సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2021వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 37వ భాగం

నా పేరు సాయిబాబు. 60 సంవత్సరాలుగా నేను చేస్తున్న పూజల ఫలితంగా బాబా నాకు కొన్నిరకాలుగా సహాయం చేస్తున్నారు. మాకు తెలిసిన కొంతమంది కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. అది నాకు తెలిసి నేను వాళ్ళచేత రోజూ బాబాకి పూజ చేయిస్తూ, వాళ్ళ తరఫున నేను బాబాని వాళ్ళ సమస్యలకి పరిష్కారం అడుగుతుంటాను. బాబా నా ప్రశ్నకి ఫేస్బుక్, టీవిలో వచ్చే స్క్రోలింగ్స్, ఒక్కోసారి దివ్య ప్రేరణ కలిగించడం ద్వారా ఖచ్చితమైన సమాధానం ఇస్తుంటారు. బాబా ఇచ్చే ఆ సందేశాలు ఎవరి సమస్యలకు పరిష్కారమన్నది నాకు తెలుస్తుంది. నేను వారికి ఆ మెసేజ్ పంపుతాను. తూచతప్పకుండా పాటించడం వల్ల వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఆవిధంగా బాబా వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు.


ఒకసారి ఊరిలో నాకు తెలిసిన కుటుంబం వారి ఇంట ఖాళీ స్థలంలోకి వారం రోజులు రెండు పాములు వస్తుంటే వాళ్ళకి భయమేసి ఆ విషయం నాతో చెప్పి, "ఏం చేయమంటారో చెప్పమని బాబాని అడగండి" అని అన్నారు. సరేనని నేను బాబాని అడిగాను. వాళ్ళు మొదటినుండి పొలంలో, ఇంట్లో పూజ దగ్గర బండారు(అమ్మవారి గుడిలోని పసుపు, కుంకుమ) పెట్టుకుంటారు. మర్నాడు ఆ పసుపు, కుంకుమ కలిపి ఒక బాక్స్‌లో వుంచుతారు. దాన్ని ఊదీతో కలిపి రోజూ కొద్దిగా బొట్టు పెట్టుకుంటారు. వారానికి ఒకసారి పొలంలో పంట మీద చల్లుతారు. దాన్నే పాములు వచ్చే చోట జల్లమని బాబా నాకు ప్రేరణనిచ్చారు. అదే విషయం నేను వాళ్ళకి చెపితే, వాళ్ళు వెంటనే అలా చేశారు. అంతే, ఆ రోజు నుండి పాములు రాలేదు. "బాబాకి కృతజ్ఞతలు".


ఈమధ్య నాకు తెలిసిన ఒక ఆమె ఒంటరిగా ఏదో పనిమీద గుంటూరు వెళ్ళింది. అక్కడ ఆలస్యమై తిరిగి వచ్చేపాటికి చీకటి పడసాగింది. ఆమెకి భయమేసి నాకు ఫోన్ చేసి, "బాబాని తోడు పంపరా! నాకు భయంగా ఉంద"ని చెప్పింది. నేను వెంటనే ఆ  విషయం బాబాతో విన్నవించుకున్నాను. అంతలో ఫేస్బుక్‌లో బాబాతోపాటు 25 ఏళ్ల వయసు గల ఒక స్త్రీ ఫోటో వచ్చింది. ఆ ఫొటోలో బాబా ఆశీర్వదిస్తూ, 'నేను ఉండగా భయమేలా?' అన్న వాక్యాలు ఉన్నాయి. నేను ఆ మెసేజ్ ఆమెకు పంపాను. ఆమె ఆ మెసేజ్ చూసి, "బాబాకి ధన్యవాదాలు చెప్పండి. ఇప్పుడు నాకు భయం లేదు. బాబా తోడు ఉన్నారు" అని బదులిచ్చింది. ఆమె ఇంకోసారి 10 మంది రైతులతో కలిసి తన తండ్రి పొలంలో పండిన మిర్చి బస్తాలు విక్రయించడానికి ఆంధ్ర నుండి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్తున్నారని, మిర్చి బస్తాలకు మంచి ధర పలికేలా చూడమని బాబాకి చెప్పండని నాకు మెసేజ్ పెట్టింది. నేను ఆ విషయం బాబాకి విన్నవించాను. బాబా విన్నారు. వారం తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి, "బాబాకి ధన్యవాదాలు చెప్పండి. బాబా అందరికంటే క్వింటాలకు 500 రూపాయలు ఎక్కువ ఇప్పించారు. వెళ్లిన పదిమందిలో మా నాన్నకు మాత్రమే ఆ ధర నిర్ణయించారు. ఇది బాబా చలువ" అని చెప్పింది. ఇలా బాబా అనుగ్రహం ఉంటూనే ఉంటుంది. దాన్ని పొందిన వాళ్ళు బాబా భక్తులు కాకుండా ఎలా ఉండగలరు?


