సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2058వ భాగం....


ఈ భాగంలో అనుభవం:


  • బాబా మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు

భక్తులందరికీ నమస్కరం. నా పేరు నవీన్. నేను ఇప్పుడు ఇటీవలి బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుతమైన అనుభవం మీ అందరితో పంచుకుంటాను. 2025, డిసెంబర్ నెలాఖరులో మా అమ్మమ్మ పరమపదించారు. ఆవిడ కర్మాంతరాలు నెల్లూరులో జరిగాయి. ఆ కార్యక్రమానికి నేను వెళ్లాలని 2026, జనవరి 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హఠాత్తుగా నిర్ణయమైంది. మరుసటిరోజు కార్యక్రమాలకి అక్కడ ఉండాలంటే నేను అప్పటికప్పుడు బయలుదేరాల్సిన పరిస్థితి. కాబట్టి నేను ట్రైన్ లేదా బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళదామంటే నడికుడి నుండి గుంటూరు వరకు ఒక బస్సు, అక్కడ నుండి ఇంకో బస్సు మారి చాలా ప్రయాణం చేయాలి. పోనీ ట్రైన్‌లో వెళదామంటే అది అంత అనుకూలమైన మార్గం కాదు, ఆ మార్గంలో రైళ్లు చాలా తక్కువ. ఉన్నవాటిలో శబరి అనే ట్రైన్ అందుబాటులో ఉన్నప్పటికీ నాకు రిజర్వేషన్ లేదు. మా అమ్మానాన్న, "ఏం కాదు. ఆ ట్రైన్‌‌కే వెళ్ళు, హాయిగా ఉంటుంది. జనరల్‌లో ఖాళీ లేకపోతే స్లీపర్‌లో ఎక్కి TTEతో మాట్లాడి నెల్లూరుదాకా టికెట్ వ్రాయించుకో" అని చెప్పారు. కానీ నాకైతే ఆ రైలు మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే, ఆ రైలు కేరళ వెళ్తుంది. నాకు తెలిసినంతవరకు మామూలు సీజన్‌లోనే ఆ రైలు చాలా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇంకా ఇప్పుడు నడుస్తున్న అయ్యప్పస్వాములు సీజన్ సంగతి చెప్పాలా? రైలు అంతా చాలా రద్దీగా ఉంటుంది. అందుకని బస్సులో వెళదాం, సీట్ ఉంటుంది, ఇబ్బంది ఉండదని అనుకున్నాను. అయితే బయలుదేరడానికి సిద్ధమయ్యేముందు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, "మనకి ఏది కరెక్టో బాబాకి తెలుసు. ఆయన్ని నాకు ఏది బెస్టో చెప్పమంటే, కరెక్ట్‌గా చెప్తారు కదా!" అని. వెంటనే నాకు తెలిసిన ఒక బాబా మిత్రుడిని, "నేను బస్సులో వెళ్లాలా? లేక శబరి ట్రైన్‌కి వెళ్లాలా? అని బాబాని అడిగి నాకు ఏ విషయం మెసేజ్ పెట్టండి. ఈలోపు నేను తయారవుతాను" అని చెప్పాను. అతను సరేనన్నారు. కాసేపటికి నేను తయారై ఫోన్‌లో మెసేజ్ చూస్తే. 'బాబా మిమ్మల్ని శబరికి వెళ్లమంటున్నారు' అని ఆ బాబా మిత్రుడు పెట్టిన మెసేజ్ కనపడింది. అది చూసి నేను  ఆశ్చర్యపడ్డాను. ఆ ట్రైన్‌కి రిజర్వేషన్ లేదు. పైగా ఫుల్ రష్ సీజన్. మరి బాబా ఎందుకిలా చెప్పి ఉంటారనుకున్నాను. అయినాసరే, బాబా చెప్పారు కాబట్టి ఆయనే సీటు ఇప్పిస్తారు. ఆయనే స్వయంగా వచ్చి భక్తులకు సీటు ఇచ్చిన ఎన్నో అనుభవాలు చూసాను కదా! ఆయన ఏదో ఒకటి చేస్తారులే అని ఆయన మీద నమ్మకంతో నేను శబరి ట్రైన్‌కే వెళదామని నిశ్చయించుకున్నాను. అదే విషయం మా నాన్నకి చెప్తే, ఆయన సరేనని నన్ను రైల్వేస్టేషన్ వద్ద దింపడానికి స్టేషన్‌కి వచ్చారు. అప్పుడు అంతా నా మనసులో 'సీటు ఉంటుందో, లేదో, 6 గంటలపైన ప్రయాణం' అని ఒకటే ఆలోచనలు. దాంతో ఉండబట్టలేక బాబాని 'స్లీపర్ కోచ్ ఎక్కమంటారా?' అని అడిగాను. దానికి బాబా వద్దన్నారు. బాబా ఇలా అంటున్నారు ఏమిటి అని మళ్ళీ ఆశ్చర్యపడ్డాను. అంతలో, "నేను ఉండగా నువ్వు ఇతరులను(TTE) అడగడం ధేనికి? నేనే నీకు ఇస్తాను" అని బాబా అంటున్నట్లు నా మనసుకి స్ఫురించింది. ఆ విషయం బాబా మిత్రునికి చెప్తే, తను కూడా "బాబా చూసుకుంటారులే" అని భరోసా ఇచ్చారు. ఇలా టెన్షన్ నడుస్తుండగా ట్రైన్ వచ్చింది. నేను అనుకున్నంత రద్దీ లేకపోయినా జనం అయితే ఉన్నారు. దాదాపు ట్రైన్‌లో ఉన్న సీట్లన్నీ ఫుల్ అయి ఉన్నాయి. నేను ట్రైన్ ఎక్కి ఒక దగ్గర సీటు ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందామనుకొనే లోపు ఒక ఆమె అక్కడ కూర్చుంది. నేను ఇంకా ఎక్కడ కూర్చుందామా అని చూస్తూ అక్కడే నిల్చున్నాను. ఇంతలో రైలు కదిలింది. నా వెనక సీటులో ఉన్న అతను నన్ను పిలిచి, "నేను దిగుతున్నాను. మీరు కూర్చోండి" అని సీటు ఇచ్చారు. నేను, "సూపర్ బాబా! పిలిచి మరీ సీటు ఇచ్చారు కదా!" అని చాలా ఆనందపడిపోయాను. ఇది బాబా దయకాకపోతే మరేంటి? రద్దీ సీజన్‌లో పిలిచి మరీ సీటు ఇవ్వడం ఏమిటీ? అంతా బాబా అనుగ్రహమే అని నాకు అర్థమైంది. ఈ విషయం నేను వెంటనే నా మిత్రుడికి మెసేజ్ పెడితే, "నేను ఇప్పుడే బాబాతో 6 గంటల ప్రయాణం, తనకి సీటు దొరికేలా చూడండి అని చెప్పుకున్నాను. రెండు నిమషాలు అయిందో, లేదో మీ మెసేజ్ సాయి. అది చూసి నాకు చాలా ఆనందమేసింది" అని చెప్పారు. మేమిద్దరమూ బాబాని నమ్మితే ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందని చాలా ఆనందించాము. ఇంకా ప్రయాణం అంతా బాగా జరిగింది. రైలు కాస్త ఆలస్యమై నేను నెల్లూరు చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయింది. నేను అక్కడినుండి వెళ్లాల్సిన ప్రదేశం సిటీకి చాలా దూరంలో, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఆటో దొరుకుతుందో, లేదో అని ఆందోళన చెందాను కానీ, 'బాబా చూసుకుంటారులే' అని అనుకున్నాను. బాబా దయవల్ల రాపిడోలో చూస్తే, వెంటనే ఆటో బుక్ అయింది. హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేరాల్సిన గమ్యం చేరుకున్నాను.

