1. బాబా కృపతో అబ్బాయి పెళ్లి
2. దిక్కు తోచని స్థితిలో అర్థించినంతనే బాబా చేసిన సహాయం
|
సాయి వచనం:-
|
|
|
1. బాబా కృపతో అబ్బాయి పెళ్లి
2. దిక్కు తోచని స్థితిలో అర్థించినంతనే బాబా చేసిన సహాయం
1. నమ్మకంతో ప్రార్థిస్తే ఎప్పుడూ స్పందించే బాబా
2. రూమ్ దొరికేలా దయచూపిన బాబా
నమ్మకంతో ప్రార్థిస్తే ఎప్పుడూ స్పందించే బాబా
నా పేరు మహేశ్వర. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాను. కొన్నిరోజుల క్రితం మా ఇంట్లో టీవీ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. రిమోట్ ప్రెస్ చేసినా, ప్లగ్ తీసి పెట్టినా ఎలాంటి స్పందన లేదు. దాంతో నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. టెక్నీషియన్ని పిలవాలనుకుంటూ ఉండగా నా మనసులో ఒకేఒక్క ఆలోచన వచ్చింది -- 'సాయిబాబా! ఉన్నారు కదా. ఆయన చూసుకుంటారు' అని. “బాబా! దయచేసి టీవీ తిరిగి ఆన్ అయ్యేలా చూడండి. మీ ఆశీర్వాదం ఉంటే, సమస్య ఏదైనా సర్దుకుంటుంది” అని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థించాను. రెండు నిమిషాల తర్వాత ఎవరో అడుగులు వేస్తున్నట్టు అనిపించి టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నించాను. ఆశ్చర్యం! ఈసారి టీవీ వెంటనే ఆన్ అయింది. ఎంత ప్రయత్నించినా ఆన్ కాని టీవీ బాబా పేరు తలుచుకున్న తర్వాత పనిచేయడం ప్రారంభించింది. నా కళ్లలో ఆనందం, హృదయంలో శాంతి. ఇది పూర్తిగా బాబా కృపేనని నాకు స్పష్టంగా అనిపించింది. ఈ అనుభవం “నేను నా భక్తుల పిలుపుకు బదులు ఇవ్వకుండా ఉండను” అని బాబా అంటూ ఉండే మాటను నాకు గుర్తు చేసింది. ఇలాంటి చిన్నచిన్న విషయాలలో కూడా బాబా మనతోనే ఉన్నారని, మన మీద ఆయన దయ ఎప్పుడూ ఉంటుందని నాకు మళ్లీ నమ్మకం కలిగిచింది.
ఒకసారి నేను ఒళ్ళంతా నొప్పులు, జ్వరంతో బాధపడ్డాను. ఏ మందులు వేసుకున్నా ఉపశమనం రాలేదు. అలా కొన్నిరోజులు గడిచాక ఒకరోజు నేను బాబా ఫోటో ముందు కూర్చుని, మనసులో, “బాబా! నేను నిన్ను శరణువేడుతున్నాను. దయచేసి ఈ నొప్పులు, జ్వరం తగ్గించు” అని ప్రార్థించాను. ఆ రాత్రి నాకు గాఢ నిద్ర పట్టింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేచినప్పుడు నా శరీరం చాలా తేలికగా అనిపించింది. బాబా కృపతో జ్వరం, నొప్పులు అన్నీ పూర్తిగా పోయాయి. అలాగే ఇంకోసారి కొన్నిరోజులుపాటు శరీరంలో నొప్పులు, జీర్ణ సమస్యలతో బాధపడ్డాను. అది నా రోజువారీ పనుల మీద ప్రభావం చూపింది. ఇక అప్పుడు నేను మనసులోనే బాబాను ప్రార్థించనారంభించి ప్రతిరోజూ బాబా ధ్యానం చేస్తూ, ఇంట్లో శాంతియుత వాతారణం పెంపొందడానికి ఆయన కీర్తనలను వినటం, సద్గుణాలతో జీవించటంపై దృష్టి పెట్టాను. బాబా దయతో కొద్దిరోజుల్లోనే జీర్ణ సమస్యలు, శరీర నొప్పులు తగ్గి తేలికగా అనిపించడం, మెరుగైన నిద్రపట్టడం జరిగాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నేను టెక్ మహేంద్రలో ఉద్యోగం చేస్తున్నాను. 2025, నవంబర్ 28న నా జీతం సాధారణంగా వచ్చే సమయానికి రాలేదు. ఆ రోజంతా జీతం ఎప్పుడు వస్తుందో అన్న ఆందోళనతో కాస్త టెన్షన్గా గడిపాను. ఎంతలా ఎదురు చూసినా జీతం నా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను బాబాను ప్రార్థిస్తాను. ఆ రోజు కూడా సాయంత్రం 5 గంటల సమయంలో, "బాబా! మీ ఆశీస్సులతో ఈనెల కూడా సాఫీగా సాగేందుకు జీతం నా అకౌంట్లో పడాలి" అని మనసులోనే బాబాని ప్రార్థించాను. కొద్ది నిమిషాల్లోనే నా జీతం అకౌంట్లో జమయింది. ఆ క్షణం నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఇలాగే ఇదివరకు కూడా ఒక నెల బాబా అనుగ్రహం మీద నమ్మకంతో మనసులో, “ఈరోజు గం.2:45నిముషాలలోపు నా జీతం నా బ్యాంకు ఖాతాలో పడాలి” అని అనుకున్నాను. ఆశ్చర్యం! సరిగ్గా 2:40కి నా జీతం నా ఖాతాలో జమ అయింది. అది చూసి ఆనందంతో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బాబా దయ లేకుండా ఇవన్నీ సాధ్యం కాదు. కొన్నిసార్లు ఆలస్యమవుతుందేమోగానీ సమయానికి తప్పకుండ దీవిస్తారు బాబా. నమ్మకంతో ప్రార్థిస్తే, బాబా ఎప్పుడూ స్పందిస్తారు. "శతకోటి ప్రణామాలు బాబా. మీ దయతో ప్రతి నెల ఇలాగే సాఫీగా సాగాలని ప్రార్థిస్తున్నాను.
ఓం శ్రీసాయినాథాయ నమః.
- బాబా కృపాదృష్టి
1. దృఢమైన నమ్మకం వల్ల పొందిన బాబా అనుగ్రహం
2. సొంతూరుకి ట్రాన్స్ఫర్ అనుగ్రహించిన బాబా
3. ఊదీయే పరమ ఔషధం
- ప్రతిక్షణం తోడుగా ఉంటూ ఆందోళనలు, శారీరిక, మానసిక సమస్యలు తీర్చే బాబా
1. శ్రీసాయి అనుగ్రహశీస్సులు
2. బాబాను తలుచుకుంటే ఏదీ లేదనరు
1. ప్రార్థించినంతనే అనుగ్రహించే బాబా
2. బాబా చెప్పినట్లే 7వ రోజున తగ్గిన జ్వరం
3. బాబా రక్షణ
1. శ్రీసాయి అనుగ్రహం
2. బాబా దయ
3. ఒక్క రాత్రిలో అనుగ్రహించిన బాబా
- శ్రీసాయి అద్భుత లీల
1. శ్రీసాయి అనుగ్రహ లీలలు - 38వ భాగం
2. బాబా కృప
శ్రీసాయి అనుగ్రహ లీలలు - 38వ భాగం
నా పేరు సాయిబాబు. 2016లో ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రపోతున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు యమభటులు తమ చేతులు చాచి నన్ను పట్టుకోబోతున్నారు. నాకు భయమేసి 'బాబా' అని గట్టిగా అరిచాను. అంతే! మరుక్షణంలో ఒక పాదం ఆ యమదూతలిద్దరినీ ఒక్క తన్నుతంతే వాళ్ళు దూరంగా పడి, లేచే పారిపోయారు. అంతలో బాబా నా పక్కన నిలబడి కనిపించారు. ఆయన, "భయపడకు! వాళ్ళని తన్ని తరిమేసాను" అని నాతో చెప్పారు. ఆకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది. ఆ కలంతా నా భార్యకి చెప్పాను. అదేరోజు సాయంత్రం నా భార్య బాబా పుస్తకం చదువుతూ నన్ను పిలిచి ఒక పేజీలో వాక్యాలు చదవమని చెప్పింది. అక్కడ, "అవును నిజంగానే యమభటులు వచ్చారు. వాళ్ళని తన్ని తరిమేసాను. భయపడొద్దు!" అని ఉంది. మా ఇద్దరికీ చాలా ఆశ్చర్యమేసింది. అలా నాకొచ్చింది కల కాదు, నిజమేనని బాబా చెప్పారు.
2025. ఆగస్ట్ 18న నా భార్య శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని 19వ తేదీన హైదరాబాద్ వెళ్లి, అక్కడినుండి కైలాష్, మానస సరోవర యాత్రకి బయలుదేరింది. నేను బాబాతో, "నా భార్య చేత మంచిగా యాత్ర చేయించి సురక్షితంగా తిరిగి మా ఇంటికి చేర్చండి బాబా" అని చెప్పుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. నా భార్య ఏ ఆటంకం లేకుండా మానససరోవరం సరస్సు చూసుకొని, కైలాస పర్వత ప్రదక్షిణ చేసింది. తరువాత తిరిగి వస్తున్నప్పుడు తను దారి తప్పిపోయింది. తనకి ఎవరూ కనపడక భయమేసి 'శివ' నామం చెప్పుకుంది. తర్వాత బాబాని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోగానే ముసలి దంపతులు తన దగ్గరికొచ్చి తన చెరొక చేయి పట్టుకొని నిలబెట్టారు. నా భార్య వాళ్ళని శివపార్వతులుగా భావించి తనతో శిరిడీ నుండి తీసుకెళ్లిన మారేడు దళాలు వారి పాదాలు మీద పెట్టింది. ముఖ్య విషయమేమిటంటే, చైనావాళ్లు యాత్రికులను తనిఖీ చేసినప్పుడు అందరి దగ్గర వున్న మారేడు దళాలను తీసుకొని తిరిగి ఇవ్వలేదుగానీ నా భార్యకు మాత్రం ఇచ్చారు. సరే అసలు విషయానికి వస్తే, ఆ వృద్ధ దంపతులు నా భార్యని నడిపించుకుంటూ తీసుకొని వెళ్తున్నప్పుడు ఎదురుగా వున్న పర్వతం మీద అభయహస్తంతో బాబా నా భార్యకి దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా నా భార్య వాళ్లతోపాటు వెళ్లిన గుర్రం వాడు ఒకామె తప్పిపోయందని మిలిటరీవాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాడు. దాంతో మిలిటరీవాళ్ళు నా భార్యను వెతుక్కుంటే బయలుదేరారు. ఆ క్షణానికి వృద్ధ దంపతులు నా భార్యకి తను వెళ్లాల్సిన చోటుకి దారి చూపించారు. అంతలో మిలిటరీవాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు దగ్గరకి రాగానే ఆ వృద్ధ దంపతులు మరి కనపడలేదు. అలా బాబా దయవల్ల 11 రోజుల యాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తై నా భార్య క్షేమంగా మా ఇంటికి చేరుకుంది.
1. ఆరోగ్య విషయంలో బాబా సహాయం
2. టాబ్లెట్ వేసుకోకపోయినా ఏ సమస్యా రాకుండా దయచూపిన బాబా
- శ్రీసాయి అనురాగ తరంగాలు