మా కుటుంబమంతా శిరిడీలో ఉంటుండగా మా అల్లుడు ఒక్కడే బెంగళూరులో ఉంటున్నాడు. ఒకరోజు నేను బాబాని, దయచేసి మా అల్లుడికి ఎప్పుడూ తోడుగా ఉండండి అని ప్రార్థించాను. బాబా మా ప్రార్థనను విని కింది సందేశం పంపారు. 


🔥సాయి వచనం:- 'నా భక్తుడు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, లోపల, వెలుపల ఎప్పుడూ అతడితోనే ఉంటాను.'


2025, జూలైలో ఒకరోజు ఉదయం నేను, మా అమ్మాయి శిరిడీలో బాబా మాకు ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎప్పుడు బాబా అనుమతి ఇస్తారో, అలాగే అందుకు అవసరమైన డబ్బు సమకూరుస్తారో అని అనుకున్నాం. పది నిమిషాల తర్వాత నేను నా మొబైల్లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, "మీరు త్వరగా ఇల్లు నిర్మించండి. నేను వచ్చి అందులో ఉంటాను". "మీకు ధన సహాయం వెంటనే అందుతుంది" అని రెండు మెసేజ్లు వచ్చాయి. ఇదే నెలలో ఒకరోజు మా అమ్మాయి బాబా దర్శనం కోసం మందిరంకి వెళ్లలేదు. మర్నాడు ఉదయం, "నీవు దర్శనానికి రాలేదని చింతించవద్దు. నేనే నీ దగ్గరకు మీ ఇంటికి వస్తున్నాను" అని బాబా మెసేజ్ ఫేస్బుక్‌లో వచ్చింది. అదేరోజు మధ్యాహ్నం మా అమ్మాయి నిద్రపోతే, కలలో బాబా దర్శనమిచ్చి మాట్లాడారు. బాబా మాట తప్పరు కదా! అదే నెలలో నేను కూడా రెండు రోజులు బాబా మందిరంకి వెళ్ళలేదు. మూడోరోజు నేను ఒక్కడినే దర్శనానికి వెళ్లాను. తర్వాత బాబా "నువ్వు దర్శనానికి వచ్చావా? నేను నీకు రుణపడి ఉన్నాను. నేనే నీ వద్దకు రావాలి" అని ఫేస్బుక్‌లో మెసేజ్ వచ్చింది. అది యాదృచ్చికం కాదని సమయానికి బాబానే పంపించారని గ్రహించండి.


శిరిడీలోని మేముంటున్న ఇంటిలో నేలపై గ్లాస్ టైల్స్ ఉన్నాయి. వాటిపై 2025, జూన్ మొదటివారంలో వర్షపు జల్లు పడింది. అది తెలియని నేను ఆ తడి మీద అడుగులు వేసి కాలు జారి 'బాబా' అంటూ కిందపడ్డాను. ఆ ప్రమాదకర సంఘటనలో నా ఎముకలు ఫ్రాక్చర్ అయి ఉండాలి. కానీ బాబా దయవల్ల అటువంటిదేమీ జరగలేదు. తుంటి ఎముక మాత్రం బాగా నొప్పి పెట్టింది. నేను ప్రతిరోజూ ఆయిల్, అలోవెరా జెల్ ఒక నెలరోజులపాటు రాసినా ఆ నొప్పి తగ్గలేదు. అప్పుడొకరోజు సాయంత్రం పూజ చేసేటప్పుడు వెలిగించిన అగరబత్తీల పొడిని(ఊదీ) రాత్రి నిద్రించేముందు రాసుకోవాలన్న ప్రేరణ కలిగింది. అది బాబా ఇచ్చిన ప్రేరణగా భావించి అలాగే చేశాను. అంతే! నెలరోజులుగా తగ్గని నొప్పి 3 రోజుల్లో మటుమాయం అయింది. ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


సాయిభక్తుల అనుభవమాలిక 2020వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 36వ భాగం

నా పేరు సాయిబాబు. మేము శిరిడీ వచ్చినా రెండో వారంలో ఒకరోజు సాయంత్రం నేను మేముండే ఇంటి కారుడారిలో నిల్చుని ఆకాశం వైపు చూస్తున్నాను. చల్లటి గాలి, ఆకాశం నిర్మలంగా ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంది. హఠాత్తుగా బాబా నన్ను ఫోటో తీసుకోమంటున్నట్టు అనిపించి, నా మొబైల్‌తో ఆకాశాన్ని ఫోటో తీసి చూస్తే, బాబా నయనాలు, నుదురు చాలా స్పష్టంగా దర్శనమిచ్చాయి. వెంటనే ఆ ఫోటోని కొంతమంది సాయిభక్తులకు పంపించాను. అది చూచి వాళ్ళు చాలా సంతోషించారు. అలాగే ఒకరోజు మా ఇంటి టీవిలో సంధ్య హారతి చూస్తున్నప్పుడు బాబాకి కర్పూర హారతి ఇచ్చే సమయంలో బాబా నన్ను మొబైల్‌లో ఫోటో తీసుకోమని చెప్తున్నట్లు ప్రేరణ కలిగి ఫోటో తీసాను. మహా అద్భుతం! కర్పూర హారతిలో బాబా మూర్తి, ఆ మూర్తిపై ఛత్రం స్పష్టంగా దర్శనమిచ్చాయి. ఇవి బాబా లీలలు.


ఒకరోజు నేను, మా అమ్మాయి సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకున్న తర్వాత మా అమ్మాయి ఊదీ పంపిణీ సేవలో పాల్గొనగా నేను కిటికీలో నుండి కనిపిస్తున్న బాబాను చూస్తూ దూరంగా ఉన్న బెంచి మీద కూర్చున్నాను. అంతలో గాలి వీచి గురుస్థానం వద్ద ఉన్న వేపచెట్టు ఆకులు రాలి నేల మీద పడ్డాయి. వాటిని చాలామంది ఏరుకున్నారు. నేను నా మనసులో, "బాబా! ఒక ఆకు మీరే నా దగ్గరకు పంపిస్తారు కదూ!" అని అనుకోగానే మరల గాలి వీచి ఒక ఆకు దూరంగా కూర్చుని ఉన్న నా ముందు పడింది. అది తీసుకొని జాగ్రత్తపరిచాను. మనం అడగకుండా బాబా ప్రసాదించేవి కూడా కొన్ని ఉంటాయి. జూన్ 3న సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకుని బయటకు రాగానే మా అమ్మాయికి మెట్ల మీద రెండు ఆకులు దొరికాయి. తర్వాత బయటకు రాగానే నాకు కూడా ఒక ఆకు లభించింది. అయితే ఒకరు అడగడంతో వాళ్ళకి ఇచ్చేసాను.


2025, జూలై 5న మేము బాబా అనుమతితో వణిలోని సప్తశృంగి మాత ఆలయ దర్శనానికి కారులో శిరిడీ నుండి బయలుదేరాం. అప్పుడు కుండపోతగా ఒకటే వర్షం. అందువల్ల నెమ్మదిగా వెళ్తూ నేను మనసులో బాబాని "బాబా! అమ్మవారి దర్శనానికి అడ్డులేకుండా వర్షం ఆపండి" అని ప్రార్థించాను. తర్వాత మేము అక్కడికి చేరుకొని కారు పార్క్ చేసాం.  అంతే! వర్షం దాదాపు తగ్గిపోయి సన్నగా చినుకులు రాలసాగాయి. మా అమ్మాయి కొండకున్న ముందు మెట్ల మార్గం గుండా తన మొక్కుననుసరించి మెట్ల పూజచేస్తూ 510 మెట్లు ఎక్కడం మొదలుపెట్టగా నేను కొండ వెనకనున్న 700 మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. అక్కడున్న మిలిటరీ సెక్యూరిటీ ఆఫీసర్ నాకు తోడుగా ఒక అతనిని పంపారు. 100 మెట్లు ఎక్కేసరికి నాకు ఆయాసం, దడగా అనిపించి దాహం కూడా వేసింది. ఒక నిమిషం ఆగి బావా నామం చెప్పుకుంటూ మిగతా మెట్లు చకచకా ఎక్కేసాను. మా అమ్మాయి కూడా బాబా నామం చెప్పుకుంటూ మెట్లు పూజ చేసి పైకి చేరుకొని నన్ను కలిసింది. క్యూలైన్‌లో దర్శనానికి 4 గంటల సమయం పడుతుందన్నారు. నా వెంట వచ్చిన అతను కేవలం 10 నిమిషాల్లో మాకు అమ్మవారి దర్శనం చేయించి బండారు ఇప్పించారు. తర్వాత మేము కొండ దిగి మిలిటరీ ఆఫీసర్ దగ్గరకి వెళ్ళాము. అక్కడ సెక్యూరిటీ వాళ్లతో బాబా మాకు ప్రసాదించిన అనుభవాల గురించి 2 గంటలసేపు మాట్లాడుకున్నాము. ఆరోజు వారాహి నవరాత్రులు ఆఖరిరోజు. అక్కడే భోజనం చేసి తిరుగు ప్రయాణమయ్యాము. మరుక్షణం భారీ వర్షం మొదలైంది. అంటే బాబా మా విన్నపం ఆలకించి దర్శనం అయ్యేంతవరకు వర్షం ఆపారు. అలా బాబా అనుగ్రహంతో అమ్మవారి దర్శనం మాకు అయింది.


బాబా నాకు ప్రసాదించిన వందలాది అనుభవాలలో నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం అత్యంత విశిష్టమైనది. సచ్చరిత్ర 33వ అధ్యాయంలో జామ్నేరు ఊదీ లీల మీరంతా చదివే ఉంటారు. దానికి సంబంధించినదే నేను చెప్పబోయే నా అనుభవం. 2025, జూలై 10, గురువారం, గురుపౌర్ణమి. ఆ సందర్భంగా సూరత్‌కి చెందినవాళ్ళు ఒకరు సమాధి మందిర ప్రాంగణంలో బాబాకి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నేను ముందురోజు బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఫోటోలు వరుసగా చూస్తుండగా ఇద్దరు సంస్థాన్ ఉద్యోగులు ఆ ఫోటోగ్రాఫర్‌తో మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళు మాట్లాడేది వినసాగాను. ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోల గురించి వివరిస్తూ ఒక ఫోటో దగ్గర ఆగి, ‘ఈ ఫోటో నానాసాహెబ్ చందోర్కర్ కుటుంబసభ్యుల దగ్గర నుండి తీసుకున్నానని, ఆ కుటుంబీకుల దగ్గ్గర ఇప్పటికీ ఆనాడు మైనతాయికి పంపిన ఊదీ ఉందని(బాబా పంపిన ఊదీలో నుంచి చిటికెడు మాత్రమే నీళ్లలో కలిపి ఆమెకి ఇచ్చారట, మిగతాది అలాగే వారి దగ్గర భద్రపరుచుకున్నారట), ఆ ఊదీ నాకు కొంచం ఇచ్చారని’ చెప్పి, దాన్ని భద్రంగా దాచుకున్న చిన్న వెండి భరణిని చూపించాడు. అప్పుడు సంస్థాన్ ఉద్యోగస్తులు వేళ్ళతో కొంచెం ఊదీ తీసుకొని నుదుటన పెట్టుకున్నారు. పక్కనే ఉన్న నేను కూడా వేళ్ళతో కొంచం ఊదీ తీసి నుదుటన ధరించాను. బాబా హస్తస్పర్శ పొందిన ఊదీ లభించినందుకు నాకు చాలా సంతోషమేసింది. సాయంత్రం మా ఇంటిలో బాబాకి పూజ చేసిన తర్వాత నా మనసులో 'ఆ ఫోటోగ్రాఫర్ చెప్పింది నిజమా, అబద్దమా' అని ఒక ఆలోచన వచ్చింది. అదే విషయం గురించి చేతిలో సచ్చరిత్ర పుస్తకం మూసి పట్టుకొని, నా కళ్ళు కూడా మూసుకొని బాబాని అడిగి పుస్తకం తెరిచి, ఆపై కళ్ళు తెరిచి చూసాను. పుస్తకంలో జామునేర్ ఊదీ లీల ఉన్న 33వ అధ్యాయం వుంది. అది చూసి నా కళ్ళ నుండి ఆనందబాష్పాలు జాలువారాయి. ఆవిధంగా ఫోటోగ్రాఫర్ చెప్పింది నిజమని బాబా తెలియజేసారు. ఆయన నాకు ఎంతటి మహాభాగ్యం కల్పించారు? "ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 2019వ భాగం...


ఈ భాగంలో అనుభవం:
  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 35వ భాగం

నా పేరు సాయిబాబు. నాకు అయ్యప్పస్వామి ప్రసాదం అంటే ఇష్టం. ఆంధ్రాలో ఉంటే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు అయ్యప్ప ప్రసాదం తెచ్చి నాకు ఇస్తుంటారు. కానీ 2024లో నేను బెంగళూరులోని మా అమ్మాయి వాళ్ళింటిలో ఉన్నాను. అందువల్ల ఆ సంవత్సరం నాకు అయ్యప్ప ప్రసాదం లభించలేదు. మా అమ్మాయివాళ్ళకి పాలుపోసే అతను అయ్యప్పమాల వేసుకున్నప్పటికీ నేను అతన్ని ప్రసాదం కావాలని అడగలేకపోయాను. బాబా మనసులోని మాట గ్రహించి అది నెరవేరుస్తారు కదా! మేము డిసెంబర్ నెలలో శిరిడీ వెళ్దామని బస్సు టికెట్లు బుక్ చేసుకున్నాము. మా ప్రయాణానికి ముందురోజు మేము అడగకుండానే తెలిసినవాళ్లు అయ్యప్పస్వామి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. మేము శిరిడీకి వెళ్లొచ్చిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుందామని సీల్ ఓపెన్ చేయకుండా బాబా దగ్గర పెట్టి, ఇంటికి తాళాలు వేసి శిరిడీ వెళ్ళాము. 4 రోజుల తర్వాత తిరిగి వచ్చాము. మేము తలుపు తెరవగానే బాబా దగ్గరున్న అయ్యప్ప ప్రసాదం సీల్ ఓపెన్ చేసి మూత పక్కన పెట్టి ఉండటం చూసి ఆశ్చర్యపోయాము. తలుపులు, కిటికీలు మొత్తం అన్నీ మూసి ఉన్నందున బాబానే మూత తీసి ప్రసాదం స్వీకరించారని ఆనందించాము. అదీ బాబా లీల.


బాబా అనుగ్రహంతో 2025, మే 1న శిరిడీలో బాబా చరణల వద్ద నేను, నా కుటుంబం శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాము. మేము శిరిడీ వెళ్ళినప్పటినుండి బాబా సమయానికి మాకన్నీ సమకూరుస్తున్నారు. ఉదాహరణకు గ్యాస్ కనెక్షన్, ఆధార్‌లో చిరునామా మార్పు, బ్యాంకు అకౌంట్ మొదలైనవి. ఊదీ వితరణ సేవ కూడా లభించింది. అంతేకాకుండా బాబా దయవల్ల మా మనవడికి అక్కడ మంచి కాలేజీలో సీటు వచ్చింది. మామూలుగా బెంగళూరు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకు ఒక సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండగా శిరిడీకి దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీవాళ్ళు మావాడి మెరిట్ చూసి ప్రవేశ పరీక్ష పెట్టి, అందులో తనకి మంచి మార్కులు రావడంతో సంవత్సరానికి నామమాత్రం ఫీజుతో సీటు ఇచ్చారు. అది మామూలు కాలేజీ కాదు. వందకు పైగా బస్సులు, అన్ని కోర్సులు ఉన్న యూనివర్సిటీ. ఇదంతా బాబా దయ. ఆయనకు మా కుటుంబం మీద ఉన్న ఆపారమైన కరుణాకటాక్షాలు.

శిరిడీ వచ్చినప్పటినుండి నేను ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో బాబా దర్శనానికి వెళుతున్నాను. ఒకరోజు నేను ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా ముందు కొన్ని పూలు ఉన్నాయి. వాటిలో నుండి కొన్ని మల్లెపూలు నా ముందున్న వ్యక్తికి పూజారి ఇచ్చారు. కానీ నేను అడిగితే ఇవ్వలేదు. అంతలో వేరే అతను బాబా వద్దనున్న పెద్ద బంతిపువ్వు నా చేతికి ఇచ్చారు. అది బాబా అనుగ్రహం.


ఒకరోజు నేను, మా అమ్మాయి ఇంట్లో బాబాకి నైవేద్యం తయారు చేసి మధ్యాహ్న హారతి సమయంలో బాబాకి నైవేద్యం సమర్పించే వేళకి ద్వారకామాయికి వెళ్లి బాబాకి నివేదించాము. హారతికి అక్కడే ఉండి హారతి అనంతరం ప్రసాదం భక్తులకి పంచాము. ఆ సమయంలో వేరే వాళ్ళు కూడా ప్రసాదం పంపిణి చేసారు. నేను వాళ్ళు పంచుతున్నది కేసరి అనుకున్నాను. కానీ తీరా నా చేయి చెపితే, వాళ్ళు ఇచ్చింది కేసరి కాదు, కిచిడి. తర్వాత బయటకు వస్తే, అక్కడ ఇంకొకరు ప్రసాదం పంచుతున్నారు. చూస్తే, అది కేసరి. బాబా మన మనసు గ్రహిస్తారు కదా!


మా మనవడి ఆధార్ కార్డులో అడ్రస్ శిరిడీగా మార్చుకున్నందున మేము ప్రతిరోజూ సామాన్య భక్తులు వెళ్లే క్యూలైన్ గుండా కాకుండా శిరిడీ స్థానిక భక్తుల లైన్లో నేరుగా బాబా దర్శనానికి వెళుతున్నాము. అయితే 2025, జూన్ మొదటి వారంలో ఒకరోజు నేను, మా మనవడు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సెక్యూరిటీ నా ఆధార్ కార్డు చూసి, అందులో శిరిడీ అడ్రెస్స్ కాకుండా వేరే అడ్రస్ ఉన్నందున ససేమిరా లోపలికి పంపనని అన్నాడు. అప్పుడు చేసేదిలేక ముందు ద్వారకమాయిలో దర్శనం చేసుకుని తర్వాత ముఖదర్శనంకి వెళ్ళాము. అక్కడ నేను బాబాని చూస్తూ, "బాబా! ప్రతిరోజూ నేరుగా నీ దర్శనం ఇస్తున్నావు. మరి ఈరోజు ఎందుకు ఇవ్వటం లేదు. నన్ను లోపలికి అనుమతించు బాబా" అని మనసులో అనుకున్నాను. తర్వాత బయటికి వెళ్లి చూస్తే, మునుపు నన్ను లోపలికి పంపనన్న సెక్యూరిటీ స్థానంలో వేరొక సెక్యూరిటీ ఉన్నారు. మేము వెళ్లి నా మనవడి ఆధార్ కార్డు చూపిస్తే, అతను మమ్మల్ని లోపలికి అనుమతించాడు. సంతోషంగా మందిరంలో బాబా దర్శనం చేసుకుని పది నిమిషాల్లో బయటకు వచ్చాము. అప్పుడు చూస్తే, కొత్త సెక్యూరిటీ అతని స్థానంలో నన్ను లోపలికి పంపని సెక్యూరిటీనే ఉన్నాడు. అంటే, బాబా నా మనసులోని మాట విని మాకు తమ దర్శన భాగ్యం కలిగించారు.


ఒక గురువారం ఉదయం నేను ఒక్కడినే బాబా దర్శనానికి వెళ్తున్నప్పుడు చాలా జనం ఉన్నారు. నేను మందిరం దగ్గరకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక కాషాయ వస్త్రధారి ఐన సాధువు నన్ను పిలుస్తూ నావైపు రాసాగాడు. అతను మామూలు సాధువులా కాక వేరుగా కనిపించాడు. అతను నన్ను రెండుసార్లు పిలిచినా నేను వినిపించుకోక వేగంగా మందిరంలోకి వెళ్ళిపోయాను. గురుస్థానం, ముఖదర్శనము, ద్వారకమాయి, చావడి దర్శించుకొని మధ్యాహ్న హారతి అక్కడున్న టీవీలో చూశాను. ఆరతి అనంతరం నాకు బాబా తీర్థ, ప్రసాదాలు లభించాయి. సాయంత్రం వరకు మందిరంలో ఉండి ఇంటికి వచ్చేసాను. మర్నాడు ఫేస్బుక్‌లో 'నేను నిన్ను ఒక కాషాయ వస్త్రం ధరించిన సాధువు రూపంలో కలుస్తాన'న్న సారాంశంతో ఒక మెసేజ్ వచ్చింది. తద్వారా నిన్న ఆ సాధువు రూపంలో వచ్చిన నన్ను మిస్ అయ్యావు, మళ్లీ కలుస్తాను గుర్తుంచుకో! అని బాబా నాకు సెలవిచ్చారు. లా అంటాయి బాబా లీలలు. ఒక పట్టాన అర్థం కావు. మనం జాగ్రత్తగా ఉండాలి.


సాయిభక్తుల అనుభవమాలిక 2018వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • దగ్గరుండి నాన్నని కాపాడిన బాబా


సాయిభక్తుల అనుభవమాలిక 2017వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇబ్బందులు లేకుండా చూసిన బాబా
2. శ్రీసాయి కృప

ఇబ్బందులు లేకుండా చూసిన బాబా

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా  కోమలవల్లి. నేను తిరుమల వెళ్ళి 4 సంవత్సరాలైంది. ఎందుకంటే, మావారు ఎక్కడికీ వెళ్ళకూడదంటారు. అందుకని గొడవపడి గుడికి వెళ్ళడం ఇష్టం లేక నేను మౌనంగా ఉండేదాన్ని. నేను చాలావరకు నాకు తెలిసిన వారందరికీ తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేస్తూ ఉంటాను. అందరూ 'నువ్వు కూడా బుక్ చేసుకో. మేము చూసుకుంటాము' అని అంటుంటారు. అయినా ఎందుకు గొడవని నేను వదిలిసేదాన్ని. మనసులో మాత్రం ఎప్పుడు తిరుమల వెళ్తానో అని అనుకునేదాన్ని. ఇలా ఉండగా 2025, ఏప్రిల్ నెల టికెట్లు విడుదలైనప్పుడు మా నాన్న, 'నన్ను మా అబ్బాయిని కూడా బుక్ చేసుకోమని, అప్పుడు వీలుకాకపోతే చుద్దాం. ఇప్పుడే ఆలోచన ఎందుకు?' అని అన్నారు. నేను సరేనని మా అమ్మ, నాన్నలతోపాటు నాకు, మా అబ్బాయికి జూలై 1న తిరుమల దర్శనానికి టిక్కెట్లు బుక్ చేశాను. ప్రయాణానికి ఒక వారం ముందు మావారికి విషయం చెప్తే, ఆయన రోజూ సాయంత్రం గొడవ చేస్తుండేవారు. ప్రయాణానికి ముందురోజు కూడా కొద్దిసేపు గొడవపడి మౌనంగా నిద్రపోయారు. అప్పుడు నేను సోషల్ మీడియా చూస్తుంటే, "రేపు నీ ప్రయాణంలో తోడుగా నేను వస్తాను" అన్న బాబా మేసేజ్ కనిపించింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. మర్నాడు మావారు మా ప్రయాణానికి అంగీకరించడంతో మేము తిరుమలకు ప్రయాణమయ్యాము. మాకు రెండు గంటలలో స్వామివారి దర్శనమైంది. తర్వాత మా నాన్న, "మన తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో! తిరుచానురు వెళదాము" అని అన్నారు. సరేనని తిరుచానూరు వెళితే, అక్కడ లాకర్‌లో మా లగేజీ పెట్టె చోట పెద్ద బాబా ఫోటో దర్శనమిచ్చింది. అప్పుడు ఆరోజు బాబా ఇచ్చిన సందేశం గుర్తుకు వచ్చి 'నాకు తోడుగా బాబా వచ్చారు' అని చాలా ఆనందమేసింది. అమ్మవారిని  దర్శించుకొని మావారికి చెప్పిన సమయం కల్లా నేను ఇంటికి చేరుకున్నాను. బాబా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. "ధన్యవాదాలు బాబా".

మా అబ్బాయి మదనపల్లి దగ్గర రెడ్డమ్మ అమ్మవారి అనుగ్రహంతో పుట్టాడు. నేను తను రెడ్డమ్మ కొండకు వెళ్ళినప్పుడు తనకి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. అయితే వాడు ఒకసారి మా అమ్మాయి, అల్లుడుతో రెడ్డమ్మ గుడికి వెళ్ళాడు కానీ, గుండు చేయించుకోలేదు. ఆ కారణంగా ఏమో వాడికి మాటలు నత్తినత్తిగా వస్తుంటే, నేను మళ్ళీ వాడిని గుడికి తీసుకెళ్లి గుండు కొట్టిస్తానని అనుకున్నాను. కానీ ఒక సంవత్సరం ప్రయత్నించినా మావారు ఒప్పుకోలేదు. చివరికి 2025, జూలై నెలలో మావారితో గొడవపడి 'మధ్యాన్నం కల్లా వచ్చేస్తాను. ఇప్పుడు వాడు పదవ తరగతి చదువుతున్నాడు. మళ్ళీ వెళ్ళడానికి కుదరద'ని ఎంతో నచ్చచెప్పి నేను, మా అబ్బాయి బయలుదేరాము. అయితే సాధారణంగా వెళ్లే మార్గం కాకుండా 3 గంటల సమయం పట్టె కొత్త మార్గంలో వెళ్లాలని అనుకున్నాను. ఆ మార్గంలో బస్సులు దొరకవని అన్నా, "బాబా! మేము మధ్యాహ్నం 2 గంటల కల్లా ఇంటికి వచ్చేయాలి. నువ్వే నాకు దిక్కు" అని అయన మీద భారమేసి ఆ మార్గంలోనే వెళ్ళాను. కొత్త మార్గమైనప్పటికీ బాబా దయవల్ల బస్సులు, ఆటోలకోసం ఒక్క నిమిషం కూడా వేచి చూసే పని లేకుండా, ఎక్కడా ఇబ్బందిపడకుండా మా అబ్బాయికి గుండు కొట్టించి, అమ్మవారి దర్శనం చేసుకొని మధ్యాహన్నం 2 గంటల కల్లా ఇంటికి తిరిగి వచ్చేసాను. బాబా మీద భారమేస్తే, మనకు ఎప్పుడు ఏది కావాలో ఆయన చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. నా కూతురికి ఒక బిడ్డను ప్రసాదించు బాబా".

సర్వం సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు.

శ్రీసాయి కృప

ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు ఉష. నేను చాలా ఇబ్బందులలో ఉన్నప్పుడు బాబా నాకు చాలా అండగా ఉన్నారు. ట్యూషన్ చెప్తేనే నాకు ఇంట్లో జరుగుతుందని నేను పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు మొదట ఒకేఒక్క అమ్మాయి వచ్చింది. అప్పుడు నేను, "స్వామీ! ట్యూషన్‌కి పిల్లలు బాగా వచ్చేటట్టు చూడు" అని బాబాని వేడుకున్నాను. ఆ మరుసటిరోజు నుంచే ట్యూషన్‌కి పిల్లలు ఎక్కువగా రావడం మొదలైంది. ఒకరితో మొదలై 30 మంది వరకు పిల్లలయ్యారు. ఇప్పటికీ నేను నాకు ఏ బాధ వచ్చినా బాబాని తలుచుకుంటాను. "ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2016వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సురక్షితంగా USA చేర్చిన బాబా
2. నమ్మిన వారి వెన్నంటే నిలిచి కాపాడే సాయినాథుడు



సాయిభక్తుల అనుభవమాలిక 2015వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆపద్బాంధవుడు మన సాయి
2. కష్టాలు తీర్చే బాబా



సాయిభక్తుల అనుభవమాలిక 2014వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయవల్లే చేకూరిన ఆరోగ్యం
2. బాబా దయ 



సాయిభక్తుల అనుభవమాలిక 2013వ భాగం...


ఈ భాగంలో అనుభవాలు:

1. పరిష్కరించలేని సమస్యలను సాయి పరిష్కరించగలరు 
2. ప్రార్థనకు బదులిచ్చిన బాబా



సాయిభక్తుల అనుభవమాలిక 2012వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు
2. ప్రార్థన విని సమస్యను పరిష్కరించిన బాబా
3. సాయి కరుణ




సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo