|
సాయి వచనం:-
|
|
|
బాబా దర్శనానికి వచ్చిన ఆంగ్ల దొరలు
సాయిభక్తుల అనుభవమాలిక 2108వ భాగం....
1. బాబా నాతోనే ఉన్నారన్న అనుభూతి
2. నెక్లెస్ దొరికేలా బాబా చేసిన సహాయం
సాయిభక్తుల అనుభవమాలిక 2107వ భాగం....
1. శ్రద్ధ-సబూరిలతో బాబాని ప్రార్థిస్తే, ఆయన తప్పకుండా సహాయం చేస్తారు
2. బదిలీ కాకుండా దయచూపిన బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2106వ భాగం....
- బాబా మీద నమ్మకముంచితే అంతా శుభమే!
సాయిభక్తుల అనుభవమాలిక 2105వ భాగం....
1. బాబా చేసిన గొప్ప సహాయాలు
2. సమస్యలు తీర్చే సాయితండ్రి
సాయిభక్తుల అనుభవమాలిక 2104వ భాగం....
- పట్టుబట్టి మొక్కు తీర్పించి మరీ సొంతింటిని అనుగ్రహించిన బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2103వ భాగం....
ఏది అడిగితే అది, ఎలా కావాలనుకుంటే అలా అనుగ్రహించే సాయితండ్రి
ఒకసారి నాకు చాలా జ్వరం వచ్చి అస్సలు ఓపిక లేకుండా పోయింది. అయినా తప్పనిసరి పరిస్థితిలో నా బ్యూటీపార్లర్కి వెళ్లాల్సి వచ్చి వెళ్ళాను. ఆరోజు షాపులో పనిచేసే అమ్మాయి రాలేదు. నాకు ఓపిక లేదు. 'బాబా! ఇప్పుడు ఎవరైనా క్లయింట్ వస్తే, ఏం చేస్తాం? నేను అస్సలు నిల్చోలేకపోతున్నాను. ఎవరు వచ్చినా పంపించేస్తాను. నేను వాళ్ళని హ్యాండిల్ చేయను, చేయలేను' అనుకుంటూ కూర్చున్నాను. కొంత సమయం తర్వాత ఒక క్లయింట్ వస్తే, "నాకు బాగోలేదు. నేను ఏ పని చేయలేన"ని చెప్పాను. కానీ తనకి ఫంక్షన్ ఉందని, అర్జెంటుగా ఫేషియల్ చేయించుకోవాలని అన్నారు. "మేడం! నేను అస్సలు హ్యాండిల్ చేయలేను" అన్నాను. కానీ తను "మేడం! చేసేయండి ప్లీజ్. నాకు మీరు తప్ప ఇక్కడ ఎవరూ తెలియదు? నేను ఎక్కడికీ వెళ్ళను. మీకు తెలుసు కదా!" అన్నారు. సరేనని నేను కొంచెం ఓపిక తెచ్చుకుని, "ఫేషియల్ చేద్దాం బాబా. మీరు నాకు తోడుగా ఉండండి. ఫేషియల్ బాగా చేసి పంపించేంత వరకు నాకు కొంచెం శక్తిని ఇవ్వండి బాబా" అని అనుకొని ఫేషియల్ మొదలుపెట్టాను. కానీ ఒక్క నిమిషం కూడా నిల్చోలేకపోతున్నాను. బాబాని తలుచుకొని మనసులో, "అయ్యో.. బాబా! ఫేషియల్ మొదలుపెట్టేసాను. నాకస్సలు బాగాలేదు. నేనేం చేయను బాబా. ఫేషియల్ చేయడానికి ఒక అమ్మాయిని పంపించండి బాబా. అమ్మాయి ఉంటే బాగుంటుంది బాబా" అని అనుకుంటున్నాను. అంతే! 'మేడం' అంటూ ఓ గొంతు వినిపించింది. ఎవరని బయటికి వెళ్లి చూస్తే, నా దగ్గర అదివరకు పనిచేసే మానేసిన అమ్మాయి. నేను తనని చూసి షాక్ అయిపోయాను. ఆ రోజు తన బాబు పుట్టినరోజని నాకు చాక్లెట్లు ఇవ్వడానికని తన బాబు, భర్తని తీసుకుని వచ్చింది. తను నా పరిస్థితి చూసి షాక్ అయి, "మేడం! ఎందుకలా నీరసంగా ఉన్నారు? బాగోలేదా మీకు?" అని అడిగింది. "అవును పూజా! నాకు అస్సలు బాగోలేదు. ఫేషియల్ కోసం క్లయింట్ ఉన్నారు. కానీ నాకు అస్సలు ఓపిక లేదు" అన్నాను. అంతే, "నేను చేసేస్తాను మేడం. మీరు కూర్చోండి" అని తను నన్ను కూర్చోబెట్టి, చక్కగా ఫేషియల్ పూర్తి చేసింది. తన పిల్లలు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ మమ్మీ వచ్చేంతవరకు చక్కగా ఆడుకున్నారు. తన భర్త కూడా ఓపికగా షాపులో గంటసేపు వేచి ఉన్నారు. అంతా బాబా అనుగ్రహమనే చెప్పాలి. నేను ఎలా అడిగానో, అలానే అనుగ్రహించారు బాబా. హృ
సాయిభక్తుల అనుభవమాలిక 2102వ భాగం....
- పెళ్ళైన 15ఏళ్లకు సంతాన భాగ్యం ప్రసాదించిన బాబా - రెండవ భాగం
2015, నవంబర్ 8వ తేది ఉదయం నేను ముందుగా సాయి మందిరంకి వెళ్లి, తర్వాత అటు నుంచి అటే హాస్పిటల్కి వెళ్లి అడ్మిట్ అయ్యాను. అందరూ 'ఈ పిల్ల చెపితే వినలేదు, విశ్రాంతి తీసుకోలేదు, ఏమవుతుందో!' అని ఒకటే భయపడ్డారు. అయితే బాబా అద్భుతం చూపించారు. 5 కేజీల బరువుతో చక్కని బాబు పుట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు, భలే పుట్టాడని ఆనందించారు. చూశారా! బాబా నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో. బాబుకి 'సాయి పుష్కర్' అని పేరు పెట్టాము గానీ, ముద్దగా సాయికొడుకు అని పిలుస్తాను. బాబు పుట్టి ఒక నెలవుతూనే బాబుని తీసుకొని మునుపటిలా నేను షాపుకి వెళ్ళడం మొదలుపెట్టాను. చిన్నపిల్లాడిని అలా తిప్పకూడదు గాలి, ధూలి సోకుతుందని అందరూ అన్నారు. కానీ 'బాబా ఉన్నారు. ఆయనే చూసుకుంటారని' రోజూ బాబుని షాపుకి తీసుకెళ్ళేదాన్ని. ఒక్క రోజు కూడా బాబుకి దిష్టి తీయడం లాంటివి చేయలేదు. బాబా దయవల్ల నా సాయికొడుకుకి చిన్న జలుబు గాని, విరోచనాలు గాని, ఇంకా ఎటువంటి సమస్య గాని రాలేదు. రోజూ బాబా ఊదీ పెట్టేదాన్ని అంతే. బాబా నా బిడ్డకి ఏ ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అనుక్షణం బాబా తోడుంటే భయమెందుకు? నా బాబా నా కొడుకు రూపంలో నాతోనే ఉన్నారు. నా కొడుకు చిరునవ్వులో బాబా కనిపిస్తారు. ఇంత అందమైన కొడుకు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కొడుకుని చూస్తుంటే నాకు అనుక్షణం బాబానే గుర్తు వస్తారు. నేను ఇప్పుడు కూడా 'బాబా నా పెద్దకొడుకు, బాబా ప్రసాదించిన బిడ్డను నా చిన్నకొడుకు' అంటాను. నా మొబైల్ స్క్రీన్పైన నా ఇద్దరు కొడుకుల ఫోటోలు ఉంటాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నేను(సాయి సురేష్) ఇప్పుడు మా సిస్టర్ 2014 మొదటిసారి శిరిడీ వెళ్లొచ్చినప్పటినుండి తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి మధ్య ఉన్న మూడు నెలల కాలంలో జరిగిన ఒక అనుభవాన్ని చెప్తాను. 2014. సెప్టెంబరులో మా డాడీ హాస్పిటల్లో ఉన్న సమయంలో మా సిస్టర్కి బాబాపట్ల ఉన్న అమితమైన ప్రేమను చూసిన నాకు, వాళ్ళు నవంబర్లో శిరిడీ వెళ్లొచ్చాక(అదే నెలలో) వాళ్ళకి ఒకటిన్నర అడుగుల బాబా మూర్తి(విగ్రహం) ఇవ్వాలని ప్రేరణ కలిగింది. బాబాని అడిగితే, ఆయన సమ్మతించారు. కానీ నేను ఆ విషయం గురించి మా సిస్టర్తో మాట్లాడినప్పుడు తను ఏవో కొన్ని కారణాల వలన బాబా మూర్తిని తీసుకోవడానికి సుముఖత చూపలేదు. 'బాబా అనుగ్రహం ఉంది కాబట్టి, ఆయనే తను అంగీకరించేటట్లు చేస్తారు' అని నేను ఊరుకున్నాను. తర్వాత 2015, జనవరి నెలలో మా సిస్టర్, బావగారు సంక్రాంతికి మా సొంతూరు వెళ్లి, తిరిగి వైజాగ్ వెళ్ళేటప్పుడు దారిలో మా ఇంటికి వచ్చారు. అప్పుడు మా ఇంట్లో ఉన్న బాబాని చూసి మా సిస్టర్ ఎంతగానో మురిసిపోయింది. కాసేపు అలానే బాబాను చూస్తూ ఉండిపోయింది. తర్వాత తనకి బాబా మూర్తి ఇస్తానన్న ప్రస్తావన వచ్చి, తన సందేహాలకు నేను కొంత వివరణ ఇచ్చాను. దాంతో తను, "సరే, నేను అలోచించి నా నిర్ణయం చెప్తాన"ని వెళ్ళిపోయి
మరికొన్ని అనుభవాలు తరువాయి భాగాలలో ..
సాయిభక్తుల అనుభవమాలిక 2101వ భాగం....
- పెళ్ళైన 15ఏళ్లకు సంతాన భాగ్యం ప్రసాదించిన బాబా - మొదటి భాగం
సాయిభక్తుల అనుభవమాలిక 2100వ భాగం....
- ఖచ్చితంగా బాబా ఉన్నారు - మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు
నా పేరు జగదీశ్వర్. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి కరీంనగర్లో, ఏప్రిల్ 29న మా అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో జరిగాయి. వేసవికాలం, ఒక్క పెళ్లికే అలసిపోయే రోజులు. అలాంటిది రెండు పెళ్లిళ్లు. ఎలా చేయగలనో అని మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, తర్వాత మొత్తం భారం బాబా మీద వేసి, "బాబా! నేను నిమిత్తమాత్రుణ్ణి, రెండు పెళ్లిళ్లు ఏ ఇబ్బందులు రాకుండా మీరే దగ్గరుండి జరిపించి ఆశీర్వదించండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటినుంచి అమ్మాయి పెళ్లి కరీంనగర్లో, అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో, తన రిసెప్షన్ కరీంనగర్లో అయ్యేవరకు ఎలాంటి టెన్షన్ లేకుండా అన్నీ సక్రమంగా అనుకున్న విధంగా పూర్తయ్యాయి. అమ్మాయి పెళ్లిలో, అబ్బాయి రిసెప్షన్లో ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు సాధారణంగా వచ్చేవాళ్ళో, బాబా దయ చూపి అలా వచ్చారో నాకైతే తెలియలేదు. ఇంకా డబ్బుల విషయానికి వస్తే, అప్పట్లో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న మా అబ్బాయి, హఠాత్తుగా మనసు మార్చుకొని యుఎస్ వెళ్లి MS పూర్తి చేసి, NVedia అనే పెద్ద కంపెనీలో సూపర్ జీతంతో జాయినయ్యాడు. ఈ పెళ్లిళ్ల ఖర్చులు తనే సర్దుబాటు చేసుకున్నాడు. ఇదంతా బాబా ముందస్తు ప్రణాళిక.
నాకు ఒక సాయిబాబా బంగారు ఉంగరం ఉంది. నేను దాన్ని అప్పుడప్పుడు పెట్టుకొని, తిరిగి లోపల దాచేస్తుంటాను. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి ఉందని వారం ముందు ఆ ఉంగరం కోసం చూస్తే, అది కనిపించలేదు. అన్నీ చోట్లా వెతికినా కానీ దొరకలేదు. నేను చాలా టెన్షన్ పడిపోయి బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరికేలా చేయమ"ని వేడుకున్నాను. ఐదు రోజుల తర్వాత మా ఆవిడ ఏదో మందు కొరకు వెతుకుతుంటే, విచిత్రంగా టాబ్లెట్ల బాక్స్లో బాబా ఉంగరం ఉంది.
ఇకపోతే, పెళ్ళైన తర్వాత, ఏప్రిల్ 6న భోజనాల అనంతరం మా అమ్మాయి చేతి వేలికి ఉండాల్సిన వంకి ఉంగరం లేదు. ఫోటోలలో చేస్తే భోజనం చేసేటప్పుడు తన వేలికి ఉంగరం ఉంది. ఇంకా అందరం అన్నీ చోట్లా వెతికాము కానీ, ఎక్కడా ఆ ఉంగరం దొరకలేదు. మా చిన్నమ్మాయి ఏడుస్తూ అత్తవారింటికి హైదరాబాద్ వెళ్ళింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరకాల"ని వేడుకున్నాను. మర్నాడు ఉదయం మా చిన్నమ్మాయి ఫోన్ చేసి, ఒక బ్యాగులో ఉంగరం ఉందని చెప్పింది. అందరం చాలా సంతోషించాం.
పెళ్లిళ్లు అయిన తర్వాత, 2026, మే 8న అందరం అంటే మా ఇద్దరు అమ్మాయిలు, అల్లుళ్లు, మనవరాలు, అబ్బాయి, కోడలు, నేను, నా భార్య బయలుదేరి ఫ్లైట్లో శిరిడీ వెళ్లాము. అదే రోజు ధూప్ ఆరతిలో మేము పాల్గొన్నాము. మర్నాడు 9వ తేదీ మధ్యాహ్నం 3.40కి మా రిటర్న్ ఫ్లైట్ ఉండగా నేను పొద్దున్నే బాబా దర్శనం చేసుకున్నాను. తర్వాత 10 గంటలకు అందరం టిఫిన్ చేసి దర్శనానికి సీనియర్ సిటిజన్ లైన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తే నన్ను, నా భార్యను అనుమతించి మిగతా వాళ్లను అనుమతించలేదు. దాంతో వాళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్టు తీసుకుని వస్తామని వెళ్లారు. అప్పటికి దాదాపు 11.10 అవుతుంది. నాకు, నా భార్యకి 20 నిమిషాల్లో దర్శనం అయింది కానీ, పిల్లలు రాలేదు. మేము ముందుగా భయపడ్డట్టే ఆరతికోసం లైన్లు ఆపేసారు. దాంతో ఒకవైపు మేము కనీసం 2 గంటలకి ఎయిర్పోర్ట్లో ఉండాలన్న టెన్షన్, ఇంకో వైపు పిల్లలు ఎప్పుడు బయటికి వస్తారో తెలియని పరిస్థితి. బాబానే ప్రార్థించి ఆయన మీదే భారమేసాను. బాబా దయవల్ల వాళ్ళు సరిగ్గా 1:30కి బయటకు వచ్చారు. మేము ఇంకా ఆలస్యం చేయకుండా రూమ్కి వెళ్లి, లగేజ్ సర్దుకొని సమయానికి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చాము. అక్కడ వేరే ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్ళాము. మే 10వ తేదీన పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిపించాము. మర్నాడు 11వ తేదీ రాత్రి 9 గంటలకి మా తిరుగు ప్రయాణానికి ఫ్లైట్ ఉంది. స్వామివారి దర్శనానికి నా దగ్గర విఐపి లెటర్స్ ఉన్నా వాటిని యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఎదురైంది. ఇంకా తప్పనిసరై నేను, నా భార్య మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటామని అనుకున్నాము. కానీ పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతారు కాబట్టి, స్వామివారికి దణ్ణం పెట్టుకొని 11వ తేదీకి శ్రీవాణి టిక్కెట్లు తీసుకున్నాం. ఆరోజు మేము కూడా కొండపైకి వెళ్లి స్వామివారికి బయటనుండి దణ్ణం పెట్టుకొని, రాత్రి 7 కల్లా విమానాశ్రయం చేరుకున్నాము కానీ, 4 గంటలకి శ్రీవాణి బ్రేక్ దర్శనానికి లోపలికి వెళ్లిన పిల్లలు రావడానికి ఎంత టైం పడుతుందో, వాళ్లకి ఫ్లైట్ అందుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాం. అయినా నాకు బాబా ఉన్నారన్న ధైర్యం మాత్రం పోలేదు. బాబా దయవల్ల వాళ్ళు మొదటి గడప దర్శనం చేసుకొని 6.30కి బయటకు వచ్చి, ఎయిర్ పోర్ట్కి 8 గంటల కల్లా చేరుకున్నారు. సురక్షితంగా ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాము.
మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు పోలాండ్కి వెళ్ళడానికి మే 16కి టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ 5 రోజుల ముందు వాళ్ళు దుబాయ్కి బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాంతో వాళ్ళు తప్పనిసరై హైదరాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి వియన్నాకి ఫ్లైట్, వియన్నా నుండి పోలాండ్ దేశంలోని క్రకౌకి బస్సు బుక్ చేసుకున్నారు. బస్ ఫ్లైట్కి లింక్ సర్వీస్ కాదు కాబట్టి, బస్సు బయలుదేరే లోపు వీళ్ళు వియన్నా చేరుకోవాలి. కానీ ఢిల్లీ నుండి వియన్నా వెళ్లే ఫ్లైట్ ఆలస్యం అయింది. దాంతో అక్కడ బస్ మిస్ అవుతుందేమో అని భయపడ్డాము. ఇక్కడ నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "పిల్లలు బస్సుకి అందేలా చూడమ"ని వేడుకున్నాను. వాళ్ళు వియన్నా చేరుకున్నాక మా పెద్దమ్మాయి చాలా ఉత్సాహంగా ఫోన్ చేసి, "బస్ అందుకున్నాము. ఒక్క నిమిషం ఆలస్యమైనా బస్సు వెళ్లిపోయేది" అని చెప్పడంతో 'మనకు బాబా ఉన్నారు కదా!' అనుకోని మనసులోనే వారికి దణ్ణం పెట్టుకున్నాను. ఆయన దయవల్ల మా పెద్దమ్మాయివాళ్ళు క్రకౌలోని వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు.
తర్వాత 14వ రోజు మా అబ్బాయి, కోడలు బయలుదేరి బాబా దయవల్ల ఇమ్మిగ్రేషన్లో ఎటువంటి సమస్య లేకుండా యుఎస్ చేరుకోని, వాళ్ళవాళ్ళ ఉద్యోగాల్లో చేరారు. తర్వాత మా చిన్నమ్మాయి, అల్లుడు స్లీపర్ బస్సులో గోవా వెళ్లారు. వాళ్ళ క్షేమం గురించి నేను బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో వాళ్ళు క్షేమంగా వెళ్లొచ్చారు. 100కి 200% బాబా దయవల్లనే అన్నీ సక్రమంగా జరిగాయి. నేను అందరికీ చెప్పేది ఒక్కటే, 'ఖచ్చితంగా బాబా ఉన్నారు. మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
ఓం శ్రీసాయి సర్వభారాభృతే నమః.
బాబా సాయి చరణం
సర్వదా శరణం శరణం.