బాబాను నమ్మితే, ఆయన మాట విని పాటిస్తే మనకి ఇబ్బంది లేకుండా ఎంతటి ఫలితాలు వస్తాయో తెలియపరచడానికి నా ఈ అనుభవం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కేవలం ఒక రైలు ప్రయాణంలో బాబా చెప్పిన మాట విని పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయిందే, అదే ఆయన చెప్పిన ప్రతి మాట పాటిస్తే, మనం ఎంత మేలు పొందుతామో వేరే చెప్పాల్సిన పని లేదు. మనమంతా మన జీవితంలో చాలా విషయాలకి వ్యక్తుల మీద ఆధారపడుతుంటాం. నిజానికి వాళ్ళు మనకి అంతగా సహకారం అందిస్తారో, లేదో తెలియదు. అదే మనం వ్యక్తుల మీద ఆధారపడకుండా బాబా మీద ఆధారపడితే, ఆయన ఎంతో అద్భుతంగా అనుగ్రహిస్తారు. బాబా మనల్ని ఎన్నుకొని భక్తులుగా చేసుకోవడం మన జన్మజన్మల సుకృతం. అంత అద్భుతమైన వరాన్ని ఎవరూ వృధా చేసుకోవద్దు. ఎక్కడో మనకి అందనంత దూరంలో ఉండే మహావృక్షం నీకు సదా నీడనిచ్చి కాపాడుతానని మన ఇంటికే వస్తే, మనం ఆ నీడ నుండి బయటపడాలనుకుంటే మన అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. బాబాపట్ల భక్తి పదింతలు ఉంటే వందింతలుకు, 1000 రెట్లు ఉంటే 10000 రెట్లుకు పెంచుకోవాలని, బాబా ప్రేమిని, ఆయనిచ్చిన సేవా భాగ్యాన్ని జాగ్రత్తగా ఆయనకోసం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

చివరిగా ఒక మాట: "ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగివుంటారో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపిస్తాను" అని బాబా అన్న మాట అక్షర సత్యం. ఆయనని నమ్ముకుంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. అలా ఆయన మనల్ని నడిపించాలంటే మనకి ఆయన పట్ల గట్టి నమ్మకం ఉండాలి. బస్సు లేదు రైలు ప్రయాణంలో డ్రైవర్ మీద నమ్మకంతో నిశ్చింతగా నిద్రపోయినట్టు మన జీవిత ప్రయాణంలో బాబాను నమ్మాలి. నమ్మితే, ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ లేకుండా మన ప్రయాణం బాబానగరి అనే శాశ్వత ముక్తిదామంకి చేరుకుంటుంది. అదే మన లక్ష్యం.

సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయిభక్తుల అనుభవమాలిక 2057వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్య లేకుండా అనుగ్రహించిన బాబా
2. బాబా దయతో పరీక్షలో ఉత్తీర్ణత - అద్దెకు ఇల్లు - 11 సార్లు పారాయణ
3. ఎప్పటిలానే అనుగ్రహించిన బాబా




సాయిభక్తుల అనుభవమాలిక 2056వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి ఆందోళనను తీసేసే బాబా

సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు తన్వి. నేను చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తురాలిని. ఆయన నా చిన్ననాటి నుండి నా ప్రతి అడుగులో మార్గనిర్ధేశం చేస్తున్నారు. మావారు ఇండియన్ ఆర్మీ, త్రిపురలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుటుంబాన్ని అక్కడికి తీసుకొని వెళదామని క్వార్టర్ కోసం దరఖాస్తు పెడుతున్నప్పటికీ క్వార్టర్ ఖాళీ లేని కారణంగా అప్లికేషన్ చాలాసార్లు రిజెక్ట్ అయింది. ఆయన మాకు దూరంగా ఉండటం వల్ల మాకు అస్సలు మనశాంతి ఉండేది కాదు. అప్పుడు నేను, 'ఏ సమస్య వచ్చినా అడిగితే చాలు అసాధ్యాన్ని సాధ్యం చేసే బాబా ఉండగా దిగులెందుకని' ఆయన మీద భారమేసి 'నవగురువర వ్రతం' మొదలుపెట్టాను. బాబా అద్భుతం చేసారు. వ్రతం మొదలు పెట్టిన రెండో వారంలోనే మావారు ఫోన్ చేసి, "క్వార్టర్ సెక్షన్ అయింద"ని చెప్పారు. అది విని నా ఆనందానికి అవధులు లేవు. బాబాకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

తర్వాత మావారు కుటుంబాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి 2025, అక్టోబర్ 30కి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసారు. కానీ అవి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి కన్ఫర్మ్ కాలేదు. దాంతో మావారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఒక్కరే వెళ్లిపోయారు. ఆ తర్వాత మావారు మమ్మల్ని తీసుకెళ్లడానికి మళ్ళీ టిక్కెట్లు బుక్ చేసారు. ఈసారి కూడా అవి వెయిటింగ్ లిస్టులో ఉండటంతో అవి కన్ఫర్మ్ అవుతాయో, లేదో అని నాకు చాలా ఆందోళన మొదలైపోయింది. ప్రయాణం 2025, నవంబర్ 12న కాగా ముందురోజు అంటే నవంబర్ 11న అవి కన్ఫర్మ్ అయ్యేది, లేనిది తెలుస్తుంది. నేను బాబాని, "ఈసారి టిక్కెట్లు కన్ఫర్మ్  అవ్వకపోతే మేము ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది బాబా. దయచేసి ఈసారైనా టికెట్లు కన్ఫర్మ్ అయ్యేలా చూడండి సాయి" అని కన్నీళ్లతో వేడుకొని ఆయన సహాయం అర్థించి 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అని రోజంతా జపించాను. సాయంత్రానికి మావారు కాల్ చేసి, "టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. బట్టలు, సామాన్లు అన్ని సర్దుకొని సిద్ధంగా ఉండండి" అని చెప్పారు. నేను బాబాకి నమస్కారం చేసుకొని ధన్యవాదాలు తెలుపుకున్నాను.

ఇకపోతే, ట్రైన్‌లో 3రోజుల ప్రయాణం. పైగా నాకు హిందీ అంతగా రాదు. అందువల్ల నాలో మళ్ళీ ఆందోళన మొదలై, "3 రోజుల ప్రయాణం ఏ ఆటంకం రాకుండా చూడు" సాయి అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మా బెర్తులు ఉన్న చోట ఇద్దరు తెలుగువాళ్ళు వున్నారు. వాళ్ళు కూడా సైనికులు. మాతోపాటు త్రిపుర(అగర్తల) ముందు స్టేషన్ గౌహతి వరకు ప్రయాణం చేసారు. మాకు చాలా ధైర్యంగా అనిపించింది. బాబానే స్వయంగా మాతో ప్రయాణం చేసినట్లు అనిపించింది. సాధారణంగా గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ అంత బాగుండవు. నేను, "ఎలాగైనా మాకు ఇచ్చిన క్వార్టర్ బాగుండేలా చూడు బాబా" అని బాబాని వేడుకున్నాను. ఆయన దయవల్ల మాకు ఇచ్చిన క్వార్టర్ చాలా బాగుంది.

మేమున్న చోట చుట్టూ అంతా హిందీ, బెంగాలీ వాళ్ళు ఉన్నారు. నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయాక నేను, మా అత్తయ్య ఇంట్లో ఒంటరిగా వుండేవాళ్ళం. నేను, "బాబా! తెలుగువాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యేలా చూడు" అని బాబాకి చెప్పుకున్నాను. అంతలో డ్యూటీలో ఉన్న నా భర్తకి తనతో కలిసి పనిచేసే ఒక అన్నయ్య కాల్ చేసి, 'తనకి తెలిసిన తెలుగువాళ్ళు ఉన్నార'ని వాళ్ళ నంబరు చెప్పి, "మా చెల్లికి వాళ్ళని పరిచయం చేయి. వాళ్ళు కొంచం తోడుగా ఉంటారు. తనకి ఒంటరితనం అనిపించదు" అని చెప్పారు. మావారు డ్యూటీ నుండి ఇంటికి వచ్చి నన్ను, మా అత్తయ్యని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. నేను వాళ్ళు నాతో చనువుగా ఉంటారో, లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, వాళ్ళు నేను అనుకున్న దానికంటే చాలా మంచివాళ్ళు. అంతా బాబా దయ. కానీ మా అత్తయ్య "నేను ఇక్కడ వుండలేను. తిరిగి ఇంటికి (వైజాగ్) వెళ్లిపోతాను" అని ఒకటే గొడవ చేసింది. ఆమె వెళ్ళిపోతే, నేను ఎక్కడ ఒంటరిని అయిపోతానోనని చాలా బాధపడ్డాను. కానీ ఆమె ఎంత చెప్పిన వినలేదు. ఇంకా చేసేది లేక టికెట్ తీసి ఆమెని తిరిగి ఇంటికి పంపేశాం. నేను బాబాతో, "నాకు ఇక్కడ ఎవరూ లేరు. మీరు నాతో వున్నారన్న ధైర్యం తప్ప. ఎప్పుడూ మీరు నాతో వుండి అడుగుడుగునా నన్ను నడిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాలో ఉన్న భయాన్ని, ఆందోళనని తీసేయమని వేడుకుంటున్నాను సాయినాథా" అని వేడుకున్నాను.

తర్వాత 2025, డిసెంబర్ 18న మా తమ్ముడు కాల్ చేసి అమ్మమ్మ పడిపోయి హఠాత్తుగా చనిపోయిందని చెప్పాడు. నేను ఇంత దూరం నుండి వెళ్ళలేక చాలా ఏడ్చాను. మా అమ్మకు దగ్గరుండి ధైర్యం చెప్పలేని పరిస్థితికి రెండురోజులు చాలా బాధపడ్డాను. అమ్మమ్మ పోయిన బాధ నుండి నేను అస్సలు బయటపడలేక, "అమ్మమ్మ చనిపోయిన బాధ నుండి త్వరగా కొలుకునేలా చేయి సాయినాథా. నీవు తప్ప మాకు దిక్కు లేదు. నీవే శరణం బాబా" అని బాబాను వేడుకున్నాను. పిలిస్తే పలికే దైవం శ్రీసాయినాథుడు. ఆయన తన బిడ్డలు కష్టాల్లో ఉంటే  తట్టుకోలేరు. నేను ఆ బాధ నుండి బయటపడేలా చేసారు. "ధన్యవాదాలు సాయితండ్రీ".

ఒకరోజు రాత్రి నా పొట్టలో బాగా మంటగా అనిపించింది. నేను బాబా ఊదీ తీసుకుని కాస్త నా నుదుటన పెట్టి, మరికాస్త నీటిలో కలిపి తాగాను. బాబా దయవల్ల ఉదయానికల్లా నా పొట్టలో మంట తగ్గింది. "చాలా థాంక్స్ బాబా. మీ ఋణం ఏ జన్మలోనూ తీర్చుకోలేనిది. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మమ్మల్ని అడుగడుగునా నడిపించు తండ్రీ. అందరూ బాగుండేలా చూడు తండ్రీ".

మేము ఉండేది ఉత్తర భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలో అని చెప్పాను కదా! ఇక్కడ ఒకరోజు మరీ విపరీతమైన చలి వేసింది. నేను ఆ చలికి తట్టుకోలేక, "బాబా! నాకు ఎక్కువగా చలి వేయకుండా చూడండి తండ్రీ" అని బాబాను ప్రార్ధించాను. అలా ప్రార్ధించానో. లేదో మరుక్షణమే నాకు చలివేయడం తగ్గింది. "చాలా చాలా ధన్యవాదాలు తండ్రీ .అందర్ని ఇలానే కాపాడు సాయినాథా".

సాయిభక్తుల అనుభవమాలిక 2055వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ప్రతి అడుగులో తోడుగా ఉండి అన్నీ అనుకూలంగా జరిపించిన బాబా


సాయిభక్తుల అనుభవమాలిక 2054వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఏం ఉన్నా లేకున్నా బాబా ఉంటే చాలు


సాయిభక్తుల అనుభవమాలిక 2053వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  • బాబా ఊదీ పరమ ఔషధం


సాయిభక్తుల అనుభవమాలిక 2052వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి సమస్యకి దారి చూపే బాబా
2. బాబా దయ


బాబా దయ

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. సాయినాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆయన దయతోనే నేను ఈమాత్రం సంతోషంగా ఉండగలుగుతున్నాను. నేను ఈ మధ్యకాలంలో దంత సమస్యలతో చాలా బాధపడ్డాను. రెండుసార్లు డాక్టర్ దగ్గరకి వెళ్లినా ఉపయోగం లేకపోయింది. తిండి కూడా తినలేకపోయాను. అప్పుడు ఒకరోజు బాబా దగ్గర ఏడుస్తూ, "ఈ సమస్యను తీర్చు బాబా" అని వేడుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ని సంప్రదిస్తే, బాబా దయవల్ల నా పళ్ళు కొన్ని సరి చేయడంతో చాలావరకు నా సమస్య తగ్గింది.

2025, అక్టోబర్ నెల రెండో వారంలో మేము మా బంధువుల అబ్బాయి పెళ్లికి వెళ్లాము. ఆ పెళ్లిలో నా భర్త బ్రాస్లెట్ ఎక్కడో పడిపోయింది. ఇప్పుడున్న బంగారం ధరకి ఎంత నష్టమో అని నాకు కాళ్ళు, చేతులు ఆడలేదు. "ఇంత పరీక్ష ఏంటి బాబా? మీ దయతో ఆ బ్రాస్లెట్ దొరుకుతుంది కానీ, అంతవరకు ఈ టెన్షన్ ఎలా భరించాల"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అంతే! బాబా 2 నిమిషాల్లో బ్రాస్లెట్ మా అక్కకి దొరికేలా అనుగ్రహించారు.

2025, ఆగస్టు 16 రాత్రి ఉన్నట్టుండి నా కళ్ళు చాలా దురదగా ఉండి ఎడమ కన్ను చాలా లావుగా అయింది. నేను చాలా భయపడి బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ రాసుకున్నాను. బాబా దయవల్ల మర్నాటికి వాపు తగ్గింది. ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పను? "ఎల్లవేళలా మమ్మల్ని నడిపిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 2051వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఉద్యోగానికి వచ్చిన అపాయం నుండి బయటపడిన బాబా
2. బాబా దయతో బాధ, భయం మాయం

ఉద్యోగానికి వచ్చిన అపాయం నుండి బయటపడిన బాబా

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. నేను సాయిబాబాని దృఢంగా నమ్ముతాను. బాబా దయ ఎప్పుడూ మనపై ఉంటుంది. అది మన అదృష్టం. ఆయన దయ గురించి మాటల్లో చెప్పలేము. దాన్ని అనుభూతి చెందినప్పుడు 'ఆయన చూస్తున్నారు, వింటున్నారు, కష్టం తీర్చారు' అని తెలుస్తుంది. మా చిన్న అబ్బాయి లండన్‌లో ఎం.ఎస్. పూర్తిచేసాడు. వెంటనే తనకి అక్కడ ఉద్యోగం వచ్చింది. బాబా భక్తుడైన తను కేవలం బాబా వల్లనే తనకి ఆ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. మూడేళ్లు బాగానే గడిచాయి. అంతా బాగుంది కదా అని మేము తనకి పెళ్లి చేసాము. అదేంటో 2025, ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొని తిరిగి వెళ్ళాడు. తనకి ఆఫీస్‌లో కష్టాలు మొదలయ్యాయి. ఆ విషయం తను మాకు చెప్పకుండా బిజీ అని, పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పాడు. తర్వాత మా కోడలు అక్కడికి వెళ్ళింది. కానీ తను కూడా మాకు ఏమీ చెప్పలేదు. ఉద్యోగం అపాయంలో పడి ఒక నెల సమయం ఉందనగా అప్పుడు నాకు విషయం చెప్పాడు మా అబ్బాయి. నాకు చాలా బాధేసింది. ఏమీ అర్ధం కాలేదు. మా అబ్బాయిని, "నీ పనిలో ఏదైనా తప్పు ఉందా?" అని అడిగాను. తను, "లేద"ని చెప్పాడు. నేను తనతో, "నీ వైపు తప్పు లేకుంటే బాబా సహాయం చేస్తారు. ఆయనకి చెప్పుకో" అని చెప్పాను. నేను కూడా, "ఈ కష్టం నుండి బయటపడేయండి బాబా" అని బాబాను వేడుకున్నాను. మా అబ్బాయికి బాబాపై మంచి నమ్మకం. వాడు బాబా చరిత్ర పారాయణ మొదలుపెట్టాడు. మా కోడలికి చికెన్ అంటే చాలా ఇష్టం. అది తినడం మానేసి తను కూడా బాబా చరిత్ర చదవడం ప్రారంభించింది. వారం రోజులయ్యాక మా అబ్బాయి ఫ్రెండ్, "నా వర్క్‌లో తప్పు ఏమీ లేదు. అంతా సరిగా ఉందని ఆఫీసులో ఫిర్యాదు చేయమ"ని సలహా ఇచ్చాడు. మా అబ్బాయి అలాగే చేసాడు. వాళ్ళు స్పందించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆ మీటింగ్ తరువాత ఒక నెల సమయమిచ్చి వేరే వర్క్ ఇచ్చారు. మా అబ్బాయి ఆ వర్క్ చాలా కష్టంగా ఉందని చెప్పినప్పటికీ బాబా మీద భారమేసి పూర్తి చేసాడు. వాళ్ళు అది చూసి, "అంతా బాగానే ఉంది కదా! మరి ఎందుకలా సమస్య చేసార"ని మా అబ్బాయిని మరల ఉద్యోగంలోకి తీసుకున్నారు. అదంతా జరుగుతున్నప్పుడు యూట్యూబ్, ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' చూస్తుంటే, 'బాబా ఉన్నారు. నీ బిడ్డ గురించి చింత వద్దు. నేను చూసుకుంటాను' అనే విధంగా సాయినాథుని సందేశాలు నాకు వస్తూ ఉండేవి. అదే నిజం అయింది. ఆయనే మా అబ్బాయికి సహాయం చేసారు. తన ఉద్యోగం నిలబడింది. తను మధ్యలో, "ఈ ఉద్యోగం బాబా దయవల్లనే వచ్చింది. నా గొప్ప ఏమీ లేదు. అలాంటిది ఉద్యోగం ఇలా పోతుందమ్మా" అని అన్నాడు. కానీ తనకి బాబా మీద ఉన్న నమ్మకం తనని గట్టెక్కించింది. ఇకపోతే, ఇది మా కోడలికి మొదటి అనుభవం. మా అబ్బాయి సమస్య నుండి బయటపడ్డాడని తెలిసి తను బాబా ముందు కూర్చొని ఏడ్చింది. తనకి బాబా దయ గురించి తెలిసింది, బాబాపై చాలా నమ్మకం ఏర్పడింది. మొత్తానికి బాబా అంతటి కష్టం నుండి బయటపడేసారు. నాకు చాలా సంతోషమేసింది. ఇప్పుడు అందరం ప్రశాంతంగా ఉన్నాం. ఇది నిజంగా కేవలం బాబా దయవల్లనే సాధ్యమైంది. ఆయన ప్రేమ చెప్పనలవి కానిది.

బాబా దయతో బాధ, భయం మాయం

ఓం శ్రీ సాయినాథాయ నమ:. ముందుగా సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ప్రతిరోజూ బ్లాగులో వచ్చే అనుభవాలు తప్పకుండా చదువుతాను. దాని వలన బాబాపై మన భక్తి, (ప్రేమలు రెట్టింపు అవుతాయి, మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా నేను బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు బాబా భక్తులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నా అనుభవాలకు వస్తే..  2025, నవంబర్ నెలాఖరులో ఒకరోజు రాత్రి గ్యాస్ వల్ల నా గుండెల్లో నొప్పి, దడగా ఉండేసరికి నాకు చాలా భయమేసింది. టాబ్లెట్ వేసుకున్నా ఉపశమనం కలగలేదు. ఇంట్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. వాళ్ళని లేపడం ఇష్టం లేక నేనే లేచి వెళ్లి బాబా ఊదీ తీసుకొని నా ఛాతికి రాసుకొని, మరికొంత ఊదీ నీళ్లలో వేసుకొని తాగాను. బాబా ఫోటో ఒకటి ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. ఆది పట్టుకొని, "బాబా! ఈ బాధ తగ్గేలా చూడండి" అని దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల కొంతసేపటికి బాధ తగ్గి నిద్రపట్టింది.

మా ఎదురింటి అతను ఎప్పుడూ ఏదో ఒక సమస్య విషయంగా అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతను నా భర్తని ఏదో అన్నాడు. మావారు కూడా అతనిని ఏదేదో అన్నారు. నాకు భయమేసి "గొడవ పెరగకుండా చూడు బాబా" అని మనస్సులో అనుకున్నాను. బాబా దయవల్ల అతను మౌనం వహించాడు. "ధన్యవాదాలు బాబా. నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి".

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

సాయిభక్తుల అనుభవమాలిక 2050వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఉనికిని తెలియజేసి ధైర్యాన్నిచ్చిన బాబా
2. బాబా ఎల్లప్పుడూ భక్తుల ప్రార్థన వింటారు - ఎన్నడూ నిరాశపరచరు

ఉనికిని తెలియజేసి ధైర్యాన్నిచ్చిన బాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు సురేష్ కుమార్. నేను నా కుటుంబంతో యుఎస్‌లో ఉంటున్నాను. నేను నా జీవితంలో ఎక్కువసార్లు చదివిన పుస్తకం 'బాబా చరిత్ర'. బాబా నా జీవితంలో ఒక భాగమైపోయాయి. ఆయన ఇప్పటివరకు నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో నుండి కొన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మకి ఛాతీలో కొంచం ఇబ్బందిగా అనిపిస్తే, డాక్టర్ని సంప్రదించి అన్ని పరీక్షలు చేయించాము. అప్పుడు ఆమె హార్ట్‌లో బ్లాక్ ఉందని తెలిసి దేశం కాని దేశంలో అమ్మకి స్టెంట్ వేయించాల్సి వచ్చింది. అమ్మని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లేటప్పుడు మేము వస్తామన్నాము. ఎందుకంటే, మా అమ్మకి ఇంగ్లీష్ అస్సలు రాదు, డాక్టర్‌కి తెలుగు తెలీదు. కానీ డాక్టర్ వద్దన్నారు. దాంతో మేము గదిలో చాలా భయపడుతూ కూర్చున్నాము. నేను బాబానే ధ్యానిస్తూ, 'బాబా బాబా..' అనుకుంటూ ఏం చేయాలో తెలియక ఒకసారి గది తలుపు తీసి చూసాను. ఒక్కసారిగా నా కళ్ళు చమర్చాయి. మేమున్న గదికి ఎదురుగా ఒక తలుపు(STAIRS డోర్) ఉంది. ఆ తలుపు మీద ఉన్న STAIRS అన్న అక్షరాలలో కొన్ని అక్షరాలు రాలిపోయి కేవలం 'S  A  I' అని మాత్రమే మిగిలాయి. అది చూసిన వెంటనే నాకు ధైర్యం వచ్చి మనస్ఫూర్తిగా బాబాకి నమస్కరించుకున్నాను. బాబా దయతో ఆపరేషన్ విజయవంతమైంది.

ఒకసారి నేను కొంచం అత్యవసర పని మీద ఇండియా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు వీసా లేనందున వీసా స్టాంపింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాను. తర్వాత స్టాంపింగ్‌కి వెళ్లే ముందురోజు చూసుకుంటే, నా DS-160(టెంపరరీ వీసా) తప్పు వుంది. అప్పటికప్పుడు నేను వేరే DS-160 ఫారం నింపి తీసుకెళ్ళాను. కానీ మనసులో 'వాళ్ళు కొత్త అప్లికేషన్ తీసుకుంటారా? మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని రమ్మంటారా? అదే జరిగితే స్లాట్స్ దొరకవేమో!' ఇలా చాలా సందేహాలు. బాబాని తలుచుకొని, "నువ్వే గట్టెకించాలి బాబా?" అని అనుకుంటూ 'బాబా బాబా..' అని నామస్మరణ చేస్తూ ఉన్నాను. తర్వాత పిలిచేది నన్నే అనగా ఎందుకో పక్కకి తిరిగి చూసాను. అద్భుతం! నా పక్క వరుసలో కూర్చున్న ఒక ఆమె బాబా చరిత్ర చదువుతుంది. వెంటనే నాలో ఆనందం, ధైర్యం కలిగాయి. ఆమె దగ్గరకు వెళ్లి, బాబాకి నమస్కరించుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి సమస్యా లేకుండా వీసా పని పూర్తయింది. "ధన్యవాదాలు బాబా. మేము ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాం బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 2049వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టరు
2. బాబా దయతో తగ్గిన జ్వరం
3. కష్టాలను దూరం చేసే సాయి

బాబా తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టరు

నా పేరు కామేశ్వరి. నాకు పెళ్ళైన 8 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. డాక్టర్లు మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. అయినా నేను సాయి మీద నమ్మకంతో 'సాయి దివ్యపూజ' చేశాను. అలాగే రోజూ 'సచ్చరిత్ర' చదివాను. సాయి నన్ను ఎప్పుడూ విడిపెట్టలేదు. ఆయన అద్భుతం చేసారు. 2022, జనవరిలో నేను గర్భవతినని నిర్ధారణ అయింది. సెప్టెంబర్ 8, గురువారం నాకు ఒక పాప పుట్టింది. అలా బాబా కృపతో నా ప్రార్థనలకు సమాధానమిచ్చి నా జీవితంలో జరగదన్న విషయాన్ని జరిపించి తామున్నామని నిరూపించారు.
 
2025, నవంబర్‍లో మా అమ్మ అనారోగ్యం పాలైంది. డాక్టర్లు స్కాన్ చేసి, "బ్రెస్ట్ ‍‍లో కణితి ఉంది. క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంద"ని చెప్పారు. మా అమ్మ చాలా భయపడిపోయింది. నేను, "బాబా! మా అమ్మ చాలా భయపడుతుంది. మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు సాయి" అని సాయి పాదాలు పట్టుకొని వేడుకున్నాను. అప్పుడు డాక్టర్ మరోసారి టెస్ట్ చేయాలని చెపితే, సాయి దేవుని వేడుకొని చేయించాను. కానీ, రిజల్ట్ మళ్ళీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుందని వచ్చింది. అప్పుడు నేను నాకు తెలిసిన స్నేహితురాలి ద్వారా క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు అమ్మను తీసుకెళ్లి చూపించాను. ఆ డాక్టర్ కణితి తొలగించి టెస్టుకి పంపించారు. నేను, "సాయీ! మీ నామజపము చేస్తున్నాను. రిపోర్టు క్యాన్సర్ కాదని ఇవ్వండి తండ్రీ. ముందు ఇచ్చిన రిపోర్టు తప్పు అని నిరూపించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. ఒక వారంలో రావలసిన రిపోర్టు రాకపోవడంతో నాలో చాలా భయం పెరిగిపోయింది. ఆందోళన చెంది బాబాని ప్రార్ధిస్తూ గడిపాను. రెండు వారాల తర్వాత బాబా కృపవల్ల రిపోర్ట్ క్యాన్సర్ కాదని వచ్చింది. ఈ అనుభవం ద్వారా బాబా తన బిడ్డలను ఎప్పుడూ విడిపెట్టరని, అవసరంలో ఎప్పుడూ మనతో ఉంటారని నేను తెలుసుకున్నాను. బాబా నా విషయంలో చూపిన కృప నేను జీవితంలో ఎప్పుడూ మరువలేను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". 



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo