని అరవడం మొదలుపెట్టారు. ఆ క్షణమే మా అమ్మ 'బాబా సర్వవ్యాపి' అని గుర్తించారు. ఆయనకు మా  ఇంట్లో జరిగిన ప్రతీ విషయం తెలుసు. ఆనందం పొంగిపొర్లగా ఆమె, "బాబా! నేను మీకు ఏ సేవ చేయగలను?" అని అడిగింది. అప్పుడు బాబా, "నీ కొడుకుకు కలరా సోకిందా? సరే, అలా ఉండనీ. అరే మాయీ(అమ్మా)! నీ ముందు ఉన్న ద్వారం ప్రక్కన అందమైన మారేడు చెట్టు ఉంది. నాకు దాని ఆకులు(బిల్వ పత్రాలు) సమర్పించు" అన్నారు. తరువాత బాబా మమ్మల్ని ఆశీర్వదించి, పిడికిలినిండా ఊదీ ఇచ్చారు. బాబా తమ స్వహస్తాలతో తమ చిత్రపటాన్ని కూడా మాకు ఇచ్చారు.

శిరిడీ యాత్ర తరువాత మా అమ్మ జీవితం మొత్తం మారిపోయింది. ఆమె తన తుదిశ్వాస వరకు మర్చిపోకుండా ప్రతిరోజూ బాబా చిత్రపటానికి ఆ చెట్టు ఆకులు సమర్పిస్తూ, తన సమయమంతా అవసరంలో ఉన్నవాళ్లకు సేవ చేసేవారు. అమ్మ తెలివిగా ఎక్కువగా కాకుండా మితంగా బాబా ఊదీని జబ్బులతో బాధపడుతున్నవాళ్లకు, ప్రసవం కష్టంగా ఉన్న తల్లులకు ఇస్తుండేవారు. దానితో వాళ్ళ సమస్యలు తీరిపోయేవి. తొందరలోనే ఆమె గ్రామస్థులందరికీ ఇష్టమైన పిన్ని(కాకు)గా మారింది. బాబా ఆమెకు ప్రసాదించిన ఇంకొక వరం ఏమిటంటే, ఉపాయం చెప్పడం(knack of predicting నేర్పుతో అంచనా వేయడం). గ్రామస్తులు ఆమె దగ్గరకు వచ్చి తప్పిపోయిన ఆవులు, దూడలు గురించి అడిగేవారు. అప్పుడు కాకు బాబాను ప్రార్థించి, అవి ఎక్కడ దొరుకుతాయో ఖచ్చితంగా చెప్పేవారు. ఆమె రైతులకు, గొర్రెల కాపరులకు, దళితులకు ఏదో ఒకరకంగా సహాయం చేసేవారు. ఆమె చనిపోయే చివరిరోజు వరకు కూడా ఎన్నడూ బాబా ఆమెకు ప్రసాదించిన చిత్రపటాన్ని పూజించకుండా ఉండలేదు. అది ఇప్పటికీ మాతోనే ఉంది." 

చివరిగా శ్రీమతి మంగళ ఇలా చెప్తున్నారు: "ఈ అద్భుత లీలలు విన్న తరువాత, నేను కూడా ఆ చెట్టు ఆకులు బాబాకు సమర్పించటం మొదలుపెట్టాను. నేను గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, బాబా తమ స్వహస్తాలతో ఆమెకిచ్చిన చిత్రపటం ఇప్పటికీ మా వద్దనే ఉంది, దాన్ని మేము పూజిస్తున్నాము".

Ref: సాయిప్రసాద్ దీపావళి సంచిక, 1999.
సోర్స్: Baba’s Divine Manifestations by విన్నీ చిట్లూరి.

సాధువులను గౌరవించాలని భక్తులకు తెలియజేసిన బాబా లీల


బప్కర్ మహరాజ్ ఒక బైరాగి సాధువు. ఆయనొకసారి ముంబాయికి వచ్చారు. ఆయన భక్తుడైన నానాసాహెబ్ పిట్కర్ ఆయనను కలిసి, తన ఇంట్లో కొన్నిరోజులు ఉండమని అభ్యర్ధించాడు. అయితే బప్కర్ మహరాజ్ శిరిడీ సందర్శించాలన్న సంకల్పంతో, తనని నిర్బంధించక వెళ్ళనివ్వమని పదేపదే చెప్పారు. అసలు విషయం ఏమిటంటే, బప్కర్ మహరాజ్ తన కొడుకుకు మరుసటిరోజుకల్లా శిరిడీలో ఉండమని ఉత్తరం వ్రాసి ఉన్నారు. అందువలన ఆయన కూడా మరుసటిరోజుకి తప్పనిసరిగా శిరిడీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ సమయానికి నానాసాహెబ్‌ పిట్కర్‌తోపాటు చాలామంది భక్తులు ఆయన దర్శనం కోసం వచ్చి ఉన్నారు. అంతమంది భక్తులను నిరాశపరిచి వెళ్లలేకపోయారాయన. ఎందుకంటే సాధువులు తమ భక్తుల కోరికలు తీర్చి వారిని సంతృప్తిపరచి ముందుకు సాగిపోతారు.

ఇదిలా ఉంటే బప్కర్ కొడుకు తన తండ్రి చెప్పిన ప్రకారం శిరిడీ చేరుకున్నాడు. అక్కడ అతనికి ఎవరూ తెలియనందున నేరుగా ద్వారకామాయికి వెళ్లి ఒక మూలన కూర్చున్నాడు. మధ్యాహ్న హారతి సమయానికి కొంచెం ముందుగా మూలన కూర్చున్న ఆ యువకుని మీద బాబా దృష్టి పడింది. బాబా తన దివ్యదృష్టితో ఆ యువకుడు ఎవరన్నది గ్రహించి, "ఆ యువకుడిని ఇక్కడకు తీసుకుని రా!" అని శ్యామాను పంపించారు. తరువాత బాబా అక్కడ కూర్చున్న భక్తుల వైపు తిరిగి, "ఈ యువకుడి తండ్రి ఆధ్యాత్మికంగా గొప్ప స్థితిని అందుకున్నాడు. ఆయనొక గొప్ప సాధువు. ఆయన ఈరోజు ఇక్కడకు రావాలని అనుకున్నారు. కానీ ఆయన భక్తులు ఆయనను ఇంకోరోజు ముంబాయిలో ఉండమని అభ్యర్థించారు. వాళ్ళని నిరాశపరచడం ఇష్టంలేని ఆయన అక్కడ ఉండిపోయారు. ఆయన కొడుకుని మనం తగిన విధంగా గౌరవించాలి. శ్యామా! ఈరోజు ఈ యువకుడు నా ఆసనంలో కూర్చుంటాడు, హారతి నిర్వహింపబడుతుంది" అని చెప్పారు.

అందువలన ఆరోజు బాబా భక్తులందరూ ఆచారపూర్వకంగా ఆ యువకుడిని పూజించి, హారతి ఇచ్చారు. బాబా ఎప్పుడూ తమని దర్శించడానికి వచ్చిన యోగులను, సాధువులను చాలా గౌరవించేవారు. ఈ సన్నివేశంతో తమ భక్తులు కూడా యోగులను గౌరవించాలని బాబా తెలియజేసారు.

Ref: సాయి ప్రసాద్ మ్యాగజైన్, దీపావళి సంచిక, 1993.
Source: Baba’s Divine Manifestations  compiled by విన్నీ చిట్లూరి.

సాయిభక్తుడు దాజీసాహెబ్ పట్వర్ధన్


1914 నాటికి బాబా కీర్తి నలుమూలలా వ్యాపించింది. ఒక్క మహారాష్ట్రలోనే ఆయనకు అసంఖ్యాక భక్తులున్నారు. అదేవిధంగా ఆయనను సందేహించేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో దాజీసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతనొక పెద్ద అనుమాన పిశాచి. అటువంటి అతను బాబాకు అంకితభక్తునిగా ఎలా మార్పు చెందారో మనమిప్పుడు తెలుసుకుందాం.

దాజీ పూర్వీకులు సంగ్లీ జిల్లాలోని మీరజ్‌లో నివాసముండేవారు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న కారణంగా వారికి 'సర్కార్' అనే బిరుదు ప్రదానం చేయబడింది. వాళ్ళది బాగా ధనిక కుటుంబం. విస్తారమైన వ్యవసాయ భూములు, ఒక పెద్ద వాడా కూడా ఉన్నాయి. ఆ వాడాలోనే వాళ్ల కుటుంబమంతా నివాసముండేది. దాజీ తాతగారైన హల్‌బాత్‌బాబా పట్వర్ధన్ గొప్ప సాధు సత్పురుషులు. ఆ కుటుంబమంతా గణేశుడిని పూజించేవారు. దాజీ కూడా గణేశుని అంకిత భక్తుడు. అతడు బాగా పుస్తకాలు చదువుతుండేవాడు. ఆ కాలానికి చెందిన మహాత్ముల చరిత్రలన్నీ చదివాడు. అయితే వాటిని భక్తి విశ్వాసాలతో కాకుండా కేవలం విశ్లేషణాత్మక దృష్టితో చదివేవాడు. "వాటిలో ఉన్న లీలలు నిజంగా జరిగాయా?" అని ఆశ్చర్యపడుతుండేవాడు. ఒకసారి అతని సన్నిహిత స్నేహితుడు, గొప్ప మహాత్ములైన సాయిబాబా దర్శనం చేసుకోవాలని తనకు ఉందని, కావున తనకి తోడుగా తనతోపాటు శిరిడీ రమ్మని దాజీని పిలిచాడు. బాబా ఒక ముస్లిం ఫకీరని, ఎంతోమంది హిందువులు ఆయనను అనుసరిస్తారని, వాళ్లలో కూడా ఎక్కువమంది బ్రాహ్మణులని, బాబా ఏదో మాయ చేసి వాళ్ళని తమవైపు తిప్పుకున్నారని, శిధిలమైన మసీదులో ఉంటారని, భిక్ష చేస్తారని, మసీదులో తులసిమొక్కను కూడా నాటారని దాజీ విని ఉండటం వలన శిరిడీ వెళ్ళడానికి విముఖత చూపాడు. ముఖ్యంగా అతన్ని ఎక్కువ చికాకు పెట్టింది, అందరూ నిజమని నమ్మే బాబా నీళ్లతో దీపాలు వెలిగించిన లీల. అయితే తానే స్వయంగా వెళ్లి బాబాని పరీక్షించి, ఆయనొక గారడీలమారి అని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ ఆలోచన ప్రకారం 1914, మే నెలలో దాజీ శిరిడీ ప్రయాణమయ్యాడు. ఈరోజుల్లోలాగా ఆరోజుల్లో శిరిడీ వెళ్లడం అంత సులువైన విషయమేమీ కాదు. అదొక సుదీర్ఘమైన దుర్భర ప్రయాణం. దాజీ మిరాజ్ నుంచి రైలులో పూణే వరకు ప్రయాణం చేసి, అక్కడ ఇంకొక రైలు పట్టుకుని మన్మాడ్ చేరి, అక్కడనుంచి కోపర్‌గాఁవ్ ప్రయాణమయ్యాడు. కోపర్‌గాఁవ్‌లో దిగాక చివరిగా టాంగాలో శిరిడీ వెళ్లాల్సి ఉంది. అప్పటికే అతడు సుదీర్ఘమైన, ప్రయాసకరమైన ప్రయాణంతో బాగా అలసిపోయి, బట్టలు మురికిపట్టిపోయి చాలా చికాకుగా ఉన్నాడు. అందువలన స్నానం చేసి బట్టలు మార్చుకుంటే కాస్తైనా ఉపశమనంగా ఉంటుందని ఆలోచిస్తూ రైల్వేస్టేషన్ బయటకు వచ్చాడు.

స్టేషన్ సమీపంలోనే  దాదాపు 60 అడుగుల లోతున్న ఒక పెద్ద బావి ఉంది. దాజీ బావి దగ్గరకి వెళ్లి లోపలకి చూసాడు. లోపల స్వచ్ఛమైన చల్లని నీళ్లు చాలా ఆకర్షణీయంగా కనిపించాయి. అప్పుడు దాజీ వయస్సు 20 సంవత్సరాలు. బలమైన యువకుడు, పైగా ఈతలో మంచి నైపుణ్యం కలవాడు కావడంతో ఎక్కువ ఆలోచించకుండా బావిలోకి దూకేసాడు. అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో, "ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలు తీసుకోవడానికి బావిలో దూకేసాడు" అంటూ కేకలు పెట్టారు. బావిలో పడ్డ దాజీకి తాను మునిగిపోతున్నానని అర్థమై, నిస్సహాయతతో చేతులు ఊపసాగాడు. కానీ తాను ఎంతగా ప్రయత్నించినా ఇంకా ఇంకా లోతుకి మునుగిపోతున్నాడు. నీటి లోపలనుండి పైకి రావడానికి, ఊపిరి తీసుకోవడానికి నిర్విరామంగా పోరాడాడు కానీ, ప్రయోజనం లేకపోయింది. ఇక కొద్దిక్షణాల్లో పూర్తిగా మునిగిపోయి తన ప్రాణాలు కోల్పోతానని అతను గ్రహించాడు. ఆ క్షణంలో అతనికి బాబా జ్ఞప్తికి వచ్చారు. వెంటనే, "బాబా! నిన్ను పరీక్షించడానికి అంతదూరంనుండి వచ్చాను. మీరు నాకు గొప్ప గుణపాఠం నేర్పారు. మిమ్మల్ని కలవకుండానే నన్నిప్పుడు స్వర్గానికి పంపుతున్నారు. నాకు ఈమధ్యనే వివాహమైంది. ఇంకా పిల్లలు కూడా లేరు. నా భార్య యుక్తవయస్సులోనే విధవరాలవుతుంది. దీన్నైనా దృష్టిలో పెట్టుకుని నా ప్రాణాన్ని కాపాడండి. మీరు నన్ను కాపాడితే, మిగిలిన నా జీవితమంతా మిమ్మల్ని భక్తితో పూజిస్తాను" అని మనస్సులోనే బాబాని ప్రార్థించాడు. మరుక్షణం ఒక రాయి కొన తన కాళ్లకు తగలడంతో దానిపై నిలుచున్నాడు. ఆ రాయి ఇంకా లోతుకు మునిగిపోకుండా అతనిని ఆపింది. తరువాత బావి అంచు గోడ పట్టుకొని నిదానంగా పైకి వచ్చే ప్రయత్నం చేసాడు. అప్పటికే అక్కడికి గుంపుగా చేరి ఉన్న గ్రామస్తులు అతనికి సహాయం అందించి సురక్షితంగా బయటికి లాగారు. దాజీ ప్రమాదంనుండి బయటపడుతూనే చేతులు జోడించి, తన ప్రాణాలు కాపాడినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తరువాత ఒక టాంగా తీసుకుని శిరిడీ ప్రయాణమయ్యాడు. దాజీ ద్వారకామాయిలోకి ప్రవేశించిన వెంటనే బాబా, "అరే బ్రాహ్మణుడా! కనీసం ఇప్పుడైనా నమ్మకం వచ్చిందా?" అని పలకరించారు. దాజీ ముందుకు వెళ్లి సాష్టాంగపడి బాబా పాదాలు పట్టుకున్నాడు. అప్పటినుండి అతను బాబాకు అంకిత భక్తుడయ్యాడు. ప్రతిరోజూ ఉదయాన లేస్తూనే, "ఈ జీవితం బాబా ఇచ్చిన ప్రసాదమ"ని భావించేవాడు.

మనలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా గొప్పగా ఈ కష్టాలనే సముద్రాన్ని ఈది దాటగలమనుకుంటాము. నిజం చెప్పాలంటే మనం మునిగిపోతాం. అయితే సద్గురువుని ప్రార్థించి, శరణు పొందిన తరువాత ఆయన దయతో బయటికి లాగబడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటాము. ఒకసారి రక్షింపబడ్డాక, నిజంగా మనం ఎవరమన్న దానిమీద శ్రద్ధ పెట్టి, ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. అందుకే బాబా, భావూని 'బ్రాహ్మణుడా' అని సంబోధించారు.


Ref: శ్రీసాయి సాగర్ మ్యాగజైన్, వాల్యూం 3, జనవరి - మార్చ్ 2013.
సోర్స్: Baba's divine manifestations by విన్నీ చిట్లూరి.

భావూ రాజారామ్ అంబిక


భావూ రాజారామ్ అంబిక సతారా జిల్లా, వడుజ్ నివాసి. అతడు వడుజ్‌లోని ప్రాథమిక ఆరోగ్యం మరియు ఇమ్యునైజేషన్ శాఖకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసేవాడు. ఒకరోజు తనకి నాసిక్ జిల్లాకు బదిలీ అయినట్లుగా ఉత్తర్వులు రావడంతో అతడు చాలా అసంతృప్తి చెందాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందున అంతదూరం గుర్రపు స్వారీ చేస్తూ ప్రయాణం చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నది. పోనీ ఉన్న చోటనే ఉండాలన్నా లేక వేరే ప్రాంతానికి మార్పించుకోవాలన్నా ఇన్‌ఛార్జ్ అధికారులు బ్రిటిషు వారైనందున వాళ్ళని అభ్యర్థించినా వాళ్ళు పట్టించుకోరు. అదంతా వృధా ప్రయాస అని భావూ ఏం చెయ్యాలో అర్థంకాని గందరగోళంలో పడ్డాడు. అలాంటి సమయంలో బాబా దైవత్వం, దయ గురించి అతని చెవినపడ్డాయి. వెంటనే శిరిడీ వెళ్లి బాబాకు రెండు పైసల దక్షిణ సమర్పించి తన సమస్యలు విన్నవించుకొని, వాటిని పరిష్కరించమని అడగాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్న ప్రకారం శిరిడీ చేరుకుని ద్వారకామాయిలో ప్రవేశించాడు. బాబా ఒక మూల కూర్చుని ఉన్నారు. ఆయన ముందు కొన్ని భాక్రీలు ఉన్న చిన్న మట్టికుండ(కొలంబా) ఉంది. బాబాతో పాటు రెండు కుక్కలు ఆ మట్టికుండనుండి ఆహారాన్ని తృప్తిగా తింటుండటం చూసి భావూ ఆశ్చర్యపోతూ, "జనులు ఈయనను గొప్ప సత్పురుషుడని అంటున్నారు. కానీ ఇక్కడ ఇతను చొంగ కారుస్తున్న కుక్కలతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎలాగూ ఇప్పుడు నేనిక్కడకు వచ్చాను కాబట్టి, ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపోవడం మంచిది" అని అనుకున్నాడు. అంతలో బాబా భావూ వైపు తిరిగి చూసి, "నా రెండు పైసలు ఇప్పటికిప్పుడే నాకివ్వు" అని అడిగారు. ఆశ్చర్యంతో భావూ రెండు పైసలు బాబాకి ఇవ్వబోతూ తన మనస్సులో, "బాబా నిజంగా గొప్ప మహాత్ముడు. ఆయన సర్వాంతర్యామి. వడుజ్ నుండి బయలుదేరేముందు రెండు పైసల దక్షిణ ఆయనకి ఇవ్వాలని నేను చేసుకున్న సంకల్పాన్ని ఆయన తెలుసుకున్నారు" అని అనుకున్నాడు. అతని మదిలో తలంపు ముగిసేలోపే, అతడేదో ఆ మాటలు బిగ్గరగా బయటికి చెప్పినట్లుగా బాబా, "నేను గొప్ప మహాత్ముడినా, కాదా; నేను చొంగకారుస్తున్న కుక్కలతో తినడం - వీటితో నీకు ఏమిటి సంబంధం? నీవు దర్శనానికి వచ్చావు. దర్శనం కూడా చేసుకున్నావు. ఇదిగో ఈ భాక్రీ ముక్క తీసుకుని బయలుదేరు" అని సమాధానం ఇచ్చారు. బాబా అలా చెప్పి, కొలంబా నుండి ఒక ముక్క భాక్రీ తీసి భావూ మీదకు విసిరారు. అప్పుడు భావూ, "బాబా! మళ్ళీ మీ దర్శనానికి నేనెప్పుడు రావాలి?" అని అడిగాడు. అందుకు బాబా, "నీవు మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నావు? ఏమైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకో!" అని బదులిచ్చారు. ఇక వేరే దారిలేక భావూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తన తిరుగు ప్రయాణంలో "బాబా నన్నెందుకు మళ్ళీ రమ్మనలేదు?" అని తీవ్రంగా ఆలోచించాడు. కానీ కారణం అంతుబట్టలేదు. వడుజ్ చేరుకున్నాక తిరిగి తన ఉద్యోగవిధులలో చేరినప్పుడు తనకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే, నాసిక్‌కు బదిలీ అయిన ఉత్తర్వులు రద్దు చేసి, వెంటనే వడుజ్ తిరిగి వెళ్ళాలన్న ఉత్తర్వులు కూడా జారీ అయి ఉన్నాయి. అప్పుడు "మళ్ళీ నువ్వెందుకు తిరిగి రావాలనుకుంటున్నావు?" అన్న బాబా మాటలకు అర్థం భావూకు బోధపడింది. ఎందుకంటే అప్పటికే బాబా తన కోరికను అనుగ్రహించేశారు.

బాబా సర్వజ్ఞులు. భావూ ఎందుకు శిరిడీ వచ్చాడో ఆయనకు తెలుసు. సర్వశక్తిమంతుడైన బాబా భావూ బదిలీ పత్రాలను రద్దు చేసారు. బాబా సర్వాంతర్యామి, ఆయన కుక్కలు మొదలగు అన్ని జీవులలో కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు భావూ ఏ సంవత్సరంలో శిరిడీ వెళ్ళిందీ స్పష్టంగా తెలియలేదు.

'ఆయనే భయం, భయానికి కారణం, ఆయనే భయనాశకుడు'. అందుకే బాబాని 'భూతకృత భయనాశనా' అని పిలుస్తారు.

ఆయనకు జరుగుతున్నవన్నీ తెలుసు, ఎందుకంటే అందుకు కారణం ఆయనే కాబట్టి. జరిపించేది ఆయనే. చర్య, దాని ఫలితం ఆయనే.

మూలం: సాయి ప్రసాద్ పత్రిక, వాల్యూమ్ 33, నెంబర్.9 
రచన: శశికాంత్ పి. అంబిక.
Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri

భావుసాహెబ్ అర్నాల్కర్.


భావుసాహెబ్ అర్నాల్కర్ న్యాయవాది వృత్తి చేస్తూ ముంబాయిలో నివసిస్తుండేవాడు. ఆ సమయంలో అతని మిత్రులు తరచూ పండరీపురం దర్శిస్తుండేవారు. దాదాపుగా బాబా గురించి ఎవరికీ తెలియదు. అయితే న్యాయవాది అయిన అర్నాల్కర్ తరచూ దభోల్కర్‌ను, మామల్తదారైన దేవును కలుస్తుండటం వలన వారి మధ్య స్నేహం అభివృద్ధి చెందింది. ఆ సమయంలో దభోల్కర్ బాబా సచ్చరిత్ర వ్రాయటంకోసం లీలలను, ముఖ్యమైన విషయాలను సేకరిస్తూ, తరచూ దేవుతో కలిసి శిరిడీ సందర్శిస్తుండేవారు. వాళ్ళిద్దరూ బాబా అద్భుతమైన లీలలను భావుసాహెబ్‌తో చెప్తుండేవారు. పర్యవసానంగా అతను కూడా బాబా భక్తుడై ఎప్పుడెప్పుడు శిరిడీ వెళ్తానా అని ఆశగా ఎదురుచూస్తుండేవాడు.

అప్పట్లో చాలామంది బాబాను ముస్లిం ఫకీరని అనుకునేవారు. కానీ అర్నాల్కరుకు ఎలాంటి సందేహమూ లేదు. ఆయనకి బాబా భగవంతుని అవతారం. భక్తుడు తాను నమ్ముకున్న దైవం దగ్గర అన్ని విషయాలు తేలికగా మనస్సు విప్పి చెప్పుకోవచ్చన్నది అతని అభిప్రాయం. నిత్యావసరాలకు కూడా పైకం లేనంత క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అతని శిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. అతను తన ప్రయాణానికి ముందు మనస్సులో, "శిరిడీ వెళ్ళి, నా దైవమైన బాబా పాదాలను శరణు పొందాలి. తరువాత ఆయనతో ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి?" అని పదేపదే ఆలోచించుకుంటూ, "భక్తుడు తన సమస్యలను, బాధలను భగవంతునికి తానే చెప్పుకోకపోతే, ఇంకెవరు వాటిగురించి చెప్తారు?" అని పరిపరివిధాల నెమరువేసుకుంటూ మొత్తానికి శిరిడీ ప్రయాణమయ్యాడు.

శిరిడీ చేరుకున్న తరువాత ద్వారకామాయికి వెళ్ళి, ఎంతో భక్తితో బాబా ముందర సాష్టాంగపడ్డాడు. మూడురోజులపాటు తరచూ ద్వారకామాయికి వెళ్ళివస్తూండేవాడు. అతను వెళ్ళిన ప్రతిసారీ బాబా చుట్టూ చాలామంది భక్తులు ఉండేవారు. ఒక్కసారి కూడా బాబా ఒంటరిగా ఉండకపోవడంతో తాను అనుకున్నది బాబాకు చెప్పలేకపోయాడు. అందరిముందు తన సమస్యలను బాబాకు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. 4వ రోజు బాబా అతన్ని పిలిపించి, తమ దగ్గరగా కుర్చోబెట్టుకొని, "ఇప్పుడు నీవు బయలుదేరాలి. నీకు కుటుంబం, బంధువులు ఉన్నారు కదా?" అని అన్నారు. వెంటనే అతడు తన శిరస్సును బాబా పాదాలపై ఉంచి, భావోద్వేగాలకు లోనయ్యాడు. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా తన మనస్సులో, "బాబా వెళ్లిపొమ్మని చెప్పిన తరువాత ఎవరూ ఇక్కడ ఒక్కనిమిషం కూడా ఉండరు, ఇది శిరిడీ ఆచారం. కానీ నా సమస్యలు బాబాకు చెప్పాలి, కానీ చెప్పలేకపోయాను. ఏది ఏమైనా ఇక నేను బయలుదేరడం మంచిది" అని అనుకుని నిరాశతో ద్వారకామాయి నుండి బయటకు వెళ్ళబోయాడు. ఇంతలో బాబా అతనిని పిలిచి, "భావూ! నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి?" అని అడిగారు. భావుకు ప్రాణం లేచివచ్చినట్లు అనిపించి తన మనస్సులో, "బాబా ఎంత గొప్పవారు! స్వయంగా ఆయనే డబ్బు విషయం ప్రస్తావిస్తున్నారు" అని అనుకుంటూ బాబాతో, "నా వద్ద మూడు రూపాయలు, కొన్ని అణాలున్నాయి. అవి నా తిరుగుప్రయాణానికి సరిపోతాయి" అని చెప్పాడు. అప్పుడు బాబా, "అరె! ఆ మొత్తం పైకం నాకివ్వు. ఫకీరుకు కూడా డబ్బులు అవసరమే" అని అన్నారు. దానితో భావు మౌనంగా బాబాకు డబ్బు ఇచ్చేసాడు. వెంటనే బాబా, "టాంగా నీకోసం బయట వేచివుంది. తొందరగా వెళ్ళు!" అని అన్నారు. నిరాశతో భావు వేచివున్న టాంగా వద్దకు వెళ్ళాడు. టాంగావాడు భావుకి పరిచయస్తుడై ఉండటంతో, టాంగా నిండుగా ఉన్నప్పటికీ అతనికి స్థలం సర్దుబాటు చేసాడు. నిండుగా ప్రయాణికులు ఉన్నందున టాంగావాడు అతనివద్ద డబ్బులు కూడా తీసుకోలేదు. "ఇప్పుడు ముంబాయి ఎలా వెళ్ళాలి? టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం" అని ఆలోచిస్తూ ప్లాట్‌ఫారమ్ మీద వేచి ఉన్నాడు. ఇంతలో ముంబాయి వెళ్ళే రైలు వచ్చి ఆగింది. తనకి ఎదురుగా ఉన్న బోగిలోనుంచి ఎవరో, "వకీల్ సాహెబ్, ఈ బోగీలోకి రండి!" అని పిలవడం వినిపించింది. అది రెండవతరగతి బోగీ. ఒక మరమనిషిలా భావు బోగీలోకి ఎక్కి చూస్తే, ఆ పిలిచిన వ్యక్తి ఎవరో కాదు, ఇతని పాత స్నేహితుడైన రైల్వే అధికారి. భావు తన దగ్గర టిక్కెట్ లేదని తెలియజేయగా, ఆ స్నేహితుడు, "నేను నీతో ముంబాయికి ప్రయాణం చేస్తుండగా నీకెందుకు చింత? బాబా కృపవలన చాలా నెలల తరువాత మనం కలిసాం" అని అన్నాడు. భావు ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. ఇద్దరూ కలిసి సుఖంగా ప్రయాణం చేసి ముంబాయి చేరుకున్నారు.

ముంబాయిలో దిగిన తరువాత అతని స్నేహితుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. బయటకు వెళ్ళే ద్వారంవద్ద రైల్వే అధికారి టికెట్లు పరిశీలిస్తున్నాడు. అందువలన అతడు బయటకు వెళ్లలేక అక్కడే నిల్చొని చూస్తున్నాడు. అంతలో ఇద్దరు మొరటుగా వున్న పల్లెటూరి వ్యక్తులు స్టేషన్ లోపలికి ప్రవేశిస్తూ ఆ అధికారిని దారినుంచి పక్కకు నెట్టుకుంటూ నేరుగా భావు దగ్గరకు వెళ్లి, ఒక సంచి అతని చేతిలో పెట్టారు. అందులో 300/- రూపాయలు ఉన్నాయి. వాళ్లలో ఒక మనిషి, "వకీల్ సాహెబ్, నేను నా స్నేహితుడైన ఇతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ బాబా కృపవలన నేనిక్కడ మిమ్మల్ని కలిసాను. మూడురోజుల తరువాత నా కేసు మొదలు కాబోతోంది. కాబట్టి దయచేసి ఈ డబ్బులు తీసుకోండి. మీరిప్పుడు తీసుకోకపోతే ఇదే పనిమీద మీకు ఫీజు ఇవ్వడానికి అంతదూరంలో ఉన్న వసయికి రావాలి" అని చెప్పాడు. ఆ మాటలు వింటున్న భావుకి, బాబా తన సమస్యకి నిశ్శబ్దంగా తగిన నివారణ చేసారని అర్థమై నోటమాట రాలేదు.

భావుసాహెబ్ అర్నాల్కర్‌లా మనకి కూడా బాబాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే బాబా మూలాలతో సహా ఆ సమస్యలను/అడ్డంకులను తొలగించి మనలను పరిశుద్ధం చేస్తారు. ఒకసారి మనల్ని పరిశుద్ధం చేసిన తరువాత, మన పురోగతికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మన బాధ్యత ఏమంటే, ఆయన చెప్పినవి ఒక మరమనిషిలా అనుసరించడం. ఒకసారి అనుసరించడం మొదలుపెట్టాక, మన పురోగతికి, అభివృద్ధికి అవసరమైన త్రిగుణాలను నిర్వహించే శక్తిని అనుగ్రహిస్తారు.


Ref: శ్రీసాయిలీల పత్రిక, అక్టోబర్ 1979.


సోర్స్: Baba's Divine Manifestations by Vinni Chitluri.

బాబా భికాజీని ఆశీర్వదించిన లీల.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బాబా భికాజీని ఆశీర్వదించిన లీల.

బాబా అనుగ్రహం భికాజీ హరి రిస్బూద్ మీద ఎంత గొప్పగా ఉందంటే, బాబా యొక్క ఈ మాటలను బట్టి అంచనా వేయవచ్చు: "అరే అన్నా! నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను".

ఆసక్తికరమైన ఆ లీలను ముంబాయిలో నివసిస్తున్న భికాజీ మనుమడు అనిల్ నారాయణ్ రిస్బూద్ ఇలా వివరించారు:

"మా తాతగారు ఆధ్యాత్మిక వైద్యులు (వైద్), రాయగఢ్ జిల్లాలోని 'పేణ్' లో నివాసం ఉండేవారు. ఆయన ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండటంతో తరచూ రోగుల చికిత్స నిమిత్తం ముంబాయి వెళ్తుండేవారు. దాదాపు ప్రతినెలా అక్కడికి వెళ్ళి, వారం, అంతకన్నా ఎక్కువ రోజులు అక్కడే ఉండేవారు. అలా ముంబాయి వెళ్ళినప్పుడే ఆయన బాబా దైవత్వం గురించి విని, 1916వ సంవత్సరంలో శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని, పేదరికంవల్ల తను పడుతున్న దురవస్థను విన్నవించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే శిరిడీ చేరి, బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళాడు. ఆ సమయంలో బాబా భయంకరమైన కోపంతో ఉన్నారు. బాబా శాంతించిన తరువాత ఆయన పాదాలమీద పడాలని భికాజీ అనుకుని ధర్మశాలకు తిరిగివచ్చి, భోజనం చేసి నిద్రపోయాడు. కాసేపటికి బాబా కలలో దర్శనమిచ్చి, "నీవు నిద్రపోవడానికి ఇక్కడకు వచ్చావా? లేక నన్ను కలవడానికా?" అని అడిగారు. అందుకు భికాజీ, "దేవా! మిమల్ని కలవడానికి నేను వచ్చినప్పుడు మీరు కోపంగా ఉన్నారు. అందువలన నేను భయపడి తిరిగి వచ్చేసాను" అని చెప్పాడు. మళ్ళీ బాబా, "నేను నీ పేరు పెట్టి నిన్ను ఏమైనా అన్నానా?" అని అన్నారు. తక్షణమే భికాజీకి మెలకువ వచ్చి, బాబా వద్దకు వెళ్ళి ఆయన ముందు సాగిలపడ్డాడు. కొన్ని క్షణాల తరువాత బాబా, "అరె అన్నా! నేను నీ బిడ్డగా మీ ఇంటికి వచ్చి ఉంటాను. ఈ మాట గుర్తుపెట్టుకో అన్నా!  నాకు శ్రీపాద అని పేరు పెట్టు!" అని అద్భుతమైన పదాలు పలికారు. ఆ సమయంలో భికాజీ భార్య 6 నెలల గర్భవతి. ఆ మరుసటిరోజే భికాజీ తిరిగి ఇల్లు చేరుకున్నాడు.

తరువాత భికాజీ భార్య ఒక గురువారంనాటి ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవిస్తున్న సమయంలో భికాజీ తన ఇంటి గుమ్మం వద్ద నిల్చొని ఉండగా, ఒక ఫకీరు వీధిలో వెళ్తూ ఉన్నారు. ఆ ఫకీరు తీక్షణంగా అతని ఇంటివైపు చూస్తున్నాడు, కాని భికాజీ ఫకీరును అంతగా గమనించలేదు. బాబా సూచించిన ప్రకారమే మగబిడ్డ పుట్టాడు. బిడ్డకు శ్రీపాద అని పేరు పెట్టారు. అయితే ఆ పిల్లవాడికి మెడమీద ఒక విశేషమైన పుట్టుమచ్చ ఉంది. అది మూడు పోగుల గొలుసులాగా ఉండి, మధ్యలో తులసి ఆకు ఆకారంలో లాకెట్టు ఉన్నట్లుగా ఉంది.

శ్రీపాద అందంగా ఉండేవాడు. 5 సం౹౹ వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు ఉపనయనం చేయాలని నిర్ణయించారు. ఆరోజు రాత్రి బాబా భికాజీకి కలలో కనిపించి పదే పదే ఇలా చెప్పారు: "ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీ నుంచి నాకేమీ అక్కరలేదు" అని. అప్పడు భికాజీ, "నేను మా ఇంటికి రమ్మని పిలవడానికి మీ దగ్గరకు వచ్చానా? మరి అలాంటప్పుడు మీరు రావడం, పోవడం అన్న ప్రశ్న ఎలా వస్తుంది?" అని అడిగాడు. బహుశా ఉపనయనం చేయాలన్న ఆలోచనను బాబా ఆమోదించలేదేమో, ఎందుకంటే అతడు స్వామి దత్తాత్రేయుని అవతారం, ఏ కారణం చేతనో ఉపనయనం ఆగిపోయింది. మళ్ళీ ఆ కుర్రవాడికి 8 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఉపనయనం విషయం తలెత్తింది. అప్పడు కూడా ఏవో కారణాలతో తండ్రి కొంతకాలం తరువాత చేద్దామని నిర్ణయించాడు.

తరువాత ఒకసారి శ్రీపాద అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక ముల్లు అతని పాదంలో గుచ్చుకుని ధనుర్వాతానికి దారితీసింది. వైద్యులు చికిత్స చేసినా గుణం కనపడలేదు. ఒక గురువారంనాటి తెల్లవారుఝామున భికాజీకి కలలో బాబా కనిపించి, "నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇక మీదట నేనుండలేను. అల్లా నిన్ను అనుగ్రహిస్తాడు" అని చెప్పారు. వెంటనే భికాజీ మంచం మీద నుంచి దిగి, ఇంటి గుమ్మం వద్ద నిలుచున్నాడు. ఆ క్షణాన ఒక ఫకీరు తీక్షణంగా ఇంటివైపు చూస్తూ వెళ్ళిపోతున్నాడు. అకస్మాత్తుగా భికాజీకి శ్రీపాద పుట్టినప్పుడు ఇదే ఫకీరు ఇంటిముందు నడుచుకుంటూ వెళ్ళిన సంగతి గుర్తుకువచ్చింది. వెంటనే భికాజీ పరిగెత్తుకుంటూ శ్రీపాద నిద్రిస్తున్న చోటుకు వెళ్లి చూసాడు. కానీ పాపం అప్పటికే అతను మరణించాడు​. శ్రీపాద ప్రపంచంలోకి వచ్చింది గురువారం ఉదయం 7 గం||లకు, మళ్ళీ అదే గురువారం అదే సమయానికి చనిపోయాడు. పైగా అతను పుట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు అదే ఫకీరు ఇంటివైపు తీక్షణంగా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ రెండింటికి సంబంధం ఏమిటనేది అగోచరమైన విషయం. ఆ ఫకీరు ఆ తరువాత ఎవ్వరికీ, ఎక్కడా కనపడలేదు".

చివరిగా అనిల్ నారాయణ రిస్బూద్, "బాబా మా ఇంటిలోకి శ్రీపాద రూపంలో వచ్చారు, మా ఇంటిని పవిత్రం చేసారు. తరువాత కూడా ఆయన అనుగ్రహం, దయ మా మీద కురిపిస్తూనే ఉన్నారు" అని చెప్పారు.

సోర్స్: శ్రీ సాయిలీల పత్రిక, డిసెంబర్ 1989.
Baba's Divine Manifestations. రచన: విన్నీ చిట్లూరి.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo